ప్రకాశం: మనోడు చాలా లక్కీ.. పోయిందనుకున్న డబ్బులు మళ్లీ దొరికాయి

మనం ఏదైనా వస్తువు, డబ్బులు, బంగారం పోగొట్టుకుంటే ఆ బాధ వర్ణనాతీతం. అయితే అలా పోగొట్టుకున్న వస్తువో, డబ్బులో, బంగారమో దొరికితే ఫీలింగ్ ఏంటి. అవును అది నిజంగా అదృష్టమనే చెప్పాలి. తాజాగా ప్రకాశం జిల్లాలో కూడా అదే జరిగింది. పోగొట్టుకున్న డబ్బులు మరోసారి దొరికాయి. దీంతో ఆ యువకుడి ఆనందానికి అవధులు లేకుండా పోయింది.

సీహెచ్‌ వెంకటేశ్వర్లుది ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం ఒద్దిమడుగు. ఆయన కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ నుంచి మార్కాపురానికి రైల్లో బయలుదేరారు. గురువారం రాత్రి హుబ్లీ ఎక్స్‌ప్రెస్‌లో వచ్చి మార్కాపురం రైల్వేస్టేషన్‌లో దిగారు. ఆ హడావిడిలో రెండు బ్యాగులు రైల్లో మర్చిపోయారు. తీరా ఇంటికి వచ్చి చూసుకున్న తర్వాత రెండు బ్యాగులు లేవు.. ఏం జరిగిందా అని ఆలోచిస్తే రైల్లో మర్చిపోయమని అనుమానించారు.

ఈ బ్యాగులో రూ.1.44 లక్షల విలువ చేసే సొత్తు ఉన్నట్లు గుర్తించి వెంటనే మార్కాపురం ఆర్‌పీఎఫ్‌ పోలీసులను ఆశ్రయించారు. వెంటనే వారు కంభం సిబ్బంది ద్వారా ఆర్‌పీఎఫ్‌ పోలీసులకు తెలియజేయగా.. వారు వెళ్లి బ్యాగుల్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ప్రయాణికుడికి వాటిని అందజేశారు. తన బ్యాగుల్ని తిరిగి అప్పగించినందుకు అతడు ఆర్‌పీఎఫ్ పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు.

Read Latest

Andhra Pradesh News

and

Telugu News

2023-03-18T05:34:35Z dg43tfdfdgfd