తిరుమల : తిరుమలలోని నాదనీరాజనం వేదిక, ఆస్థాన మండపంలో శనివారం జరిగిన 24 గంటల అఖండ హనుమాన్ చాలీసా(Hanuman Chalisa) పారాయణం భక్తిభావాన్ని పంచింది. శనివారం ఉదయం 9.30 గంటలకు ప్రారంభమైన ఈ పారాయణం ఆదివారం ఉదయం వరకు 24 గంటల పాటు జరుగనుంది. టీటీడీ బోర్డు మాజీ సభ్యులు, యుగతులసి ఫౌండేషన్ చైర్మన్ శివ కుమార్ ఆధ్వర్యంలో సోలీస్ ఐ కేర్ హాస్పిటల్స్ చైర్మన్ ఎన్ రాము సౌజన్యంతో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో(Ttd) ఎవి.ధర్మారెడ్డి, టీటీడీ పాలకమండలి సభ్యులు పోకల అశోక్ కుమార్, ఉప్పల్ శాసన సభ్యులు బేతి సుభాష్ రెడ్డి, శేరిలింగంపల్లి శాసనసభ్యులు అరికెపూడి గాంధీ, సోలీస్ ఐ కేర్ హాస్పిటల్స్ చైర్మన్ ఎన్ రాము, రాజగోపాల్ నాయుడు, శ్రీ ఫణి భజన బృందం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన సుమారు 500 మంది భక్తులు పారాయణంలో పాల్గొన్నారు.
2023-03-18T14:50:12Z dg43tfdfdgfd