‘గుప్పెడంత మనసు’ మే 26 ఎపిసోడ్: చించిపారేసిన రిషీ.. శైలేంద్ర, దేవయానీలకు ఫ్యూజులు ఎగిరిపాయే..

Guppedantha Manasu 2023 May 26 Episode: ‘గుప్పెడంత మనసు’ సీరియల్.. నేడు 2023 మే 26న 771 ఎపిసోడ్‌లో అడుగుపెట్టింది. ఇప్పుడు ఆ Guppedantha Manasu May 26 Episode హైలైట్స్ చూద్దాం. (photo courtesy by star maa and disney+ hotstar)

Guppedantha Manasu 2023 May 26 Episode: ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌ రసవత్తరంగా మారింది. మెషిన్ ఎడ్యుకేషన్ చెక్ విషయంలో అభియోగాన్ని రిషి ముందు పెట్టడం.. దాని గురించి వసుని నిలదీయడం.. అప్పటికే వసు.. జగతికి మాటివ్వడం అంతా తెలిసిందే. అదే సీన్ నేటి కథనంలో కంటిన్యూ అయ్యింది. ఇప్పుడు ఆ హైలైట్స్ చూద్దాం. ‘వసుధారా చెప్పు.. మనం ఆ చెక్ ఇష్యూ చేశామా.. సారధికి మనం ఇచ్చామా?’ అంటూ నిలదీస్తాడు అందరి ముందు. అప్పుడే కావాలనే శైలేంద్ర వసుని.. ‘వసుధారా నువ్వైనా చెప్పు.. అది నిజం కాదని చెప్పు.. రిషి తప్పు చేయడు కదా’ అంటూ డ్రామా ప్లే చేస్తాడు. పాపం వసు.. రిషి ప్రాణాలను కాపాడమే ముఖ్యం అనుకుంటూ.. మనసులో అల్లాడిపోతూ ఉంటుంది. ‘వసుధారా అడుగుతున్నారు కదా.. చెప్పు.. మెషిన్ ఎడ్యుకేషన్ విషయంలో ఏ చిన్న తప్పు కూడా చేయం కదా? చెప్పు వసుధార.. చెప్పు’ అంటూ అరుస్తాడు రిషి. ‘చెప్పు వసు.. రిషి సార్ జీవితం నీ చేతుల్లో ఉంది.. ఇలా మౌనంగా ఉంటే కుదరదు.. నోరు తెరిచి నిజం చెప్పు’ అంటూ సైగ చేస్తుంది జగతి వసుకి.

వసుధార... చెప్పు

‘చెప్పు వసుధార నువ్వు ఎవరి గురించి ఆలోచించాల్సిన పనిలేదు.. నిజమే చెప్పు’ అంటాడు మినిస్టర్. ‘వసుధార చెప్పు’ అంటూ అరుస్తాడు రిషి మరోసారి. ‘ఆ చెక్ రిషి సారే ఇచ్చారు’ అంటుంది వసు. రిషి షాక్ అయిపోతాడు. అదే షాక్‌లో పైకి లేస్తాడు. ఆ సమయంలో రిషి ఎక్స్‌ప్రెషన్స్ అల్లాడించేశాయి. ఇక్కడి నుంచే రిషి అసలు నటన మొదలైంది. కళ్లు ఎర్రగా మారి.. నిస్సహాయమైన చూపులు.. కోపం, బాధ.. అన్నింటినీ కలగలిపి చూసించే రిషి(నటుడు ముఖేష్ గౌడ్) నటన ప్రేక్షకుల మనసుల్ని మెలిపెట్టక మానదు.

శైలేంద్ర, దేవయాని నాటకం..

వసు అలా చెప్పగానే ఫణేంద్ర కోపంగా పైకి లేచి.. ‘వసుధారా.. నువ్వు పొరబడుతున్నావ్.. సరిగా గుర్తు చేసుకుని చెప్పు’ అంటాడు. ‘ఏ తప్పు చేయకపోతే ఈ సాక్ష్యాలన్నీ ఏమిటి బావగారు..’ అంటుంది జగతి. ‘లేదు పిన్ని వసుధార అబద్దం చెబుతోంది’ అంటాడు శైలేంద్ర. ‘అబద్దం చెప్పాల్సిన అవసరం తనకేముంది?’ అంటుంది జగతి. ‘అది తనకే తెలియాలి’ అంటుంది దేవయాని. రిషి వసునే చూస్తూ ఉంటాడు. ‘నిజం చెప్పు వసుధార ఎందుకు అబద్దం చెబుతున్నావ్’ అంటాడు శైలేంద్ర కోపంగా.

నిజమే చెబుతున్నా..

అప్పుడే రిషి.. వసుని కోపంగా పైకి లేపి కళ్లల్లోకి చూస్తూ.. ‘నిజం చెప్పు.. నా కళ్లల్లోకి చెప్పు.. నేను ఆ చెక్ ఇచ్చానా?’ అంటాడు రిషి. ‘అవును వసుధార నాకు తెలిసి రిషి అలా చేయడు.. ఇందులో ఏదైనా మతలబు ఉందా?’ అంటాడు మినిస్టర్. వెంటనే వసు రిషి వైపు చూడకుండానే.. కన్నీళ్లతో.. ‘ఏం లేదు సార్.. నిజమే చెబుతున్నాను.. రిషి సారే ఆ చెక్ ఇష్యూ చేశారు’ అంటుంది వసు. వెంటనే రిషి కోపంగా వసుని మరోసారి తనవైపు తిప్పుకుని.. ‘అటు చూసి కాదు నావైపు చూసి చెప్పు.. నా కళ్లల్లోకి చూసి చెప్పు’ అంటాడు రిషి కోపంగా. వసు అల్లాడిపోతుంది.

ముక్కలైన రిషిధార బంధం..

‘చెక్‌ని నేను ఇచ్చానా.. నా కళ్లల్లోకి చూడు’ అంటూ రిషి వసునే గట్టిగా నిలదీస్తూ ఉంటాడు. వసు కళ్లల్లోకి చూస్తూ.. ‘మీరే ఇచ్చారు సార్’ అంటూ ఏడుస్తూ చెబుతుంది వసు. వెంటనే వసుని వదిలి.. రెండు అడుగులు వెనక్కి వేస్తాడు నిస్సహాయంగా రిషి. ‘సార్’ అని వసు పట్టుకోబోతుంటే.. చేయి చూపిస్తాడు అక్కడే ఆగిపో అన్నట్లుగా. తనని తాను తమాయించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు రిషి. ఇంతలో దేవయాని పైకి లేచి.. ‘అసలు ఏంటి ఇదంతా? కొంచెం కూడా నమ్మబుద్ధి కావట్లేదు’ అంటుంది.

నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా?

శైలేంద్రకూడా పైకి లేచి.. ‘పిన్నీ ఏంటి ఇదంతా.. ఇప్పుడేం చేస్తారు?’ అంటాడు నటించేస్తూ. ‘రిషి బయటికి వెళ్తే కనీసం ప్రాణాలతో అయినా ఉంటాడు.. మళ్లీ నిలబడగలడు..’ అని మనసులో అనుకున్న జగతి.. ‘ప్రాణానికి ప్రాణం వసు చెప్పింది కదా.. ఇంకేంకావాలి?’ అంటుంది జగతి కఠినంగా. మినిస్టర్ పైకి లేచి.. ‘రిషి వసుధార కూడా చెప్పింది.. దీని మీద నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా?’ అంటాడు. దేవయాని, శైలేంద్రలు చాలా సంబరంగా ఎదురుచూస్తూ ఉంటారు.

అడ్డంగా దొరికిపోయాను..

సత్తువ కోల్పోయి.. బల్లకు చేతుల్ని ఆనించి నిలబడిన రిషి.. కాస్త పక్కకు తిరిగి.. ‘జగతి మేడమ్.. వసుధారలు కలిసి నేను తప్పు చేశానని నిరూపించాక ఇక చెప్పడానికి ఏమీ లేదు.. తప్పు చే..శాను.. మనుషుల్ని నమ్మి కచ్చితంగా తప్పు చేశాను.. మోసం చేశాను.. నా మనసాక్షిని మోసం చేశాను.. అడ్డంగా దొరికిపోయాను.. దొరికిపోయి దోషిలా నిలబడ్డాను’ అంటూ రిషి మాట్లాడుతుంటే.. జగతి, వసులు మనసులోనే కుమిలిపోతారు. అలా అనొద్దు అన్నట్లుగా తలను అడ్డంగా ఊపుతూ కన్నీళ్లు పెట్టుకుంటాడు చాలా ఆవేదనగా.

మీరు వేసే శిక్ష ఏంటో చెప్పండి..

రిషి మాట్లాడుతూనే ఉంటాడు. ‘మనుషుల విషయంలో నా అంచనాలు తప్పాయి.. అంతకు మించిన తప్పు ఇంకేముంటుంది? నేను చేసిన తప్పు నిరూపించడానికి మీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి.. దోషిగా నేను మీ ముందున్నాను.. నాకు శిక్ష పడాలి.. చెప్పండి ఈ రిషీంద్ర భూషణ్‌కి మీరు వేసే శిక్ష ఏంటో చెప్పండి’ అంటాడు ఆవేదనగా కళ్లనిండా నీళ్లతో. ‘చెప్పండి జగతి మేడమ్’ అంటాడు మినిస్టర్ జగతివైపు చూస్తూ. జగతి చాలా కఠిన స్వరంతో తీర్పునిస్తుంది. జగతి మాటలకు రిషి అల్లాడిపోతూ నిలబడటం మనసుల్ని మెలిపెడుతుంది.

శైలేంద్ర షాక్..

‘నువ్వు ఇక నుంచి ఈ కాలేజ్ ఎండీ బాధ్యతల నుంచి తప్పుకోవాలి.. కాలేజ్‌తో కానీ కాలేజ్ బోర్డ్‌తో కానీ నీకు ఎటువంటి సంబంధం ఉండకూడదు.. అంతే కాకుండా నువ్వు ఏ విధ్యా సంస్థల్లో కూడా ఎండీగా బాధ్యతలను తీసుకోవడానికి వీల్లేదు.. ఎటువంటి అడ్మినిస్ట్రేషన్ పదవులు చేపట్టడానికి వీల్లేదు..’ అంటుంది జగతి కన్నీళ్లతో. చివరి మాటలకు శైలేంద్ర షాక్ అవుతాడు. ‘అదేంటి పిన్నీ కాలేజ్ నుంచి అయితే పంపిస్తున్నారు.. బయట కూడా చేసుకోవద్దు అంటే ఎలా?’ అంటాడు శైలేంద్ర. ‘సారీ రిషి ఇలా జరుగుతుందని అసలు ఊహించలేదు’ అంటాడు మినిస్టర్.

జగతి మేడమ్‌కే ఎండీ పదవి..

‘ఏంటి నాన్నా ఇది.. నీకు ఇలాంటి పరిస్థితి రావడం ఏంటో.. నాకు చాలా బాధగా ఉంది నాన్నా’ అంటుంది దేవయాని. ‘ఇప్పుడు కాలేజ్ ఎండీ పదవిని ఎవరు చేపడతారు’ అంటాడు శైలేంద్ర చాలా అమాయకంగా ముఖం పెట్టి. ‘జగతి మేడమ్’ అంటాడు మినిస్టర్. ఆ సమాధానానికి ఫ్యూజులు ఎగిరిపోతాయి జగతితో సహా అందరికీ. ‘ఏంటి సార్’ అంటాడు శైలేంద్ర. ‘అవును... జగతీ మేడమ్.. ఇక నుంచి ఈ ఎండీ బాధ్యతలు మీరే తీసుకోవాలి.. ఈ కాలేజ్ బోర్డ్ నుంచి రెండు నెలల క్రితమే మీరు ఎండీ పదవి చేపడుతున్నట్లుగా మాకు లెటర్ వచ్చింది..’ అంటాడు మినిస్టర్.

రెండు నెలల క్రితం..

‘ఏంటి సార్ మీరు అంటోంది?’ అని కంగారుగా అడుగుతుంది జగతి. ‘అవును మేడమ్.. ఆ లెటర్ మీద రిషి సంతకం కూడా ఉంది.. బోర్డ్‌లో ఆమోదం కూడా ఉంది’ అంటాడు మినిస్టర్. ‘రిషీ ఏంటి ఇదంతా?’ అంటుంది జగతి. దాంతో రిషికి జరిగింది గుర్తొస్తుంది. గతంలో వసు మోసం చేసిందనే బాధలో కాలేజ్ వదిలి పోవాలని జగతిని ఎండీ సీట్‌లో కూర్చోబెట్టినప్పుడే ఆ నిర్ణయం తీసుకుని.. లెటర్ పంపించాడు రిషి. వెంటనే రిషి విషయం చెప్పకుండా.. ‘మినిస్టర్ గారు చెప్పింది నిజమే.. ఇక నుంచి జగతి మేడమ్మే ఎండీ.. నాకు ఈ కాలేజ్‌కి ఎటువంటి సంబంధం లేదు.. మీరు విధించిన శిక్షని సంతోషంగా స్వీకరిస్తాను.. నిబంధనకు కట్టుబడి ఉంటాను’ అంటూ రిషి వెళ్లబోతాడు.

అక్కర్లేదు మేడమ్..

రిషి అని పిలుస్తుంది జగతి. ‘ఇంకా చెప్పేదేమైనా మిగిలి ఉందా మేడమ్?’ అంటాడు వెనక్కి తిరిగి. ‘ఇది అభియోగమని.. నిజం కాదని తేలిన వెంటనే ఈ శిక్ష వెనక్కి తీసుకునే వెసులుబాటు ఉంటుంది.. ఆ తర్వాత నువ్వు మళ్లీ ఈ కాలేజ్ ఎండీగా పదవి చేపట్టవచ్చు’ అంటుంది జగతి. ‘అక్కర్లేదు మేడమ్.. నేను ఎప్పటికీ డీబీఎస్‌టీ కాలేజ్‌లో అడుగు కూడా పెట్టను.. అంతే కాదు.. ఈ క్షణం నుంచి ఈ ఇంట్లోను.. మీ జీవితాల్లో కూడా ఉండలేను’ అంటాడు రిషి. వసుకి గుండె ముక్కలైపోతుంది.

ఇక నుంచి ఈ రిషీంద్ర భూషణ్ ఒంటరి..

‘రిషీ.. ఏంటా మాటలు’ అంటుంది జగతి అల్లాడిపోతూ. ‘అవును మేడమ్.. శిక్షను మోస్తూ మామూలు మనిషిగా మీ ముందు తిరగడం నా వల్ల కాదు.. ఈ రిషి మోసగాడు.. నేరస్తుడు.. అందుకే వెళ్లిపోతున్నాను.. ఎవరికీ కనిపించనంత దూరంగా వెళ్లిపోతాను. ఈ నిర్ణయంలో ఎలాంటి మార్పులేదు.. నన్ను ఎవరూ ఆపే ప్రయత్నం చేయొద్దు. ఇక నుంచి ఈ రిషీంద్ర భూషణ్ ఒంటరి’ అంటూ ముందుకు కదులుతాడు. ‘సార్.. సార్ ఆగండి’ అంటూ వసు ఏడుస్తూనే పరుగుతీస్తుంది. రిషీ రిషీ అంటూ జగతి కంగారు ముందుకు వస్తుంది. కానీ వాళ్లని చూడడు రిషి.

రిషి కాలేజ్‌కి రాకపోతే సరిపోతుంది కదా..

‘రిషీ.. నువ్వు వెళ్లడం ఏంటి నాన్నా నేను తట్టుకోలేను’ అంటూ దేవయాని లేని కంగారు నటిస్తుంది. ‘పెద్దమ్మా అందరి ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని నేను అనుకోలేదు’ అంటాడు రిషి. ‘రిషి కాలేజ్‌కి రాకపోతే సరిపోతుంది కదా.. అందరిని వదిలి వెళ్లడం దేనికి’ అంటాడు శైలేంద్ర బాధ ఉన్నట్లు నటిస్తూ. ‘అది నావల్ల కాదు.. నా చుట్టు ఉన్న మనుషుల మీద నాకు క్లారిటీ వచ్చింది.’ అంటాడు జగతి, వసులను ఉద్దేశించి వాళ్ల వైపు చూడకుండానే.

మీరు జాగ్రత్త..

‘నాకు న్యాయం జరిగింది అన్యాయం జరిగింది అది అప్రస్తుతం.. కాలేజ్‌కి మాత్రం న్యాయం చేయండి. ఈ సంఘటన నా జీవితంలో ఒక మాయని మచ్చ.. నా చుట్టు ఉన్న మనుషుల మీద నాకు క్లారిటీ వచ్చింది.. ఎవరు ఏంటో పూర్తిగా తెలిసింది. తప్పు చేసి పారిపోవాట్లేదు.. తప్పు ఎవరు చేశారో ఆ పైవాడితే తెలుసు.. ఇక్కడ నా అవసరం లేదు.. నాకు ఎవ్వరూ అవసరం లేదు.. జాగ్రత్తగా ఉండండి పెదనాన్నా.. పెద్దమ్మా, అన్నయ్యా.. వెళ్తున్నాను అంటూ వసు, జగతీల ముఖం కూడా చూడకుండా వెళ్లిపోతాడు రిషి.

పిన్ని చాలా తెలివైంది..

సార్ ఆగండి.. రిషి ఆగు అంటూ జగతి, వసులు వెనుకే పరుగుతీస్తారు. ఇక దేవయాని, శైలేంద్రలు కారులో ఇంటికి వెళ్తూ వెళ్తూ.. రిషి వెళ్లిపోయినందుకు సంబరపడిపోతారు. కానీ ఎండీ పదవి చేతికి రానందుకు బాధపడతారు.. ఏది ఏమైనా రిషి మాట మీద నిలబడే మనిషి కాబట్టి.. తిరిగి రాడని.. జగతి చేతుల్లోంచి ఆ పదవిని ఎలాగైనా లాక్కోవాలని ఫిక్స్ అవుతారు. అయితే శైలేంద్ర మాత్రం.. ‘పిన్ని చాలా తెలివైంది. తననుంచి పదవి లాక్కోవడం చాలా కష్టం’ అంటాడు. ‘జగతికి తెలివితో పాటు భయం కూడా ఎక్కువే.. అదే మనకు ప్లెస్’ అంటుంది దేవయాని. Guppedantha Manasu కొనసాగుతోంది. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం! (photo courtesy by star maa and disney+ hotstar)

2023-05-26T03:24:50Z dg43tfdfdgfd