Trending:


కాలేజీలో అవార్డ్స్ ఇవ్వడానికి వెళ్లి స్టూడెంట్ ని 3సార్లు పెళ్లి చేసుకున్న నటుడు

Actor: బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ గురించి చాలా మందికి తెలియని ఆయన పర్సనల్ లైఫ్ గురించి కొన్ని విషయాలు ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాం. అర్షద్ వార్సీ తన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. దాంతో పాటు ఆయన లవ్ స్టోరీ కూడా సినిమా కథలా ఉంటుంది. నటుడి ప్రేమకథ విని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. నటుడు అర్షద్ వార్సి 14 ఫిబ్రవరి 1999న ప్రేమికుల రోజున మరియా గోరెట్టిని లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. అర్షద్ , మరియా పెళ్లి చేసుకొని 25 సంవత్సరాలు గడిచింది. పెళ్లయి ఇన్ని సంవత్సరాలైనా వీరి ప్రేమ చెక్కుచెదరలేదు. అర్షద్ వార్సీ మారియాను కాలేజీలో కలిశాడు. వీరిద్దరూ 1991లో తొలిసారి కలుసుకున్నారు. టైమ్స్ నౌ హిందీలో అర్షద్ వార్సీ ప్రేమకథ గురించి ప్రచూరించింది. మరియా సెయింట్ జేవియర్స్ కాలేజీలో చదువుతున్నప్పుడు అర్షద్ వార్సీ ఆమె కాలేజీకి 'డ్యాన్స్ టాలెంట్ షో'లో న్యాయనిర్ణేతగా వెళ్లాడు. అప్పుడు అర్షద్ మరియాను మొదటిసారి చూశాడు. కాలేజీలో జరిగిన పోటీలో మరియా గెలిచింది. ఆ సమయంలో మారియా ప్రతిభకు అర్షద్ ముగ్ధుడయ్యాడు. అర్షద్ మరియాను తన డ్యాన్స్ టీమ్‌లో చేరమని ఆఫర్ చేశాడు. అయితే ఆ ఆఫర్‌ను మారియా అర్షద్‌ తిరస్కరించింది. దీంతో నటుడు కూడా ఆశ్చర్యపోయాడు. ఈ ఘటన తర్వాత అర్షద్, మారియా మధ్య ఎలాంటి మాటలు లేవు. నటుడి ఆఫర్‌ను మారియా తిరస్కరించిన మూడు నెలల తర్వాత మరియా , అర్షద్ మళ్లీ అనుకోకుండా కలుసుకున్నారు. ఆ సమయంలో కూడా అర్షద్ మళ్లీ తన డ్యాన్స్ గ్రూప్‌లో చేరమని మరియాకు ఆఫర్ చేశాడు. అయితే ఈసారి అర్షద్ మాటలను మారియా ఖండించలేదు. ఆ తర్వాత ఇద్దరూ క్రమంగా స్నేహితులయ్యారు. వీరి స్నేహం ప్రేమగా మారింది. ఇద్దరూ ఒకరి భావాలను ఒకరు అర్థం చేసుకున్నారు. కానీ ఇద్దరూ తమ ప్రేమను ఒకరికొకరు చెప్పుకోవడానికి వెనుకాడారు. మరియా తనను ప్రేమిస్తోందని అర్షద్‌కు తెలుసు. అయితే దీని గురించి అడిగితే నిరాకరిస్తారేమోనని భయంగా ఉంది. మరియా తన ప్రేమను ఒప్పుకుందామని అర్షద్ ఎదురుచూశాడు. మరియాతో కలిసి అర్షద్ దుబాయ్ టూర్‌కు వెళ్లగా.. సాఫ్ట్ డ్రింక్‌లో మరియా బీరు కలిపి ఇచ్చింది. మరియా తాగి వచ్చి అర్షద్‌తో తన భావాలన్నింటినీ అతని ముందు వెల్లడించింది. తర్వాత ఈ జంట ఒక్కటైంది. అర్షద్ , మరియా ఇద్దరూ కూడా గతంలో రెండుసార్లు వివాహం చేసుకున్నారు. మరియా క్రిస్టియన్. అయితే అర్షద్ ముస్లిం కుటుంబం నుంచి వచ్చాడు. అందుకే 1999 ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజున ఈ జంట పెళ్లి చేసుకున్నారు. సంప్రదాయం ప్రకారం ఈ జంట పెళ్లి చేసుకున్నారు. ఈ సంవత్సరం 2024లో అర్షద్ వార్సీ ఆయన భార్య మరియా గోరెట్టి 25 సంవత్సరాల వివాహం తర్వాత తమ వివాహాన్ని కోర్టులో నమోదు చేసుకున్నారు. ఈసారి మూడో పెళ్లి చేసుకున్నారు. అర్షద్ 25 ఏళ్లలో ఒకే వ్యక్తిని మూడుసార్లు పెళ్లి చేసుకున్నాడు.


పదివేల చీరలు, 1250 కిలోల వెండి, 28 కిలోల బంగారం.. ఈ తెలుగు హీరోయిన్ దేశంలోనే సంపన్నురాలు..

ఇండియన్ సినీ ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్లు హీరోలతో సమానంగా డబ్బులు సంపాదిస్తుంటారు. వరుస హిట్లు పడితే, కోట్ల రూపాయల రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుంటారు. మన దేశంలో మంచి స్టార్‌డమ్‌తో భారీగా డబ్బు సంపాదించిన హీరోయిన్లు అంటే, మనకు ఐశ్వర్య రాయ్, ప్రియాంక చోప్రా, దీపికా పదుకొణె వంటి పేర్లు గుర్తుకు వస్తాయి. రేఖ, శ్రీదేవి వంటి అలనాటి నటీమణులు కూడా ఈ లిస్టులో ఉంటారు. అయితే వీరందరి కంటే ఎక్కువ డబ్బులు సంపాదించిన హీరోయిన్ మరొకరు ఉన్నారు. పదివేలకు పైగా చీరలు, 1250 కిలోల వెండి, 28 కిలోల బంగారం ఆమె దగ్గర ఉండేవి. ఆమె ఎవరో కాదు, ఒకప్పటి హీరోయిన్, తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత. నటిగా రాణించి, రాజకీయ నాయకురాలిగా ఎదిగిన జయలలిత భారతదేశంలోనే అత్యంత ధనవంతురాలైన నటిగా పేరు తెచ్చుకున్నారు. గూఢచారి 116, చిక్కడు దొరకడు, సుఖ దుఃఖాలు వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను సైతం ఆమె అలరించారు. భారీ సంపద1997 నాటికి జయలలిత రాజకీయాల్లో బాగా స్థిరపడ్డారు. ఆ సమయంలో, చెన్నైలోని ఆమె పోయెస్ గార్డెన్ నివాసంపై అవినీతి నిరోధక అధికారులు దాడి జరిపారు. దాఖలు చేసిన అభియోగాల పత్రంలో, జయలలితకు రూ.188 కోట్ల ఆస్తి ఉన్నట్లు డిక్లేర్ చేసినప్పటికీ, నిజానికి ఆమె నికర సంపద విలువ రూ.900 కోట్ల వరకు ఉంటుందని అధికారులు ఆరోపించారు. ద్రవ్యోల్బణం, రూపాయి విలువ పరంగా చూస్తే.. ఈ విలువ ఇప్పుడు భారీగా ఉంటుంది. ఈ ఆస్తుల విలువ ప్రస్తుతం రూ.800 కోట్ల సంపద కలిగిన ఐశ్వర్య రాయ్ కంటే ఎక్కువ. ఇతర టాప్ ఇండియన్ హీరోయిన్లు ప్రియాంక చోప్రా (రూ.600 కోట్లు), దీపికా పదుకొణె (రూ.560 కోట్లు), అలియా భట్ (రూ.550 కోట్లు)లు జయలలిత కంటే ఇప్పటికీ చాలానే వెనకబడ్డారని చెప్పవచ్చు. సంపన్న నటిఅధికారులు జయలలిత ఇంట్లో 10,500 చీరలు, 750 జతల చెప్పులు, 91 గడియారాలు, 800 కిలోల వెండి, 28 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. 2016లో మరో దర్యాప్తులో ఆమె వద్ద 1,250 కిలోల వెండి, 21 కిలోల బంగారం ఉన్నట్లు తేలింది. జయలలితకు ఎనిమిది లగ్జరీ కార్లు, రూ.42 కోట్ల విలువైన చరాస్తులు కూడా ఉన్నాయి. సినిమా, రాజకీయ జీవితంజయలలిత 1948లో మైసూర్ రాష్ట్రంలోని మాండ్యలో జన్మించారు. 1961లో కన్నడ భాషా చిత్రం "శ్రీ శైల మహాత్మ"లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించడం ద్వారా నటనా జీవితాన్ని ప్రారంభించారు. చిన్న పాత్రలతో సినిమాలు, నాటకాలలో నటించిన తరువాత 1960ల మధ్యలో తమిళ, తెలుగు సినిమాల్లో హీరోయిన్‌గా అరంగేట్రం చేశారు. 1968లో ధర్మేంద్ర సరసన "ఇజ్జత్" చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. 70వ దశకంలో దక్షిణ భారతదేశంలో అగ్ర నటిగా నిలిచారు. ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, జైశంకర్, ఎం.జి. రామచంద్రన్ వంటి అప్పటి దిగ్గజ హీరోలతో కలిసి నటించారు. జయలలిత జనవరి 1980లో సినిమా కెరీర్‌కు గుడ్ బై చెప్పి తమిళనాడు రాజకీయాల్లో క్రియాశీలకంగా పని చేశారు. 1991 నుంచి 2016 మధ్య ఆరు పర్యాయాలు, 14 సంవత్సరాలకు పైగా తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2016, డిసెంబర్‌లో 68 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడే ఈ రిచెస్ట్ యాక్ట్రెస్ మరణించారు.


వారాహి పవన్ కళ్యాణ్ ప్రాపర్టీ కాదా..? ఆయన వద్ద ఉన్న లగ్జరీ వెహికిల్స్ కలెక్షన్స్ విలువ ఎంతో తెలుసా?

పవన్ కళ్యాణ్ ఎన్నికల అఫిడవిట్ లో తన ఆస్తులు, అప్పుల వివరాలు తెలియజేశాడు. ఈ క్రమంలో తన వద్ద ఉన్న లగ్జరీ వెహికల్స్ డిటైల్స్ షేర్ చేశాడు. పవన్ కళ్యాణ్ ఎన్నికల అఫిడవిట్ లో తన ఆస్తులు, అప్పుల వివరాలు తెలియజేశాడు. ఈ క్రమంలో తన వద్ద ఉన్న లగ్జరీ వెహికల్స్ డిటైల్స్ షేర్ చేశాడు. పవన్ కళ్యాణ్ కూటమిలో భాగంగా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నాడు. ఆయన ఏప్రిల్ 23న పిఠాపురంలో నామినేషన్ దాఖలు చేశాడు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ తన ఆస్తులు, అప్పులు,...


సినీ ఫక్కీలో చైన్ స్నాచింగ్

సినీ ఫక్కీలో చైన్ స్నాచింగ్ శంషాబాద్ రూరల్ పరిధిలో ఘటన శంషాబాద్, వెలుగు :  వ్యవసాయ పొలం వద్ద సినీ ఫక్కీలో చైన్ స్నాచింగ్ జరిగింది. శంషాబాద్ పరిధిలోని హమీదుల్లా నగర్ కు చెందిన మల్లేష్, మంజుల దంపతులకు పొలం ఉంది. అక్కడే ఉంటుండగా.. సోమవారం భర్త  ఓ ఫంక్షన్ వెళ్లాడు. మధ్యాహ్నం సమయంలో మంజుల(38) పొలంలో చేస్తుండగా ఓ వ్యక్తి కారులో అక్కడికి వెళ్లాడు. పొలంలో ...


Krishna Mukunda Murari Today ఏప్రిల్ 24 ఎపిసోడ్: ‘ఐ లవ్యూ ముకుందా.. పెళ్లి చేసుకుందాం’ ప్రపోజ్ చేసిన ఆదర్శ్

Krishna Mukunda Murari April 24 Episode: ముకుంద కుట్రలు చేయడం ఆపలేదు. ఇక ఆదర్శ్.. తన ప్రేమను మీరా ముందు పెట్టడమే నేటి కథనంలో షాకింగ్ ట్విస్ట్. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. (photo courtesy by star maa and disney+ hotstar)


Chanakya Niti: భార్య తన భర్తలోని ఈ భాగాన్ని తాకితే.. ఎంతటి మగాడైనా లొంగిపోవాల్సిందే..!

మౌర్యుల పరిపాలనా కాలంలో… చంద్రగుప్త మౌర్యుడి సలహాదారుగా, రాజనీతిజ్ఞుడిగా, ఆర్థికవేత్తగా, భారత తత్వవేత్తగా గుర్తింపు పొందిన మహా మనిషి చాణక్కుడు. ఈయన నంద వంశాన్ని నాశనం చేసి .. మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపన చేసిన రాజనీతిజ్ఞుడు. రాజకీయాలు, ఆర్థిక శాస్త్రం, జీవితం అనే అంసాలపై చాణక్యుడు ఎన్నో నీతి సూత్రాలు చెప్పాడు. వాటినే చాణక్య నీతి అని పిలుస్తారు. వీటిని ఇప్పటికీ సువర్ణాక్షరాలుగా భావిస్తారు. జీవితం అద్భుతంగా ఉండాలంటే చాణక్య నీతిని పాటించాలని విశ్వసిస్తారు. గొప్ప పండితులలో ఒకరైన ఆచార్య చాణక్యుడు మానవ జీవితానికి అనేక నియమాలను అందించారు. భార్యాభర్తల మధ్య అనుబంధం గురించి చాణక్య నీతిలో వివరించారు. దాంపత్య జీవితాన్ని ఆనందమయం చేసేందుకు మంచి సూత్రాన్ని బోధించారు. చాణక్యుడి సిద్ధాంతం ప్రకారం.. ప్రతి స్త్రీ వివాహం తర్వాత తన భర్త ఒక ప్రత్యేకమైన భాగాన్ని తాకాలి. ప్రతిరోజూ ఉదయం నిద్రలేచిన తర్వాత ..మళ్లీ సాయంత్రం భర్త పని నుండి ఇంటికి వచ్చిన తర్వాత భార్య ఇలా చేయాల్సి ఉంటుంది. భార్య తన భర్తలోని ఈ భాగాన్ని తాకడం.. లొంగడానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. అంటే భార్యకు భర్త లొంగిపోతాడన్నమాట. దీంతో భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది. ఇలా చేయడం వల్ల.. ఆ ఇంట్లో సుఖసంతోషాలు, శాంతి నెలకొంటుంది. సంపద కూడా పెరుగుతుందట మరి భార్య.. భర్తలోని ఏ భాగాన్ని తాకాలో తెలుసా? అది మరేంటో కాదు.. కాలు. స్త్రీలు.. తమ భర్త పాదాలను తాకాలని చాణక్యుడు చెప్పాడు. భర్త పాదాలను తాకడం వల్ల ఇంట్లో సానుకూల వాతావరణం ఉంటుందని.. తద్వారా శుభాలు కలుగుతాయని పేర్కొన్నాడు. (Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ) (ప్రతీకాత్మక చిత్రం)


ఫ్యాంట్ లేకుండా రకుల్ ప్రీత్.. పెళ్లైన తర్వాత ఈ రేంజ్ ఆరబోత ఏంటీ సామి..

రకుల్ ఇటీవల పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. హిందీ యువ నిర్మాత, నటుడు జాకీ భగ్నానీని పెళ్లి చేసుకుంది ఈ బ్యూటీ. వీరి పెళ్లి ఫిబ్రవరి 21న గోవాలో ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో భారీగా జరిగింది.. Photo : Twitter అది అలా ఉంటే రకుల్.. తాాజాగా కొన్ని ఫోటోలను పంచుకుంది. ఈ ఫోటోల్లో రకుల్ మరింత అందంగా అదరగొడుతోంది. అయితే ఈ ఫోటోలపై నెటిజన్స్ మాత్రం ఓ రేంజ్‌లో కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక పెళ్లైన నెల రోజులకు ఆమె వ్యాపారాన్ని స్టార్ట్ చేసింది. ఆరంభమ్ అంటూ ఓ కొత్త రెస్టారెంట్‌ను హైదరాబాద్‌లో షురూ చేసింది. మిల్లెట్‌లతో కూడిన ఫుడ్ ఐటెమ్స్ ఎక్కువగా ఉంటాయట. ఇక ఈ రెస్టారెంట్ ఏప్రిల్ 16 నుండి ప్రారంభం అయ్యింది. ఈ రకుల్ రెస్టారెంట్ హైదరాబాద్‌లోని మాదాపూర్, కావూరి హిల్స్‌లో ఉంది. చూడాలి మరి ఈ కొత్త రెస్టారెంట్ ఏమేరకు ఆదరణ పొందనుందో.. రకుల్ ఇప్పటికే హైదరాబాద్‌లో పలు జిమ్‌లను నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఇక సినిమాల విషయానికి వస్తే.. రకుల్ కమల్ హాసన్‌తో కలిసి 'ఇండియన్ 2' లో కనిపించనుంది. ఈ చిత్రంలో బాబీ సింహా, ప్రియా భవానీ శంకర్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఆమె సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం రకుల్ ప్రీత్ తెలుగులో పూర్తిగా సినిమాలను తగ్గించేసింది. హిందీలో మాత్రం ఓ రెండు సినిమాలను చేస్తోంది. అందులో భాగంగా రకుల్ ప్రీత్ హిందీలో ఛత్రీవాలి అనే ఓ బోల్డ్ సినిమాను చేసింది. ఈసినిమా ఆమధ్య ఓటీటీలో విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఈ సినిమాలో రకుల్ కండోమ్ క్వాలిటీ చెక్ చేసే పాత్రలో నటించింది. ప్రముఖ నిర్మాత రోనీ స్క్రూవాలా నిర్మించారు. Photo : Instagram రకుల్ చివరగా తెలుగులో కొండపొలం సినిమాలో నటించింది. క్రిష్ ఈ సినిమాను కేవలం 40 రోజుల్లోనే షూటింగ్ కంప్లీట్ చేశారట. ఈ చిత్రాన్ని వికారాబాద్ ఫారెస్ట్‌లో ఎక్కువు శాతం చిత్రీకరించారు. ప్రముఖ రచయిత సున్నపురెడ్డి వెంకట్రామి రెడ్డి రాసిన పాపులర్ నవల కొండపోలం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.. బి టెక్ చేసిన ఓ కుర్రాడు. Photo : Instagram . తన తండ్రితో తమ గొర్రెలను కాపాడుకునేందుకు ఎటువంటి చర్యలు తీసుకున్నారు. బిటెక్ చదివి ఫారెస్ట్ ఆఫీసర్‌గా ఎందుకు మారాడు వంటి అంశాలు నవలలో ప్రధాన అంశాలు.. ఆ మధ్య విడుదలైన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ డిగ్లామర్ పాత్రలో కనిపించారు. Photo : Instagram


Taran Adarsh Post: ఇక బాలీవుడ్‌ను కాపాడేది టాలీవుడ్‌ హీరోలే - హాట్‌టాపిక్ అవుతున్న హిందీ క్రిటిక్ పోస్ట్‌

Telugu heroes to save Bollywood from Drought: ప్రస్తుతం తెలుగు సినిమాలను ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటుతున్నాయి. బాహుబలి నుంచి మొదలు.. టాలీవుడ్‌ ఇండస్ట్రీ డైరెక్టర్స్‌, హీరోలు పేర్లు అంతర్జాతీయ వేదికలపై మారుమోగుతున్నాయి. ఒకప్పుడు ఇండియన్‌ సినిమా అంటే బాలీవుడ్‌ అనేవారు. కానీ ఇప్పుడు టాలీవుడ్‌ అంటున్నారు. అంతగా మన తెలుగు సినిమాలు వరల్డ్‌ బాక్సాఫీసుని శాసిస్తున్నాయి. పాన్‌ ఇండియా, పాన్‌ వరల్డ్‌ అంటూ సునామిల విజృంభిస్తున్నాయి. చూస్తుంటే మరో రెండేళ్ల...


TS Inter Result 2024 Live: తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్.. డైరెక్ట్ లింక్ ఇదే..!

Telangana Inter Result 1st &2nd Year Live: తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు నేడు ఉదయం 11 గంటలకు వెల్లడికానున్నాయి. విద్యార్థులు https://tsbie.cgg.gov.in/, https://results.cgg.gov.in/ వెబ్‌సైట్లలో తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.


AI in Movies: సినిమాల్లో AI మాయ..ముసలి హీరోలు కుర్రాళ్లుగా..అమితాబ్యే కాదు వీళ్లు కూడా..

AI in Movies: సినిమాల్లో AI మాయ..ముసలి హీరోలు కుర్రాళ్లుగా..అమితాబ్యే కాదు వీళ్లు కూడా.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ రంగంలో ఓ సంచలనం. ఇటీవల దీని క్రేజ్ మరింత పెరిగింది. AI రంగంలో భారీపెట్టుబడులు పెట్టేందుకు టెక్ కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి. అయితే, ప్రస్తుతం AI వాడకం సినిమాల్లోనూ పెరిగిపోతుంది. ముసలి వాళ్ళను యంగ్ ...


Hindu Festivals: వైశాఖ మాసంలో అదృష్ట రాశులు ఇవే.. ఇందులో మీ రాశి ఉందా?

Hindu Festivals: ఇటీవల వైశాఖ మాసం ప్రారంభమైంది. ఈ నెలలో నాలుగు రాశులవారి పంట పండనుంది. వీరి పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆ లక్కీ రాశులు గురించి తెలుసుకుందాం.


Varalaxmi: ఇక చాలు ఆపండి.. అవి చదివితే నాకు కోపం వస్తోంది.. వరలక్ష్మి శరత్ కుమార్ సెన్సేషనల్ కామెంట్స్

Varalaxmi Sarathkumar: వరలక్ష్మి శరత్ కుమార్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ముఖ్యంగా నెగిటివ్ పాత్రల్లో కనిపించి తెలుగు ప్రేక్షకులకు ఎక్కువగా దగ్గరయింది ఈ నటి. తాజాగా వరలక్ష్మి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.


Pushpa 2: పుష్ప పుష్ప పుష్పరాజ్... బన్నీ కోసం డీఎస్పీ మార్క్ ట్యూన్, 'పుష్ప 2' ఫస్ట్ సాంగ్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) కథానాయకుడిగా తెరకెక్కుతున్న సినిమా 'పుష్ప: ది రూల్' (Pushpa The Rule). ఉత్తమ నటుడిగా ఆయనకు జాతీయ పురస్కారం తెచ్చిన 'పుష్ప: ది రైజ్'కు సీక్వెల్ ఇది. క్రియేటివ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. జాతీయ స్థాయిలో ప్రేక్షకులతో పాటు ప్ర‌పంచ‌వ్యాప్తంగా పలువురు ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. అల్లు అర్జున్ బర్త్ డేకి ఇటీవల విడుదల చేసిన టీజర్‌కు అద్భుత స్పందన లభించింది. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... ఇప్పుడు...


చీరకట్టులో కిర్రాక్ పోజులు.. సన్నజాజి నడుము చూపిస్తూ బ్యూటీ హల్చల్

అందానికి కేరాఫ్ అడ్రఫ్ తానే అన్నట్లుగా బ్యూటిఫుల్ పోజులతో అట్రాక్ట్ చేస్తోంది అచ్చ తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా. ఈ క్రమంలోనే తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. చీరకట్టి కుర్రకారులో సెగలు పుట్టించింది ఈ అందాల భామ. కెమెరా ముందు బాడీ షేప్స్ చూపిస్తూ అందాల విందు చేసింది ఈషా రెబ్బా. చీరకట్టులో సన్నజాజి నడుము షో చేస్తూ కుర్రకారు మనసు దోచేసింది. ఈ బ్యూటిఫుల్ ఫొటోస్ చూసి తెగ షేర్ చేస్తున్నారు నెటిజన్లు. ఇక కామెంట్లకైతే కొదవేలేదని చెప్పుకోవాలి. మోడలింగ్ చేస్తూ కెరీర్ ప్రారంభించిన ఈషా రెబ్బా.. 'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' మూవీతో సినీ ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే యువత చూపు తనపై పడేలా చేసుకొని ఆ వెంటనే 'అంతకు ముందు ఆ తర్వాత' అనే సినిమా చేసి హీరోయిన్ గా మంచి మార్కులు కొట్టేసింది ఈ తెలుగమ్మాయి. ఫేమస్ హీరోయిన్ కానప్పటికీ ఈషా రెబ్బా అన్నా, ఆమె గ్లామర్ అన్నా పరిచయం లేని ప్రేక్షకుడు లేడని చెప్పడంలో అతిశయోక్తి లేదు. వెండితెరపై తనదైన గ్లామర్ ఒలకబోస్తూ ఫేమ్ కొట్టేసిన ఈ బ్యూటీకి అదృష్టం మాత్రం కలసి రావడంలేదు. కావాల్సినంత అందం ఉన్నా కూడా ఎందుకో ఈషా రెబ్బకు తెలుగు హీరోలు సరైన అవకాశాలు ఇవ్వడం లేదనే చెప్పాలి. అందుకే వెబ్ సిరీస్‌లతో పాటు పక్క ఇండస్ట్రీలపై ఫోకస్ పెట్టింది ఈ తెలుగు అందం. మెయిన్ హీరోయిన్ గా ఎలాగూ సక్సెస్ రావడం లేదని.. సెకండ్ హీరోయిన్ గానూ చేయడానికి ముందుకొచ్చింది ఈ అందాల ఈషా. ఎన్టీఆర్ హీరోగా వచ్చిన 'అరవింద సమేత.. వీరరాఘవ', అక్కినేని వారసుడి 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' వంటి చిత్రాల్లో నటించింది. అయినా అవి కూడా పెద్దగా సక్సెస్ తీసుకురాలేకపోయాయి. మోడ్రన్ యుగంలో రాణించడం కోసం 'పిట్ట కథలు' అనే ఓ వెబ్ సిరీస్‌లోనూ ఈషా నటించింది. ఇలా మరికొన్ని సిరీస్‌లను చేసేందుకు సిద్ధమవుతోంది. ఎలాగైనా తన కెరీర్ గాడిలో పెట్టుకొని స్టార్ స్టేటస్ పట్టేయాలని శ్రమిస్తోంది. ఈ మేరకు కెమెరా ముందు గ్లామర్ వడ్డించడానికి కూడా రెడీ అని చెప్పకనే చెబుతోంది. మరోవైపు శరీరాకృతిని కాపాడుకుంటూ నిత్యం జిమ్ లో కసరత్తులు చేస్తోంది ఈషా. జిమ్ లుక్స్ కూడా పంచుకుంటూ సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది ఈషా. సోషల్ మీడియాలో యాక్టీవ్ రోల్ పోషిస్తూ ఎప్పటికప్పుడు ఈ అమ్మడు షేర్ చేస్తున్న ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. ఎప్పటికప్పుడు ఈషా పోస్ట్ చేస్తున్న పిక్స్ చూసి.. ఈ అందానికి దాసోహం అంటూ రొమాంటిక్ కామెంట్లు వదులుతున్నారు నెటిజన్లు. సో.. చూడాలి మరి సోషల్ మీడియాలో ఆమె చేస్తున్న ఈ గ్లామర్ ట్రీట్.. అమ్మడికి ఏ మేర అవకాశాలు తెచ్చిపెడుతుందనేది!.


Vijay Deverakonda: విజయ్ దేవరకొండ ఇంటికి పాన్ ఇండియా సెన్సేషనల్ డైరెక్టర్.. విషయమేమిటంటే..

Prashanth Neel : సలార్ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తాజాగా హైదరాబాద్ లోని ఫిలింనగర్ లో యువ హీరో విజయ్ దేవరకొండ వాళ్ళ ఇంటికి డిన్నర్ కి వెళ్ళారు. అయితే విజయ్ దేవరకొండ హీరోగా ప్రశాంత్ నీల్ సినిమా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా లేక తన సినిమాలలో ఏమన్నా ఆఫర్ ఇస్తున్నారా అని ఇప్పుడు సోషల్ మీడియాలో పుకార్లు మొదలయ్యాయి.


Kalki 2898 AD: 'కల్కి'కి కమల్ హాసన్ రెమ్యూనరేషన్ తెలిస్తే కళ్లు తేలేయాల్సిందే

ప్రభాస్ లీడ్ రోల్‌లో నటిస్తున్న కల్కి 2898 AD సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దీనికి ఈ మూవీ క్యాస్టింగ్ కూడా ఓ కారణం. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి దిగ్గజాలు ఈ సినిమాలు యాక్ట్ చేస్తున్నారు. అయితే కమల్ హాసన్ ఈ చిత్రం కోసం తీసుకున్న రెమ్యూనరేషన్‌పై ఓ న్యూస్ వైరల్ అవుతోంది.


Pawan Kalyan: పవన్ కళ్యాణ్ రియల్ పుట్టిన రోజు తేదీ ఇదేనట - పవర్ స్టార్ వయస్సుపై జోరుగా చర్చ

Pawan Kalyan's True Date Of Birth Revealed: కొణిదెల ప‌వ‌న్ క‌ల్యాణ్.. ఈయ‌న ఫాలోయింగ్ చూస్తే మైండ్ బ్లాంక్ అవుతుంది. ఈయ‌నకు ఉన్న క్రేజ్ వేరే లెవెల్. అభిమానులందు ప‌వ‌న్ అభిమానులు వేర‌య్యా అనేలా ఉంటారు ఈయ‌న అభిమానులు. అభిమాన హీరోకి సంబంధించి ప్ర‌తి విష‌యాన్ని ఆస‌క్తిగా తెలుసుకుంటారు. ఆస‌క్తిగా నిర్వ‌హిస్తారు. అయితే, ప‌వన్ అభిమానుల్లో మాత్రం ఒక కన్‌ఫ్యూజన్ ఎప్పుడూ ఉంటుంది. అదే ఆయ‌న డేట్ ఆఫ్ బ‌ర్త్. సెప్టెంబ‌ర్ 2 బ‌ర్త్ డే అని అంద‌రికీ తెలుసు. కానీ,...


ప్రభాస్ హీరోయిన్ సిస్టర్ ఎంత బ్యూటీఫుల్.. సినిమాలు వద్దనుకొని అలా మారిపోయింది

Bollywood Actress: వరుణ్ తేజ్ నటించిన లోఫర్ సినిమాతో కెరీర్ ప్రారంభించిన నటి దిశా పటానీ ఆ తర్వాత బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. హిందీలో ఆమె ఫస్ట్ మూవీ MS ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ. తొలి సినిమాతోనే ప్రేక్షకుల మన్ననలు పొందింది ఈ భామ. అయితే ఆమె సోదరి గురించి మీకు తెలుసా? ఆమె ఏం చేస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. దిశా పఠానీ మాత్రమే కాదు ఆమె సిస్టర్ కి కూడా సోషల్ మీడియాలో అంతే స్థాయిలో ఫాలోయింగ్ ఉంది. దిశా పటాని అక్క ఖుష్బూ పటాని. దిశా మాదిరిగానే ఆమె సోదరి కూడా ఫిట్‌నెస్‌పై ఆసక్తి చూపుతుంది. ఖుష్బూ ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్‌గా పనిచేస్తోందని తెలిసి ఇప్పుడు ఆమెను మరింతగా అభిమానిస్తున్నారు.(Photo:Instagram) ఖుష్బూకు వెరిఫైడ్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా కూడా ఉంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది ఈ లేడీ ఆఫీసర్. అక్కాచెల్లెళ్లిద్దరూ తమ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూనే ఉంటారు. దిశా అక్క పేరుకు ముందు మేజర్ అని ఉంటుంది .(Photo:Instagram) దిశా తన సోదరిని 'అద్భుతమైన మహిళ' అని పిలుస్తుంది. ఎందుకంటే ఖుష్బూ తరచూ తన సైనిక శిక్షణ పొందుతున్న ఫోటోలను షేర్ చేస్తుంటారు. ఖుష్బూ, దిశా తర్వాత ఆమెకు సూర్యాంశ్ పటానీ అనే తమ్ముడు ఉన్నాడు. అయితే వారిలో ఖుష్బూ హైలైట్. ఆమె ఇప్పుడు సైన్యంలో లేదు. కాబట్టి మాజీ సైనిక అధికారిణి అంటారు.(Photo:Instagram) ఖుష్బూ పఠానీ తన సోదరిలా తన చదువును తగ్గించుకోలేదు. బదులుగా బరేలీలోని BBL పబ్లిక్ స్కూల్‌లో చదివింది. ఆ తర్వాత DIT స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ నుండి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పొందింది.(Photo:Instagram) డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఖుష్బూ పఠానీ ప్రభుత్వ పరీక్షలో ఉత్తీర్ణులై ఇండియన్ ఆర్మీలో చేరారు. ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్‌గా పనిచేశారు. దిశా పఠానీ తన సోదరి ఫోటోను పంచుకుంది. ఆమె లెఫ్టినెంట్ అయినప్పుడు ఆమెను అభినందించింది. అకా ఖుష్బూ ఆర్మీ యూనిఫాం వేసుకుంది.(Photo:Instagram) తాజాగా ఖుష్బూ ఇన్‌స్టాగ్రామ్‌లో పాత ఫోటోను షేర్ చేసింది. నా ఆర్మీ జీవితాన్ని గుర్తు చేసుకుంటున్నాను. 'నా యువ సైన్యం పేరులో' అని క్యాప్షన్‌తో పాటు 'లవ్ ఇండియా' అని కూడా రాసింది.(Photo:Instagram) దిశా పఠానీలాగే ఖుష్బూ కూడా ఫిట్‌నెస్ ఫ్రీక్. అతని ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో చాలా వ్యాయామ ఫోటోలు ఉన్నాయి. ఇది ఆమె వ్యాయామశాల, వ్యాయామం , ఫిట్‌నెస్ లక్ష్యాలను కలిగి ఉంటుంది. మంచి డ్యాన్సర్ కూడా. తరచుగా డ్యాన్స్ వీడియోలను షేర్ చేస్తుంది.(Photo:Instagram) ఖుష్బూ పటాని ఆర్మీలో పని చేయడం వల్ల చాలా మంది అభిమానులు అతన్ని ప్రేమిస్తారు. గతంలో ఇండియన్ ఆర్మీలో పనిచేసినందుకు నెటిజన్లు కూడా మెచ్చుకుంటున్నారు.(Photo:Instagram) ఇన్‌స్టాగ్రామ్‌లో అతనికి 380 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. అతను మాజీ ఇండియన్ ఆర్మీ ఆఫీసర్, సర్టిఫైడ్ ట్రైనర్ మరియు న్యూట్రిషనిస్ట్. జీవించి ఉన్నంత కాలం సంతోషంగా జీవించు అంటోంది ఖుష్బూ.(Photo:Instagram)


వరుడి ముఖంపై యాసిడ్ పోసిన గర్ల్ ఫ్రెండ్

వరుడి ముఖంపై యాసిడ్ పోసిన గర్ల్ ఫ్రెండ్ ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది.  ఒక అమ్మాయి తన ప్రియుడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడనే కోపంతో అతని ముఖంపై యాసిడ్ పోసింది. అదృష్టవశాత్తు అతను స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.  రాకేష్‌ బింద్‌, లక్ష్మి గతకొంతకాలంగా ప్రేమలో ఉన్నారు.  కానీ ఆ అమ్మాయిని కాదని రాకేష్ తల్లిదండ్రులు అతనికి మరో అమ్మాయితో పెళ్లి ఫిక్స్ చ...


Love Me: లవ్ మీ... వేసవిలో ప్రేక్షకుల ముందుకు, దెయ్యంతో ప్రేమకథ విడుదల ఎప్పుడంటే?

'రౌడీ బాయ్స్' సినిమాతో ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు సోదరుని కుమారుడు, శిరీష్ తనయుడు ఆశిష్ హీరోగా పరిచయం అయ్యారు. తొలి సినిమాతో మంచి పేరు, విజయం అందుకున్నారు. ఆయన హీరోగా నటించిన తాజా సినిమా 'లవ్ మీ'. 'బేబీ'తో యువతను ఆకట్టుకోవడంతో పాటు భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న వైష్ణవి చైతన్య హీరోయిన్. తొలుత ఈ సినిమాను ఏప్రిల్ 25న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ, ఇప్పుడు ఆ తేదీకి సినిమా రావడం లేదు. ఓ నెల వెనక్కి వెళ్లింది. మే 25న 'లవ్ మీ' సినిమా...


ఆ సీనియర్ నటి వీడికి బలుపు ఎక్కువ అందట... మొగలు రేకులు సాగర్ కీలక కామెంట్స్

మొగలి రేకులు ఫేమ్ సాగర్ ని ఒక సీనియర్ నటి అందరి ముందుకు వీడికి బలుపు ఎక్కువ అందట. ఆమె ఎవరో? దానికి కారణం ఏమిటో చచూద్దాం... చక్రవాకం, మొగలి రేకులు సీరియల్స్ తెలుగులో సూపర్ హిట్. ఈ రెండు సీరియల్స్ లో నటించిన సాగర్ బుల్లితెర ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆయనకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. ఆ సీరియల్స్ ద్వారా వచ్చిన ఫేమ్ తో సిల్వర్ స్క్రీన్ కి ఎంట్రీ ఇచ్చాడు. ముఖ్యంగా మొగలి రేకులు సీరియల్ లో ఆర్ కే నాయుడుగా పాప్యులర్ అయ్యాడు. సాగర్...


చెల్లె పెళ్లికి గోల్డ్ రింగ్‌ గిఫ్ట్‌గా ఇచ్చాడని భర్తతో గొడవ, దారుణంగా చంపించిన భార్య

Crime News in Telugu: యూపీలో దారుణ ఘటన జరిగింది. వెడ్డింగ్‌ గిఫ్ట్‌ గురించి వచ్చిన గొడవలో భార్య భర్తని హత్య చేయించింది. చంద్రప్రకాశ్ మిశ్రా తన చెల్లి పెళ్లికి గోల్డ్‌ రింగ్‌, టీవీ గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఈ విషయంలోనే భార్య గొడవ పడింది. రెండు గిఫ్ట్‌లు ఇవ్వాల్సిన అవసరం ఏముందంటూ వాదించింది. కానీ అందుకు చంద్రప్రకాశ్ ఒప్పుకోలేదు. కచ్చితంగా ఇచ్చి తీరతానని చెప్పాడు. ఈ చిన్న గొడవ కాస్తా పెద్దదైంది. ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలనుకున్న భార్య తన కుటుంబ...


నిరుద్యోగులకు ఇండియన్ నేవీ గుడ్‌ న్యూస్.. టెన్త్ పాస్ అయితే చాలు

అప్రెంటిస్‌షిప్ అనేది కెరీర్ నిర్మాణంలో కీలకపాత్ర పోషిస్తుంది. భవిష్యత్‌లో మంచి ఉద్యోగం పొందడానికి ఇది ప్లాట్‌ఫామ్‌గా చేస్తుంది. అప్రెంటిస్‌షిప్‌లో అవసరమైన స్కిల్స్ పెంపొందించుకోవచ్చు. యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపర్చడానికి ఇటీవల అనేక సంస్థలు అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ చేపడుతున్నాయి. తాజాగా నిరుద్యోగ యువతకు ఇండియన్ నేవీ గుడ్‌న్యూస్ చెప్పింది. 10, 8వ తరగతి అర్హతతో అప్రెంటిషిప్ రిక్రూట్‌మెంట్‌ను ప్రారంభించింది. అర్హులైన అభ్యర్థులు ఇండియన్ నేవీ...


ఏనుగుల గుంపు పట్ల అలర్ట్ గా ఉండాలి : శాంతారామ్

ఏనుగుల గుంపు పట్ల అలర్ట్ గా ఉండాలి : శాంతారామ్ ప్రాణనష్టం జరగకుండా చర్యలు చేపట్టాలి కవ్వాల్ టైగర్ జోన్ ఫీల్డ్ డైరెక్టర్ శాంతారామ్ నస్పూర్, వెలుగు : ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర సరిహద్దుల్లో సంచరిస్తున్న ఏనుగుల గుంపు తెలంగాణ వైపు వచ్చే అవకాశం ఉందని, వాటి రాక పట్ల సంబంధిత అధికారులు అలర్ట్ గా ఉండాలని కవ్వాల్ టైగర్ జోన్ ఫీల్డ్ డైరెక్టర్ శాంతారామ్ అన్నారు. ...


వీడొక లుచ్చాగాడు : స్కూల్ లో పిల్లలకు అశ్లీల సినిమాలు చూపిస్తున్న ప్యూన్..

వీడొక లుచ్చాగాడు : స్కూల్ లో పిల్లలకు అశ్లీల సినిమాలు చూపిస్తున్న ప్యూన్.. అది స్కూల్.. చిన్న చిన్న పిల్లలు చదువుకోవటానికి వస్తుంటారు.. అలాంటి స్కూల్ లో ఓ లుచ్చాగాడు ఉన్నాడు.. వాడు ప్యూన్ గా పని చేస్తున్నాడు.. స్కూల్ కు వచ్చే పిల్లలకు అశ్లీల సినిమాలు చూపిస్తూ.. ఓ చిన్నారులపై లైంగిక దాడికి ప్రయత్నించాడు ఈ నీచుడు.. విషయం బయటకు రావటంతో.. పోలీసులు తీవ్...


Aparna Das: పెళ్లి చేసుకున్న 'ఆదికేశవ' నటి.. ఫొటోలు వైరల్

మలయాళ హీరోయిన్ అపర్ణ దాస్‌.. మంజుమ్మెల్‌ బాయ్స్‌ నటుడు దీపక్‌ పరంబోల్‌ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట పెద్దల అంగీకారంతో ఒక్కటైంది. కేరళ గురువాయూర్ దేవాలయంలో వీరి వివాహం బుధవారం ఉదయం జరిగింది.


Bandi Sanjay : అభ్యర్ధిని కూడా ప్రకటించుకోలేని అసమర్థులా నన్ను ఓడించేది - కాంగ్రెస్‌పై బండి సంజయ్ సెటైర్లు

Telangana Politics : ముఖ్యమంత్రి ఎక్కడికిపోయినా దేవుడి మీద ఒట్టేసి హామీలను అమలు చేస్తానంటున్నడు. గద్వాల పోయి జోగులాంబ అమ్మవారి మీద ఒట్టేస్తరు. యాదాద్రి పోయి లక్ష్మీ నర్సింహస్వామి మీద ఒట్టేస్తరు..వరంగల్ పోయి భద్రకాళి అమ్మవారి మీద ఒట్టేస్తరు.. నేను మాట్లాడితే తప్పని ఎందుకంటున్నారని కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ప్రసశ్నించారు. తాను వాళ్ల లెక్క దేవుడిపై ఒట్టేసి హామీలు అమలు చేయకుండా మోసం చేయడం లేదు. దేశం కోసం, ధర్మ రక్షణ కోసం...


రవితేజ గోడలు దూకిన రోజులు బయటపెట్టిన కృష్ణభగవాన్‌.. అద్దె ఇంట్లో రోజూ రాత్రిళ్లు అదే పని.. అరుదైన విషయాలు

రవితేజ సోలోగా వచ్చి హీరోగా ఎదిగాడు. స్టార్‌ హీరోగా రాణిస్తున్నాడు. కానీ బ్యాచ్‌లర్‌గా ఉన్నప్పుడు అద్దె ఇంట్లో ఉన్నప్పుడు గోడలు దూకిన విషయాలను బయటపెట్టాడు కృష్ణభగవాన్‌. మాస్‌ మహారాజా రవితేజ ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా సినిమాల్లోకి వచ్చాడు. అసిస్టెంట్‌ డైరెక్టర్‌ నుంచి, చిన్న ఆర్టిస్టుగా, అసిస్టెంట్‌గా చేసుకుంటూ నెమ్మదిగా ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చాడు. అనేక స్ట్రగుల్స్ ఫేస్‌ చేసి హీరోగా ఎదిగా, స్టార్‌ హీరోగా నిలబడ్డాడు. జయాపజయాలతో సంబంధం...


తపోవన ఆశ్రమంలో ఘనంగా ఆంజనేయస్వామి జయంతోత్సవాలు

తెలుగు రాష్ట్రాలనే కాదు.. దేశంలోనే ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ఆ పరమ పవనమైన పీఠం విరాజిల్లుతూ ఉంది. ఆ పీఠానికి అనుబంధంగా ఉన్న పీఠంలో తెలుగు రాష్ట్రంలో విశేష ఆధ్యాత్మిక కార్యక్రమాల సైతం నిర్వహిస్తూ ఉంటారు. ఇక ఆంజనేయస్వామి జయంతి సందర్భంగా ఆ ఉమ్మడిజిల్లాలో ఉన్న ఆశ్రమంలో ఆశ్రమ పీఠాధిపతులు ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా ఉత్సవాల జరిగాయి. ఆ విశేషాలు ఒకసారి వీక్షిద్దాం.ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే కాదు తెలుగు రాష్ట్రాలలో దేశవ్యాప్తంగా శృంగేరి పీఠం అంటే ఒక...


స్టార్ హీరోలకు షాక్ ఇచ్చిన శివకార్తికేయన్, నడిగర్ సంఘ భవనానికి భారీగా విరాళం...?

తమిళ స్టార్ హీరోలకు షాక్ ఇచ్చాడు.. కోలీవుడ్ నేచురల్ స్టార్ శివకార్తికేయన్. చాలా ఏళ్ళుగా నిర్మాణంలో ఉన్న నడిగర్ సంఘ భవన నిర్మాణాని భారీగా విరాళం ప్రకటించాడు. దక్షిణ భారత నటీనటుల సంఘానికి కొత్త భవనాన్ని నిర్మిస్తున్నారు. చాలా ఏళ్ల క్రితం పనులు ప్రారంభించినా నేటికీ పూర్తి కాలేదు. నిధుల కొరతే ఇందుకు కారణమని చెబుతున్నారు. విశాల్, కార్తీ, నాజర్ సహా సంఘానికి చెందిన పెద్దలు చాలా రకాలుగా నిధులు సమకూర్చే ప్రయత్నాలు చేశారు. ఆర్ట్ షోలు, స్టార్ క్రికెట్,...


Medak Teacher Murder: వివాహేతర సంబంధం అనుమానంతో మెదక్‌లో టీచర్ హత్య.. ఆత్మహత్య చేసుకున్న వివాహిత!

Medak Teacher Murder: వివా‍‍‍హేతర సంబంధం రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. తన భార్యతో సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో పొరుగింట్లో ఉంటోన్న టీచర్‌ను ఓ వ్యక్తి కొట్టి చంపేశాడు. ఆ విషయంలో తెలియడంతో నిందితుడు భార్య ఆత్మహత్యకు పాల్పడింది.


మహేష్ బాబు ఈ సినిమా రెండు సార్లు చూసినా అర్థం కాదు..

ఈ నేపథ్యంలో మనం ఈరోజు మహేష్ బాబు సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం గురించి మాట్లాడుకుందాం.. మీరు రెండుసార్లు చూసినా ఈ సినిమా కథ, విలన్ రెండూ మీకు అర్థం కావు. ఈ చిత్రానికి IMDB రేటింగ్ 8 ఉంది. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన కృతి సనన్ నటించింది. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా ఓకే అనిపించుకుంది. (ఫోటో కర్టసీ: యూట్యూబ్ థంబ్‌నెయిల్) ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో మహేష్ బాబు రాక్ మ్యూజిషియన్ పాత్రలో నటించాడు. గౌతమ్ అనే కుర్రాడి పాత్రలో వావ్ అనిపించాడు. (ఫోటో కర్టసీ: యూట్యూబ్ థంబ్‌నెయిల్) గౌతమ్ తన జీవితంలో జరిగిన విషయాలను మర్చిపోతాడు. అతను తరచుగా ముగ్గురు వ్యక్తుల చిత్రాలను చూస్తాడు. అతని తల్లిదండ్రులను ఈ ముగ్గురిలో ఒకరు చంపి ఉంటారని భావిస్తాడు. (ఫోటో కర్టసీ: యూట్యూబ్ థంబ్‌నెయిల్) గౌతమ్ నెమ్మదిగా ఈ ముగ్గురి కోసం వెతుకుతాడు. అయితే ఈ ముగ్గురూ వేర్వేరు కథలు చెబుతారు గౌతమ్‌కు. అప్పుడు అతను తన చిన్నతనంలో అనాథనని, ఎవరో దత్తత తీసుకున్నట్లు అనిపిస్తుంది. వీటన్నింటి మధ్య ఒక జర్నలిస్ట్ సమీరా గౌతమ్‌ని ఫాలో అవుతుంది. (ఫోటో కర్టసీ: యూట్యూబ్ థంబ్‌నెయిల్) సమీర పాత్రలో కృతి సనన్ నటించింది. గౌతమ్ తన షో తర్వాత ఒకరితో గొడవ పడుతాడు. దానిని సమీర తన కెమెరాలో బంధిస్తుంది. గౌతమ్ తనకు తానే ఊహించుకుంటూ చేస్తాడని తర్వాత తెలుస్తుంది. (ఫోటో కర్టసీ: Imdb) సినిమా చివరి వరకు గౌతమ్ తన తల్లిదండ్రులను వెతకడానికి ప్రయత్నిస్తాడు. చివరికి అతను తన శ్రేయోభిలాషిగా భావించే వ్యక్తి వాస్తవానికి విలన్ అని తెలుస్తుంది. కానీ విలన్ తన తల్లిదండ్రుల గురించి చెప్పడానికి నిరాకరిస్తాడు. (ఫోటో కర్టసీ: యూట్యూబ్ థంబ్‌నెయిల్) సినిమా క్లైమాక్స్ ఎమోషనల్‌గా ఉంటుంది. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. ఇక మహేష్ ప్రస్తుతం గుంటూరు కారం సినిమా తర్వాత రాజమౌళితో ఓ ప్యాన్ వరల్డ్ మూవీ చేస్తున్నాడు.


Shukra Gochar In Mesh 2024: మేష రాశిలో శుక్ర సంచారం - ఈ 7 రాశులవారికి ఆర్థికలాభం, ఆనందం!

Shukra Gochar In Mesh 2024: ఏప్రిల్ 24 న మేషరాశిలో ప్రవేశించిన శుక్రుడు మే 19 వరకూ ఇదే రాశిలో ఉంటాడు. శుక్రుడి సంచారం ఈ ఏడు రాశులవారికి అన్నీ అనుకూల ఫలితాలనే ఇస్తోంది... మేష రాశి (Aries) శుక్రుడు మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. కాబట్టి, ఈ రాశి వారికి శుక్రుని సంచారం ఫలవంతంగా ఉంటుంది. ప్రేమ సంబంధాలు పెళ్లి వరకూ తీసుకెళ్లేందుకు ఇదే మంచి సమయం. వివాహం చేసుకోవాలి అనుకున్నవారి ప్రయత్నాలు ఫలిస్తాయి. చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనా నెమ్మదిగా సర్దుకుంటాయి....


Furiosa: ‘మ్యాడ్ మ్యాక్స్’ ఫ్రాంచైజ్ నుంచి మరో సినిమా - ఆ 15 నిమిషాల సీన్ కోసం 78 రోజులు షూటింగ్!

Furiosa A Mad Max Saga: ‘మ్యాడ్ మ్యాక్స్’ మూవీ ఫ్రాంచైజ్‌కు హాలీవుడ్‌లో మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. హాలీవుడ్‌లో బెస్ట్ యాక్షన్ సినిమాలుగా సూపర్ హిట్ అందుకున్న సినిమాల్లో ‘మ్యాడ్ మ్యాక్స్’ ఫ్రాంచైజ్ కూడా ఒకటి. ఇక తాజాగా ఈ ఫ్రాంచైజ్ నుంచి అయిదో చిత్రం అయిన ‘ఫ్యూరియోసా’ విడుదలకు సిద్ధమయ్యింది. ఇప్పటికే ఈ మూవీని ప్రమోట్ చేయడానికి మేకర్స్ అంతా దీనికి సంబంధించిన విశేషాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. అదే సమయంలో ఈ సినిమాలో...


గంటకు కోటిన్నర రూపాయలు తీసుకునే సింగర్.. విడాకుల తర్వాత అన్నీఇన్నీ కష్టాలు కాదు

ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే గాయకుల్లో అరిజిత్ సింగ్ ఒకరు. వేలాది పాటలు పాడటం ద్వారా గాయకుడికి లభించే హోదా ఈయనకు కేవలం 655 పాటలతోనే వచ్చేసింది. గంట సేపు కచేరికి ఈయన ఏకంగా కోటిన్నర రూపాయలు వసూలు చేస్తారు. (Image: Instagram@arijitsingh) అరిజిత్ సింగ్ తల్లి, మేనమామ, అత్త కూడా కూడా గాయకులే. 'మర్డర్' చిత్రంలోని 'ఫిర్ మొహబ్బత్ కర్ణ చలా' పాట పాడి రాత్రికి రాత్రే ఫేమస్ అయ్యారు. 'ఆషికీ 2' చిత్రంలోని 'తుమ్ హి హో' పాట పాడి అద్బుతంగా నటించారు. ఆ పాట వింటుంటే వ్యక్తిగత జీవితంలోని బాధను తన గొంతులో పలికించినట్లుగా అనిపించింది. (Image: Instagram@arijitsingh) ఈయన తన వ్యక్తిగత జీవితంలో కూడా ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. 'ఫేమ్ గురుకుల్' రియాలిటీ షోలో పరిచయమైన రేఖా బెనర్జీని అరిజిత్ మొదట వివాహం చేసుకున్నాడు. మొదటి భార్య నుంచి విడాకులు తీసుకున్న తరువాత అతను చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు.(Image: Instagram@arijitsingh) అనంతరం తన అతని చిన్ననాటి స్నేహితుడు కోయల్ రాయ్‌ ఆయన జీవితంలోకి వచ్చింది. ఇద్దరూ డేటింగ్ చేసి ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం 36 ఏళ్ల అరిజిత్ నలుగురు పిల్లలకు తండ్రి. అరిజిత్ సింగ్ భారతదేశపు టాప్ సింగర్ మాత్రమే కాదు, చాలా ధనవంతుడు కూడా..! (Image: Instagram@arijitsingh) మీడియా నివేదికల ప్రకారం.. 2020 సంవత్సరంలో అరిజిత్ సింగ్ నికర ఆస్తుల విలువ సుమారు రూ .52 కోట్లు. గంట నిడివి గల కచేరీకి ఏకంగా రూ.1.5 కోట్లు తీసుకుంటారు. ఇక సినిమాల్లో పాట పాడితే రూ.10 లక్షలు వసూలు చేస్తున్నారు. (Image: Instagram@arijitsingh) అరిజిత్ సింగ్ కావాలనుకుంటే విలాసవంతమైన ఇల్లు, లగ్జరీ కారు కొనుక్కోవచ్చు. కానీ సామాన్యుడిలా జీవిస్తారు. ఈ గాయకుడి సింపుల్ లైఫ్ స్టైల్ చూసి జనాలు కూడా ఆశ్చర్యపోతున్నారు. అర్జిత్ సింగ్‌కు ముర్షిదాబాద్ లో ఒక సాధారణ ఇల్లు ఉంది. దాని ముందు చిన్న కారు ఉంటుంది. (Image: Instagram@arijitsingh) అరిజిత్ సింగ్ ఇంటిని చూసేందుకు ఎంతో మంది అక్కడికి వస్తుంటారు. అరిజిత్ సింగ్ 'ఇండియన్ ఐడల్'ను గెలుచుకోలేకపోయినా తన గానంతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్నారు. యూట్యూబ్‌లో లక్షలాది మంది ఆయన పాటలు వింటారు.(Image: Instagram@arijitsingh)


ఆ టీవీ మనదిరా...ఈ ఫోన్ మనదిరా....గల్లీ మనదిరా...!

ఆ టీవీ మనదిరా...ఈ ఫోన్ మనదిరా....గల్లీ మనదిరా...! ©️ VIL Media Pvt Ltd.


ఈ తేదీల్లో పుట్టిన వ్యక్తులు ఫన్నీ పర్సన్స్.. వీళ్లకు ఎవ్వరైనా పడిపోవాల్సిందే..!

మన చుట్టూ ఉండే వ్యక్తుల్లో కొందరు ఎప్పుడూ మూడీగా ఉంటారు. ఎవరితోనూ మాట్లాడకుండా ఇంట్రావర్ట్‌గా ఉంటారు. ఇంకొందరు మాత్రం చాలా త్వరగా నలుగురిలో కలిసిపోతారు. వీరిలోనూ కొంతమంది ఎప్పుడూ ఫన్నీగా, చమత్కారంగా ఉంటారు. తమ మాటలతో హాస్యాన్ని పండిస్తారు, ఇతరుల దృష్టిని ఆకర్షిస్తారు. కొన్ని తేదీల్లో పుట్టిన వారికి, కొన్ని లైఫ్ పాత్ నంబర్స్ వర్తించే వారికి ఇలాంటి లక్షణాలు ఉంటాయని న్యూమరాలజీ చెబుతోంది. ఏ తేదీలో జన్మించిన వ్యక్తులకు ఇలాంటి స్వభావం ఉంటుందో...


కోడెల సంరక్షణలో నిర్లక్ష్యం వహించొద్దు : హనుమంతురావు

కోడెల సంరక్షణలో నిర్లక్ష్యం వహించొద్దు : హనుమంతురావు వేములవాడ, వెలుగు: భక్తులు ఎంతో విశ్వాసంగా చూసే రాజన్న కోడెల సంరక్షణలో ఆలయ ఉద్యోగులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఎండోమెంట్‌‌ కమిషనర్‌‌‌‌ హనుమంతురావు హెచ్చరించారు. మంగళవారం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయానికి సంబంధించిన గోశాలను సందర్శించారు. కోడెలు చాలా ...


Qఅండ్ R ల మధ్య చూడండి: వైరల్ ట్రెండ్లో..రోడ్ సేఫ్టీపై ఢిల్లీ పోలీసుల వార్నింగ్

Qఅండ్ R ల మధ్య చూడండి: వైరల్ ట్రెండ్లో..రోడ్ సేఫ్టీపై ఢిల్లీ పోలీసుల వార్నింగ్ సోషల్ మీడియాలో ఢిల్లీ పోలీసులు పోస్టు చేసిన ‘కీ బోర్డులో Q మరియు R అక్షరాల మధ్య చూడండి’ అనే వైరల్ ట్రెండ్ X ఫ్లాట్ ఫాంలో సంచలనం సృష్టిస్తోంది. అదేంటంటే ఏదైనా మేసేజ్ చెప్పాలనుకున్నపుడు.. కీబోర్డులో కొన్ని అక్షరాల మధ్య చూడండి అంటూ కోడింగ్ ను ఉపయోగిస్తున్నారు. విషయం మొత్తం...


న్యూ లుక్‌‌‌‌లో సర్‌‌ప్రైజ్ చేస్తున్నాడార్లింగ్ ప్రభాస్

న్యూ లుక్‌‌‌‌లో సర్‌‌ప్రైజ్ చేస్తున్నాడార్లింగ్ ప్రభాస్ ఓవైపు ‘కల్కి 2898 ఎడి’ అనే సైన్స్ ఫిక్షన్ ఫ్యూచరిస్టిక్‌‌‌‌ సినిమాలో నటిస్తున్న ప్రభాస్.. మరోవైపు ‘రాజా సింగ్‌‌‌‌’ అనే హారర్ కామెడీ సినిమాలో నటిస్తున్నాడు. ఈ రెండు చిత్రాల్లో డిఫరెంట్ గెటప్స్‌‌‌‌లో కనిపించనున్నాడు. ఇదిలా ఉంటే ప్రభాస్‌‌‌‌ సరికొత్త అవతార్‌‌‌‌‌‌‌‌లో కనిపిస్తున్న ఫొటో ఒకటి సోషల్ మ...


Shah Rukh Khan: ప్లేస్ మీరు చెప్తారా? నన్ను చెప్పమంటారా? మోహన్‌లాల్‌కి షారుక్ రిప్లయ్

Shah Rukh Khan & Mohanlal on Social Media: బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్.. మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ మధ్య సోషల్ మీడియాలో జరిగిన ఓ కన్వర్సేషన నెటిజన్లను ఫిదా చేస్తుంది. మరి వీరిద్దరూ ఏం మాట్లాడుకున్నారంటే?


పవన్ కళ్యాణ్ పిల్లలిద్దరూ ఇండియన్స్ కాదా..? OCIకి, భారత పౌరులకు తేడా ఏంటి..?

Pawan Kalyan Children: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు మొత్తం నలుగురు పిల్లలు అనే సంగతి తెలిసిందే. అందులో ఇద్దరు పిల్లలు అకీరా నందన్, ఆద్య.. రెండో భార్య రేణు దేశాయ్ దగ్గర ఉంటున్నారు. మూడో భార్య అన్నా లెజినోవాకు జన్మించిన పొలినా, మార్క్ శంకర్.. ఇద్దరూ ఓవర్సీస్ సిటిజన్లు అని పవన్ కళ్యాణ్ తన ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. మొత్తంగా నలుగురు పిల్లలను చూడాల్సిన బాధ్యత తనపై ఉందని జనసేనాని అఫిడవిట్లో వెల్లడించారు.


Sabari First Review: శబరి ఫస్ట్ రివ్యూ వచ్చేసింది - తల్లి పాత్రలో వరలక్ష్మి నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

జీవితం అంటేనే రిస్క్ అని, వెండితెరపై తల్లి పాత్రలో నటించడం రిస్క్ అని తాను అసలు భావించడం లేదని విలక్షణ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ (Varalaxmi Sarathkumar) చెప్పారు. నటిగా తన తొలి సినిమా 'పోడా పొడి'లో తల్లి పాత్రలో నటించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. 'క్రాక్', 'నాంది', 'యశోద', 'వీర సింహా రెడ్డి', 'హనుమాన్'తో తెలుగులో వరుస విజయాలు అందుకున్నారు. మే 3న 'శబరి' సినిమాతో పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. తెలుగులో వరలక్ష్మీ శరత్ కుమార్ నటించిన...


ఆ జ్ఞాపకాలు వెంటాడుతున్నాయి.. స్పెషల్ పర్సన్ గురించి రష్మిక మందన్న ఇంట్రెస్టింగ్ పోస్ట్..

రష్మిక మందన్న గురించి తెలుగు వారికి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతుంది ఈ కూర్గ్ అందం. ఈ భామ ప్రస్తుతం తెలుగులో రెయిన్బో అనే లేడీ సెంట్రిక్ మూవీతో పాటు అల్లు అర్జున్‌తో పుష్ప ది రూల్ మూవీ కూడా చేస్తోంది. Photo : Instagram పుష్ఫ2 ఆగస్టు 15న భారీగా విడుదలకానుంది. ఆ మధ్య వారసుడుతో మరో బంపర్ హిట్ అందుకున్న రష్మిక తాజాగా హిందీలో యానిమల్ అనే ప్యాన్ ఇండియా చిత్రంలో నటించి మరో భారీ విజయాన్ని అందుకుంది. రణబీర్ కపూర్ హీరోగా వచ్చిన ఈ సినిమాకు.. సందీప్ రెడ్డి వంగా దర్శకుడు. Photo : Instagram ఇక ఈ భామ నటిస్తున్న పుష్ఫ2 ఆగస్టు 15న భారీగా విడుదలకానుంది. ఆ మధ్య వారసుడుతో మరో బంపర్ హిట్ అందుకున్న రష్మిక తాజాగా హిందీలో యానిమల్ అనే ప్యాన్ ఇండియా చిత్రంలో నటించి మరో భారీ విజయాన్ని అందుకుంది. రణబీర్ కపూర్ హీరోగా వచ్చిన ఈ సినిమాకు.. సందీప్ రెడ్డి వంగా దర్శకుడు. Photo : Instagram ఇక అది అలా ఉంటే.. రష్మిక మందన్న సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ అని తెలిసిందే. అందులో భాగంగా తాజాగా ఈ భామ ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసింది. ఆమె తన పోస్ట్’లో రాస్తూ.. ఈ సమ్మర్‌లో తన ఇంటిని.. తాను పెంచుకుంటున్న కుక్క పిల్లను ఎంతో మిస్ అవుతున్నానని తెలిపింది. దీంతో నెటిజన్స్ ఈ పోస్ట్‌పై రకరకాలుగా స్పందిస్తున్నారు.. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Photo : Instagram ఇక రష్మిక మందన్న సినిమాల విషయానికి వస్తే... రష్మిక పాటు పుష్ప2 : ది రూల్ - 15 ఆగస్టు విడుదల కానుంది. ఈ సినిమాతో పాటు VD12 - విజయ్ దేవరకొండ - గౌతమ్ తిన్ననూరి సినిమా, D51 - ధనుష్ & శేఖర్ కమ్ముల సినిమా, రవితేజ- గోపీచంద్ మలినేని సినిమా, రెయిన్‌బో - లేడీ ఓరియెంటెడ్ మూవీల్లో నటిస్తోంది. వీటితో పాటు ఇక లేటెస్ట్‌గా దర్శకుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వస్తోన్న మూవీ.. ఈ సినిమాను GA2 పిక్చర్స్‌ నిర్మిస్తోంది. . Photo : Instagram ఈ భామ శేఖర్ కమ్ముల, ధనుష్ కాంబినేషన్‌లో వస్తున్న కుబేర అనే ఓ ఫ్యాన్ ఇండియా మూవీలో హీరోయిన్‌గా నటించనుంది. ఈ సినిమాను అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP బ్యానర్ నిర్మిస్తున్నారు.. Photo : Instagram లేటెస్ట్‌గా తమిళ స్టార్ హీరో విక్రమ్‌కు జోడిగా రష్మిక ఓ భారీ సినిమాలో నటించనుందని తెలుస్తోంది. ఇటీవల కేరళలో వచ్చిన వరదల నేపథ్యంలో వచ్చిన ‘2018’ అనే చిత్రం డైరెక్టర్‌ జూడ్‌ ఆంథోనీ జోసెఫ్‌ దర్శకత్వంలో విక్రమ్ ఓ భారీ సినిమాను చేస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా రష్మిక మందన్న నటించనుందట. ఈ విషయంలో త్వరలో అధికారిక ప్రకటన విడుదలకానుంది. రష్మిక ఇప్పటికే తమిళ్‌లో కార్తీ ‘సుల్తాన్ ’, విజయ్‌ ‘వారిసు’ చిత్రాల్లో నటించి అక్కడ మంచి పాపులర్ అయ్యింది. Photo : Instagram ఇప్పటికే యానిమల్, మిషన్ మజ్ను, గుడ్ బై వంటి సినిమాల్లో నటించింది.. ఇక వీటికి తోడుగా ఆమెకు మరో భారీ సినిమాలో అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. ఛవా అనే హిస్టారికల్ పాన్-ఇండియా సినిమాలో ఆమె హీరోయిన్‌గా ఎంపికైనట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో విక్కీ కౌశల్ సరసన రష్మిక కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రం ఛత్రపతి శివాజీ పెద్ద కుమారుడు చత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా రూపొందించబడింది. శంభాజీ మహారాజ్ భార్య యేసుబాయి భోంసాలే పాత్రలో రష్మిక నటిస్తోంది. ఛవా చిత్రానికి లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించనున్నారు. దినేష్ విజన్ నిర్మించనున్నారు. Photo : Instagram ఇక మరోవైపు రష్మిక ఓ సంచలన రికార్డ్‌ను క్రియేట్ చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో తరచు తన సినీ, వ్యక్తిగత విషయాలను ఫ్యాన్స్, ఆడియన్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటుంది రష్మిక. ఇక తాజాగా రష్మిక మందన్న తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌లో మొత్తంగా 40 మిలియన్ ఫాలోవర్లని దక్కించుకుని ఒక గొప్ప రికార్డు నమోదు చేసింది. దీంతో ఇండియాలోనే అత్యధిక ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లు కలిగిన హీరోయిన్స్‌లో ఒకరిగా సెన్సేషనల్ రికార్డ్‌ను నమోదు చేసింది రష్మిక మందన్న.. Photo : Instagram ఇక వరుస హిట్ సినిమాలతో మంచి ఊపు మీదున్న రష్మిక మందన్న రెమ్యూనరేషన్ గురించి సోషల్ మీడియాలో వైరల్’గా మారింది. రష్మిక ఒక్కో సినిమాకు 4 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుందని తెలుస్తోంది. ఇక ఆమె ఆస్తుల విషయానికి వస్తే.. రష్మిక నికర ఆస్తుల విలువ 64 కోట్ల ఉంటుందని.. నెలవారి ఆదాయం 60 లక్షలుకు పైగా, వార్షిక ఆదాయం ఎనిమిది కోట్లకు పైగా ఉంటుందని తెలిపింది సెలెబిట్రీల ఆస్తుల వివరాలను తెలిపే ఓ వెబ్ సైట్. Photo : Twitter ఈ భామ తన సంపాదనలో ఎక్కువ భాగం ప్రాపర్టీస్‌పై ఇన్వెస్ట్ చేసిందని తెలుస్తోంది. అందులో భాగంగా ఆమె ఈ ఐదు సంవత్సరాల్లో ఓ ఐదు లగ్జరీ అపార్ట్‌మెంట్స్‌ను కొన్నట్లు తెలుస్తోంది. ఇవి ఐదు డిఫరెంట్ ప్లేసుల్లో అని సమాచారం. రష్మిక హైదరాబాద్, గోవా, ముంబై, కూర్గ్, బెంగుళూరు సిటీలో ఖరీదైన అపార్ట్‌మెంట్స్ సొంతం చేసుకుందట. Photo : Twitter Photo : Twitter రష్మిక మందన్న పర్సనల్ విషయానికి వస్తే.. ఆమె కర్ణాటకలో కొడగు జిల్లాలోని విరాజ్‌పేట్‌లో ఏప్రిల్ 5, 1996లో జన్మించారు. రష్మిక కూర్గ్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు. ఆ తర్వాత రష్మిక M. S. రామయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ & కామర్స్ నుండి సైకాలజీ, జర్నలిజం, ఆంగ్ల సాహిత్యంలో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. రష్మిక మందన్న బెంగళూరు టైమ్స్ 25 మోస్ట్ డిసైరెబుల్ ఉమెన్ ఫర్ 2014 జాబితాలో చోటు సంపాదించి అదరగొట్టారు. Photo : Instagram రష్మిక మందన్న..'గీత గోవిందం' సినిమాతో తెలుగువారికి చాలా దగ్గరైంది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో.. తెలుగులో విజయ్‌తో మరోసారి 'డియర్ కామ్రెడ్' సినిమాలో అదరగొట్టిన సంగతి తెలిసిందే. రష్మిక, మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. కన్నడలో ఆమె పునీత్ రాజ్‌కుమార్ సరసన అంజని పుత్ర, గణేశ్ సరసన ఛమక్ అనే సినిమాల్లో నటించింది. ఇక తెలుగులో యువ నాగ శౌర్యతో కలసి నటించిన ఛలో ఆమె తొలి తెలుగు సినిమా. ఈ సినిమా తర్వాత వరుసగా సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అందులో భాగంగా విజయ్ దేవరకొండతో పాటు మహేష్ బాబు, నితిన్, అల్లు అర్జున్ లాంటీ స్టార్స్‌తో సినిమాల్లో నటిస్తూ అదరగొడుతోంది ఈ కూర్గ్ అందం.Photo : Instagram


చెస్ రామయ్య వద్దకు మీ పిల్లలను పంపించారా.. చెస్ ఛాంపియన్లు కావాల్సిందే..

వేసవి సెలవులు ఉన్న నేపథ్యంలో స్కూల్ పిల్లల కి ఎలాంటి కోర్సులు నేర్పిస్తే మంచిది అనే తల్లిదండ్రులు ఆలోచనలో ఉన్నారా..కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ వేసవిలో పిల్లలకి మైండ్ కి పదును పెట్టే చెస్ ఆటలో నైపుణ్యం సాధించే దిశగా ఆలోచన చేయండి. అలా అయితే ఈ వేసవి కాలం మీ పిల్లలకు ఎంతగానో ఉపయోగ పడుతుంది. ఈ మధ్య కాలం లో తల్లి దండ్రులు ఎక్కువ శాతం పిల్లల్లో ఉన్న ప్రతిభను గుర్తించి ఆయా ఆటలలో నేర్పించేదుకు తల్లిదండ్రులు కృషి చేస్తుంటారు కానీ ఈ చెస్ ఆటలో నైపుణ్యం...


వామ్మో కుక్కలు : ప్రతి రోజూ 70 కుక్క దాడులు.. నెలలో ఇద్దరు మృతి

వామ్మో కుక్కలు : ప్రతి రోజూ 70 కుక్క దాడులు.. నెలలో ఇద్దరు మృతి హైదరాబాద్ నగర వాసులను వీధి కుక్కలు బెంబేలెత్తిస్తున్నాయి. కుక్క కాటు కేసులు ప్రతి సంవత్సరం పెరుగుతున్నాయే కానీ తగ్గడం లేదు.ఈ ఏడాది ఇప్పటి వరకు ప్రతి రోజూ 70 మంది కుక్క కాటుకు గురయ్యారు. ప్రతి నెలా కనీసం ఇద్దరు వ్యక్తులు రేబిస్ బారిన పడి మృతి చెందుతున్నారు. 2022లో 19 వేల 847 కేసులు నమోద...


Mahesh Babu - Rajamouli - SSMB 29: ఆ స్పెషల్ డే రోజున మహేష్ బాబు, రాజమౌళి సినిమాపై అఫిషియల్ ప్రకటన..

Mahesh Babu - Rajamouli -SSMB29: రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా సినిమా ఎపుడు స్టార్ట్ అవుతుందా అని అభిమానులు కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరి ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన మహేష్ బాబుకు ఎంతో ఇష్టమైన ఈ ప్రత్యేకమైన రోజున ప్రకటించనున్నారు.


కవర్ స్టోరీ : తెలంగాణ అమర్ నాథ్ యాత్ర.. మన సలేశ్వరం యాత్ర.. 5 రోజుల సాహసం ఓ అద్భుతం

కవర్ స్టోరీ : తెలంగాణ అమర్ నాథ్ యాత్ర.. మన సలేశ్వరం యాత్ర.. 5 రోజుల సాహసం ఓ అద్భుతం చరిత్ర సలేశ్వరం క్షేత్రానికి ఎంతో చరిత్ర ఉంది. నాగార్జున కొండ తవ్వకాల్లో బయట పడిన ఇక్ష్వాకుల శాసనాల్లో సలేశ్వరం ప్రస్తావన ఉంది. ఈ శాసనాలు క్రీ.శ. 260 సంవత్సరంలో వేయించినట్టు చరిత్రకారులు చెప్తున్నారు. వీటిలో 'చుళదమ్మగిరి' గురించి ప్రస్తావించారు. శ్రీలంక నుంచి వచ్చిన...


30 ఏళ్ల యూట్యూబ్ స్టార్, చిన్న రెస్టారెంట్‌లో పనిచేసేవాడు, ఇప్పుడు 100 కోట్ల ఆస్తి..

వినోద పరిశ్రమలో వచ్చిన మార్పులతో తెలుగులో రాజీ రెడ్డి, అన్వేష్, బయ్యా సన్నీ యాదవ్, షణ్ముఖ్, విస్మయ్ ఫుడ్స్, ప్రసు బేబి వంటి వారు ఉంటే.. హిందీలో క్యారీ మినాటి, ఆశిష్ చంచ్లానీ, అమిత్ భదానా వంటి యూట్యూబ్ స్టార్స్ బయటకు వచ్చారు. అయితే వీరికంటే కూడా భారతదేశంలో అత్యంత ధనిక యూట్యూబర్ గురించి యూట్యూబర్ గురించి ఇక్కడ మనం మాట్లాడుకుందాం. అతని సంపద కోట్లలో ఉంటుంది. నేటి యుగంలో, చాలా మంది స్టార్‌లుగా మారారు, సోషల్ మీడియా ద్వారా తమ నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నారు. అందులో భాగంగా చాలా మంది కష్టపడి తమను తాము గొప్ప యూట్యూబర్‌లుగా మార్చుకున్నారు. అయితే భారతదేశ ప్రసిద్ధ యూట్యూబర్ భువన్ బామ్ మాత్రం అందరికంటే కూడా ప్రత్యేకం.. భువన్ బామ్ ఒకప్పుడు నెలకు రూ.5వేలు సంపాదించేవాడు, ఆ సమయంలో క్లబ్బులలో పనిచేసేవాడు.. ఈ రోజు భువన్ పేరు భారతదేశంలోని అత్యంత ధనవంతులైన యూట్యూబర్‌ల జాబితాలో కనిపిస్తుంది. పాటలు పాడే టీవీ షోలలోకి రావడానికి గంటల తరబడి క్యూలో నిలబడే భువన్ ఈరోజు సెలబ్రిటీ అయ్యాడు, జనాలు అతన్ని సినిమా స్టార్ లాగా ప్రేమిస్తారు.. సోషల్ మీడియాలో ఆయనకు అంత ఆదరణ ఉంది.గతంలో రోజుకు రూ.150 సంపాదించిన భువన్ ఇప్పుడు ఖరీదైన కార్లలో తిరుగుతూ కోట్లాది రూపాయల ఆస్తికి (భువన్ బామ్ నెట్ వర్త్) యజమాని. GQ ప్రకారం, భువన్ బామ్ రూ. 122 కోట్ల నికర విలువతో భారతదేశంలో అత్యంత ధనిక యూట్యూబర్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. యూట్యూబ్‌లో 26 మిలియన్ల సబ్‌స్క్రైబర్‌‌లు ఉన్నారు.30 ఏళ్ల భువన్ బామ్ మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చాడు. గతంలో కేఫ్ ఆర్టిస్ట్‌గా పనిచేసాడు. అతను న్యూ ఢిల్లీలోని చిన్న కేఫ్‌లు, రెస్టారెంట్లలో పాడేవాడు. తరువాత భువన్ బామ్ యూట్యూబ్‌లోకి ప్రవేశించి తన సత్తాను చాటాడు. 30 ఏళ్ల భువన్ బామ్ మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చాడు. గతంలో కేఫ్ ఆర్టిస్ట్‌గా పనిచేసాడు. అతను న్యూ ఢిల్లీలోని చిన్న కేఫ్‌లు, రెస్టారెంట్లలో పాడేవాడు. తరువాత భువన్ బామ్ యూట్యూబ్‌లోకి ప్రవేశించి తన సత్తాను చాటాడు. 2021లో 'ధిండోరా' అనే కామెడీ సిరీస్‌తో భువన్ బామ్ తన సృజనాత్మకు మరింత పదును పెట్టాడు. యూట్యూబ్‌లో హాఫ్ బిలియన్ వ్యూస్ సాధించిన భారతదేశపు సిరీస్‌గా గుర్తించబడింది. ఆ తర్వాత 'తాజా ఖబర్' అని, Amazon MiniTVలో రొమాంటిక్ కామెడీ 'రఫ్తా రాఫ్తా'లలో నటించి వావ్ అనిపించాడు. ఇక భువన్ ఫస్ట్ వీడియో యూట్యూబ్‌లో చాలా పాపులర్ అయ్యింది. ఆపై అతను వెనుదిరిగి చూడలేదు. భువన్ తన BB వైన్స్ సిరీస్‌ని ప్రారంభించాడు. అందులో అతను చాలా చిన్న వీడియోలను పోస్ట్ చేసేవాడు. అతని వీడియోలలో అద్భుతమైన మాటలు, తీరు అతన్ని రాత్రిపూట స్టార్‌గా మార్చింది. BB Ki Vines 26 మిలియన్ల కంటే ఎక్కువ సబ్‌స్క్రైబర్‌‌లు ఉన్నారు


టీ షర్ట్‌పై మీ బొమ్మ కావాలా? జస్ట్ 10 నిమిషాల్లో ప్రింట్ వేసిస్తారు

బర్త్ డే , అలాగే మ్యారేజస్, పుట్టినరోజు వేడుకలకు మంచి బహుమతి ఇవ్వాలనుకుంటారు.. మారుతున్న కాలానికి అనుగుణంగా కూడా మంచి గిఫ్ట్స్ వినూత్న రీతిలో డిజైన్చేసి ఇస్తున్నారు. ఫ్యామిలీ ఫొటో ఆల్బమ్ డిజైన్చేయడం నుండి మనం టీ, కాఫీ తాగే కప్ పై ఫొటోస్ వేయడం టీ షర్ట్స్ పైన ఫొటోస్ వేయడం కీ చైన్స్ పైన మనకు నచ్చిన ఫొటోస్ ఇవ్వడం ఇలా ఏ వస్తువు అయితే ఆ వస్తువు పైన ఫొటోస్ వేయడం ఈ మధ్యకాలంలో ఒక ఫ్యాషన్ అయిపోయింది యువతీ, యువకులు కూడా ఇలాంటివి గిఫ్ట్‌గా ఇవ్వడానికి చాలా ఆసక్తి చూపుతున్నారు. దీనికి అనుగుణంగా గిఫ్ట్ ఆర్టికల్స్ షాప్ కూడా అలానే వెలిశాయి. ఇందులో భాగంగా కరీంనగర్‌కు చెందిన శివ అనే వ్యక్తి బహుమతి గిఫ్ట్ గ్యాలరీ షాప్‌తో అనేక విధాలుగా ఫొటోస్ ప్రేమ్స్ మనకు నచ్చిన స్టైల్లో డిజైన్వేసి కరీంనగర్ ప్రజలకు తక్కువ ధరలోనే అందిస్తున్నారు. వీరి దగ్గర టీ కప్పు ప్రింటింగ్, టీ షర్ట్, ప్రింటింగ్ స్వయంగా సొంత మిషనరీ పైన వేసి పదే పది నిమిషాల్లో కస్టమర్‌కు అందిస్తున్నారు. వీరి దగ్గర రూపాయలు 100 నుండి మొదలుకొని 3000 రూపాయల వరకు అతి తక్కువ ఖర్చుతో కరీంనగర్ లో ఎవరు ఇవ్వని ధరలకు వీటిని ఇస్తున్నారు. కస్టమ్మర్స్ అభిరుచులకు తగ్గట్టు వివిధ డిజైన్లలో ఫోటో పెయింటింగ్ చేసి తక్కువ సమయంలోనే వారికి అందిస్తున్నారు. దాదాపు రెండు సంవత్సరాల నుండి ఈ బహుమతి గిఫ్ట్ ఆర్టికల్ నడుపుతున్నామని కరీంనగర్ చుట్టుపక్కల ప్రాంతాల వారికి తక్కువ ధరలకే ఈ సౌకర్యాలు అందించాలని, మేము స్వయంగా అన్ని మిషనరీలు తెచ్చుకొని మేమే ప్రింట్ చేసి తక్కువ సమయంలో ఇస్తున్నామని బహుమతి గిఫ్ట్ ఆర్టికల్ నిర్వాహకులు శివ లోకల్ 18 కు తెలిపారు. కాలేజీ ఈవెంట్స్, అలాగే పండగలకు మ్యారేజెస్‌కు స్పెషల్ అట్రాక్షన్ కోసం వీరి దగ్గర టీ షర్ట్స్‌పై ఎక్కువగా ఫోటో ప్రింట్ వేసి ఇస్తున్నారు. ఆన్లైన్‌లో దొరికే ప్రతి ఫోటో గ్యాలరీ కావచ్చు, అలాగే మగ్ ప్రింటింగ్ కావచ్చు ఏదయినా ఇక్కడ తక్కువ ధరలోనే ఉంటాయట. మీరు మీకు నచ్చిన ఫొటోస్ టీ షర్ట్స్‌పై వేసుకోవాలనుకుంటున్నారా ఐతే వీరిని సంప్రదించండి.. ఇంకెందుకు లేటు మీకు నచ్చినగర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫెండ్స్, వైఫ్, పిల్లలకు, మంచి గిఫ్ట్ బహుమతి ఇవ్వాలనుకుంటే వీరిని సంప్రదించండి వీళ్ళ అడ్రస్స్ వచ్చేసి బస్టాండ్ టూ గీతబావన్ రోడ్.జోయాలూకాస్ పక్కన కరీంనగర్