Trending:


Karnataka Corporator Daughter Murder: క్యాంపస్ లో ఘోరం.. ప్రేమను ఒప్పుకోలేదని యువతిపై 9 సార్లు కత్తిపోట్లు.. వీడియో వైరల్..

Karnataka Corporator Daughter Murder: కాలేజీలో ఒక యువకుడు అమ్మాయిని క్రూరంగా హతమార్చాడు. అందరు చూస్తుండగానే పరిగెత్తించి మరీ 9 సార్లు కత్తితో ఇష్టమోచ్చినట్లు ఆమె మెడపై పొడిచాడు. ఈ ఘటనతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


Mamitha Baiju: ఐశ్వర్య రాయ్ నన్నారే సాంగ్కి మమితా డ్యాన్స్ వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

Mamitha Baiju: ఐశ్వర్య రాయ్ నన్నారే సాంగ్కి మమితా డ్యాన్స్ వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే! నెల్సన్ కే గఫూర్, మమితా బజు హీరోహీరోయిన్లుగా నటించిన ఈ ఫీల్ గుడ్ మూవీ ప్రేమలు. లవ్ కామెడీ జోనర్లో వచ్చి మలయాళ యూత్నే కాదు..తెలుగు ఆడియన్స్ను కూడా ఇంప్రెస్ చేసింది. ఈ సినిమాపై సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియోస్కు తెగ ఫిదా అవుతున్నారు యూత్. ముఖ్యంగా ఇ...


Article 370 OTT Streaming: నేటి నుంచే ప్రముఖ ఓటీటీలో ఆర్టికల్ 370 మూవీ స్ట్రీమింగ్..

Article 370 OTT Streaming: ప్రెజెంట్ సినీ ఇండస్ట్రీలో రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ నేపథ్యంలో తెరకెక్కే చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అంతేకాదు ఈ తరహా చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయి. ఇక మన దేశంలో జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తూ వస్తోన్న ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేసింది. ఈ నేపథ్యంలో హిందీలో 'ఆర్టికల్ 370' పేరుతో ఓ సినిమా వచ్చి బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. తాజాగా ఈ సినిమా ప్రముఖ...


Salman Khan House Firing: సల్మాన్‌పై కాల్పులు జరిపేందుకు అంత చెల్లించారట - ఫుల్ అమౌంట్ తీసుకోకుండానే దొరికిపోయారు!

Salman Khan House Firing Case: బాలీవుడ్ స్టార్ యాక్టర్ సల్మాన్ ఖాన్ ఇంటి దగ్గర కాల్పులు జరిగిన కేసులో మరో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. హర్యానాలో మూడో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్, పోలీసుల అదుపులో ఉన్న విక్కీ గుప్తా(24), సాగర్ కుమార్ పాలక్(21) మధ్య కోఆర్డినేటర్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఆదివారం తెల్లవారుజామున సల్మాన్ నివాసం ముందు కాల్పులు ఆదివారం(ఏప్రిల్ 14) నాడు తెల్లవారుజామున ముంబై బాంద్రాలోని సల్మాన్...


ఆర్ఎంపీ కొడుకుకు సివిల్స్ లో 321వ ర్యాంక్

ఆర్ఎంపీ కొడుకుకు సివిల్స్ లో 321వ ర్యాంక్ సివిల్స్ ఫలితాల్లో ఆర్ఎంపీ కొడుకు సత్తా చాటాడు. సిద్దిపేట జిల్లా కొండపాకకు చెందిన ఆర్ఎంపీ నరేష్, లలిత కుమారుడు బుద్ది అఖిల్ యాదవ్ 321వ ర్యాంకు సాధించారు. ఎలాంటి కోచింగ్ కు వెళ్లకుండా ఇంట్లోనే సొంతంగా నోట్స్ తయారు చేసుకొని చదివి విజయం సాధించారు. అఖిల్ 2018లో కేయూలో ఇంజినీరింగ్ పూర్తి చేసిన తర్వాత సివిల్స్ పై...


చిరంజీవి చేసిన పనికి ప్రతి చోట పరువు పోగొట్టుకుంటున్న యాంకర్‌ సుమ.. చివరికి నవదీప్‌ కూడా వదల్లేదు

మొన్న ఓ ఈవెంట్‌లో చిరంజీవి, సుమ మధ్య జరిగిన కోట్‌ దొంగ కన్వర్జేషన్‌ బాగా పేలింది. కానీ ఇప్పుడు అది సుమ పరువు తీస్తుంది. ఆమె కొంప ముంచుతుంది. యాంకర్‌ సుమ హోస్ట్ గా ఉన్న ఏదైనా ఈవెంట్‌కి మెగాస్టార్‌ చిరంజీవి వచ్చారంటే ఏదో రకంగా ఇద్దరి మధ్య సరదాగా కన్వర్జేషన్‌ ఉంటుంది. నవ్వులు పూయించేలా చేస్తారు. లేదంటే ఏదైనా ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకోవడమా? కొత్త విషయాలను పంచుకోవడమా జరుగుతుంటాయి. ఏదైనా ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫుల్‌ ఉంటుందని చెప్పొచ్చు. అయితే ఓ ఈవెంట్‌లో...


ఓటీటీలో 6 వెబ్ సిరీస్‌లను చూశారా.. ఒళ్లు గగుర్లు పొడిచే సీన్స్‌తో..

The Railway Men : శివ్ రావైల్ దర్శకత్వం వహించిన సిరీస్‌లో కెకె మీనన్, ఆర్. మాధవన్, దివ్యేందు శర్మ మరియు బాబిల్ ఖాన్. ఇందులో, ది రైల్వే మెన్ భారతీయ రైల్వేలతో సంబంధం ఉన్న నలుగురు వ్యక్తుల కల్పిత కథను చెబుతుంది. భోపాల్ చరిత్రలో అత్యంత దారుణమైన రాత్రి గురించి ఈ వెబ్ సిరీస్‌లో చూపించారు. దీనిని YRF ఎంటర్‌టైన్‌మెంట్ (యశ్ రాజ్ ఫిల్మ్స్ స్ట్రీమింగ్ విభాగం) నిర్మించింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతోంది. నాలుగు గంటల నిడివి గల వెబ్ సిరీస్ ఎపిసోడ్ 1984 భోపాల్ విపత్తు సంఘటనలను హైలైట్ చేస్తుంది. Scam 1992:The Harshad Mehta Story: స్టాక్ బ్రోకర్ హర్షద్ మెహతా నిజ జీవితం చుట్టూ తిరిగే థ్రిల్లింగ్ బయోలాజికల్ ఫైనాన్షియల్ సిరీస్ ఇది. జర్నలిస్టులు సుచేతా దలాల్, దేబాశిష్ బసు రచించిన 1992 పుస్తకం ది స్కామ్ : హు వోన్, హూ లాస్ట్, హూ గాట్ అవే ఆధారంగా తెరకెక్కింది. స్టాక్ బ్రోకర్లు చేసిన 1992 ఇండియన్ స్టాక్ మార్కెట్ స్కామ్‌ను డిస్కస్ చేస్తుంది. హన్సల్ మెహతా దర్శకత్వం వహించారు, జై మెహతా కో-డైరెక్టర్‌గా పనిచేశారు, ఈ వెబ్ సిరీస్‌లో ప్రతీక్ గాంధీ, శ్రేయ ధన్వంతి, హేమంత్ ఖేర్, సతీష్ కౌశిక్ నటించారు. స్కామ్ 1992 అక్టోబరు 9, 2020న ప్రీమియర్ అయ్యింది. SonyLIVలో ప్రసారం అవుతోంది. Dahaad: ఇది ఒక పోలీస్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్, ఇందులో సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలో నటించింది. రీమా కగ్తి, జోయా అక్తర్ రూపోందించారు. రుచికా ఒబెరాయ్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో గుల్షన్ దేవయ్య, విజయ్ వర్మ, సోహమ్ షా ఇతర కీలక పాత్రలో నటించారు. ఈ వెబ్ సిరీస్ సీరియల్ కిల్లర్ మోహన్ కుమార్ జీవితం ఆధారంగా తీసుకుని తీశారు. అతన్ని సైనైడ్ మోహన్ అని కూడా పిలిచేవారు. ఈవెబ్ సిరీస్ మే 12, 2023 నుంచి Amazon Prime వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. Scoop: హన్సల్ మెహతా, మృణ్మయీ లాగూ వైకులే నిర్మించి, దర్శకత్వం వహించిన స్కూప్‌ సిరీస్‌లో కరిష్మా తన్నా, మహమ్మద్ జీషన్ అయ్యూబ్,హర్మాన్ బవేజా ప్రధాన పాత్రల్లో నటించారు. ఇందులో ప్రోసెన్‌జిత్ ఛటర్జీ, తన్నిష్ఠ ఛటర్జీ, దేవెన్ భోజాని కూడా సహాయక పాత్రల్లో నటించారు. ఈ స్కూప్ జిగ్నా వోరా జీవితచరిత్ర స్మృతి బిహైండ్ బార్స్ ఇన్ బైకుల్లా : మై డేస్ ఇన్ ప్రిజన్ ఆధారంగా రూపొందించబడింది. ఈ సిరీస్ జూన్ 2011లో మిడ్-డే రిపోర్టర్ జ్యోతిర్మయి డే హత్యను డిస్కస్ చేస్తుంది. ఈ క్రైమ్ డ్రామా సిరీస్ జూన్ 2, 2023 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.Delhi Crime: ఢిల్లీ క్రైమ్‌లో షెఫాలీ షా, రసిక దుగ్గల్, ఆదిల్ హుస్సేన్ , రాజేష్ తైలాంగ్ నటించారు. ఈ సిరీస్ మొదటి సీజన్ 2012లో దక్షిణ ఢిల్లీలో జరిగిన ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేసు ఆధారంగా వచ్చింది. గ్యాంగ్‌రేప్ సంఘటన తర్వాత, మహిళా బాధితురాలిని కొట్టి చంపడానికి కారణం ఏంటీ.. ఈ నిందితులను డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డిసిపి) వర్తికా చతుర్వేది ఎలా కనుగొన్నారు అనే విషయాలను డిస్కస్ చేశారు. మొదటి సీజన్ మార్చి 22, 2019 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఇక రెండవ సీజన్ ఆగస్టు 26, 2022 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. రెండో సీజన్ చడ్డీ బనియన్ గ్యాంగ్‌పై ఫోకస్ చేసింది. ఈ రెండు సీజన్‌లు నెట్‌ఫ్లిక్స్‌లో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతున్నాయి. Jamtara– Sabka Number Ayega: సౌమేంద్ర పాధి నిర్మించి, దర్శకత్వం వహించిన ఇండియన్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్ ఇది. జమ్తారా - సబ్కా నంబర్ ఆయేగాలో అమిత్ సియాల్, దిబ్యేందు భట్టాచార్య, అక్ష్ పర్దసాని, స్పర్ష్ శ్రీవాస్తవ, అన్షుమాన్ పుష్కర్ తదితరులు నటించారు. ఇండియాలో జరిగే ఫిషింగ్ రాకెట్‌ను నడిపే వ్యక్తుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ సిరీస్ మొదటి సీజన్‌ను జనవరి 10, 2020 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఇక రెండవ సీజన్‌ను సెప్టెంబర్ 23, 2022 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ రెండు సీజన్‌లు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉన్నాయి.


Trinayani Serial April 19th: త్రినయని సీరియల్: సుమన నటనకు గాల్లో ఉసిరి దీపాలు.. తొలిబిడ్డ జాడ నయనికి తెలిసిపోతుందా..!

Trinayani Today Episode : విశాలాక్షి చెప్పినట్లు హాసిని ఉసిరి దీపాల పూజకు ఏర్పాట్లు చేస్తుంది. తిలోత్తమ, సుమన అందరూ అక్కడే ఉంటారు. నయనికి తల స్నానం చేసి రమ్మని విశాలాక్షి చెప్తుంది. తిలోత్తమ, సుమన నయని తలపెట్టిన ఆ పూజకు ఆటంకం తలపెట్టాలని అనుకుంటారు. వల్లభ: చిన్న మరదలా.. కాసేపట్లో వాళ్లు వెలిగించబోయే ఆ ఉసిరి దీపాలను నేలపాలు చేశావంటే మీ అక్క దీక్షకు భంగం కలుగుతుంది. సుమన: అందరి నన్ను కొట్టి చంపేయాలి అని అలా చెప్తున్నారు కదా బావగారు. తిలోత్తమ:...


నైనీ బొగ్గు బ్లాక్​కు ఏనుగుల​ గండం!

నైనీ బొగ్గు బ్లాక్​కు ఏనుగుల​ గండం! ‘ఎలిఫెంట్ ​కారిడార్’ పేరుతో ఒడిశా కొర్రీలు మూడేళ్లుగా స్టేజ్-2 ఎన్విరాన్​మెంట్​ పర్మిషన్లు ఇయ్యట్లే ఓబీ, కోల్​ ఉత్పత్తికి వాయిదాల మీద వాయిదాలు టార్గెట్లు కేటాయిస్తున్నా షురూ కాని బొగ్గు ఉత్పత్తి తాజాగా ఆఫీసర్ల టీమ్​ను పంపేందుకు రాష్ట్ర సర్కారు చర్యలు కోల్​బెల్ట్, వెలుగు: సింగరేణి ఎనిమిదిన్నరేండ్ల కింద ఒడిశా ర...


ఇద్దరు నకిలీ డాక్టర్లపై కేసు

ఇద్దరు నకిలీ డాక్టర్లపై కేసు ఘట్ కేసర్, వెలుగు : రోగులకు ట్రీట్ మెంట్ చేస్తున్న ఇద్దరు నకిలీ డాక్టర్లపై కేసు నమోదైంది. పోచారం ఐటీసీ ఇన్ స్పెక్టర్ రాజువర్మ తెలిపిన   ప్రకారం.. నారపల్లిలోని కొర్రెముల రోడ్డులో  వైద్య వృత్తిలో ఎలాంటి అనుభవం లేకుండానే ఎంబీబీఎస్ డాక్టర్లు గా ఆర్ఆర్ క్లినిక్ ను  రవీందర్ రెడ్డి, డీబీఎం క్లినిక్ ను  నరేందర్ నడుపుతున్నారు.  ...


కన్యత్వం గురించి కొడుకు ముందే తెలుగు హీరోయిన్ ఓపెన్.. ఇదేం సంప్రదాయం అంటూ..

మలైకా అరోరా గురించి తెలుగు వారికి ప్రత్యేక పరిచయం అక్కర లేదు. ఆమె తెలుగులో పలు సినిమాల్లో ఐటెమ్ సాంగ్స్ చేసింది. ముఖ్యంగా గబ్బర్ సింగ్‌లో కెవ్వు కేక అంటూ ఆడిపాడింది. ఆ తర్వాత కూడా పలుచిత్రాల్లో ఐటెమ్ నంబర్స్ చేసింది. ప్రస్తుతం హిందీ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అది అలా అంటే మలైకా తన కొడుకును 'కన్యత్వం' గురించి ప్రశ్నించిందట. దీంతో ఆమెకు ఊహించని విధంగా జవాబు వచ్చిందట. మలైకా కొడుకు అర్హాన్ ఖాన్ ఓ పాడ్‌కాస్ట్ చేస్తున్నాడు. దీని పేరు 'దమ్...


"60 మంది ముందు CI చేసిన ఆ అవమానమే, నేను సివిల్స్ వైపు వెళ్లేలా చేసింది"-ఉదయ్ కృష్ణారెడ్డి

"60 మంది ముందు CI చేసిన ఆ అవమానమే, నేను సివిల్స్ వైపు వెళ్లేలా చేసింది"-ఉదయ్ కృష్ణారెడ్డి


Car Accident: ప్రముఖ సినీ నటుడి కారు బీభత్సం.. బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకుడు మృతి

Actor Raghu Babu Car Hits Bike Man Died In Nalgonda: ప్రముఖ సినీ నటుడి కారు ఢీకొని బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకుడు మృతి చెందాడు. ఈ సంఘటన తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో చోటుచేసుకుంది.


Today Panchangam:ఈ దుర్ముహుర్తంలో కాలు బయట పెట్టకండి..!

Today Panchangam: తెలుగు పంచాంగం ప్రకారం.. 18 ఏప్రిల్ 2024 గురువారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి. పంచాంగం తేది :- 18ఏప్రిల్ 2024 శ్రీ క్రోథి నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్ర మాసం శుక్లపక్షం గురువారం తిథి :- దశమి రాత్రి 06:55ని॥ వరకు నక్షత్రం :- ఆశ్రేష ఉ॥09:38ని॥ వరకు యోగం:- గండం రాత్రి 02:03 ని॥ వరకు కరణం:- తైతుల ఉ॥06:10గరజి రాత్రి 06:55 ని॥వరకు వర్జ్యం:- రాత్రి10:46ని॥ల12:31ని॥వరకు అమృత...


Shakeel News: నా కొడుకును తెలంగాణ పోలీసులు చంపుతారట, సీబీఐ ఎంక్వైరీ వేయాల్సిందే - బోధన్ మాజీ ఎమ్మెల్యే

Bodhan Ex MLA Shakeel: బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆమీర్ చాలా కాలం తర్వాత ఓ వీడియోను విడుదల చేశారు. తన కుమారుడు ఓ కారు ప్రమాదంలో ఇరుక్కోవడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన షకీల్ ఇప్పుడు ఓ వీడియో ద్వారా తన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వీడియోను ఆయన దుబాయ్ నుంచే చేసినట్లుగా తెలిసింది. తన కొడుకును జైల్లో పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుట్రలు పన్నుతున్నారని షకీల్ అన్నారు. పోలీసులు కూడా నా కొడుకును చంపేస్తామని అంటున్నారని ఆరోపించారు. కేవలం రాజకీయ కుట్రతోనే...


కల్యాణ రామునికి 45కిలోల లడ్డు

కల్యాణ రామునికి 45కిలోల లడ్డు జగిత్యాల టౌన్, వెలుగు: శ్రీరామనవమి పురస్కరించుకొని  విశ్వహిందూ పరిషత్ జగిత్యాల శాఖ, శ్రీరామ సేవాసమితి ఆధ్వర్యంలో స్వామివారికి భారీ లడ్డు నైవేద్యంగా సమర్పించారు. జగిత్యాల పట్టణం ధరూర్ క్యాంపులోని శ్రీ కోదండ రామాలయం 45 ఏండ్లు  పూర్తి చేసుకున్న సందర్భంగా 45కిలోల లడ్డూను స్వామి వారికి  నైవేద్యంగా సమర్పించారు. ఈ కార్యక్రమంల...


అల్లు అర్జున్ భార్య ముందు హీరోయిన్స్ దిగదుడుపే... స్నేహారెడ్డి గ్లామరస్ లుక్ చూశారా!

అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి స్టార్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తుంది. వాళ్ళు ఒకింత కుళ్ళుకునేలా ఆమె గ్లామర్ ఉంది. అల్లు స్నేహారెడ్డి లేటెస్ట్ లుక్ వైరల్ అవుతుంది. అల్లు స్నేహారెడ్డి సోషల్ ఇండియాలో సపరేట్ ఫ్యాన్ బేస్ మైంటైన్ చేస్తుంది. గ్లామరస్ ఫోటో షూట్స్, వీడియోలు పోస్ట్ చేస్తూ తన ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేస్తుంది. ఫిట్నెస్ ఫ్రీక్ అయిన స్నేహారెడ్డి ప్రతిరోజూ వ్యాయామం చేస్తారు. యోగ ఆచరిస్తారు. మానసిక ప్రశాంత కోసం గార్డెన్ లో గడుపుతారు. స్ట్రిక్ట్...


రాజన్న సన్నిధిలో రాములవారి కళ్యాణం.. లక్షమంది భక్తులు హాజరు

రాజన్న సన్నిధిలో రాములవారి కళ్యాణం.. లక్షమంది భక్తులు హాజరు సీతారాముల కల్యాణానికి హాజరైన లక్షదాకా జనం       ఆకర్షణగా నిలిచిన శివ పార్వతులు, జోగినులు, హిజ్రాలు      వైభవంగా రథోత్సవం వేములవాడ, వెలుగు : వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో శ్రీ సీతారాముల కల్యాణం బుధవారం అంగరంగ వైభవంగా జరిగింది. కల్యాణం తిలకించడానికి లక్ష మందికి పైగా భక్తులు హాజరయ్...


నేను మహేష్ బాబుకు అమ్మను ఏంటి, నాన్సెన్స్! నా బతుకు ఇలా అయిపోయింది! అయ్యో కస్తూరి!

కస్తూరి శంకర్ తనకు వయసు పెరగడం లేదని తెగ బాధపడిపోతోంది. దాని వలన ఆమె ఆఫర్స్ కోల్పోతున్నారట. మహేష్ బాబు పక్కన అమ్మగా సెట్ కాను , హీరోయిన్ గా చేసే వయసే అంటుంది నటి కస్తూరి శంకర్ ముక్కుసూటిగా మాట్లాడుతుంది. పలు సందర్భాల్లో ఆమె చేసిన కామెంట్స్ చర్చకు దారి తీశాయి. తాజాగా వయసు పెరగని కారణంగా ఆమె ఆఫర్స్ కోల్పోతున్నారట. ఆ కహాని ఏమిటో చూద్దాం.. తాజా ఇంటర్వ్యూలో నటి కస్తూరి మాట్లాడుతూ... కళ్యాణ్ రామ్ డెవిల్ మూవీలో నాకు ఆఫర్ వచ్చింది. సీత చేసిన పాత్ర నేను...


నాగవంశీ కి ‘దేవర’డీల్ సెట్ కాలేదా?ఎంతకు అడిగారు

‘‘సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న అప్‌డేట్స్‌, ఫొటోల్లో ఎలాంటి వాస్తవం లేదు. మేం నిర్మించే, డిస్ట్రిబ్యూట్‌ చేసే చిత్రాలకు సంబంధించిన విషయాలను అధికారికంగా ప్రకటిస్తాం. కాబట్టి, దయచేసి రూమర్స్ నమ్మకండి’’ అంటూ నాగవంశీ వేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌గా మారింది. నాగవంశీ ఈ పోస్ట్‌ పెట్టానికి కారణం ఏమిటా? అని చాలా మంది నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. మరికొంతమంది మాత్రం ‘దేవర’ గురించే అని అనుకొంటున్నారు. తమ బ్యానర్‌కు...


నేడు శ్రీరామ నవమి : ధర్మానికి ప్రతిరూపం శ్రీరాముడు

నేడు శ్రీరామ నవమి : ధర్మానికి ప్రతిరూపం శ్రీరాముడు శ్రీరాముడు వసంత ఋతువులో  చైత్ర శుద్ధ నవమి పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో,  అభిజిత్ ముహూర్తంలో త్రేతాయుగంలో జన్మించాడు. ఆ మహనీయుని పుట్టిన రోజును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. పద్నాలుగు సంవత్సరములు అరణ్యవాసం, రావణ సంహారం అనంతరం  శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడయ్యాడు. ఈ శుభ సంఘటన కూ...


రఘుబాబు కారు ఢీకొని BRS నేత మృతి..వైరల్ వీడియోలో ఏముందంటే..

తెలంగాణలోని నల్గొండ పట్టణ సమీపంలోని అద్దంకి- నార్కట్ పల్లి జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు బీఆర్ఎస్ పార్టీకి చెందిన నల్లగొండ పట్టణ కార్యదర్శి సంధినేని జనార్ధన్ రావు (48)గా గుర్తించారు. అయితే ఢీకొట్టిన కారు ప్రముఖ సినీనటుడు రఘుబాబుదిగా గుర్తించారు. రఘుబాబు వెళ్తున్న కారును బైక్‌పై వేగంగా వచ్చిన జనార్ధన్‌ రావు అదుపు తప్పి ఢీకొట్టాడని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం అనంతరం రఘుబాబుతో...


TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్ - జులై నెల ఆర్జిత సేవా టికెట్లు విడుదల

TTD Released Srivari Seva Tickets: తిరుమల (Tirumala) శ్రీవారి భక్తులకు అలర్ట్. జులై నెలకు సంబంధించి ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ గురువారం ఉదయం 10 గంటలకు విడుదల చేసింది. ఈ నెల 20 వరకు ఆన్ లైన్ లో టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. ఆ రోజు ఉదయం 10 గంటల వరకూ సుప్రభాతం, తోమాల, అర్చన అష్టదళపాదపద్మారాధన టికెట్లు పొందడానికి ఆన్ లైన్ లో పేర్లు నమోదు చేసుకోవాలి. అనంతరం మధ్యాహ్నం లక్కీ డిప్ ఆధారంగా అధికారులు టికెట్లు కేటాయిస్తారు. ఇందులో టికెట్లు పొందిన వారు...


ప్రియుడి ఆత్మహత్యకు బాధ్యత ప్రియురాలిది కాదు

ప్రియుడి ఆత్మహత్యకు బాధ్యత ప్రియురాలిది కాదు న్యూఢిల్లీ: లవ్ ఫెయిల్యూర్ కారణంగా యువకుడు సూసైడ్ చేసుకుంటే దానికి అతడి లవర్​ను దోషిగా నిర్ధారించలేమని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. బలహీన మనస్తత్వం కలిగిన వ్యక్తి తీసుకున్న తప్పుడు నిర్ణయానికి వేరొకరిని నిందించలేమని తేల్చి చెప్పింది. 2023లో ఓ యువకుడు లవ్ ఫెయిల్యూర్ కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడు. తనను...


Ayodhya Ram Lalla Getup | బాల రాముని వేషధారణలో బాలుడు

రామ్ లల్లా వేషం ధరించి, రామనవమి సందర్భంగా అయోధ్యకు వచ్చాడు. బాలుడు చత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌ నుంచి నగరానికి వచ్చాడు.


Actor Raghubabu Car Incident: నటుడు రఘుబాబు కారు ఢీకొని బీఆర్ఎస్ నేత మృతి - నల్లగొండలో ఘోర ప్రమాదం

Actor Raghubabu Car Incident In Nalgonda: కారు, బైక్ ను ఢీకొట్టిన ఘటనలో బీఆర్ఎస్ నాయకుడు మృతి చెందిన ఘటన నల్లగొండలో జరిగింది. నల్లగొండ బైపాస్ రోడ్డులో నిన్న(ఏప్రిల్ 17న) సాయంత్రం ఈ ఘటన జరిగింది. నటుడు రఘుబాబు హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ వైపు వెళ్తుండగా ఈ యాక్సిడెంట్ జరిగింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే? 50 మీటర్లు బైకును లాక్కెళ్లిన రఘుబాబు కారు నల్లగొండ పట్టణంలోని నార్కెట్ పల్లి- అద్దంకి రహదారిపై సినీ నటుడు రఘుబాబు కారును బైక్‌ ఢీ కొట్టింది. ఈ...


ఒకసారిస్తే ప్రభాస్ మళ్ళీ అడిగాడు... వేణు స్వామి భార్య వీడియో వైరల్!

వేణు స్వామి హీరో ప్రభాస్ పై పలుమార్లు నెగిటివ్ కామెంట్స్ చేశారు. ప్రభాస్ వ్యక్తిగత జీవితం పై ఆయన చేసిన కామెంట్స్ ఫ్యాన్స్ ని హర్ట్ చేశాయి. దాంతో వేణు స్వామిని వారు పలుమార్లు ట్రోల్ చేశారు. ప్రభాస్ కి వివాహం జరగదు. సలార్ ప్లాప్ అవుతుంది. ఆయనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయంటూ... వేణు స్వామి చెప్పిన సంగతి తెలిసిందే. ప్రభాస్ అంటే నాకేమీ కోపం లేదు. ఆయన జాతకం ప్రకారం భవిష్యత్తు ఏమిటో చెప్పాను అంతే అన్నారు. నెగిటివ్ కామెంట్స్ తో వేణు స్వామి ప్రభాస్ తో పాటు...


చెర్రీ చెర్రీ లేడీ.. వన్నెలాడిలా దివ్యభారతి!

దివ్యభారతి బ్లూ శారీలో చెర్రీ చెర్రీ లేడీ సాంగ్‌తో ఫొటోషూట్ చేసింది. అసలే అందం ఆపై చీర ఇక నెటిజన్లు అదిరిపోయే కాంప్లిమెంట్స్ ఇచ్చారు.


Chaitra Purnima Hanuman Jayanti 2024 Date: ఏప్రిల్ 23 చైత్ర పూర్ణిమ రోజు హనుమాన్ జయంతి కాదు హనుమాన్ విజయోత్సవం - ఈ రెండింటికి వ్యత్యాసం తెలుసా!

Chaitra Purnima Hanuman Jayanti 2024: ఏటా చైత్రమాసం వచ్చేసరికి పౌర్ణమి రోజు హనుమాన్ జయంతి అనే హడావుడి జరుగుతుంది. మరికొందరు వైశాఖ మాసంలో కదా హనుమాన్ జయంతి అని ప్రశ్నిస్తారు. ఇంతకీ ఆంజనేయుడి జన్మ తిథి చైత్రమాసంలోనా , వైశాఖంలోనా ? దీనికి క్లారిటీ కావాలంటే..హనుమాన్ విజయోత్సవం - హనుమాన్ జయంతి మధ్య ఉన్న వ్యత్యాసం తెలియాలి... Also Read: మూఢం వచ్చేస్తోంది మూహుర్తాలు పెట్టేసుకోండి త్వరగా - అసలు మూఢంలో శుభకార్యాలు ఎందుకు నిర్వహించకూడదో తెలుసా! హనుమాన్...


కమిట్మెంట్ ఇచ్చినా అవకాశాలు రావు... తెలుగు అమ్మాయిల పరిస్థితిపై హిమజ ఓపెన్ కామెంట్స్

తెలుగు అమ్మాయి హిమజ పలు చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ చేసింది. ఈమె క్యాస్టింగ్ కౌచ్ పై చేసిన కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. కమిట్మెంట్ ఇచ్చిన వాళ్ళందరూ అవకాశాలు రావడం లేదని వాపోయింది. తెలుగు అమ్మాయి అయిన హిమజ సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించింది. భార్యామణి, స్వయంవరం, కొంచెం ఇష్టం కొంచెం వంటి సీరియల్స్ లో ఆమె నటించారు. కీలక రోల్స్ చేసింది. 2016లో విడుదలైన శివమ్ మూవీతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది. నేను శైలజ, జనతా గ్యారేజ్, ధ్రువ, మహానుభావుడు,...


అభినవ్ గోమటం .. నవ్వించే దొంగ

అభినవ్ గోమటం .. నవ్వించే దొంగ అభినవ్ గోమటం లీడ్‌‌ రోల్‌‌లో నటించిన చిత్రం ‘మై డియర్ దొంగ’. శాలినీ కొండెపూడి, దివ్య శ్రీపాద, నిఖిల్ గాజుల, వంశీధర్ గౌడ్, శశాంక్ మండూరి కీలక పాత్రలు పోషించారు. గోజల మహేశ్వర్‌‌రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఆహా ఓటీటీ ద్వారా​ విడుదల అవుతోంది. బుధవారం జరిగిన ఈవెంట్‌‌లో ప్రియదర్శి ట్రైలర్‌‌‌‌ను లాంచ్ చేసి, టీమ్‌‌కు ఆల్ ద బెస్ట...


సినీ నటుడు రఘుబాబు కారును ఢీకొని బీఆర్ఎస్ నేత మృతి

ప్రముఖ సినీ నటుడు కారును ఓ బైకర్ ఢీకొట్టాడు. ఈదుర్ఘటనలో బైక్ పై వచ్చిన వ్యక్తి స్పాట్ లో చనిపోయాడు. స్థానికులు సినీ నటుడి కారును చుట్టుముట్టారు. ఇంతలో పోలీసులు ఘటన స్తలానికి చేరుకొని సినీ నటుడి పొరపాటు లేదని.. బైక్ పై వచ్చిన బీఆర్ఎస్ నాయకుడే రాంగ్ రూట్లో వచ్చి కారును ఢీకొట్టినట్లుగా తేల్చడంతో నటుడితో స్థానికులు వాగ్వాదానికి దిగారు. . ఈఘటన నల్లగొండ జిల్లా అద్దంకి- నార్కట్ పల్లి జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. బైక్ తో రాంగ్ రూట్లో వచ్చి కారును...


తిరుమల శ్రీవారిని మొదటి గడప నుంచి దర్శించుకోవాలా? ఈ లక్కీ ఛాన్స్ మీకోసమే

తిరుమలలో శ్రీవారి దర్శనానికి వెళ్లాలనుకునే భక్తులకు గుడ్ న్యూస్. జూలై నెల కోటాను విడుదల చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం. తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన జూలై నెల కోటాను ఇవాళ ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. తిరుమల ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం భక్తులు ఏప్రిల్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. అదేరోజు మధ్యాహ్నం 12 గంటలకు లక్కీడిప్ జరుగుతుంది. లక్కీ డిప్‌లో టికెట్లు పొందిన వారు డబ్బులు చెల్లించి ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్ల కోటాను ఏప్రిల్ 22వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన జూలై నెల కోటాను ఏప్రిల్ 22న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. జూలై నెల‌కు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను ఏప్రిల్ 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన జూలై నెల ఆన్ లైన్ కోటాను ఏప్రిల్ 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా జూలై నెల ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను ఏప్రిల్ 23న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది. ఇక జూలై నెల‌కు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఏప్రిల్ 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. తిరుమల, తిరుపతిలో జూలై నెల గదుల కోటాను ఏప్రిల్ 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. ఏప్రిల్ 27న శ్రీవారి సేవ ఉదయం 11 గంటలకు, న‌వ‌నీత సేవ మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు, ప‌ర‌కామ‌ణి సేవ మ‌ధ్యాహ్నం 1 గంట‌కు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. భక్తులు ఈ విషయాలను గమనించి టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ కోరుతోంది. లక్కీ డిప్‌లో పాల్గొనాలనుకునే భక్తులు ముందుగా https://ttdevasthanams.ap.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. మొబైల్ నెంబర్‌, ఇతర వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి. రిజిస్ట్రేషన్ పూర్తైన తర్వాత లాగిన్ చేయాలి. లాగిన్ అయ్యాక ఇతర వివరాలు నమోదు చేసి లక్కీ డిప్‌లో టికెట్స్ సెలెక్ట్ చేయాలి. టీటీడీ ముందుగా చెప్పిన సమయానికి లక్కీ డ్రా నిర్వహిస్తుంది లక్కీ డిప్‌లో టికెట్స్ వచ్చినవారు డబ్బులు చెల్లించి టికెట్స్ తీసుకోవచ్చు. ఆ తర్వాత తిరుమలలో గదుల కోసం రిజిస్ట్రేషన్ చేయొచ్చు.


వైభవంగా సీతారాముల కల్యాణం

వైభవంగా సీతారాముల కల్యాణం బ్రహ్మాండంగా భద్రాద్రి శ్రీరామనవమి బ్రహ్మోత్సవం     ఉమ్మడి జిల్లాలో భక్తులతో కిక్కిరిసిన రామాలయాలు భద్రాచలం, వెలుగు : భద్రాద్రి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం సీతారాముల కల్యాణం వైభవంగా  జరిగింది. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు కల్యాణం చూసి పులకించిపోయారు. ముందుగా గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి, నదీ మాతకు ప...


ఒంటరైన ఐకే రెడ్డి .. బీఆర్‌ఎస్‌కు దూరం .. అందని హస్తం

ఒంటరైన ఐకే రెడ్డి .. బీఆర్‌ఎస్‌కు దూరం .. అందని హస్తం కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నాలు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వని హైకమాండ్‌ ఆయన చేరికను వ్యతిరేకిస్తున్న స్థానిక లీడర్లు నిర్మల్, వెలుగు : కొన్ని నెలల కిందటి వరకు మూడు శాఖలకు మంత్రిగా పనిచేసి, నిర్మల్‌ జిల్లా రాజకీయాల్లో ఆధిపత్యం కొనసాగించిన ఇంద్రకరణ్‌రెడ్డి ప్రస్తుతం ఒంటరిగా మిగిలారు. బీఆర్‌ఎస్‌ను వీ...


మాంసం ప్రియులకు బ్యాడ్ న్యూస్ ... ఈ ఆదివారం నో నాన్ వెజ్

హైదరాబాద్ : తెలంగాణ ప్రజలు మంచి నాన్ వెజ్ ప్రియులన్న విషయం అందరికీ తెలిసిందే. పండగైనా, శుభకార్యమైనా మెనూలో నాన్ వెజ్ వంటకాలు వుండాల్సిందే. ఇక ఆదివారం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు... ఆ రోజు ఇంట్లో పక్కా నాన్ వెజ్ వండాల్సిందే. మరీ ముఖ్యంగా ఈ ఉరుకుల పరుగుల ఉద్యోగ, వ్యాపార జీవితాన్ని సాగించే హైదరాబాదీలకు ఆదివారమే కాస్త సమయం దొరికేది. అందువల్లే ఆ రోజు భార్యాపిల్లలతో కలిసి ఇష్టమైన మాంసాహారం తినేందుకు ఇష్టపడతారు... కాబట్టి మాంసం దుకాణాలు...


ఆది సాయి కుమార్ హీరోగా .. కృష్ణ ఫ్రమ్ బృందావనం షురూ

ఆది సాయి కుమార్ హీరోగా .. కృష్ణ ఫ్రమ్ బృందావనం షురూ ఆది సాయి కుమార్ హీరోగా వీరభద్రమ్ చౌదరి తెరకెక్కిస్తున్న చిత్రం ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’. తూము నరసింహా, జామి శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. గురువారం ఈ చిత్రాన్ని ప్రారంభించారు. నిర్మాత దిల్ రాజు, దర్శకుడు అనిల్ రావిపూడి, నటుడు సాయికుమార్ అతిథులుగా హాజరయ్యారు. ఆది మాట్లాడుతూ ‘‘చుట్టాలబ్బాయ్’ తర్వాత వ...


Neha Shetty: పరవశంలో తేలిపోతున్న నేహా శెట్టి.. టిల్లు భామ అందాలకు కుర్రాళ్లు బోల్డ్..

Neha Shetty: పరవశంలో తేలిపోతున్న నేహా శెట్టి.. టిల్లు భామ అందాలకు కుర్రాళ్లు బోల్డ్..


Rama navami 2024: రామ నవమి నాడు ఈ 5 పనులు అస్సలు చేయకండి..!

రామభక్తులకు రామ నవమి పండుగ లాంటిది. రాముడిని ప్రసన్నం చేసుకోవడానికి అనేక మంత్రాలు, శ్లోకాలు చదవాలని మత గ్రంధాలు చెబుతున్నాయి. ఈ మంత్రాలు మరియు స్తోత్రాలను చదవడం వల్ల శ్రీరాముడు సంతోషిస్తాడని నమ్ముతారు. ముఖ్యంగా శ్రీరామరక్షా స్తోత్రాన్ని పఠించడం వల్ల జీవితంలోని అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు ఉంటాయి. దానికి పరిష్కారాలు వెతకాలి. అయితే దానికి దేవుని సహాయం కూడా కావాలి. కాబట్టి ఈ రామ నవమి నాడు తప్పకుండా ఈ శ్లోకాలు పఠించండి రామ నవమి పూజ ఎలా చేయాలి: ఈసారి రామ నవమి మార్చి 30న వస్తుంది. ఈ రోజున రామ రక్షా స్తోత్రాన్ని పఠించడం వల్ల జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు పెరుగుతుంది. దీనిని పఠించే ముందు తెల్లవారుజామున లేచి తలస్నానం చేసి శ్రీరాముని అనుగ్రహం పొందాలని పూజించాలి. ఉపవాస సమయంలో పుష్కలంగా నీరు త్రాగాలి. నిమ్మరసం, మంచినీరు, మజ్జిగ , గ్రీన్ టీ తాగడం ఇతర ఎంపికలు.పూజ సమయంలో దేవునికి అర్ఘ్యం సమర్పించండి.అయోధ్యలోని సరయు నదిలో పుణ్యస్నానం చేయడం వల్ల గత మరియు ప్రస్తుత పాపాలు తొలగిపోతాయి.రామచరిత మానస, రామ చాలీసా మరియు శ్రీరామ రక్షా స్తోత్రాలను కలిసి పఠించండి.ఈ రోజు రామ కీర్తనలు, భజనలు మరియు స్తోత్రాలను నిరంతరం పఠించడం ఉత్తమం. హనుమాన్ చాలీసా పఠించండి మరియు ప్రజలకు మరియు పేదలకు మీకు వీలైనంత దానం చేయండి.శ్రీరాముడు మధ్యాహ్న సమయంలో జన్మించినందున, ఈ సమయంలో రామనవమి పూజ చేయడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ రోజున అర్చనలు, నిర్దిష్ట పూజలు కూడా చేయవచ్చు.మీరు నిజాయితీగా ఉండండి. ఈ పవిత్రమైన రోజున చేయకూడని కొన్ని పనులు ఉన్నాయి:తామసిక ఆహారాలు, మాంసం మరియు ఆల్కహాల్ తీసుకోవడం మానుకోండి. ఉల్లి, వెల్లుల్లి వేయకుండా కూరలు చేయడం గురించి ఆలోచించండి.ఈ రోజున మీ జుట్టును కత్తిరించడం లేదా షేవింగ్ చేయడం మానుకోండి.ఇతరులను విమర్శించవద్దు లేదా చెడుగా మాట్లాడవద్దు.మీ భాగస్వామిని మోసం చేయవద్దు. ఎవరికీ ద్రోహం చేయవద్దు.(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఆధారాలు లేవు.)


ఈ రామాలయం పై హనుమంతుడి ప్రదక్షిణలు .. అదెలాగో తెలుసుకుందామా !

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలను భక్తిశ్రద్దలతో ఘనంగా జరుపుకున్నారు. ఊరూ వాడ రాములోరి కళ్యాణ మహోత్సవాలు కన్నుల పండువగా జరిగాయి. జిల్లాలోని ఆలయాలన్నీ రామ నామంతో మారుమ్రోగిపోయాయి. భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఉదయం నుండే ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు జరిగాయి. శ్రీ సీతారామచంద్రస్వాముల వారి కళ్యాణోత్సవాన్ని కూడా వైభవంగా నిర్వహించారు. శ్రీరామ నవమిని పురస్కరించుకొని జిల్లాలో పలుచోట్ల భారీ శ్రీరాముడి విగ్రహాలతో...


Pooja Hegde: గోల్డ్ డ్రెస్సులో పూజా హెగ్డే.. హీట్ పెంచేసే అందాలు

Pooja Hegde: గోల్డ్ డ్రెస్సులో పూజా హెగ్డే.. హీట్ పెంచేసే అందాలు


Parijatha Parvam Movie Review - పారిజాత పర్వం రివ్యూ: హర్ష చెముడు కామెడీ ఫుల్ హిట్ - మరి సినిమా? కిడ్నాప్ డ్రామా?

Crime Comedy Movie Parijatha Parvam Review In Telugu: చైతన్య రావు, సునీల్, శ్రద్ధా దాస్, మాళవికా సతీశన్, హర్ష చెముడు (వైవా హర్ష) ప్రధాన పాత్రల్లో నటించిన క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్ 'పారిజాత పర్వం'. సంతోష్ కంభంపాటి దర్శకత్వం వహించారు. మహీధర్ రెడ్డి, దేవేష్ నిర్మించారు. ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించాయి. మరి, శుక్రవారం (ఏప్రిల్ 19న) థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథ (Parijatha Parvam Movie Story): ఇంద్ర...


శిల్పాశెట్టి దంపతుల రూ.100 ఆస్తులు సీజ్

Shilpa Shetty: బాలీవుడ్ నటి శిల్పాశెట్టికి షాక్ తగిలింది. ఆమె, ఆమె భర్త రాజ్‌కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్-ఈడీ అధికారులు అటాచ్ చేశారు. బిట్‌కాయిన్లతో మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో శిల్పాశెట్టి దంపతుల స్థిర, చరాస్తులను అటాచ్‌ చేసింది. ఇందులో జుహూలోని ఓ ఫ్లాట్‌ శిల్పా శెట్టి పేరు మీద ఉన్నట్లు ఈడీ తెలిపింది. అంతేకాకుండా పుణెలోని ఓ బంగ్లా, రాజ్‌కుంద్రా పేరు మీదున్న ఈక్విటీ షేర్లను కూడా అటాచ్‌ చేసినట్లు వెల్లడించింది. 2017లో ముంబైకి చెందిన వేరియబుల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే సంస్థ గెయిన్‌ బిట్‌కాయిన్‌ పోంజీ స్కీమ్‌ను నిర్వహించింది. బిట్‌కాయిన్లలో పెట్టుబడులు పెడితే నెలకు 10 శాతం లాభాలు వస్తాయని మల్టీ లెవల్‌ మార్కెటింగ్‌ ద్వారా ముంబై, ఢిల్లీ నగరాల్లో ఏకంగా రూ.6,600 కోట్లు వసూలు చేశారు. చివరికి మోసం బయటపడటంతో కేసు నమోదు చేసిన ఈడీ దర్యాప్తు చేపట్టింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు అమిత్ భరద్వాజ్‌ నుంచి రాజ్‌ కుంద్రా 285 బిట్‌కాయిన్లు తీసుకున్నట్లు పేర్కొంది. వీటితో ఉక్రెయిన్‌లో బిట్‌కాయిన్‌ మైనింగ్‌ ఫామ్‌ను ఏర్పాటు చేయాలని రాజ్‌కుంద్రా ప్రణాళికలు వేసినట్లు తెలిపింది. ఆ బిట్‌కాయిన్లు ఇప్పటికీ రాజ్‌కుంద్రా వద్ద ఉన్నాయని.. వాటి విలువ రూ.150 కోట్లకు పైనే ఉంటుందని వెల్లడించింది.


ఈవెంట్ మేనేజర్‌ను రెండో పెళ్లి చేసుకున్న ఎన్టీఆర్ హీరోయిన్.. ఇదేం పోయే కాలం..

ఈ జాతీయ ఉత్తమ నటి గురించి తెలుగు వారికి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. తెలుగుతో పాటు తమిళ సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ తమిళ పొన్ను. ప్రస్తుతం హీరోయిన్‌గా అవకాశాలు లేక.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణీస్తూ.. సినిమాల్లో బిజీగా ఉంటోంది. అది అలా ఉంటే ప్రియమణి ఓ ముస్లీం వ్యక్తిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే చాలా మందికి నచ్చలేదట. ఈ క్రమంలో ఆమె అనేక విమర్శల్నీ ఎదర్కోన్నట్లు తెలిపింది. ఆమె తాజాగా హిందీ చిత్రం 'మైదాన్'‌లో కీలక పాత్రలో నటించింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె మాట్లాడుతూ.. నేటికీ చాలా మంది ముస్లిం వ్యక్తితో ఆమె వివాహాన్ని అంగీకరించలేకపోయారని తెలిపింది. ఇప్పటికీ కూడా ట్రోల్ చేస్తూనే ఉన్నారని పేర్కోంది. (ఫోటో కర్టసీ: Instagram@pillumani) ప్రియమణి భర్తపై 'లవ్ జిహాద్' ఆరోపణలు వచ్చయని.. ఇది తనను ఎంతో బాధించిందని తెలిపింది. ప్రియమణి భర్త ముస్తఫా రాజ్‌తో పెళ్లయి 6 సంవత్సరాల తర్వాత కూడా కొందరు ఆమెను ఇంకా ట్రోల్ చేస్తున్నారట. ఇక ముస్తఫా రాజ్‌తో ప్రియమణి రెండో పెళ్లి అని తెలిసిందే. అయితే ముస్తాఫా విడాకులు తీసుకోలేదని, అందుకే ప్రియమణితో అతని వివాహం చెల్లదని ముస్తఫా రాజ్ మొదటి భార్య అయేషా 'టైమ్స్ ఆఫ్ ఇండియా'తో చెప్పడంతో ప్రియమణి విడాకుల పుకార్లు ఊపందుకున్నాయి. ముస్తఫా రాజ్ ఈ వాదనలు నిరాధారమైనవని తెలిపాడు. దీంతో ఈ రూమర్స్‌కు చెక్ పెట్టినట్లు అయ్యింది. (ఫోటో కర్టసీ: Instagram@pillumani) బెంగళూరులో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ప్రియమణి, ముస్తఫా రాజ్ తొలిసారి కలుసుకున్నారు. ఆమె టోర్నమెంట్ క్రికెట్ టీమ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండగా, ముస్తఫా రాజ్ టోర్నమెంట్ ఈవెంట్ మేనేజర్‌గా ఉన్నారు. ఈ క్రమంలో వారి మధ్య సంభాషణ మొదలై.. ఆ తర్వాత మంచి స్నేహితులు అయ్యారు. దాదాపు నాలుగేళ్ల పాటు వీరి స్నేహం కొనసాగింది. (ఫోటో కర్టసీ: Instagram@pillumani) ప్రియమణి, ముస్తఫా రాజ్ మధ్య క్రమంగా ప్రేమ చిగురించడం ప్రారంభించింది. ఐపీఎల్ మ్యాచ్‌ల సమయంలో ఇద్దరూ కలిసి కనిపించడం.. ఆతర్వాత వీరి వ్యవహారం సర్వత్రా చర్చనీయాంశమైంది. డ్యాన్స్ రియాలిటీ షో 'డి ఫర్ డ్యాన్స్' గ్రాండ్ ఫినాలేలో ముస్తఫా జాతీయ టీవీలో ప్రియమణిని ప్రపోజ్ చేశాడు. ప్రియమణి ఈ షోకి న్యాయనిర్ణేతగా వ్యవహరించింది. వారిద్దరి మధ్య ప్రేమను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. (ఫోటో కర్టసీ: Instagram@pillumani) ప్రియమణి 27 మే 2016న ముస్తఫా రాజ్‌తో నిశ్చితార్థం చేసుకుంది, ఇక ఒక సంవత్సరం తర్వాత 23 ఆగస్టు 2017న వివాహం చేసుకుంది. పెళ్లికి సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. పెళ్లయ్యాక కూడా ఈ నటి సినిమాల్లో రాణించగలుగుతున్నారంటే దానికి కారణం భర్త మద్దతు ఉంది. (ఫోటో కర్టసీ: Instagram@pillumani) ప్రియమణి సినిమాలో పని చేయడానికి కనీసం రూ.50-60 లక్షలు తీసుకుంటుంది. ఆమె భర్త కేవలం ఈవెంట్ మేనేజర్ మాత్రమే కాదు, ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త. అంతేకాదు 'జింగ్ ఈవెంట్ అండ్ ప్రమోషన్ ప్రైవేట్ లిమిటెడ్' యజమాని కూడా. (ఫోటో కర్టసీ: Instagram@pillumani)


ఏం ఉన్నాడ్రా బాబు.. ప్రభాస్ లేటెస్ట్ లుక్ వైరల్

Prabhas Latest Look ప్రభాస్ లేటెస్ట్ లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అయితే ఇది ప్రభాస్ కొత్త లుక్? పాత లుక్? అనే ఆశ్చర్యంలో నెటిజన్లు పడిపోయారు. ఇది పాత వీడియోనా? కొత్త వీడియోనా? అని షాక్ అవుతున్నారు. ప్రభాస్ మాత్రం ఈ వీడియోల చాలా స్లిమ్‌గా, హ్యాండ్సమ్‌గా కనిపిస్తున్నాడు. ప్రభాస్ లేటెస్ట్ లుక్ అంటూ వీడియోని డార్లింగ్ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు.


Journey To Ayodhya: జర్నీ టు అయోధ్య - రామాయణం నేపథ్యంలో వేణు దోనేపూడి సినిమా

రామాయ‌ణం తెలియని ప్రజలు, మర్యాదా పురుషోత్తముడు శ్రీ రామ చంద్రుని గురించి తెలియని భక్తులు ఉండరు. తరతరాలకు తరగని తేజస్సు శ్రీరాముని సొంతం. ఆయన గొప్పదనాన్ని ప్రజలకు చెబుతూ రామాయ‌ణం ఆధారంగా మన భారతదేశంలో పలు చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు ఆ బాట‌లో నడుస్తూ మరో ఆ శ్రీరామ చంద్రుని రామాయ‌ణంను తెర‌కెక్కించ‌టానికి నిర్మాత వేణు దోనేపూడి (Venu Donepudi) సిద్ధం అయ్యారు. అయోధ్యకు ప్రయాణం... రామచరితం!చిత్రాల‌యం స్టూడియోస్ (Chitralayam Studios) నిర్మాణ సంస్థను...


టైమ్ జాబితాలో సత్య నాదేళ్ల, అలియాభట్, సాక్షి మాలిక్ సహా పలువురు భారతీయులు

ప్రముఖ అంతర్జాతీయ మేగజీన్ టైమ్.. ఏటా అత్యంత ప్రభావశీలురైన 100 మంది వ్యక్తుల జాబితాను రూపొందిస్తుంది. ఈ ఏడాదిలో వారు సాధించిన విజయాలు, ఇతరులకు ఎలా ప్రభావితం చేశారు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఈ ఏడాది ఆ జాబితాలో పలువురు భారతీయులకు చోటుదక్కింది. వీరిలో నటులు, క్రీడాకారులు, టెక్ సంస్థ సీఈఓలు ఉన్నారు. గతేడాది రెజ్లింగ్ సమాఖ్యలో లైంగిక వేదింపుల అంశంపై పోరాటం చేసిన సాక్షి మాలిక్‌‌కు చోటుదక్కింది.


ఈ శ్రీరామ నవమి ఒక తరానికి మైలురాయి: మోదీ

ఈ శ్రీరామ నవమి ఒక తరానికి మైలురాయి: మోదీ ప్రధాని నరేంద్ర మోదీ  శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. అయోధ్యలో  ప్రాణ ప్రతిష్ఠ తర్వాత  జరుగుతున్న మొదటి రామనవమి. ఇది  ఒక తరానికి  మైలురాయి వంటిది . ఐదు దశాబ్దాల నిరీక్షణ తర్వాత అక్కడ ఈ ఉత్సవాన్ని నిర్వహించుకునే భాగ్యం లభించింది.  కోట్లాది మంది  ఎన్నో సంవత్సరాల తపస్సు త్యాగాల ఫలితం.  శ్రీరాముని కృపవల్లే  ...


చిక్కుల్లో ‘రేసుగుర్రం’ సినిమా విలన్.. తెరపైకి రెండో భార్య, కూతురు

ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు రవి కిషన్‌ చిక్కుల్లో పడ్డారు. ఆయన తన భర్త అని, తన కుమార్తెకు తండ్రి అని ఓ మహిళ మీడియా ముందుకు వచ్చారు. కూతురితో సహా ప్రెస్ మీట్ నిర్వహించి తనకు న్యాయం చేయాలని కోరారు. రవి కిషన్ తనను భార్యగా స్వీకరించాలని.. తన కూతురిని బిడ్డగా అందరి ముందు ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు. ‘రేసుగుర్రం’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన భోజ్‌పురి నటుడు రవి కిషన్.. ప్రస్తుతం రాజకీయాల్లో రాణిస్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి 2019లో బీజేపీ తరఫున పోటీ చేసి రవి కిషన్ గెలిచారు. ప్రస్తుతం అదే స్థానం నుంచి మళ్లీ పోటీలో ఉన్నారు. ఇలాంటి సమయంలో లక్నోకు చెందిన అపర్ణా ఠాకూర్ అనే మహిళ ప్రకంపనలు సృష్టించారు. రవి కిషన్‌తో తనకు రెండో పెళ్లి జరిగిందని.. తమకు ఒక సంతానం కలిగిందని అని బాంబు పేల్చారు. కూతురిని కూడా ప్రెస్ మీట్‌కి వెంటబెట్టుకుని వచ్చారు. తన భర్తపై ఆరోపణలు చేసిన అపర్ణ ఠాకూర్‌పై రవి కిషన్ భార్య ప్రీతి శుక్లా.. హజ్రత్‌గంజ్ పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశారు. తన భర్తపై తప్పుడు ఆరోపణలు చేసిన అపర్ణ, ఆమె కూతురుపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. మరి, ఎన్నికల వేళ ఈ అంశం ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి.


వయసు పెరిగినా గ్రేస్ తగ్గలేదు.. సిమ్రాన్‌ స్టెప్పులకు ఫిదా అవ్వాల్సిందే

సిమ్రాన్ స్టెప్పులేస్తే వెండితెరపై ఒకప్పుడు కాసుల వర్షం కురిసింది. చిరంజీవి లాంటి వాడితో ధీటుగా సిమ్రాన్ స్టెప్పులు వేసింది. సిమ్రాన్ డ్యాన్స్‌కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఇప్పుడు నాలుగు పదుల వయసు దాటినా కూడా ఇంకా అదే గ్రేస్ మెయింటైన్ చేస్తోంది. తాజాగా ఆమె వర్కౌట్లు చేసుకుంటూ ఇలా మధ్యలో సింపుల్‌గా స్టెప్పులు వేసింది. ఆమె వేసిన స్టెప్పులకు జనాలు ఫిదా అవుతున్నారు. ఇంకా 20 ఏజ్‌లోనే ఉన్నట్టుగా ఉందే అంటూ కామెంట్లు పెడుతున్నారు.