30 ఏళ్ల యూట్యూబ్ స్టార్, చిన్న రెస్టారెంట్లో పనిచేసేవాడు, ఇప్పుడు 100 కోట్ల ఆస్తి..
వినోద పరిశ్రమలో వచ్చిన మార్పులతో తెలుగులో రాజీ రెడ్డి, అన్వేష్, బయ్యా సన్నీ యాదవ్, షణ్ముఖ్, విస్మయ్ ఫుడ్స్, ప్రసు బేబి వంటి వారు ఉంటే.. హిందీలో క్యారీ మినాటి, ఆశిష్ చంచ్లానీ, అమిత్ భదానా వంటి యూట్యూబ్ స్టార్స్ బయటకు వచ్చారు. అయితే వీరికంటే కూడా భారతదేశంలో అత్యంత ధనిక యూట్యూబర్ గురించి యూట్యూబర్ గురించి ఇక్కడ మనం మాట్లాడుకుందాం. అతని సంపద కోట్లలో ఉంటుంది. నేటి యుగంలో, చాలా మంది స్టార్లుగా మారారు, సోషల్ మీడియా ద్వారా తమ నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నారు. అందులో భాగంగా చాలా మంది కష్టపడి తమను తాము గొప్ప యూట్యూబర్లుగా మార్చుకున్నారు. అయితే భారతదేశ ప్రసిద్ధ యూట్యూబర్ భువన్ బామ్ మాత్రం అందరికంటే కూడా ప్రత్యేకం.. భువన్ బామ్ ఒకప్పుడు నెలకు రూ.5వేలు సంపాదించేవాడు, ఆ సమయంలో క్లబ్బులలో పనిచేసేవాడు.. ఈ రోజు భువన్ పేరు భారతదేశంలోని అత్యంత ధనవంతులైన యూట్యూబర్ల జాబితాలో కనిపిస్తుంది. పాటలు పాడే టీవీ షోలలోకి రావడానికి గంటల తరబడి క్యూలో నిలబడే భువన్ ఈరోజు సెలబ్రిటీ అయ్యాడు, జనాలు అతన్ని సినిమా స్టార్ లాగా ప్రేమిస్తారు.. సోషల్ మీడియాలో ఆయనకు అంత ఆదరణ ఉంది.గతంలో రోజుకు రూ.150 సంపాదించిన భువన్ ఇప్పుడు ఖరీదైన కార్లలో తిరుగుతూ కోట్లాది రూపాయల ఆస్తికి (భువన్ బామ్ నెట్ వర్త్) యజమాని. GQ ప్రకారం, భువన్ బామ్ రూ. 122 కోట్ల నికర విలువతో భారతదేశంలో అత్యంత ధనిక యూట్యూబర్ టైటిల్ను కైవసం చేసుకుంది. యూట్యూబ్లో 26 మిలియన్ల సబ్స్క్రైబర్లు ఉన్నారు.30 ఏళ్ల భువన్ బామ్ మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చాడు. గతంలో కేఫ్ ఆర్టిస్ట్గా పనిచేసాడు. అతను న్యూ ఢిల్లీలోని చిన్న కేఫ్లు, రెస్టారెంట్లలో పాడేవాడు. తరువాత భువన్ బామ్ యూట్యూబ్లోకి ప్రవేశించి తన సత్తాను చాటాడు. 30 ఏళ్ల భువన్ బామ్ మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చాడు. గతంలో కేఫ్ ఆర్టిస్ట్గా పనిచేసాడు. అతను న్యూ ఢిల్లీలోని చిన్న కేఫ్లు, రెస్టారెంట్లలో పాడేవాడు. తరువాత భువన్ బామ్ యూట్యూబ్లోకి ప్రవేశించి తన సత్తాను చాటాడు. 2021లో 'ధిండోరా' అనే కామెడీ సిరీస్తో భువన్ బామ్ తన సృజనాత్మకు మరింత పదును పెట్టాడు. యూట్యూబ్లో హాఫ్ బిలియన్ వ్యూస్ సాధించిన భారతదేశపు సిరీస్గా గుర్తించబడింది. ఆ తర్వాత 'తాజా ఖబర్' అని, Amazon MiniTVలో రొమాంటిక్ కామెడీ 'రఫ్తా రాఫ్తా'లలో నటించి వావ్ అనిపించాడు. ఇక భువన్ ఫస్ట్ వీడియో యూట్యూబ్లో చాలా పాపులర్ అయ్యింది. ఆపై అతను వెనుదిరిగి చూడలేదు. భువన్ తన BB వైన్స్ సిరీస్ని ప్రారంభించాడు. అందులో అతను చాలా చిన్న వీడియోలను పోస్ట్ చేసేవాడు. అతని వీడియోలలో అద్భుతమైన మాటలు, తీరు అతన్ని రాత్రిపూట స్టార్గా మార్చింది. BB Ki Vines 26 మిలియన్ల కంటే ఎక్కువ సబ్స్క్రైబర్లు ఉన్నారు
2024-04-24T08:01:28Z
టీ షర్ట్పై మీ బొమ్మ కావాలా? జస్ట్ 10 నిమిషాల్లో ప్రింట్ వేసిస్తారు
బర్త్ డే , అలాగే మ్యారేజస్, పుట్టినరోజు వేడుకలకు మంచి బహుమతి ఇవ్వాలనుకుంటారు.. మారుతున్న కాలానికి అనుగుణంగా కూడా మంచి గిఫ్ట్స్ వినూత్న రీతిలో డిజైన్చేసి ఇస్తున్నారు. ఫ్యామిలీ ఫొటో ఆల్బమ్ డిజైన్చేయడం నుండి మనం టీ, కాఫీ తాగే కప్ పై ఫొటోస్ వేయడం టీ షర్ట్స్ పైన ఫొటోస్ వేయడం కీ చైన్స్ పైన మనకు నచ్చిన ఫొటోస్ ఇవ్వడం ఇలా ఏ వస్తువు అయితే ఆ వస్తువు పైన ఫొటోస్ వేయడం ఈ మధ్యకాలంలో ఒక ఫ్యాషన్ అయిపోయింది యువతీ, యువకులు కూడా ఇలాంటివి గిఫ్ట్గా ఇవ్వడానికి చాలా ఆసక్తి చూపుతున్నారు. దీనికి అనుగుణంగా గిఫ్ట్ ఆర్టికల్స్ షాప్ కూడా అలానే వెలిశాయి. ఇందులో భాగంగా కరీంనగర్కు చెందిన శివ అనే వ్యక్తి బహుమతి గిఫ్ట్ గ్యాలరీ షాప్తో అనేక విధాలుగా ఫొటోస్ ప్రేమ్స్ మనకు నచ్చిన స్టైల్లో డిజైన్వేసి కరీంనగర్ ప్రజలకు తక్కువ ధరలోనే అందిస్తున్నారు. వీరి దగ్గర టీ కప్పు ప్రింటింగ్, టీ షర్ట్, ప్రింటింగ్ స్వయంగా సొంత మిషనరీ పైన వేసి పదే పది నిమిషాల్లో కస్టమర్కు అందిస్తున్నారు. వీరి దగ్గర రూపాయలు 100 నుండి మొదలుకొని 3000 రూపాయల వరకు అతి తక్కువ ఖర్చుతో కరీంనగర్ లో ఎవరు ఇవ్వని ధరలకు వీటిని ఇస్తున్నారు. కస్టమ్మర్స్ అభిరుచులకు తగ్గట్టు వివిధ డిజైన్లలో ఫోటో పెయింటింగ్ చేసి తక్కువ సమయంలోనే వారికి అందిస్తున్నారు. దాదాపు రెండు సంవత్సరాల నుండి ఈ బహుమతి గిఫ్ట్ ఆర్టికల్ నడుపుతున్నామని కరీంనగర్ చుట్టుపక్కల ప్రాంతాల వారికి తక్కువ ధరలకే ఈ సౌకర్యాలు అందించాలని, మేము స్వయంగా అన్ని మిషనరీలు తెచ్చుకొని మేమే ప్రింట్ చేసి తక్కువ సమయంలో ఇస్తున్నామని బహుమతి గిఫ్ట్ ఆర్టికల్ నిర్వాహకులు శివ లోకల్ 18 కు తెలిపారు. కాలేజీ ఈవెంట్స్, అలాగే పండగలకు మ్యారేజెస్కు స్పెషల్ అట్రాక్షన్ కోసం వీరి దగ్గర టీ షర్ట్స్పై ఎక్కువగా ఫోటో ప్రింట్ వేసి ఇస్తున్నారు. ఆన్లైన్లో దొరికే ప్రతి ఫోటో గ్యాలరీ కావచ్చు, అలాగే మగ్ ప్రింటింగ్ కావచ్చు ఏదయినా ఇక్కడ తక్కువ ధరలోనే ఉంటాయట. మీరు మీకు నచ్చిన ఫొటోస్ టీ షర్ట్స్పై వేసుకోవాలనుకుంటున్నారా ఐతే వీరిని సంప్రదించండి.. ఇంకెందుకు లేటు మీకు నచ్చినగర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫెండ్స్, వైఫ్, పిల్లలకు, మంచి గిఫ్ట్ బహుమతి ఇవ్వాలనుకుంటే వీరిని సంప్రదించండి వీళ్ళ అడ్రస్స్ వచ్చేసి బస్టాండ్ టూ గీతబావన్ రోడ్.జోయాలూకాస్ పక్కన కరీంనగర్
2024-04-24T06:00:58Z
ఆ జ్ఞాపకాలు వెంటాడుతున్నాయి.. స్పెషల్ పర్సన్ గురించి రష్మిక మందన్న ఇంట్రెస్టింగ్ పోస్ట్..
రష్మిక మందన్న గురించి తెలుగు వారికి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతుంది ఈ కూర్గ్ అందం. ఈ భామ ప్రస్తుతం తెలుగులో రెయిన్బో అనే లేడీ సెంట్రిక్ మూవీతో పాటు అల్లు అర్జున్తో పుష్ప ది రూల్ మూవీ కూడా చేస్తోంది. Photo : Instagram పుష్ఫ2 ఆగస్టు 15న భారీగా విడుదలకానుంది. ఆ మధ్య వారసుడుతో మరో బంపర్ హిట్ అందుకున్న రష్మిక తాజాగా హిందీలో యానిమల్ అనే ప్యాన్ ఇండియా చిత్రంలో నటించి మరో భారీ విజయాన్ని అందుకుంది. రణబీర్ కపూర్ హీరోగా వచ్చిన ఈ సినిమాకు.. సందీప్ రెడ్డి వంగా దర్శకుడు. Photo : Instagram ఇక ఈ భామ నటిస్తున్న పుష్ఫ2 ఆగస్టు 15న భారీగా విడుదలకానుంది. ఆ మధ్య వారసుడుతో మరో బంపర్ హిట్ అందుకున్న రష్మిక తాజాగా హిందీలో యానిమల్ అనే ప్యాన్ ఇండియా చిత్రంలో నటించి మరో భారీ విజయాన్ని అందుకుంది. రణబీర్ కపూర్ హీరోగా వచ్చిన ఈ సినిమాకు.. సందీప్ రెడ్డి వంగా దర్శకుడు. Photo : Instagram ఇక అది అలా ఉంటే.. రష్మిక మందన్న సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ అని తెలిసిందే. అందులో భాగంగా తాజాగా ఈ భామ ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసింది. ఆమె తన పోస్ట్’లో రాస్తూ.. ఈ సమ్మర్లో తన ఇంటిని.. తాను పెంచుకుంటున్న కుక్క పిల్లను ఎంతో మిస్ అవుతున్నానని తెలిపింది. దీంతో నెటిజన్స్ ఈ పోస్ట్పై రకరకాలుగా స్పందిస్తున్నారు.. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Photo : Instagram ఇక రష్మిక మందన్న సినిమాల విషయానికి వస్తే... రష్మిక పాటు పుష్ప2 : ది రూల్ - 15 ఆగస్టు విడుదల కానుంది. ఈ సినిమాతో పాటు VD12 - విజయ్ దేవరకొండ - గౌతమ్ తిన్ననూరి సినిమా, D51 - ధనుష్ & శేఖర్ కమ్ముల సినిమా, రవితేజ- గోపీచంద్ మలినేని సినిమా, రెయిన్బో - లేడీ ఓరియెంటెడ్ మూవీల్లో నటిస్తోంది. వీటితో పాటు ఇక లేటెస్ట్గా దర్శకుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వస్తోన్న మూవీ.. ఈ సినిమాను GA2 పిక్చర్స్ నిర్మిస్తోంది. . Photo : Instagram ఈ భామ శేఖర్ కమ్ముల, ధనుష్ కాంబినేషన్లో వస్తున్న కుబేర అనే ఓ ఫ్యాన్ ఇండియా మూవీలో హీరోయిన్గా నటించనుంది. ఈ సినిమాను అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP బ్యానర్ నిర్మిస్తున్నారు.. Photo : Instagram లేటెస్ట్గా తమిళ స్టార్ హీరో విక్రమ్కు జోడిగా రష్మిక ఓ భారీ సినిమాలో నటించనుందని తెలుస్తోంది. ఇటీవల కేరళలో వచ్చిన వరదల నేపథ్యంలో వచ్చిన ‘2018’ అనే చిత్రం డైరెక్టర్ జూడ్ ఆంథోనీ జోసెఫ్ దర్శకత్వంలో విక్రమ్ ఓ భారీ సినిమాను చేస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్గా రష్మిక మందన్న నటించనుందట. ఈ విషయంలో త్వరలో అధికారిక ప్రకటన విడుదలకానుంది. రష్మిక ఇప్పటికే తమిళ్లో కార్తీ ‘సుల్తాన్ ’, విజయ్ ‘వారిసు’ చిత్రాల్లో నటించి అక్కడ మంచి పాపులర్ అయ్యింది. Photo : Instagram ఇప్పటికే యానిమల్, మిషన్ మజ్ను, గుడ్ బై వంటి సినిమాల్లో నటించింది.. ఇక వీటికి తోడుగా ఆమెకు మరో భారీ సినిమాలో అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. ఛవా అనే హిస్టారికల్ పాన్-ఇండియా సినిమాలో ఆమె హీరోయిన్గా ఎంపికైనట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో విక్కీ కౌశల్ సరసన రష్మిక కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రం ఛత్రపతి శివాజీ పెద్ద కుమారుడు చత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా రూపొందించబడింది. శంభాజీ మహారాజ్ భార్య యేసుబాయి భోంసాలే పాత్రలో రష్మిక నటిస్తోంది. ఛవా చిత్రానికి లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించనున్నారు. దినేష్ విజన్ నిర్మించనున్నారు. Photo : Instagram ఇక మరోవైపు రష్మిక ఓ సంచలన రికార్డ్ను క్రియేట్ చేసింది. ఇన్స్టాగ్రామ్లో తరచు తన సినీ, వ్యక్తిగత విషయాలను ఫ్యాన్స్, ఆడియన్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటుంది రష్మిక. ఇక తాజాగా రష్మిక మందన్న తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో మొత్తంగా 40 మిలియన్ ఫాలోవర్లని దక్కించుకుని ఒక గొప్ప రికార్డు నమోదు చేసింది. దీంతో ఇండియాలోనే అత్యధిక ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లు కలిగిన హీరోయిన్స్లో ఒకరిగా సెన్సేషనల్ రికార్డ్ను నమోదు చేసింది రష్మిక మందన్న.. Photo : Instagram ఇక వరుస హిట్ సినిమాలతో మంచి ఊపు మీదున్న రష్మిక మందన్న రెమ్యూనరేషన్ గురించి సోషల్ మీడియాలో వైరల్’గా మారింది. రష్మిక ఒక్కో సినిమాకు 4 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుందని తెలుస్తోంది. ఇక ఆమె ఆస్తుల విషయానికి వస్తే.. రష్మిక నికర ఆస్తుల విలువ 64 కోట్ల ఉంటుందని.. నెలవారి ఆదాయం 60 లక్షలుకు పైగా, వార్షిక ఆదాయం ఎనిమిది కోట్లకు పైగా ఉంటుందని తెలిపింది సెలెబిట్రీల ఆస్తుల వివరాలను తెలిపే ఓ వెబ్ సైట్. Photo : Twitter ఈ భామ తన సంపాదనలో ఎక్కువ భాగం ప్రాపర్టీస్పై ఇన్వెస్ట్ చేసిందని తెలుస్తోంది. అందులో భాగంగా ఆమె ఈ ఐదు సంవత్సరాల్లో ఓ ఐదు లగ్జరీ అపార్ట్మెంట్స్ను కొన్నట్లు తెలుస్తోంది. ఇవి ఐదు డిఫరెంట్ ప్లేసుల్లో అని సమాచారం. రష్మిక హైదరాబాద్, గోవా, ముంబై, కూర్గ్, బెంగుళూరు సిటీలో ఖరీదైన అపార్ట్మెంట్స్ సొంతం చేసుకుందట. Photo : Twitter Photo : Twitter రష్మిక మందన్న పర్సనల్ విషయానికి వస్తే.. ఆమె కర్ణాటకలో కొడగు జిల్లాలోని విరాజ్పేట్లో ఏప్రిల్ 5, 1996లో జన్మించారు. రష్మిక కూర్గ్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు. ఆ తర్వాత రష్మిక M. S. రామయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ & కామర్స్ నుండి సైకాలజీ, జర్నలిజం, ఆంగ్ల సాహిత్యంలో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. రష్మిక మందన్న బెంగళూరు టైమ్స్ 25 మోస్ట్ డిసైరెబుల్ ఉమెన్ ఫర్ 2014 జాబితాలో చోటు సంపాదించి అదరగొట్టారు. Photo : Instagram రష్మిక మందన్న..'గీత గోవిందం' సినిమాతో తెలుగువారికి చాలా దగ్గరైంది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో.. తెలుగులో విజయ్తో మరోసారి 'డియర్ కామ్రెడ్' సినిమాలో అదరగొట్టిన సంగతి తెలిసిందే. రష్మిక, మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' నటించి స్టార్ హీరోయిన్గా ఎదిగింది. కన్నడలో ఆమె పునీత్ రాజ్కుమార్ సరసన అంజని పుత్ర, గణేశ్ సరసన ఛమక్ అనే సినిమాల్లో నటించింది. ఇక తెలుగులో యువ నాగ శౌర్యతో కలసి నటించిన ఛలో ఆమె తొలి తెలుగు సినిమా. ఈ సినిమా తర్వాత వరుసగా సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అందులో భాగంగా విజయ్ దేవరకొండతో పాటు మహేష్ బాబు, నితిన్, అల్లు అర్జున్ లాంటీ స్టార్స్తో సినిమాల్లో నటిస్తూ అదరగొడుతోంది ఈ కూర్గ్ అందం.Photo : Instagram
2024-04-24T05:45:43Z
బాక్స్ నిండా మీకు నచ్చిన పుస్తకాలు... జస్ట్ రూ.1500 మాత్రమే
చిన్నపిల్లలు , పెద్దవాళ్లు పుస్తకాలు చదవడం ఎంతో ముఖ్యం. పుస్తకాలు చదవడం వల్ల జ్ఞాపక శక్తి చాలా మెరుగుపడుతుంది. పాఠశాలలో ఉండే పాఠాలు చదువుతూనే ఇతర గొప్ప రచయితల కథల పుస్తకాలు చదవడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. ఈ ఆధునిక కాలంలో ఉన్న ప్రజలు పాత పద్ధతుల్లో పుస్తకాలు చదవడం ఇష్టపడుతున్నారు. హైదరాబాద్ నగర వాసులకు శుభవార్త. అదేంటంటే నగరంలో ఉన్న పుస్తక ప్రియుల కోసం భారతదేశంలోని అతి పెద్ద బుక్ ఫేర్ ఖైరతాబాద్ ప్రాంతంలోని వాసవి కళ్యాణ మండపంలో బుక్ టేల్స్ నిర్వహించిన స్టోరీ బాక్స్ అనే గొప్ప బుక్ ఫేర్ జరిగింది. ఈ బుక్ ఫేర్ లో ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన రచయితల గొప్ప పుస్తకాలు లభిస్తున్నాయి. అంతేకాకుండా ఎన్నో అవార్డులు పొందిన రచయితల పుస్తకాలు కూడా ఉన్నాయి. బుక్ టెల్స్ వారు నిర్వహించిన స్టోరీ బాక్స్ లో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల కు సంబంధించిన పుస్తకాలు ఏర్పాటు చేశారు. ఈ బుక్ ఫేర్ లో జనరల్ నాలెడ్జ్, జనరల్ సైన్స్, సొసైటీ, డాక్యుమెంటరీ, హిస్టరీ, సైన్స్ ఫిక్షన్, రొమాన్స్, క్రైమ్, ఫాంటసీ లాంటి ఎన్నో రకాల పుస్తకాలు లభిస్తున్నాయి. అంతేకాకుండా ఈ స్టోరీ బాక్స్ బుక్ ఫెయిర్ లో ప్రత్యేకంగా 16 సంవత్సరాల పై వయసు వారి కోసం ప్రత్యేకమైన పుస్తకాలనుఏర్పాటు చేశారు. అలాగే పురాతనమైన లెదర్ బాండ్ బుక్ లను కూడా ప్రదర్శించారు. ఈ బుక్ ఫేర్ లో బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా రచించిన అన్ఫినిష్డ్ పుస్తకాన్ని వచ్చిన నగరవాసులు, ఇతర ప్రాంతాల పుస్తక ప్రజలు కొనుక్కోవడం చాలా విశేషంగా అనిపిస్తుంది. అయితే ఈ బుక్ లను కొనడానికి నగర వాసులే కాకుండా ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా వచ్చి ఎన్నో రకాల పుస్తకాలనుచాలా తక్కువ ధరలో సొంతం చేసుకున్నారు. ఈ స్టోరీ బాక్స్ వారు ఇచ్చిన ఆఫర్ ఏంటంటే… రెండు బాక్స్ లనుఏర్పాటు చేశారు. ఒకటి మినీ బాక్స్ , మరొకటి బిగ్ బాక్స్. వారు ఏర్పాటు చేసిన మినీ బాక్స్ లో ఎన్ని బుక్స్ అయితే పడతాయో, వాటికి ఎంత ధర అయినా ఉన్నా … ఆ బాక్స్ కి కేవలం 1500 రూపాయలు మాత్రమే తీసుకుంటున్నారు. ఈ మినీ బాక్స్ లో సుమారు 10 నుంచి 15 పుస్తకాలు సులభంగా పెట్టుకోవచ్చు. అంతేకాకుండా బిగ్ బాక్స్ లో సుమారు 20 నుంచి 25 పుస్తకాల వరకు పెట్టుకోవచ్చు. ఈ బిగ్ బాక్స్ కు కేవలం 2500 రూపాయలు మాత్రమే తీసుకుంటున్నారని స్టోరీ బాక్స్ వాలంటీర్ రక్షందా,లోకల్ 18 ప్రతినిధితో తెలిపారు.
2024-04-24T11:17:14Z
పదివేల చీరలు, 1250 కిలోల వెండి, 28 కిలోల బంగారం.. ఈ తెలుగు హీరోయిన్ దేశంలోనే సంపన్నురాలు..
ఇండియన్ సినీ ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్లు హీరోలతో సమానంగా డబ్బులు సంపాదిస్తుంటారు. వరుస హిట్లు పడితే, కోట్ల రూపాయల రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుంటారు. మన దేశంలో మంచి స్టార్డమ్తో భారీగా డబ్బు సంపాదించిన హీరోయిన్లు అంటే, మనకు ఐశ్వర్య రాయ్, ప్రియాంక చోప్రా, దీపికా పదుకొణె వంటి పేర్లు గుర్తుకు వస్తాయి. రేఖ, శ్రీదేవి వంటి అలనాటి నటీమణులు కూడా ఈ లిస్టులో ఉంటారు. అయితే వీరందరి కంటే ఎక్కువ డబ్బులు సంపాదించిన హీరోయిన్ మరొకరు ఉన్నారు. పదివేలకు పైగా చీరలు, 1250 కిలోల వెండి, 28 కిలోల బంగారం ఆమె దగ్గర ఉండేవి. ఆమె ఎవరో కాదు, ఒకప్పటి హీరోయిన్, తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత. నటిగా రాణించి, రాజకీయ నాయకురాలిగా ఎదిగిన జయలలిత భారతదేశంలోనే అత్యంత ధనవంతురాలైన నటిగా పేరు తెచ్చుకున్నారు. గూఢచారి 116, చిక్కడు దొరకడు, సుఖ దుఃఖాలు వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను సైతం ఆమె అలరించారు. భారీ సంపద1997 నాటికి జయలలిత రాజకీయాల్లో బాగా స్థిరపడ్డారు. ఆ సమయంలో, చెన్నైలోని ఆమె పోయెస్ గార్డెన్ నివాసంపై అవినీతి నిరోధక అధికారులు దాడి జరిపారు. దాఖలు చేసిన అభియోగాల పత్రంలో, జయలలితకు రూ.188 కోట్ల ఆస్తి ఉన్నట్లు డిక్లేర్ చేసినప్పటికీ, నిజానికి ఆమె నికర సంపద విలువ రూ.900 కోట్ల వరకు ఉంటుందని అధికారులు ఆరోపించారు. ద్రవ్యోల్బణం, రూపాయి విలువ పరంగా చూస్తే.. ఈ విలువ ఇప్పుడు భారీగా ఉంటుంది. ఈ ఆస్తుల విలువ ప్రస్తుతం రూ.800 కోట్ల సంపద కలిగిన ఐశ్వర్య రాయ్ కంటే ఎక్కువ. ఇతర టాప్ ఇండియన్ హీరోయిన్లు ప్రియాంక చోప్రా (రూ.600 కోట్లు), దీపికా పదుకొణె (రూ.560 కోట్లు), అలియా భట్ (రూ.550 కోట్లు)లు జయలలిత కంటే ఇప్పటికీ చాలానే వెనకబడ్డారని చెప్పవచ్చు. సంపన్న నటిఅధికారులు జయలలిత ఇంట్లో 10,500 చీరలు, 750 జతల చెప్పులు, 91 గడియారాలు, 800 కిలోల వెండి, 28 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. 2016లో మరో దర్యాప్తులో ఆమె వద్ద 1,250 కిలోల వెండి, 21 కిలోల బంగారం ఉన్నట్లు తేలింది. జయలలితకు ఎనిమిది లగ్జరీ కార్లు, రూ.42 కోట్ల విలువైన చరాస్తులు కూడా ఉన్నాయి. సినిమా, రాజకీయ జీవితంజయలలిత 1948లో మైసూర్ రాష్ట్రంలోని మాండ్యలో జన్మించారు. 1961లో కన్నడ భాషా చిత్రం "శ్రీ శైల మహాత్మ"లో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించడం ద్వారా నటనా జీవితాన్ని ప్రారంభించారు. చిన్న పాత్రలతో సినిమాలు, నాటకాలలో నటించిన తరువాత 1960ల మధ్యలో తమిళ, తెలుగు సినిమాల్లో హీరోయిన్గా అరంగేట్రం చేశారు. 1968లో ధర్మేంద్ర సరసన "ఇజ్జత్" చిత్రంతో బాలీవుడ్లోకి అడుగుపెట్టారు. 70వ దశకంలో దక్షిణ భారతదేశంలో అగ్ర నటిగా నిలిచారు. ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, జైశంకర్, ఎం.జి. రామచంద్రన్ వంటి అప్పటి దిగ్గజ హీరోలతో కలిసి నటించారు. జయలలిత జనవరి 1980లో సినిమా కెరీర్కు గుడ్ బై చెప్పి తమిళనాడు రాజకీయాల్లో క్రియాశీలకంగా పని చేశారు. 1991 నుంచి 2016 మధ్య ఆరు పర్యాయాలు, 14 సంవత్సరాలకు పైగా తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2016, డిసెంబర్లో 68 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడే ఈ రిచెస్ట్ యాక్ట్రెస్ మరణించారు.
2024-04-24T05:16:06Z