సిటీబ్యూరో, మార్చి 18 (నమస్తే తెలంగాణ)/కందుకూరు : బుడిబుడి నడకలు.. బోసి నవ్వులు.. వచ్చీరాని పలుకులు.. హావాభావాలతో చిరునవ్వులు చిందిస్తూ ఇంటిల్లిపాదిని ఆనందపరవశంలో ముంచెత్తే చిన్నారులుంటే ఎంతో ముద్దు చేస్తారు. ఇక వారి మొదటి పుట్టినరోజును ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఇటీవల తల్లిదండ్రులు తమ చిన్నారుల ప్రథమ జన్మదిన వేడుకలను పచ్చటి వనాల్లో నిర్వహించేందుకు మక్కువ చూపుతున్నారు. కుటుంబసభ్యులతో కలిసి పర్యాటక ప్రాంతాలు, పార్కులు, హరితవనాలవైపు అడుగులేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం హరితహారంలో నాటిన మొక్కలు.. అర్బన్ ఫారెస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో పట్టణ పార్కులను సుందరీకరణ చేసిన సందర్భంగా చిన్నారుల పుట్టిన రోజు వేడుకలకు వేదికలుగా నిలుస్తుండటం విశేషం.
ఆకుపచ్చని వేదికపై ఫొటో షూట్..
బోసిపోయిన పార్కే.. నేడు పచ్చబడింది
ముషీరాబాద్లోని మా ఇంటి దగ్గరి పార్కు బోసిపోయి ఉండేది. అందువల్ల మేము నారాయణగూడలోని వైఎంసీఏ పార్కుకు వెళ్లేవాళ్లం. ఒకప్పుడు బోసిపోయిన పార్కే.. నేడు గ్రీనరీతో నిండుకొనడంతో ఈ పార్కుకే వెళుతున్నాం. గతంలో చెత్తాచెదారంతో ఉండే పార్కులను తెలంగాణ ప్రభుత్వం అందంగా తీర్చిదిద్దుతున్నది. కాలనీవాసులు ఎంతో సంతోషిస్తున్నారు.
– నీతిక, ప్రశాంత్
2023-03-18T19:14:59Z dg43tfdfdgfd