Trending:


Maname Movie Teaser: నేను మంచోడిలా క‌నిపిస్తాను. కానీ, కాదు - శర్వానంద్ ‘మ‌న‌మే‘ టీజర్ చూశారా?

Maname Movie Teaser Out: తెలుగు సినిమా పరిశ్రమలో మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్ శర్వానంద్.. ఫీల్ గుడ్ మూవీస్ చేయడంలో ముందుంటాడు. ఆయన సినిమాలన్నీ ఫ్యామిలీ ఆడియెన్స్ తో పాటు యూత్ ను బాగా ఆకట్టుకుంటాయి. ఇంకా చెప్పాలంటే ఫ్యామిలీ సెంటిమెంట్ తో ప్రేక్షకులను అలరిస్తాడు. శర్వానంద్ చివరగా ‘ఒకే ఒక జీవితం’ సినిమాలో కనిపించాడు. ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఆయన ‘మనమే’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం...


Salaar: ఇలా చేస్తే చాలు.. సలార్ లోని ప్రభాస్ బైక్ ఇక మీ సొంతం

Salaar Contest: వరుస ప్లాపులతో సతమతమవుతున్న ప్రభాస్ కి సలార్ సినిమా మంచి విజయం తెచ్చిపెట్టింది. అయితే ఈ చిత్రంలో ప్రభాస్ నడిపిన బైక్ ఇప్పుడు అభిమానులు సొంతం చేసుకోవచ్చు.. మరి అది ఎలానో ఒకసారి చూద్దాం..


పాటకు 3 కోట్లు.. ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే స్టార్ సింగర్ ఎవరు..?

సింగర్స్ లో అత్యధికం రెమ్యునరేషన్ తీసుకునే స్టార్ ఎవరు అంటే..వెంటనే ఏ శ్రేయాఘోషల్ పేరో.. చిత్ర, సిద్ధ్ శ్రీరామ్ లాంటి వారి పేర్లు గుర్తుకు వస్తాయి. కాని ఇండియాలోనే హైయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకునే సింగర్ ఎవరోతెలుసా.. 1950లలో భారతీయ సినిమాలో ప్రముఖ గాయకులకు 300 చెల్లించేవారు. కానీ నేడు దేశంలోని టాప్ సింగర్లకు లక్షల్లో ఇస్తున్నారు. ముఖ్యంగా.. డిమాండ్ ఉన్న స్టార్ సింగర్స్ కు కోట్లలోనే ఇస్తున్నారు. ఇక ఇండియాలో భారీగా రెమ్యూనరేషన్ తీసుకునే సింగర్...


పెళ్ళి చేసుకున్నవారు ఈ తప్పులు చేస్తే అస్సలు మంచిది కాదట..

వివాహ బంధంలో తెలిసితెలియక చేసే కొన్ని తప్పులు పార్టనర్‌ని ఇబ్బందిపెడతాయి. అలాంటి తప్పులు ఏంటో తెలుసుకోండి.


మేకప్ లేకుండా అనసూయను చూశారా?

అనసూయ, తన భర్తతో కలిసి వర్కౌట్లు చేస్తూ ఉంటుంది. అనసూయ తన ఫిట్ నెస్ మీద బాగానే ఫోకస్ పెట్టిందన్న సంగతి తెలిసిందే. వర్కౌట్లతో ఫుల్ బిజీగా ఉండే అనసూయ అప్పుడప్పుడు ఇలా ఫన్నీ చేష్టలన్నీ చేస్తుంటుంది. తాజాగా తన భర్తకు కన్ను కొట్టి మరీ డిస్టర్బ్ చేసింది. అనసూయ జిమ్‌లో ఇలా భర్తతో సరసాలు ఆడేసింది. ఇక ఇందులో అనసూయ విత్ అవుట్ మేకప్ ఎంతో నేచురల్ బ్యూటీలా ఉంది.


ఆ టైంలో చాలా సార్లు అబార్షన్ అయింది.. అమీర్ ఖాన్ మాజీ భార్య కామెంట్స్

దాదాపు 15 ఏళ్లపాటు అన్యోన్యంగా జీవితం సాగించిన అమీర్ ఖాన్, కిరణ్ రావు దంపతులు 2021లో విడాకులు తీసుకుని విడిపోయారు. అమీర్ ఖాన్, కిరణ్ రావులు 2005 లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరిద్దరికి ఆజాద్ రావు ఖాన్ సంతానం. కిరణ్ రావు తాజాగా ఓ ఇంటర్వ్యూలో అబార్షన్స్ గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది. పిల్లలు పొందాలని పెళ్లి తర్వాత చాలా ప్రయత్నించాం. ఒక పాప, బాబుని పొందడం ఇంత కష్టమా అనిపించింది. ఐదేళ్లలో నాకు చాలా సార్లు అబార్షన్ అయింది. అది నరకం....


Kannappa: కన్నప్ప సినిమాలో మరో స్టార్ హీరోయిన్.. రోజు రోజుకు పెరుగుతున్న స్టార్స్ లిస్ట్..

Kannappa: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప మూవీపై భారీ అంచనాలే పెట్టుకున్నాడు. అంతేకాదు ఈ సినిమా కోసం భారీ క్యాస్టింగ్‌ను కూడా రంగంలోకి దింపుతున్నాడు. ఇప్పటికే ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్‌లాల్ వంటి నటులు ఈ భారీ ప్రాజెక్ట్‌లో ఉన్నారు. తాజాగా ఈ సినిమాలో మరో స్టార్ హీరోయిన్ నటిస్తుందనే వార్త్ వైరల్ అవుతోంది.


Prathinidhi 2 Trailer: రాష్ట్రానికి అప్పులు పెరుగుతుంటే, మీ ఆస్తులు ఎలా పెరుగుతున్నాయి - ఉత్కంఠగా రేపుతున్న 'ప్రతినిధి 2' ట్రైలర్‌

Nara Rohit Prathinidhi 2 Trailer Out: చాలా రోజుల తర్వాత నారా రోహిత్‌ నటించిన చిత్రం 'ప్రతినిధి 2'. తొమ్మిదేళ్ల క్రితం రోహిత్‌ నటించిన ప్రతినిధికి సినిమాకు ఇది సీక్వెల్‌. సీనియర్‌ జర్నలిస్ట్‌ మూర్తి దర్శకత్వంతో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్‌ 25న ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా నేడు (ఏప్రిల్‌ 19) ట్రైలర్‌ విడుదల చేశారు. తాజాగా విడుదలైన ఈ ట్రైలర్‌ ఆకట్టుకుంటుంది. పొలిషియన్స్‌ ప్రశ్నించేలా ఉన్న ఒక్కొక్కొ డైలాగ్...


Karthika Deepam 2 Serial Today April 19th: కార్తీకదీపం 2 సీరియల్: తల్లి ఆవేదన చూసి జ్యోత్స్న విషయంలో కార్తీక్‌ మనసు మార్చుకుంటాడా.. ఆ ఒక్క సాయం చేయమని దీప రిక్వెస్ట్!

Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode కార్తీక్ బయటకు వెళ్లడానికి కారు దగ్గరకు వస్తే అక్కడ దీప కార్తీక్ సౌర్య కోసం కొన్న డ్రస్ పట్టుకొని నిల్చొని ఉంటుంది. కార్తీక్ దీపని చూసి మీరు ఏం అడగాలి అనుకుంటున్నారో నాకు అర్థమైంది దీప అని అంటాడు. దానికి దీప అయినా మీరు పాపకి బట్టలు కొన్నారు అని అంటుంది. దీప: ఎందుకు మీరు పాపకు దగ్గర అవుతున్నారు. ఎందుకు సౌర్య విషయంలో అంత చనువు తీసుకుంటున్నారు. సౌర్యతో స్నేహం చేయాల్సిన అవసరం మీకు ఏంటి. జాలి...


ఎస్వీఆర్‌ పంతం.. ఆ సినిమా టైమ్‌లో ఎన్టీఆర్‌నే ఏడిపించాడు.. రామారావు భయపడేది ఆయనకేనా?

నటనలో ఎన్టీఆర్‌, ఎస్వీఆర్‌ నువ్వా నేనా అనేలా ఉండేవారు. అయితే ఓ సందర్భంలో ఎన్టీఆర్‌కి బాగా ఏడిపించాడట ఎస్వీఆర్‌. సినిమా మొత్తం చుక్కలు చూపించాడట. తెలుగు చిత్ర పరిశ్రమకి ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ రెండు కళ్లు లాంటి వాళ్లు అని అంతా కొనియాడుతుంటారు. ఎస్వీఆర్‌ ప్రస్తావన చాలా తక్కువగా వస్తుంది. కానీ అప్పట్లో ఎస్వీఆర్‌ లేకుండా సినిమాలు ఉండేవి కావు, ఎన్టీఆర్‌ సినిమా అయినా, ఏఎన్నార్‌ మూవీ అయినా అందులో ఎస్వీఆర్‌ ఉండాల్సిందే అనేట్టుగా ఉండేది. అంతేకాదు ఈ ముగ్గురు...


Twins Baby : ఈ లక్షణాలు ఉన్న గర్భిణులకు కవలలు పుట్టే అవకాశం ఉంది..!

Twins : ప్రతి స్త్రీ జీవితంలో మాతృత్వం చాలా ముఖ్యమైన భాగం. ఇది మొత్తం కుటుంబంలో సంతోషకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ముఖ్యంగా మొదటి సారి గర్భం దాల్చిన కొందరు స్త్రీలకు ఒకేసారి కవల పిల్లలు పుట్టే అవకాశం ఉంది.


‘టిల్లు’ గాడి రూట్లో ‘మ్యాడ్’.. సితార సెంటిమెంట్ కలిసొస్తుందా?

Mad Square Pooja ceremony సితార బ్యానర్ ప్రస్తుతం ఫుల్ జోష్ మీదుంది. టిల్లు స్క్వేర్ భారీ సక్సెస్ అవ్వడం 150 కోట్ల గ్రాస్ దిశగా పరుగులు తీస్తుండటంతో సితార ఫుల్ ఖుషీ అవుతోంది. అందుకే వెంటనే మ్యాడ్ సీక్వెల్.. మ్యాడ్ స్క్వేర్‌ను ప్రారంభించింది. స్క్వేర్ ట్రెండ్‌ను సితార కంటిన్యూ చేయాలని ప్రయత్నిస్తోంది.


నేను మహేష్ బాబుకు అమ్మను ఏంటి, నాన్సెన్స్! నా బతుకు ఇలా అయిపోయింది! అయ్యో కస్తూరి!

కస్తూరి శంకర్ తనకు వయసు పెరగడం లేదని తెగ బాధపడిపోతోంది. దాని వలన ఆమె ఆఫర్స్ కోల్పోతున్నారట. మహేష్ బాబు పక్కన అమ్మగా సెట్ కాను , హీరోయిన్ గా చేసే వయసే అంటుంది నటి కస్తూరి శంకర్ ముక్కుసూటిగా మాట్లాడుతుంది. పలు సందర్భాల్లో ఆమె చేసిన కామెంట్స్ చర్చకు దారి తీశాయి. తాజాగా వయసు పెరగని కారణంగా ఆమె ఆఫర్స్ కోల్పోతున్నారట. ఆ కహాని ఏమిటో చూద్దాం.. తాజా ఇంటర్వ్యూలో నటి కస్తూరి మాట్లాడుతూ... కళ్యాణ్ రామ్ డెవిల్ మూవీలో నాకు ఆఫర్ వచ్చింది. సీత చేసిన పాత్ర నేను...


Viral: మాజీ ప్రియుడిపై యువతి రివెంజ్.. అతని తండ్రిని పెళ్లి చేసుకుని సవతి తల్లిగా ఎంట్రీ!

Viral Video: ప్రేమ గొప్పతనం గురించి చెప్పేందుకు చాలా మంది ప్రేమకు హద్దులు లేవు అనే మాట ఉపయోగిస్తుంటారు. నచ్చిన వారిపై అంతులేని ప్రేమను చూపించడం, వారి కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడటం ద్వారా కొందరు ఆ మాటను నిజం చేస్తారు. కానీ దీనికి పూర్తి విరుద్ధంగా జరిగిన ఓ సంఘటన నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఓ అమ్మాయి, తన ఎక్స్‌బాయ్‌ఫ్రెండ్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు ఎవ్వరూ ఊహించని పని చేసింది. ప్రేమకు కాదు, ప్రతీకారానికి హద్దులు లేవని నిరూపించింది. ఇంతకీ ఆమె...


Pooja Hegde: ప్రియుడిని పెళ్లాడబోతున్న పూజా హెగ్డే? లీకైన ఫొటోలు

Pooja Hegde & Rohan Mehra Photos Leaked: సెల‌బ్రెటీల‌కి సంబంధించి ఎప్పుడూ ఏదో ఒక రూమ‌ర్ ఇంట‌ర్నెట్ ని షేక్ చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు హీరోయిన్ పూజా హెగ్డే పెళ్లి గురించి ప్రియుడితో క‌లిసి ఆమె ఏడ‌డుగులు వేయ‌బోతున్నార‌నే వార్త బాగా వైర‌ల్ అవుతోంది. అంతే కాదు.. ఆమెకు సంబంధించి, ప్రియుడికి సంబంధించిన ఒక ఫొటో కూడా తెగ వైరల్ గా మారింది. పూజా హెగ్డే త‌న ప్రియుడిని త‌ల్లిదండ్రుల‌కు ప‌రిచ‌యం చేసింద‌ని, అందుకే ఇద్ద‌రు ఒక హోట‌ల్ కి డిన్న‌ర్ కి వ‌చ్చార‌నే...


నిఖిల్ కొడుకు పేరు ఏంటో తెలుసా... తండ్రి అయ్యాక ఆ అలవాటు వదిలేశాడట!

హీరో నిఖిల్ సిద్ధార్థ ఈ ఏడాది ఫిబ్రవరిలో తండ్రి అయ్యాడు. ఆయన భార్య పల్లవి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని నిఖిల్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు. అభిమానులకు నిఖిల్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశాడు. కాగా నిఖిల్ తన కొడుకు పేరు రివీల్ చేశాడు. ధీర సిద్దార్థ అని పేరు పెట్టారట. నిఖిల్ కి వారంలో కనీసం ఒక రోజు పార్టీకి వెళ్లడం అలవాటుగా ఉందట. ఈ అలవాటును కొడుకు పుట్టాక వదిలేశాడట. పిల్లలు పుట్టాక మనం కొన్ని అలవాట్లు మార్చుకోవాలి. మంచి...


Salman Khan: చంపాలనుకున్నారా, బెదిరించాలనుకున్నారా? అసలు సల్మాన్ ఖాన్‌ను ఎందుకు టార్గెట్ చేసుకున్నారు?

Why Do Lawrence Bishnoi Targets Salman Khan: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి ముందు కాల్పులు ఘటన గురించి ఇప్పటికీ ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు. ఇక దీని గురించి రోజురోజుకీ ఒక కొత్త విషయం బయటపడుతోంది. ముందుగా సల్మాన్ ఇంటి ముందు కాల్పులు జరిపిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారే విక్కీ గుప్తా (24), సాగర్ పాల్ (21). వీరిద్దరి దగ్గర నుండి దాడికి సంబంధించిన మరిన్ని వివరాలు సేకరించడానికి ప్రయత్నిస్తున్నారు పోలీసులు. ఇప్పటికీ...


Hero Rajinikanth Casted Vote | చెన్నైలో ఓటు హక్కు వినియోగించుకున్న రజినీ కాంత్

Hero Rajinikanth Casted Vote in tamilnadu elections 2024


Roshan Kanakala: యాంకర్‌ సుమ ఆస్తులు, షేర్స్‌ గురించి చెప్పిన కొడుకు రోషన్‌ - ఏమన్నాడంటే!

Roshan Kanakala Interesting Comments on Mother Suma: యాంకర్‌ సుమ ఎనర్జీ, టైమింగ్‌ పంచ్‌లకు ప్రత్యేకమైన ఫ్యాన్‌ బేస్‌ ఉంది. ఎంతో కాలంగా టెలివిజన్‌ రంగంలో తనదైన యాంకరింగ్‌తో రాణిస్తుంది. సెలబ్రిటీస్‌ అయినా, సాధారణ ఆడియన్స్‌ అయినా అందరికి తన పంచ్‌ డైలాగ్స్‌తో ఇచ్చి పడేస్తుంది. యాంకరింగ్‌తో ఎంతో వినోదం పంచే సుమ నాలుగు పదుల వయసులోనూ అంతే ఎనర్జీతో స్టార్‌ యాంకర్‌గా కొనసాగతుంది. ఇప్పటికీ ఆమెకు బీట్‌ చేసే మేల్‌, ఫీమేల్‌ యాంకర్స్‌ లేరనడంతో సందేహం లేదు....


శ్రీముఖిపై పదేపదే వల్గర్ కామెంట్స్, ఆ కమెడియన్ కావాలనే చేశాడా..యాంకర్ రవితో ముడిపెడుతూ అసభ్యంగా..

ధనరాజ్ కూడా గతంలో శ్రీముఖి విషయంలో వివాదంలో చిక్కుకున్నాడు. గతంలో ఓ షోలో ధనరాజ్ శ్రీముఖిని వల్గర్ గా ప్రశ్నించిన విధానం పెద్ద ఎత్తున దుమారం రేపింది. బుల్లితెర యాంకర్ శ్రీముఖి గురించి చెప్పేదేముంది. గ్లామర్, చలాకీతనం ఆమెకి ఉన్న పెద్ద ప్లస్ పాయింట్స్. అందంతో కుర్రాళ్లని అట్రాక్ట్ చేస్తూనే.. స్పీకర్లు పగిలిపోయేలా గోల చేయడం ఆమె శైలి. అందుకే శ్రీముఖి పాల్గొనే షోలలో పెద్ద హంగామా ఉంటుంది. బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూనే సిల్వర్ స్క్రీన్ పై కూడా మెరుపులు...


టీవీ తెరను తన అందాలతో ఓ ఊపు ఊపిన ఈ భామ.. ఇప్పుడు కనిపించకుండా పోయింది..

అనసూయ యాంకరింగ్‌ను ఆపేసి.. ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తోంది.. అందులో భాగంగా ఇటీవల ఆమె విమానం అనే ఓ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.. సముద్రఖని ప్రధాన పాత్రలో నటించారు. శివ ప్ర‌సాద్ యానాల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కిర‌ణ్ కొర్ర‌పాటి నిర్మించారు. అయితే ఈ సినిమాలో సుమతి అనే వేశ్య పాత్రలో అనసూయ నటించింది. ఈ సినిమాలో ఆమెది చిన్న పాత్రే అయిన ఓ పక్క గ్లామర్ షో చేస్తూనే మరోపక్క ఇంటిమేట్ సన్నివేశాల్లో అదరగొట్టింది. ప్రస్తుతం పుష్ప2లో నటిస్తోంది. Photo : Instagram ఇక అది అలా ఉంటే అనసూయ తాజాగా కొన్ని ఫోటోలను పంచుకుంది. బ్లూటాప్‌లో కవ్విస్తూ అదరగొట్టింది. దీంతో ఈ ఫోటోలపై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. అనసూయ నీకు అందం రోజురోజుకు పెరుగుతుందని కొందరు అంటుంటే.. అసలు నువ్వు అన్నం తింటున్నావా.. లేక అందం తింటున్నావా.. అని పొగుడుతూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి. Photo : Instagram. ఇక ప్రస్తుతం యాంకరింగ్‌కు గుడ్’బై చెప్పిన అనసూయ ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. అందులో భాగంగానే ఈ హాట్ యాంకర్ 'కన్యాశుల్కం' అనే వెబ్ సిరీస్‌లో నటించనున్నారని తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్ గురజాడ అప్పారావు క్లాసిక్ నాటకం 'కన్యాశుల్కం' ఆధారంగా వస్తోందని సమాచారం. అందులో భాగంగానే ఇప్పుడో వెబ్ సిరీస్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అనసూయ. Photo : Instagram. ఈ వెబ్ సిరీస్‌లో అనసూయ, మధురవాణి అనే వేశ్య క్యారెక్టర్‌లో కనిపించనుందని తాజా టాక్. ఇక్కడ విశేషం ఏమంటే.. ఈ సిరీస్ మొత్తం అనసూయ క్యారెక్టర్ చుట్టూ తిరుగుతుందట. దీనికి సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన విడుదలకానుంది. ఈ వెబ్ సిరీస్‌ను ప్రముఖ దర్శకుడు క్రిష్ నిర్మిస్తున్నారు. Photo : Instagram ఇక మరోవైపు అనసూయ రెమ్యూనరేషన్ గురించి ఓ వార్త సోషల్ మీడయాలో హల్ చల్ చేస్తోంది. జబర్దస్త్ కామెడీ షోతో తెలుగు రాష్ట్రాల్లో సూపర్ పాపులర్ అయ్యిన అనసూయ తెలుగు యాంకర్స్‌లో సుమ తర్వాత రెండవ స్థానంలో ఉంది. అంతేకాదు ఈ భామ ఒక్కో షోకు దాదాపుగా రూ. 2 లక్షల రెమ్యునరేషన్ వరకు తీసుకుంటున్నట్లు సమాచారం.. అయితే ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. Photo : Instagram దీనికి తోడు ఆమెకు సినిమా అవకాశాలు కూడా బాగానే వస్తున్నాయి. ఇప్పటికే ఓ మలయాళీ చిత్రంలో కనిపించిన అనసూయకు మరో మలయాళీ చిత్రంలో అవకాశం వచ్చింది. వీటికితోడు ఓ రెండు తమిళ సినిమాల్లోను నటిస్తోందట అనసూయ. మరోవైపు తెలుగులో పుష్ప 2లో అనసూయ పాత్రను పెంచనున్నారని తెలుస్తోంది.. Photo : Instagram ఇక అనసూయ ఆ మధ్య వచ్చిన పుష్ప సినిమాలో నటించి అదరగొట్టిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో ‘పుష్ప’ (Pushpa) అనే ప్యాన్ ఇండియా సినిమా 2021 డిసెంబర్ 17న విడుదలై మంచి ఆదరణ పొందింది. రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్‌గా చేశారు. ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. Photo : Instagram.


Market Mahalakshmi Movie Review - మార్కెట్ మహాలక్ష్మీ రివ్యూ: బొమ్మరిల్లు తండ్రీ కొడుకులు... ఇండిపెండెంట్ అమ్మాయి... సినిమా ఎలా ఉందంటే?

'కేరింత'తో తెలుగు చిత్రసీమకు 'దిల్' రాజు పరిచయం చేసిన హీరోల్లో పార్వతీశం (Parvateesam) ఒకరు. ఆ సినిమాలో ఆయన శ్రీకాకుళం యాస, నటన ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. 'కేరింత' తర్వాత వైవిధ్యమైన, విలక్షణ కథలు ఎంపిక చేసుకుని సినిమాలు చేశారు. కానీ, ఆ స్థాయి విజయం రావడం లేదు. ఇవాళ 'మార్కెట్ మహాలక్ష్మీ' సినిమా (Market Mahalakshmi Movie)తో ఆయన ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇందులో ప్రణీకాన్వికా నటించారు. మార్కెట్‌లో కాయగూరలు అమ్మే అమ్మాయితో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసే...


OTT: ఒక చిన్న ట్విస్ట్‌తో వేల కోట్లు వసూలు చేసిన తెలుగు సినిమా.. ఇప్పటికీ సంచలనమే..!

2015లో విడుదలైన ఓ టాలీవుడ్ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించింది. తెలుగులోనే కాదు.. విడుదలైన అన్ని భాషల్లోనూ బీభత్సం సృష్టించింది. అద్భుతమైన కథ, కథనంతో ప్రేక్షకులను కట్టిపడేయడమే కాదు.. దేశవ్యాప్తంగా అందరినీ కన్‌ఫ్యూజన్‌లో పడేసింది. ఆ సినిమా మరేదో కాదు.. బాహుబలి. ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన ఈమూవీ.. 2015 జూలై 10న థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా ప్రేక్షకులకు ఎంతగా నచ్చిందంటే.. రూ. 180 కోట్లతో నిర్మిస్తే.. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.650 కోట్లు రాబట్టింది. ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించింది. అదే సమయంలో ప్రేక్షకులను కన్‌ఫ్యూజన్‌లో పడేసింది. 'కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు' అనే పెద్ద ప్రశ్న ఎదురైంది. అప్పట్లో ఈ ప్రశ్న దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఏళ్ల తరబడి ఈ ప్రశ్నకు సమాధానం దొరకలేదు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ప్రశ్నతో బాహుబలి మూవీ ట్విటర్‌లోనూే ట్రెండింగ్ లో నిలిచింది. చివరికి ఈ ప్రశ్నకు ప్రేక్షకులకు సమాధానం దొరికింది. కానీ రెండేళ్ల నిరీక్షణ తర్వాత.. ఆ ట్విస్ట్ రివీల్ అయింది. 2017లో బాహుబలి-2 విడుదలయిన తర్వాత కట్టప్ప..బాహుబలిని ఎందుకు చంపాడన్న ప్రశ్నకు సమాధానం లభ్యమైంది. ఈ మూవీలో కట్టప్ప బాహుబలికి చాలా ప్రత్యేకమైన వ్యక్తి. కానీ సినిమా క్లైమాక్స్‌లో బాహుబలిని అదే కట్టప్ప చంపేస్తాడు. అక్కడితో మూవీ ముగుస్తుంది. కట్టప్ప ఎందుకు చంపాడన్నది రెండో పార్ట్‌లో చూపించారు. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఈ బాహుబలి మూవీ... టాలీవుడ్‌తో పాటు తమిళ భాషల్లో ఏకాకలంలో తెరకెక్కింది. మలయాళం, కన్నడ, హిందీలోనూ డబ్ చేశారు. పాస్ట్ పార్ట్‌లో ఉన్న ఈ ట్విస్ట్‌తో రెండో పార్ట్‌పై ఆసక్తి పెరిగి.. ఏకంగా 1800 కోట్లు వసూళ్లు చేసింది. బాహుబలి సినిమాల్లో ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా ఇప్పటికీ జనాల ఫస్ట్ ఛాయిస్‌గా మిగిలిపోయింది. తెలుగులో మరే సినిమా కూడా బాహుబలి రికార్డులను అందుకోలేకపోయాయి. ఈ చిత్రాలు ప్రస్తుతం హాట్ స్టార్, నెట్ ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉన్నాయి.


మీ టీషర్ట్‌పై మీ బొమ్మ కావాలా? ఇక్కడ రెండు నిమిషాల్లో ప్రింట్ చేసిస్తారు

బర్త్ డే , అలాగే మ్యారేజస్, పుట్టినరోజు వేడుకలకు మంచి బహుమతి ఇవ్వాలనుకుంటారు.. మారుతున్న కాలానికి అనుగుణంగా కూడా మంచి గిఫ్ట్స్ వినూత్న రీతిలో డిజైన్చేసి ఇస్తున్నారు. ఫ్యామిలీ ఫొటో ఆల్బమ్ డిజైన్చేయడం నుండి మనం టీ, కాఫీ తాగే కప్ పై ఫొటోస్ వేయడం టీ షర్ట్స్ పైన ఫొటోస్ వేయడం కీ చైన్స్ పైన మనకు నచ్చిన ఫొటోస్ ఇవ్వడం ఇలా ఏ వస్తువు అయితే ఆ వస్తువు పైన ఫొటోస్ వేయడం ఈ మధ్యకాలంలో ఒక ఫ్యాషన్ అయిపోయింది.యువతీ, యువకులు కూడా ఇలాంటివి గిఫ్ట్‌గా ఇవ్వడానికి చాలా...


ఎన్టీఆర్ ఫ్యాన్స్ అదిరే గుడ్ న్యూస్.. తెలిస్తే ఎగిరి గంతేస్తారు..

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటించి ప్యాన్ ఇండియా రేంజ్‌లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు. ఆ సినిమాలో ఆయన కొమురం భీమ్ పాత్రలో ఒదిగిపోయారు. ఇక ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకుడు.. జాన్వీ హీరోయిన్‌గా చేస్తోంది. ఈ సినిమా ఏప్రిల్ 5న వస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ సినిమా వాయిదా పడింది. Photo : Twitter కాగా ఈ చిత్రానికి సంబందించిన రిలీజ్ డేట్ పై మేకర్స్ సరికొత్త అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 10, 2024 న వరల్డ్ వైడ్‌గా థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా తెలిపారు. అనిరుద్ రవి చందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను యువ సుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లపై సుధాకర్ మిక్కిలినేని, కే. హరికృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుంది. సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ అక్టోబర్ 10, 2024 న వరల్డ్ వైడ్‌గా థియేటర్లలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. Photo : Twitter ఇక మరో వైపు ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్‌తో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం అయితే ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏప్రిల్ నుంచే సినిమా మొదలు కావాల్సి ఉంది కాని పలు కారణాలతో అది సాధ్య పడలేదు. అయితే ఇప్పుడు సినిమా షూట్ ఎప్పుడు అనే దానిపై లేటెస్ట్ అప్ డేట్ వచ్చింది. దాని ప్రకారం ఎన్టీఆర్-నీల్ సినిమా ఈ ఏడాది ఆగస్టు నుంచి మొదలు కానున్నట్టుగా తెలుస్తోంది. ఈలోపు ఎన్టీఆర్ “వార్ 2” లో తన పాత్ర పోర్షన్‌ను కంప్లీట్ చేసుకుంటారట. ఇక మరోవైపు హృతిక్ రోషన్‌తో కలిసి వార్ 2 అనే మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూట్ ఇప్పటికే ప్రారంభం అవ్వగా, హృతిక్ రోషన్ పై దర్శకుడు అయాన్ ముఖర్జీ ఇప్పటికే పలు సీన్స్ చిత్రీకరించారు. ఇక ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. సినిమా కోసం ఎన్టీఆర్ ఏకంగా 35 కోట్ల రూపాయల పారితోషికంను అందుకోబోతున్నట్లుగా టాక్. అంతే కాకుండా తెలుగు డబ్బింగ్ రైట్స్ విషయంలో కూడా లాభాల్లో వాటాను దక్కించుకునేలా ఒప్పందం కుదిరినట్లుగా టాక్ నడుస్తోంది. Photo : Twitter ఇక దేవర సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమా ఓవర్ సీస్ డీల్ ఆల్ మోస్ట్ క్లోజ్ అయినట్లు తెలుస్తోంది. దేవర సినిమా ఓవర్సీస్ రైట్స్‌ 27 కోట్ల మేరకు క్లోజ్ అయ్యి బజ్ వినిపిస్తోంది. ఇక నైజాలో మాత్రం 50 కోట్ల రేంజ్‌లో రేట్ కోట్ చేస్తున్నారట నిర్మాతలు.. అయితే ఈ రైట్స్ కోసం దిల్ రాజు గట్టిగానే ప్రయత్నం చేస్తు్న్నారట. అంతేకాదు దాదాపుగా దిల్ రాజు డీల్ క్లోజ్ చేసినట్లు టాక్ నడుస్తోంది. . Photo : Twitter ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ నిర్మిస్తోంది. జాన్వీ హీరోయిన్‌గా చేస్తోంది. భారీ అంచనాలపై వస్తున్న ఈ సినిమాపై నెక్స్ట్ లెవల్‌లో అంచనాలున్నాయి. రెండు పార్ట్‌లుగా వస్తోంది. ఇక మొదటి భాగం దసరాకు అక్టోబర్‌లో విడుదల కానుందని ప్రకటించారు. . Photo : Twitter ఇక ఈ చిత్రం ఓటీటీ హక్కులను దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు దక్కించుకుంది. తెలుస్తోన్న సమాచారం మేరకు ఈ సినిమా ఓటీటీ హక్కులని నెట్ ఫ్లిక్స్ ఏకంగా 155 కోట్ల రూపాయలు చెల్లించి సొంతం చేసుకున్నట్టుగా ఓ టాక్ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ సినిమాలో ఇప్పటికే కీలక పాత్రలో రమ్యకృష్ణని తీసుకోబోతున్నారట దర్శక నిర్మాతలు. ఎన్టీఆర్‌కి అత్త క్యారెక్టర్‌లో రమ్యకృష్ణ కనిపించనున్నారని తెలుస్తోంది. గతంలో కూడా ఇలానే ఎన్టీఆర్, రమ్యకృష్ణలు నా అల్లుడు సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఇక లేటెస్ట్‌గా ఈ సినిమాలో ఎన్టీఆర్ అక్క పాత్ర కోసం మంచు లక్ష్మిని ఎంపిక చేసినట్లు సమాచారం అందుతోంది. ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ చాలా కీలకంగా ఉంటుందట. దీనికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Photo : Twitter ఈ సినిమా ఇండియన్ భాషాల్లోనే కాకుండా.. జపనీస్, చైనీస్ ఇలా దాదాపుగా ఓ తొమ్మిది భాషాల్లో విడుదలకానుందట. అందుకు తగ్గట్లుగానే కథను రెడీ చేస్తున్నారట దర్శకుడు కొరటాల. ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్‌కు ఇటు ఇండియాలోనే కాకుండా అటు వెస్ట్రన్ కంట్రీస్‌లోను క్రేజ్ ఏర్పడింది. దీంతో టీమ్ భారీగా ప్లాన్ చేస్తున్నట్లు టాక్ .ఇక ఈ ఇద్దరి కాంబినేషన్‌లో జనతా గ్యారేజీ వచ్చి మంచి విజయం సాధించింది. ఇక రెండో సారి ఈ కాంబినేషన్‌లో సినిమా అనగానే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. Photo : Twitter ఇక ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ సినిమా ఆర్ ఆర్ ఆర్ విషయానికి వస్తే.. ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) (Roudram Ranam Rudhiram) పేరుతో (NTR) ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు (Ram Charan) ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామా వచ్చిన సంగతి తెలిసిందే. అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా 2022మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి విజయం సాధించింది. Photo : Twitter ఈ సినిమాలో (NTR, Ram Charan) ఎన్టీఆర్, రామ్ చరణ్‌లుతెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేశారు. వీరికి జంటగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, హిందీ నటి ఆలియా భట్ (Olivia Morris, Alia Bhatt) నటించారు. అజయ్ దేవ్‌గణ్ కథను మలుపు తిప్పే కీలక పాత్రలో కనిపించారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు. సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం అందించారు.. Photo : Twitter


Krishna Mukunda Murari Today ఏప్రిల్ 19 ఎపిసోడ్: ‘చచ్చిపోతానేమో అత్తయ్యా’ కృష్ణ చివరి మాటలు.. ముకుంద చావుదెబ్బ!

Krishna Mukunda Murari Today Episode: ముకుంద అనుకున్నంత పని చేసింది. పాపం కృష్ణ చివరి క్షణంలో మాట్లాడిన మాటలు అల్లాడిస్తున్నాయి. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. (photo courtesy by star maa and disney+ hotstar)


Pushpa 2 The Rule OTT Rights: కళ్లు చెదిరే భారీ రేటుకు అమ్ముడు పోయిన పుష్ప 2 ఓటీటీ రైట్స్.. ఆ విషయంలో తగ్గేదేలే ..

Pushpa 2 The Rule OTT Rights : సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన 'పుష్ప' మూవీతో ప్యాన్ ఇండియా స్టార్‌గా సత్తా చాటాడు. తాజాగా బన్ని బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. పుష్ప సినిమా సక్సెస్‌తో ఇపుడు పుష్ప 2 మూవీ ఓటీటీ రైట్స్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. తాజాగా ఈ సినిమా ఓటీటీ డీల్ క్లోజ్ అయినట్టు సమాచారం.


సత్యం రాజేష్‌ `టెనెంట్‌` మూవీ రివ్యూ, రేటింగ్‌

సత్యం రాజేష్‌ చివరగా `పొలిమేర 2`తో మెప్పించాడు. ఇప్పుడు ఆయన `టెనెంట్‌` చిత్రంతో వచ్చారు. ఈ మూవీ శుక్రవారం విడుదలైంది. సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. సత్యం రాజేష్‌ కమెడియన్‌గా కెరీర్‌ని ప్రారంభించి ఇప్పుడు హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆయన చివరగా `పొలిమేర2`తో అదరగొట్టాడు. ఇప్పుడు తనే మెయిన్‌ లీడ్‌గా `టెనెంట్‌` అనే చిత్రంలో నటించాడు. వై యుగంధర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎస్తేర్‌ కీలక పాత్రలో నటించగా, మేఘా చౌదరి, చందన...


పుట్టిన రోజున ఎర్ర చీరలో ఈషా రెబ్బా.. ముక్కు పుడక పెట్టుకుని ఎంత అందంగా ఉందో చూడండి

వరంగల్ అమ్మాయి అచ్చ తెలుగు పిల్ల ఈషా రెబ్బా క్రేజ్ సోషల్ మీడియాలో మరో స్థాయిలో ఉంటుంది. కానీ ఆమెకి టాలీవుడ్ లో ఆఫర్స్ మాత్రం అంతంత మాత్రమే. వరంగల్ అమ్మాయి అచ్చ తెలుగు పిల్ల ఈషా రెబ్బా క్రేజ్ సోషల్ మీడియాలో మరో స్థాయిలో ఉంటుంది. కానీ ఆమెకి టాలీవుడ్ లో ఆఫర్స్ మాత్రం అంతంత మాత్రమే. అందం,అభినయం ఉన్నప్పటికీ టాలీవుడ్ దదర్శకులు ఆమెని పట్టించుకోవడం లేదు. ఈషా రెబ్బా టాలీవుడ్ లో తాను చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తోంది. గ్లామర్ గా కనిపించడం మాత్రమే కాదు...


టేస్ట్ కోసం నాన్‌వెజ్‌లో ఆ మసాలా వేస్తున్నారా? జాగ్రత్త అందులో పురుగుల మందు ఉందట!

Everest Fish Curry Masala: ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలాని (Everest Fish Curry Masala) భారత్ పెద్ద ఎత్తున సింగపూర్‌కి ఎగుమతి చేస్తోంది. అయితే.. ఉన్నట్టుండి సింగపూర్‌ ఆ మసాలా ప్యాకింగ్‌లను వెనక్కి (Everest Masala Exports) పంపేసింది. అందులో పెస్టిసైడ్స్ ఉన్నాయంటూ సంచలన ఆరోపణలు చేసింది. అందుకే వెనక్కి పంపుతున్నట్టు వెల్లడించింది. ఈ మసాలాలో ethylene oxide మితిమీరి ఉంటోందని, అది చాలా ప్రమాదకరమని తేల్చి చెప్పింది. హాంగ్‌కాంగ్‌లోని Centre for Food Safety...


Hanuman Jayanti 2024: తమలపాకులంటే ఆంజనేయుడికి ఎందుకంత ప్రీతి!

Hanuman Jayanti 2024: పిల్లలకు సూపర్ హీరో...పెద్దలకు ధైర్యాన్నిచ్చే ఆరాధ్య దైవం హనుమంతుడు. గ్రహదోషాల నుంచి విముక్తి పొందేందుకు, ఆయురారోగ్యాలకోసం ఆంజనేయుడికి పూజిస్తారు. ముఖ్యంగా మంగళవారం, శనివారం రోజు హనుమాన్ ని పూజిస్తే శనిబాధల నుంచి విముక్తి కలుగుతుందంటారు. ప్రత్యేక పూజలో భాగంగా కొందరు సింధూరం సమర్పిస్తారు...మరికొందరు వడమాల వేస్తారు..ఇంకొందరు తమలపాకులతో పూజచేస్తారు. ముఖ్యంగా ఆంజనేయుడికి తమలపాకులంటే ఎందుకంత ఇష్టం...దీని గురించి పురాణాల్లో ఓ కథ...


Udhayanidhi Stalin | తన భార్యతో కలిసి ఓటు వేసిన ఉదయనిధి స్టాలిన్

ఉదయనిధి స్టాలిన్ ఆయన భార్య చెన్నైలో ఓటు వేశారు


Principal Facial In Classroom: స్కూల్ లో అమ్మాయిలతో ఫెషియల్ చేయించుకున్న ప్రిన్స్ పాల్.. వైరల్ వీడియో..

Principal Facial In Classroom: ఒక లేడీ ప్రిన్స్ పాల్ స్కూల్ లో విద్యార్థినులతో ఫెషియల్ చేయించుకుంది. దీన్ని మరో టీచర్ గమనించి వీడియో రికార్డు తీయడానికి ప్రయత్నించింది. ఈక్రమంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.


Fake Doctorate Scam: డాక్టరేట్ ఇస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా లేకపోతే ఇక అంతే!

Fake Doctorate Scams: హైదరాబాద్​లో ఫేక్​ డిగ్రీ స్కామ్​ జోరుగా సాగుతున్నట్టు కనిపిస్తోంది! ఇందుకు సంబంధించిన ఓ ఘటన.. తాజాగా వెలుగులోకి వచ్చింది.


అయ్యోపాపం : వడదెబ్బతో తెల్ల పులి స్నేహ చనిపోయింది

అయ్యోపాపం : వడదెబ్బతో తెల్ల పులి స్నేహ చనిపోయింది వృద్ధాప్య వ్యాధులతో పాటుగా వడదెబ్బతో తెల్ల పులి స్నేహ చనిపోయింది.  భువనేశ్వర్ నగర శివార్లలోని నందన్‌కానన్ జూలాజికల్ పార్క్‌లోని 14 ఏళ్ల తెల్లపులి స్నేహ శుక్రవారం మరణించినట్లు అధికారులు తెలిపారు.  తెల్లపులి ఏప్రిల్  18వ తేదీ  గురువారం అస్వస్థతకు గురి కావడంతో  మందులు వాడమని సెలైన్ కూడా ఎక్కి్ంచినట్లుగ...


Samantha: సమంత రోజుకు ఒక బోల్డ్ ఫోటోషూట్.. ఇదేందయ్యా ఇది అంటోన్న అభిమానులు

Samantha: సమంత రోజుకు ఒక బోల్డ్ ఫోటోషూట్.. ఇదేందయ్యా ఇది అంటోన్న అభిమానులు


మై డియర్ దొంగ రివ్యూ, ప్రియుడితో పూజా హెగ్డే పెళ్లి? - నేటి టాప్ సినీ విశేషాలివే!

Abhinav Gomatam, Shalini Kondepudi and Divya Sripada's My Dear Donga movie review in Telugu: కథ ఎలాగున్నా, క్యారెక్టర్ ఏదైనా తనదైన కామెడీ టైమింగ్, నటనతో ప్రేక్షకులను నవ్విస్తున్నారు అభినవ్ గోమఠం. ఓటీటీలోనూ మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. 'సేవ్ ద టైగర్స్'తో హిట్ అందుకున్నారు. ఆయన హీరోగా నటించిన సినిమా 'మై డియర్ దొంగ'. శాలినీ కొండెపూడి హీరోయిన్. అన్నట్టు... ఆవిడే రైటర్ కూడా! ఆహా ఓటీటీ ఒరిజినల్ చిత్రమిది. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. (పూర్తి...


Success story : కానిస్టేబుల్ టు సివిల్స్ .. ఈ ర్యాంకర్ స్టోరీలో ఇన్ని ట్విస్టులా .. తెలుసు

యూపీఎస్సీ సివిల్ ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. అయితే ఈ ఫలితాలలో సామాన్య కుటుంబాల నుండి వచ్చిన వారే రాణించి .. ప్రతిభ ఉంటే చాలు ఏదైనా సాధించవచ్చని నిరూపించారు. వీరిలో ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా కు చెందిన ఉదయ్ కృష్ణారెడ్డి ఒకరని చెప్పవచ్చు. ఈయన మూడు సార్లు యూపీఎస్సీ కి ప్రయత్నించి, నాలుగవ సారి 780వ ర్యాంక్ ను సాధించారు. అసలు ఈయన వ్యక్తి గత జీవితాన్ని తెలుసుకుంటే కళ్లు చమ్మగిల్లాల్సిందే. అంతేకాదు ఓ అధికారి తనను అవమానించినందుకు పోలీస్...


పిచ్చి డబుల్‌ చేసిన నాగవంశీ.. `మ్యాడ్‌ స్వ్కేర్‌` స్టార్ట్.. టిల్లు సెంటిమెంట్‌ వర్కౌట్‌ అవుతుందా?

నిర్మాత నాగవంశీకి లాభాల పంట పండుతుంది. `టిల్లు స్వ్కేర్‌`తో ఆయన మూడు రెట్లు లాభాలను పొందారు. తమ మ్యానర్లలో వచ్చిన `గుంటూరు కారం`, `ఆది కేశవ` చిత్రాలు ఘోర పరాజయం చెందడంతో ఆ నష్టాలను `టిల్లు స్వ్కేర్‌` భర్తీ చేసిందని చెప్పొచ్చు. ఈ సక్సెస్‌ జోరులో ఉన్న నిర్మాత నాగవంశీ ఇప్పుడు మరో సక్సెస్‌ ఫుల్‌ మూవీకి సీక్వెల్‌ని ప్రకటించారు. `టిల్లు` సెంటిమెంట్‌ని ఫాలో అవుతూ `మ్యాడ్‌ స్వ్కేర్‌`ని ప్రారంభించారు. పిచ్చిని డబుల్ చేయబోతున్నారు. గతేడాది వచ్చిన...


మినీ లడ్డూలు సిద్ధం చేస్తున్న టీటీడీ... ఎందుకో తెలుసా?

ఒంటిమిట్ట శ్రీ సీతా రాముల‌ కల్యాణానికి విచ్చేసే భ‌క్తుల‌కు అందించేందుకు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలు సిద్ధమయ్యాయి. తిరుమలలోని శ్రీవారి సేవా సదన్ – 1లో శ్రీవారి సేవ‌కుల‌ సహకారంతో మినీ (25 గ్రాముల) లడ్డూల ప్యాకింగ్‌ను శుక్ర‌వారం నిర్వహించారు. డిప్యూటీ ఈవో (జనరల్‌) శ్రీ శివప్రసాద్‌, పోటు ఏఈవో శ్రీనివాసులు ఆధ్వర్యంలో దాదాపు 250 మంది మహిళా, పురుష శ్రీ‌వారి సేవ‌కులు 1.20 ల‌క్ష‌ల లడ్డూలను 60 వేల జిప్‌లాక్‌ ప్యాకెట్లలో ఒక్కో ప్యాక్‌లో రెండు లడ్డూలు ఉంచారు. కడప జిల్లా ఒంటిమిట్టలో జరుగుతున్న శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 22వ తేదీ సాయంత్రం 6:30 నుంచి 8:30 గంటల మధ్య అత్యంత వైభ‌వంగా జరిగే రాష్ట్ర పండుగ శ్రీ సీతా రాముల‌ కల్యాణంలో పాల్గొనే భక్తులకు ఈ లడ్డూలను ప్రసాదంగా అందజేయనున్నారు. ఏప్రిల్ 22న జరగబోయే శ్రీ సీతారాముల కల్యాణాన్ని వైభ‌వంగా నిర్వహించేందుకు టీటీడీ, జిల్లా యంత్రాగం ఏర్పాట్లు చేస్తోంది. కల్యాణానికి వ‌చ్చే భక్తులకు అన్న‌ప్ర‌సాదాలు, తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లు, విరివిగా అందేలా ఏర్పాట్లు చేస్తోంది. కౌంట‌ర్ల‌లోను, గ్యాల‌రీల‌లో ఉన్న భ‌క్తులకు ప్ర‌సాదాల పంపిణీకి అవ‌స‌ర‌మైనంత మంది శ్రీ‌వారి సేవ‌కుల‌ను సిద్ధం చేస్తోంది టీటీడీ. ఈ ఏడాది భక్తులకు కావాల్సిన అన్ని రకాల వసతులను శాశ్వ‌త ప్రాతిపదికన నిర్మించడం విశేషం.


వేడి పుట్టిస్తున్న వేదిక.. నలభై దాటినా నాజూకుగానే ఉందిగా!

నలభై ఏళ్లు దాటినా నాజూకైన సొగసులతో వేదిక కుర్రాళ్లకు వేడి పుట్టిస్తోంది. అన్ని భాషల్లో సినిమాలు చేస్తున్న ఈ భామ తాజాగా రజాకార్‌లో కనిపించింది.


అయ్య బాబోయ్! భారీ ఎద సౌందర్యాన్ని కెమెరా ముందు పెట్టేసిన రొమాంటిక్ భామ

కొందరు సినీ తారలు వెండితెరపై అందాలు ఆరబోసి కుర్రాళ్ళ గుండెల్లో స్థిరపడిపోతుంటారు. కొన్ని సినిమాలే చేసినా ఎప్పటికీ గుర్తుండిపోతారు. హీరోయిన్ కేతిక శర్మ కూడా ఆ కేటగిరీకి చెందినదే. భారీ ఎద అందాలతో యూత్ లో హై వోల్టేజ్ తీసుకురావడం ఈ బ్యూటీ ప్రత్యేకత. పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాష్ హీరోగా వచ్చిన ‘రొమాంటిక్’ మూవీతో తెలుగు సినిమాలకు పరిచయం అయ్యింది కేతిక శర్మ. ఈ సినిమా ఆ మధ్య విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. నటనతోనే కాకుండా తన అందచందాలతో వావ్ అనిపించింది ఈ ఉత్తరాది భామ. ఆ మధ్య తెలుగులో ‘రంగరంగ వైభవంగా’ సినిమాతో పలకరించింది కేతిక. ఈ సినిమా అట్టర్ ఫ్లాప్‌తో ఈ భామ ఆశలు ఆవిరయ్యాయి. రీసెంట్ గా పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో వచ్చిన బ్రో.. ది అవతార్‌లో నటించింది. నాగ శౌర్య హీరోగా వచ్చిన లక్ష్యలో నటించింది కేతిక. ఆ సినిమా పెద్దగా ఆడలేదు. ఆ మధ్య సుమంత్ హీరోగా వచ్చిన సుబ్రమణ్యపురం సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న సంతోష్ జాగర్లమూడి ఈ సినిమాకు దర్శకుడు. విలువిద్య నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ఓ రేంజ్‌లో ఆకట్టుకుంటుందని భావించారు. అంతేకాదు ఇప్పటి వరకు తెలుగులో ఈనేపథ్యంలో ఎక్కువగా సినిమాలు రాలేదు. అయితే సినిమాలో సరైనా కథ లేకపోవడంతో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కేతిక నటించిన మరో సినిమా రంగ రంగ వైభవంగా. ఈ మూవీ 2022సెప్టెంబర్ 2న విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అంతేకాదు వైష్ణవ్ తేజ్ కెరీర్‌లో చేసిన టోటల్ మూడు సినిమాల్లో ఈ సినిమానే వీక్ ఓపెనింగ్స్ ని అందుకుంది. ఇలా కేతిక శర్మ నటించిన ప్రతి సినిమా డిజాస్టర్ అవుతుండటంతో ఈ భామకు అవకాశాలే కరువైయ్యాయి. ఇక అది అలా ఉంటే.. ఈ భామ తాజాగా కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ ఫోటోల్లో మాత్రం అందాల విందు చేసింది. దీంతో నెటిజన్స్ ఈ ఫోటోలపై రకరకాలుగా స్పందిస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ భామ.. ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ.. కుర్రాళ్ల మతి పోగొడుతోంది. దీంతో అమ్మడి ఫాలోయింగ్ పెరుగుతూ వస్తోంది.


Nandamuri Balakrishna: నామినేషన్ వేసిన బాలయ్య.. అఫిడవిట్లో మోక్షజ్ఞ ఆస్తి ఎంత చూపించారో తెలుసా?

Nandamuri Balakrishna: తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ మూడోసారి నామినేషన్‌ దాఖలు చేశారు. తన భార్య వసుంధరతో కలిసి హిందూపురం ఆర్వో కార్యాలయంలో రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలు ఇచ్చారు.


Mad Square Movie: 'మ్యాడ్ స్క్వేర్' ప్రారంభోత్సవానికి అతిథిగా 'టిల్లు స్క్వేర్' - సేమ్ సెంటిమెంట్ కంటిన్యూ చేస్తూ...

'మ్యాడ్' (Mad Movie)... కాలేజీ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. కాలేజ్ లైఫ్, యూత్ చేసే ఫన్, ఆ కామెడీ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. దాంతో సినిమా మంచి విజయం సాధించింది. దాంతో ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ 'మ్యాడ్ స్క్వేర్' (Mad Square Movie)ను స్టార్ట్ చేసింది ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్. 'మ్యాడ్ స్క్వేర్' సినిమాలోనూ సేమ్ హీరోలు!Mad Square Movie Cast And Crew: 'మ్యాడ్'లో మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిది...


జిమ్‌లో మృణాల్ ఠాకూర్ వ‌ర్కౌట్స్... వీడియో చూస్తే నవ్వకుండా ఉండలేరు

ఎప్పుడూ సరదాగా నవ్విస్తూ, నవ్వుతూ తెరముందు,వెనక ఉండే హీరోయిన్స్ కు,హీరోలకు ఉండే స్టార్డమ్ ఎక్కువ. వారికి లాంగ్ లైఫ్ కెరీర్ లో ఉంటుంది. ఆ విషయం తెలుసుకున్న హీరోయిన్స్ సోషల్ మీడియాలో తమ అభిమానులకు టచ్ లో ఉంటూ ఎప్పుటికప్పుడు వారిని ఎంగేజ్ చేసే వీడియోలు పెడుతున్నారు. ముఖ్యంగా హీరోయిన్స్ జిమ్ వర్కింగ్ వీడియోలకు భలే డిమాండ్. అందులోనూ ఫామ్ లో ఉన్న హీరోయిన్స్ వీడియోలు అయితే చెప్పక్కర్లేదు. తాజాగా 'సీతారామం' హీరోయిన్ మృణాల్ ఠాకూర్‌ ఓ వీడియో షేర్ చేసింది....


దావత్ అంటే తాగుడేనా .. తాగితినే దోస్తువురా

దావత్ అంటే తాగుడేనా .. తాగితినే దోస్తువురా చిన్న పిలగాళ్ల నుంచి పండు ముసలోళ్ల దాకా అందరికీ సెలబ్రేషన్ కావాల్సిందే. లైఫ్ అన్నంక ఎవరి లెవెల్లో వాళ్లు సెలబ్రేట్ చేసుకోవాల్సిందే. అయితే, తాగి పడిపోవడం ఏం సెలబ్రేషన్? దాంట్లో ఏం ఆనందం ఉంది? 'లిక్కర్ లేకుంటే సెలబ్రేషనే కాదు' అన్నట్టు ఇయ్యాల దావత్ కి అర్థం మారిపోయింది. 'దావత్ వితవుట్ దారు' అనేదే ఉండదా? ఒక ఊ...


Allu Arjun: బాలీవుడ్ హీరోలను బీట్ చేసిన బన్నీ - 1000 కోట్లు ఏంటి సామి? నంబర్ వన్ రేసులో దూసుకెళ్తున్న బన్నీ

ఆల్ టైమ్ రికార్డ్... పాన్ ఇండియా రేంజ్‌లో ఆల్ టైమ్ రికార్డ్ హయ్యస్ట్ క్రియేట్ చేశాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. 'పుష్ప 2' సినిమా (Pushpa 2 Movie)తో ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా కొత్త రికార్డులు లిఖించాడు. బాలీవుడ్ హీరోలను బీట్ చేశాడు. హిందీలో ఖాన్ హీరోలకు, పాన్ ఇండియాలో పాపులారిటీ సొంతం చేసుకున్న దర్శకులు రాజమౌళి, ప్రశాంత్ నీల్ వంటి వాళ్లకు సాధ్యం కానీ రికార్డును బన్నీ క్రియేట్ చేశారు. 1000 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ఏంటి సామి...బాలీవుడ్ బడా...


వెడ్డింగ్ కార్డ్లో తెలంగాణ యాస..పెళ్లి పిలుపులో నయా ట్రెండ్

వెడ్డింగ్ కార్డ్లో తెలంగాణ యాస..పెళ్లి పిలుపులో నయా ట్రెండ్ జగిత్యాల:  ఈనెల 20న మా సిన్న కొడుకు లగ్గం.. యాదించుకొని పిల్లా, జెల్లా, ముసలి, ముత్క అందరూ వచ్చి మా పిల్లా, పిలగాన్కి  దీవెనార్తి ఇచ్చి కడుపు నిండా తిని పోతే మా దిల్ కుష్ అయితది" అంటూ తెలంగాణ యాస ఉట్టిపడేలా ఉన్న ఒక పెళ్లి పత్రిక సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. లగ్గం యాడనో ఎర్కన అంటూ  ప్రదే...


Prabhas: వెనక్కితగ్గిన ప్రభాస్ రాజాసాబ్ బృందం.. కల్కి సినిమానే కారణం!

The Raja Saab Update: సలార్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో ముందుకు దూసుకుపోతున్నారు. చేతిలో ఇప్పుడు బోలెడు సినిమాలు ఉన్న ప్రభాస్ మారుతీ దర్శకత్వంలో ది రాజా సాబ్ సినిమా చేయాల్సి ఉంది. తాజా సమాచారం ప్రకారం కల్కి2898AD సినిమా కోసం ది రాజా సాబ్ చిత్ర బృందం కావాలని సినిమా కి సంబంధించిన అప్డేట్స్ ఇవ్వడంలేదని తెలుస్తోంది.


సీతమ్మ కోసం శ్రీరాముడు స్వయంగా ప్రతిష్టించిన శివలింగం ఇది.. ఎక్కడుందో తెలుసా..?

సీతారాముల వనవాసం చేస్తున్న సమయంలో సీతమ్మ తల్లి.. పూజ చేసేందుకు శ్రీరాముడు స్వయంగా ఓ శివలింగాన్ని ప్రతిష్టించారు. ఇంతకీ ఈ ఆలయం ఎక్కడ ఉందో తెలుసా. స్వయంగా శ్రీరాముడు ప్రతిష్టించిన శివలింగం ఇది. త్రేతాయుగంలో శ్రీరాముడు, సీతా సమేతంగా వనవాసం చేస్తున్న సమయంలో సీతమ్మ పూజ కోసం రాముడు ఇసుకతో శివలింగాన్ని తయరు చేసారట. ఆ శివలింగమే ఈ లొంక రామాలింగేశ్వర స్వామి ఆలయంలో వెలసినదిగా చరిత్ర చెబుతోంది. వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయం. చుట్టుదట్టమైన అడవిలో ఉండడమే లొంక రామాలింగేశ్వర ఆలయం ప్రత్యేకత . నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని దట్టమైన అటవీ ప్రాంతంలోని శ్రీ లొంక రామలింగేశ్వర స్వామి ఆలయం ఉంది. వందల యేళ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయంలో ప్రతి మహా శివరాత్రికి మూడు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. అయితే త్రేతాయుగంలో శ్రీరాముడు సీతా సమేతంగా వనవాసం చేస్తున్న సందర్భంలో ఈ లంక ప్రాంతానికి వచ్చినట్టుగా చరిత్ర చెబుతుంది. శ్రీరాముడి పాదాలు ఓ రాతి పై ఉన్నాయి. సీత, రాములు వనవాసం సమయంలో సూర్యాస్తమయం కావడంతో ఇక్కడే రాత్రికి బస చేసి ఉదయం సీతమ్మ పూజ చేసుకునేందుకు శ్రీరాముడు ఇసుకతో లింగాన్ని తయారుచేసి ఇచ్చినట్టు పురాణాలు చెపుతోంది. ఇప్పటికీ శ్రీరాముడి చేతుల మీదుగా తయారుచేసిన శివలింగమే.. శ్రీ లొంక రామలింగేశ్వర స్వామిగా ప్రాచుర్యం పొందుతుందని ఆలయ పురోహితులు నాగరాజు చెబుతున్నారు. ఈ ఆలయంలో మహా శివరాత్రి సమయంలో మూడు రోజులు పాటు ప్రత్యేక పూజలు చేస్తామని తెలిపారు. ప్రతి సోమవారం స్వామివారికి పుజలు నిర్వహించి అన్నప్రసాదం పంచి పెడుతామని ఆయన వివరించారు. ఎంతో మహిమ గల లంకరామయ్యను భక్తితో కొలిస్తే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం. భక్తులు కోరిన కోరికలు తీరడంతో స్వామివారికి వారి శక్తి కొలది కానుకలు సమర్పిస్తారన్నారు. మూడు కిలో మీటర్లు పూర్తిగా అడవి ప్రాంతం, కాలువలు, ఎత్తు పల్లాలుగా ఉన్న రహదారిని ఇటీవల ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.