ఆ జ్ఞాపకాలు వెంటాడుతున్నాయి.. స్పెషల్ పర్సన్ గురించి రష్మిక మందన్న ఇంట్రెస్టింగ్ పోస్ట్..
రష్మిక మందన్న గురించి తెలుగు వారికి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతుంది ఈ కూర్గ్ అందం. ఈ భామ ప్రస్తుతం తెలుగులో రెయిన్బో అనే లేడీ సెంట్రిక్ మూవీతో పాటు అల్లు అర్జున్తో పుష్ప ది రూల్ మూవీ కూడా చేస్తోంది. Photo : Instagram పుష్ఫ2 ఆగస్టు 15న భారీగా విడుదలకానుంది. ఆ మధ్య వారసుడుతో మరో బంపర్ హిట్ అందుకున్న రష్మిక తాజాగా హిందీలో యానిమల్ అనే ప్యాన్ ఇండియా చిత్రంలో నటించి మరో భారీ విజయాన్ని అందుకుంది. రణబీర్ కపూర్ హీరోగా వచ్చిన ఈ సినిమాకు.. సందీప్ రెడ్డి వంగా దర్శకుడు. Photo : Instagram ఇక ఈ భామ నటిస్తున్న పుష్ఫ2 ఆగస్టు 15న భారీగా విడుదలకానుంది. ఆ మధ్య వారసుడుతో మరో బంపర్ హిట్ అందుకున్న రష్మిక తాజాగా హిందీలో యానిమల్ అనే ప్యాన్ ఇండియా చిత్రంలో నటించి మరో భారీ విజయాన్ని అందుకుంది. రణబీర్ కపూర్ హీరోగా వచ్చిన ఈ సినిమాకు.. సందీప్ రెడ్డి వంగా దర్శకుడు. Photo : Instagram ఇక అది అలా ఉంటే.. రష్మిక మందన్న సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ అని తెలిసిందే. అందులో భాగంగా తాజాగా ఈ భామ ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసింది. ఆమె తన పోస్ట్’లో రాస్తూ.. ఈ సమ్మర్లో తన ఇంటిని.. తాను పెంచుకుంటున్న కుక్క పిల్లను ఎంతో మిస్ అవుతున్నానని తెలిపింది. దీంతో నెటిజన్స్ ఈ పోస్ట్పై రకరకాలుగా స్పందిస్తున్నారు.. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Photo : Instagram ఇక రష్మిక మందన్న సినిమాల విషయానికి వస్తే... రష్మిక పాటు పుష్ప2 : ది రూల్ - 15 ఆగస్టు విడుదల కానుంది. ఈ సినిమాతో పాటు VD12 - విజయ్ దేవరకొండ - గౌతమ్ తిన్ననూరి సినిమా, D51 - ధనుష్ & శేఖర్ కమ్ముల సినిమా, రవితేజ- గోపీచంద్ మలినేని సినిమా, రెయిన్బో - లేడీ ఓరియెంటెడ్ మూవీల్లో నటిస్తోంది. వీటితో పాటు ఇక లేటెస్ట్గా దర్శకుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వస్తోన్న మూవీ.. ఈ సినిమాను GA2 పిక్చర్స్ నిర్మిస్తోంది. . Photo : Instagram ఈ భామ శేఖర్ కమ్ముల, ధనుష్ కాంబినేషన్లో వస్తున్న కుబేర అనే ఓ ఫ్యాన్ ఇండియా మూవీలో హీరోయిన్గా నటించనుంది. ఈ సినిమాను అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP బ్యానర్ నిర్మిస్తున్నారు.. Photo : Instagram లేటెస్ట్గా తమిళ స్టార్ హీరో విక్రమ్కు జోడిగా రష్మిక ఓ భారీ సినిమాలో నటించనుందని తెలుస్తోంది. ఇటీవల కేరళలో వచ్చిన వరదల నేపథ్యంలో వచ్చిన ‘2018’ అనే చిత్రం డైరెక్టర్ జూడ్ ఆంథోనీ జోసెఫ్ దర్శకత్వంలో విక్రమ్ ఓ భారీ సినిమాను చేస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్గా రష్మిక మందన్న నటించనుందట. ఈ విషయంలో త్వరలో అధికారిక ప్రకటన విడుదలకానుంది. రష్మిక ఇప్పటికే తమిళ్లో కార్తీ ‘సుల్తాన్ ’, విజయ్ ‘వారిసు’ చిత్రాల్లో నటించి అక్కడ మంచి పాపులర్ అయ్యింది. Photo : Instagram ఇప్పటికే యానిమల్, మిషన్ మజ్ను, గుడ్ బై వంటి సినిమాల్లో నటించింది.. ఇక వీటికి తోడుగా ఆమెకు మరో భారీ సినిమాలో అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. ఛవా అనే హిస్టారికల్ పాన్-ఇండియా సినిమాలో ఆమె హీరోయిన్గా ఎంపికైనట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో విక్కీ కౌశల్ సరసన రష్మిక కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రం ఛత్రపతి శివాజీ పెద్ద కుమారుడు చత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా రూపొందించబడింది. శంభాజీ మహారాజ్ భార్య యేసుబాయి భోంసాలే పాత్రలో రష్మిక నటిస్తోంది. ఛవా చిత్రానికి లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించనున్నారు. దినేష్ విజన్ నిర్మించనున్నారు. Photo : Instagram ఇక మరోవైపు రష్మిక ఓ సంచలన రికార్డ్ను క్రియేట్ చేసింది. ఇన్స్టాగ్రామ్లో తరచు తన సినీ, వ్యక్తిగత విషయాలను ఫ్యాన్స్, ఆడియన్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటుంది రష్మిక. ఇక తాజాగా రష్మిక మందన్న తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో మొత్తంగా 40 మిలియన్ ఫాలోవర్లని దక్కించుకుని ఒక గొప్ప రికార్డు నమోదు చేసింది. దీంతో ఇండియాలోనే అత్యధిక ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లు కలిగిన హీరోయిన్స్లో ఒకరిగా సెన్సేషనల్ రికార్డ్ను నమోదు చేసింది రష్మిక మందన్న.. Photo : Instagram ఇక వరుస హిట్ సినిమాలతో మంచి ఊపు మీదున్న రష్మిక మందన్న రెమ్యూనరేషన్ గురించి సోషల్ మీడియాలో వైరల్’గా మారింది. రష్మిక ఒక్కో సినిమాకు 4 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుందని తెలుస్తోంది. ఇక ఆమె ఆస్తుల విషయానికి వస్తే.. రష్మిక నికర ఆస్తుల విలువ 64 కోట్ల ఉంటుందని.. నెలవారి ఆదాయం 60 లక్షలుకు పైగా, వార్షిక ఆదాయం ఎనిమిది కోట్లకు పైగా ఉంటుందని తెలిపింది సెలెబిట్రీల ఆస్తుల వివరాలను తెలిపే ఓ వెబ్ సైట్. Photo : Twitter ఈ భామ తన సంపాదనలో ఎక్కువ భాగం ప్రాపర్టీస్పై ఇన్వెస్ట్ చేసిందని తెలుస్తోంది. అందులో భాగంగా ఆమె ఈ ఐదు సంవత్సరాల్లో ఓ ఐదు లగ్జరీ అపార్ట్మెంట్స్ను కొన్నట్లు తెలుస్తోంది. ఇవి ఐదు డిఫరెంట్ ప్లేసుల్లో అని సమాచారం. రష్మిక హైదరాబాద్, గోవా, ముంబై, కూర్గ్, బెంగుళూరు సిటీలో ఖరీదైన అపార్ట్మెంట్స్ సొంతం చేసుకుందట. Photo : Twitter Photo : Twitter రష్మిక మందన్న పర్సనల్ విషయానికి వస్తే.. ఆమె కర్ణాటకలో కొడగు జిల్లాలోని విరాజ్పేట్లో ఏప్రిల్ 5, 1996లో జన్మించారు. రష్మిక కూర్గ్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు. ఆ తర్వాత రష్మిక M. S. రామయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ & కామర్స్ నుండి సైకాలజీ, జర్నలిజం, ఆంగ్ల సాహిత్యంలో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. రష్మిక మందన్న బెంగళూరు టైమ్స్ 25 మోస్ట్ డిసైరెబుల్ ఉమెన్ ఫర్ 2014 జాబితాలో చోటు సంపాదించి అదరగొట్టారు. Photo : Instagram రష్మిక మందన్న..'గీత గోవిందం' సినిమాతో తెలుగువారికి చాలా దగ్గరైంది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో.. తెలుగులో విజయ్తో మరోసారి 'డియర్ కామ్రెడ్' సినిమాలో అదరగొట్టిన సంగతి తెలిసిందే. రష్మిక, మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' నటించి స్టార్ హీరోయిన్గా ఎదిగింది. కన్నడలో ఆమె పునీత్ రాజ్కుమార్ సరసన అంజని పుత్ర, గణేశ్ సరసన ఛమక్ అనే సినిమాల్లో నటించింది. ఇక తెలుగులో యువ నాగ శౌర్యతో కలసి నటించిన ఛలో ఆమె తొలి తెలుగు సినిమా. ఈ సినిమా తర్వాత వరుసగా సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అందులో భాగంగా విజయ్ దేవరకొండతో పాటు మహేష్ బాబు, నితిన్, అల్లు అర్జున్ లాంటీ స్టార్స్తో సినిమాల్లో నటిస్తూ అదరగొడుతోంది ఈ కూర్గ్ అందం.Photo : Instagram
2024-04-24T05:45:43Z
రూ.3 కోట్లతో తీస్తే 100 కోట్లు రాబట్టిన హీరోయిన్.. 23 ఏళ్ల వయసుకే రష్మికకి మించిన క్రేజ్..
బడా స్టార్లు లేకపోయినా మంచి కంటెంట్ ఉంటే ఎంత పెద్ద హిట్టైనా సాధించవచ్చు అని ప్రేమలు (Premalu) సినిమా మరోసారి నిరూపించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన ఈ మలయాళ రొమాంటిక్ మూవీ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అతిపెద్ద విజయాలలో ఒకటిగా నిలిచింది. ఈ చిన్న సినిమా కేవలం రూ.3 కోట్ల బడ్జెట్తో తెరకెక్కింది. పైగా ఇందులో పెద్ద నటులు ఎవరూ నటించలేదు. అయినా ఇది అత్యధిక వసూళ్లు చేసిన మలయాళ సినిమాలలో ఒకటిగా అవతరించింది. ప్రేమలు సినిమాతో ఇద్దరు సాధారణ యాక్టర్స్ సింగిల్ నైట్లో బీభత్సమైన స్టార్డమ్ అందుకున్నారు. ఇందులో హీరోయిన్గా నటించిన మమితా బైజు (Mamitha Baiju) సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. అంతేకాదు, బాక్సాఫీస్ రికార్డుల పరంగా స్టార్ హీరోయిన్లను సైతం బీట్ చేసింది. సూపర్ క్రేజ్రొమాంటిక్ కామెడీ ప్రేమలు సినిమాలో మమితా బైజు యాక్టింగ్కు మూవీ లవర్స్ ఫిదా అయిపోయారు. క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో, చలాకీ నటనతో అందరి హృదయాలు దోచేసింది. అందం, అభినయంతో సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ రీనూ పాత్రలో అద్భుతంగా నటించి తెలుగు ప్రేక్షకులను కూడా కట్టిపడేసింది. ఈ సినిమా పుణ్యమా అని దాదాపు 23 ఏళ్ల వయస్సులోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. సినిమాల కోసం సైకాలజీ వదిలేసిందిమమిత కేరళలోని కిడాంగూర్లో బైజు కృష్ణన్, మినీ దంపతులకు జన్మించింది. ఆమె తండ్రి ఓ డాక్టర్. తల్లిదండ్రులు పట్టుబట్టడంతో టీనేజ్ వయసులో నటించడం స్టార్ట్ చేసింది, యాక్టింగ్ చేస్తూనే చదువు కూడా కొనసాగించింది. స్వస్థలంలోనే స్కూలింగ్ పూర్తి చేసిన మమిత కొచ్చిలోని సేక్రెడ్ హార్ట్ కాలేజీలో బి.ఎస్సీ సైకాలజీ కోర్సులో జాయిన్ అయింది. కొంతకాలం పాటు సైకాలజీలో కెరీర్ కొనసాగించాలని భావించింది. కానీ విధి ఆమెను స్టార్ హీరోయిన్ను చేసింది. చిన్న వయసులోనే ఎంట్రీ16 ఏళ్ల వయస్సులో 2017లో "సర్వోపరి పాలక్కారన్ (Sarvopari Palakkaran)" సినిమాతో మమిత తన నటనా ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత కొన్నేళ్లపాటు, అనేక టీనేజ్ డ్రామాల్లో, పెద్ద సినిమాల్లో చిన్న పాత్రల్లో నటించింది. 2021లో విడుదలైన "ఆపరేషన్ జావా" సినిమాతో ఆమెకు గుర్తింపు వచ్చింది. ఈ సినిమాలో ఆమె నటన ప్రశంసలు అందుకుంది. తరువాతి రెండేళ్లలో "ఖో-ఖో", "సూపర్ శారణ్య", "ప్రణయ విలసం" వంటి చిత్రాల్లో ముఖ్య పాత్రలు పోషించింది. ఇవన్నీ ఆమెకు పెద్దగా గుర్తింపు తెచ్చిపెట్టలేదు. కానీ "ప్రేమలు" సినిమా ఆమెను రాత్రికి రాత్రే స్టార్ హీరోయిన్గా మార్చింది. భారీ వసూళ్లురూ.3 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.136 కోట్లు వసూలు చేసి, 2024 సంవత్సరంలో అతిపెద్ద హిట్గా నిలిచింది. గిరీష్ AD దర్శకత్వం వహించిన ఈ సినిమా భారతదేశం అంతటా సూపర్ హిట్ కావడంతో మమిత, అలాగే ఆమె సహనటుడు నస్లీన్ కేరళలో మాత్రమే కాకుండా భారతదేశం అంతటా గుర్తింపు పొందారు. 2024 మార్చిలో "రెబల్" సినిమాతో ఆమె తమిళ సినిమాల్లోకి అడుగుపెట్టింది. రికార్డులు బ్రేక్ప్రేమలు సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.136 కోట్లు వసూలు చేసి, 2024లో అత్యధిక వసూళ్లు చేసిన ఎనిమిదవ భారతీయ చిత్రంగా నిలిచింది (ఏప్రిల్ 24 నాటికి). అంటే, 23 ఏళ్ల మమిత నటించిన ఈ సినిమా కత్రినా కైఫ్ నటించిన మేరీ క్రిస్మస్ (రూ. 26 కోట్లు), యామి గౌతమ్ నటించిన ఆర్టికల్ 370 (రూ. 110 కోట్లు), కృతి సనన్ నటించిన తేరి బాటన్ మెయిన్ ఐసా ఉల్ఝా జియా (రూ.133 కోట్లు) కంటే ఎక్కువ వసూళ్లు రాబట్టింది. దాదాపు 23 ఏళ్ల వయస్సులోనే ఇంతటి స్టార్ హీరోయిన్లను ఓడించడం చిన్న విషయం కాదు.
2024-04-25T06:04:59Z