OTT: ఒక చిన్న ట్విస్ట్తో వేల కోట్లు వసూలు చేసిన తెలుగు సినిమా.. ఇప్పటికీ సంచలనమే..!
2015లో విడుదలైన ఓ టాలీవుడ్ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించింది. తెలుగులోనే కాదు.. విడుదలైన అన్ని భాషల్లోనూ బీభత్సం సృష్టించింది. అద్భుతమైన కథ, కథనంతో ప్రేక్షకులను కట్టిపడేయడమే కాదు.. దేశవ్యాప్తంగా అందరినీ కన్ఫ్యూజన్లో పడేసింది. ఆ సినిమా మరేదో కాదు.. బాహుబలి. ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన ఈమూవీ.. 2015 జూలై 10న థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా ప్రేక్షకులకు ఎంతగా నచ్చిందంటే.. రూ. 180 కోట్లతో నిర్మిస్తే.. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.650 కోట్లు రాబట్టింది. ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించింది. అదే సమయంలో ప్రేక్షకులను కన్ఫ్యూజన్లో పడేసింది. 'కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు' అనే పెద్ద ప్రశ్న ఎదురైంది. అప్పట్లో ఈ ప్రశ్న దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఏళ్ల తరబడి ఈ ప్రశ్నకు సమాధానం దొరకలేదు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ప్రశ్నతో బాహుబలి మూవీ ట్విటర్లోనూే ట్రెండింగ్ లో నిలిచింది. చివరికి ఈ ప్రశ్నకు ప్రేక్షకులకు సమాధానం దొరికింది. కానీ రెండేళ్ల నిరీక్షణ తర్వాత.. ఆ ట్విస్ట్ రివీల్ అయింది. 2017లో బాహుబలి-2 విడుదలయిన తర్వాత కట్టప్ప..బాహుబలిని ఎందుకు చంపాడన్న ప్రశ్నకు సమాధానం లభ్యమైంది. ఈ మూవీలో కట్టప్ప బాహుబలికి చాలా ప్రత్యేకమైన వ్యక్తి. కానీ సినిమా క్లైమాక్స్లో బాహుబలిని అదే కట్టప్ప చంపేస్తాడు. అక్కడితో మూవీ ముగుస్తుంది. కట్టప్ప ఎందుకు చంపాడన్నది రెండో పార్ట్లో చూపించారు. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఈ బాహుబలి మూవీ... టాలీవుడ్తో పాటు తమిళ భాషల్లో ఏకాకలంలో తెరకెక్కింది. మలయాళం, కన్నడ, హిందీలోనూ డబ్ చేశారు. పాస్ట్ పార్ట్లో ఉన్న ఈ ట్విస్ట్తో రెండో పార్ట్పై ఆసక్తి పెరిగి.. ఏకంగా 1800 కోట్లు వసూళ్లు చేసింది. బాహుబలి సినిమాల్లో ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా ఇప్పటికీ జనాల ఫస్ట్ ఛాయిస్గా మిగిలిపోయింది. తెలుగులో మరే సినిమా కూడా బాహుబలి రికార్డులను అందుకోలేకపోయాయి. ఈ చిత్రాలు ప్రస్తుతం హాట్ స్టార్, నెట్ ఫ్లిక్స్లో అందుబాటులో ఉన్నాయి.
2024-04-19T11:43:25Z
ఎన్టీఆర్ ఫ్యాన్స్ అదిరే గుడ్ న్యూస్.. తెలిస్తే ఎగిరి గంతేస్తారు..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటించి ప్యాన్ ఇండియా రేంజ్లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు. ఆ సినిమాలో ఆయన కొమురం భీమ్ పాత్రలో ఒదిగిపోయారు. ఇక ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకుడు.. జాన్వీ హీరోయిన్గా చేస్తోంది. ఈ సినిమా ఏప్రిల్ 5న వస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ సినిమా వాయిదా పడింది. Photo : Twitter కాగా ఈ చిత్రానికి సంబందించిన రిలీజ్ డేట్ పై మేకర్స్ సరికొత్త అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 10, 2024 న వరల్డ్ వైడ్గా థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా తెలిపారు. అనిరుద్ రవి చందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను యువ సుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లపై సుధాకర్ మిక్కిలినేని, కే. హరికృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ అక్టోబర్ 10, 2024 న వరల్డ్ వైడ్గా థియేటర్లలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. Photo : Twitter ఇక మరో వైపు ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్తో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం అయితే ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏప్రిల్ నుంచే సినిమా మొదలు కావాల్సి ఉంది కాని పలు కారణాలతో అది సాధ్య పడలేదు. అయితే ఇప్పుడు సినిమా షూట్ ఎప్పుడు అనే దానిపై లేటెస్ట్ అప్ డేట్ వచ్చింది. దాని ప్రకారం ఎన్టీఆర్-నీల్ సినిమా ఈ ఏడాది ఆగస్టు నుంచి మొదలు కానున్నట్టుగా తెలుస్తోంది. ఈలోపు ఎన్టీఆర్ “వార్ 2” లో తన పాత్ర పోర్షన్ను కంప్లీట్ చేసుకుంటారట. ఇక మరోవైపు హృతిక్ రోషన్తో కలిసి వార్ 2 అనే మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూట్ ఇప్పటికే ప్రారంభం అవ్వగా, హృతిక్ రోషన్ పై దర్శకుడు అయాన్ ముఖర్జీ ఇప్పటికే పలు సీన్స్ చిత్రీకరించారు. ఇక ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. సినిమా కోసం ఎన్టీఆర్ ఏకంగా 35 కోట్ల రూపాయల పారితోషికంను అందుకోబోతున్నట్లుగా టాక్. అంతే కాకుండా తెలుగు డబ్బింగ్ రైట్స్ విషయంలో కూడా లాభాల్లో వాటాను దక్కించుకునేలా ఒప్పందం కుదిరినట్లుగా టాక్ నడుస్తోంది. Photo : Twitter ఇక దేవర సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమా ఓవర్ సీస్ డీల్ ఆల్ మోస్ట్ క్లోజ్ అయినట్లు తెలుస్తోంది. దేవర సినిమా ఓవర్సీస్ రైట్స్ 27 కోట్ల మేరకు క్లోజ్ అయ్యి బజ్ వినిపిస్తోంది. ఇక నైజాలో మాత్రం 50 కోట్ల రేంజ్లో రేట్ కోట్ చేస్తున్నారట నిర్మాతలు.. అయితే ఈ రైట్స్ కోసం దిల్ రాజు గట్టిగానే ప్రయత్నం చేస్తు్న్నారట. అంతేకాదు దాదాపుగా దిల్ రాజు డీల్ క్లోజ్ చేసినట్లు టాక్ నడుస్తోంది. . Photo : Twitter ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ నిర్మిస్తోంది. జాన్వీ హీరోయిన్గా చేస్తోంది. భారీ అంచనాలపై వస్తున్న ఈ సినిమాపై నెక్స్ట్ లెవల్లో అంచనాలున్నాయి. రెండు పార్ట్లుగా వస్తోంది. ఇక మొదటి భాగం దసరాకు అక్టోబర్లో విడుదల కానుందని ప్రకటించారు. . Photo : Twitter ఇక ఈ చిత్రం ఓటీటీ హక్కులను దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు దక్కించుకుంది. తెలుస్తోన్న సమాచారం మేరకు ఈ సినిమా ఓటీటీ హక్కులని నెట్ ఫ్లిక్స్ ఏకంగా 155 కోట్ల రూపాయలు చెల్లించి సొంతం చేసుకున్నట్టుగా ఓ టాక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో ఇప్పటికే కీలక పాత్రలో రమ్యకృష్ణని తీసుకోబోతున్నారట దర్శక నిర్మాతలు. ఎన్టీఆర్కి అత్త క్యారెక్టర్లో రమ్యకృష్ణ కనిపించనున్నారని తెలుస్తోంది. గతంలో కూడా ఇలానే ఎన్టీఆర్, రమ్యకృష్ణలు నా అల్లుడు సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఇక లేటెస్ట్గా ఈ సినిమాలో ఎన్టీఆర్ అక్క పాత్ర కోసం మంచు లక్ష్మిని ఎంపిక చేసినట్లు సమాచారం అందుతోంది. ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ చాలా కీలకంగా ఉంటుందట. దీనికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Photo : Twitter ఈ సినిమా ఇండియన్ భాషాల్లోనే కాకుండా.. జపనీస్, చైనీస్ ఇలా దాదాపుగా ఓ తొమ్మిది భాషాల్లో విడుదలకానుందట. అందుకు తగ్గట్లుగానే కథను రెడీ చేస్తున్నారట దర్శకుడు కొరటాల. ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్కు ఇటు ఇండియాలోనే కాకుండా అటు వెస్ట్రన్ కంట్రీస్లోను క్రేజ్ ఏర్పడింది. దీంతో టీమ్ భారీగా ప్లాన్ చేస్తున్నట్లు టాక్ .ఇక ఈ ఇద్దరి కాంబినేషన్లో జనతా గ్యారేజీ వచ్చి మంచి విజయం సాధించింది. ఇక రెండో సారి ఈ కాంబినేషన్లో సినిమా అనగానే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. Photo : Twitter ఇక ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ సినిమా ఆర్ ఆర్ ఆర్ విషయానికి వస్తే.. ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) (Roudram Ranam Rudhiram) పేరుతో (NTR) ఎన్టీఆర్, రామ్ చరణ్లు (Ram Charan) ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామా వచ్చిన సంగతి తెలిసిందే. అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా 2022మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి విజయం సాధించింది. Photo : Twitter ఈ సినిమాలో (NTR, Ram Charan) ఎన్టీఆర్, రామ్ చరణ్లుతెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేశారు. వీరికి జంటగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, హిందీ నటి ఆలియా భట్ (Olivia Morris, Alia Bhatt) నటించారు. అజయ్ దేవ్గణ్ కథను మలుపు తిప్పే కీలక పాత్రలో కనిపించారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు. సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం అందించారు.. Photo : Twitter
2024-04-19T11:12:58Z