వృద్ధురాలిని చంపి ఆమె మాంసం తిన్న యువకుడు.. నిందితుడి ముఖమంతా రక్తమే

జైపూర్: రాజస్తాన్‌లో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. 24 ఏళ్ల ఓ యువకుడు వృద్ధురాలిని చంపేశాడు. ఆ తర్వాత నింపాదిగా ఆమె పక్కన కూర్చుని ఆమె మాంసాన్ని పీక్కు తిన్నాడు. అటు వైపుగా వెళ్లిన ఆమె కొడుకు ఈ ఘటనను చూశాడు. హడలెత్తి పరిగెత్తాడు. ఆ నిందితుడి ముఖమంతా రక్తంతో నిండిపోయి ఉన్నదని ఆయన చెప్పాడు. ఈ ఘటన రాజస్తాన్‌లోని పాలి జిల్లాలో జరిగింది.

నిందితుడు హైడ్రోఫోబియాతో బాధపడుతున్నట్టు అనుమానిస్తున్నారు. ఈ ఫోబియా వారికి నీళ్లను చూస్తే చచ్చే భయం. ర్యాబిడ్ డాగ్ కరిస్తే.. చివరి స్టేజీలోని రేబిస్ ఇన్ఫెక్షన్ వల్ల హైడ్రోఫోబియా ఏర్పడుతుందని చెబుతున్నారు. ఈ వ్యక్తికి కూడా గతంలో అలాంటి కుక్క కరిచి ఉండవచ్చునని, కానీ, సరైన చికిత్స తీసుకోలేదేమో అని బంగార్ హాస్పిటల్ డాక్టర్ సురేంద్ర ఠాకూర్ తెలిపారు.

పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు అందించిన వివరాల ప్రకారం, ఈ ఘటన శారదానా గ్రామంలో (సెంద్రా పోలీసు స్టేషన్ ఏరియా) శుక్రవారం చోటుచేసుకుంది. 65 ఏళ్ల శాంతి దేవి పశువులను మేత కోసం కొట్టుకు వెళ్లింది. అక్కడే నిందితుడు ఆమెను రాయితో కొట్టి చంపేశాడు. 

నిందితుడు మానసికంగా అనారోగ్యంతో ఉన్నాడని, చాలా సార్లు అగ్రెసివ్‌గా బిహేవ్ చేస్తున్నాడని జైతరన్ డీఎస్పీ సుఖ్రామ్ బిష్ణోయ్ వివరించారు. ఆయనను హాస్పిటల్‌లో అడ్మిట్ చేశామని, అక్కడ మెడికల్ ఎగ్జామినేషన్ చేస్తున్నారని తెలిపారు. హాస్పిటల్‌లో కూడా అతను రచ్చ చేశాడని వివరించారు. ఆ తర్వాత నర్సింగ్ స్టాఫ్ ఆయనను బెడ్‌కు కట్టేశారని చెప్పారు.

నిందితుడు ముంబయి నుంచి బస్సులో సెంద్రాకు వచ్చాడని, బస్ టికెట్ ద్వారా దీన్ని నిర్ధారించవచ్చునని ఆయన వివరించారు.

Also Read: వీడీ సావర్కర్‌కు నివాళులు అర్పించిన ప్రధాని మోడీ, లోక్‌సభ స్పీకర్, కేంద్ర మంత్రులు

శాంతి దేవి కొడుకు బైరెన్ కథాట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘నేను కూడా మేకలను మేతకు తీసుకెళ్లి తిరిగి వస్తుండగా ఓ వ్యక్తి మరణించిన మహిళ శరీరం నుంచి మాంసం తినడాన్ని చూశాను. అది చూసి భయంతో పరుగు పెట్టా. ఆ వ్యక్తి ముఖమంతా నెత్తురుతో నిండిపోయింది’ అని కథాట్ తెలిపారు. ఆ తర్వాత తన తల్లిని ఆ యువకుడే చంపేశాడని కేసు పెట్టాడు.

స్థానికులు కూడా ఆయనను చూడగానే భయపడ్డారు. కానీ, నిందితుడు అక్కడి నుంచి పరిగెత్తే ప్రయత్నం చేయగా.. వెంబడించి పట్టుకున్నారు. పోలీసులకు అప్పగించారు.

2023-05-28T08:46:28Z dg43tfdfdgfd