2018 | హృదయాలను కదిలిస్తున్నది

‘2018 చిత్రం ప్రేక్షకుల హృదయాలను కదిలిస్తున్నది. ఈ సినిమాను తెలుగులో విడుదల చేసిన నిర్మాత బన్నీ వాసుగారు 2018లో కేరళ వరద బాధితుల సహాయనిధికి 63 లక్షలు విరాళంగా అందించారు. యాదృచ్ఛికంగా ఇప్పుడు ఆయనే తెలుగులో ఈ సినిమాను విడుదల చేశారు’ అన్నారు జ్యుడ్‌ ఆంటోని. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘2018’. నాలుగేళ్ల క్రితం కేరళలో సంభవించిన వరదల నేపథ్య కథాంశంతో తెరకెక్కించారు.

ఇటీవలే ఈ చిత్రం తెలుగులో విడుదలైంది. ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన సక్సెస్‌ మీట్‌లో బన్నీవాసు మాట్లాడుతూ ‘కంటెంట్‌ బాగుంటే తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని ఈ సినిమా నిరూపించింది. ఈ సినిమాలోని సన్నివేశాలు ప్రేక్షకుల హృదయాల్ని కదిలిస్తున్నాయి. నిర్మాతగా నా కెరీర్‌లో ఈ చిత్రం ప్రత్యేకంగా నిలిచిపోతుంది. విడుదలైన అన్ని కేంద్రాల్లో చక్కటి ఆదరణ లభిస్తున్నది’ అన్నారు. కేరళ మాదిరిగానే తెలుగు ప్రేక్షకులు సైతం ఈ సినిమాకు అద్భుతమైన విజయాన్ని అందించారని హీరో టోవినో థామస్‌ తెలిపారు.

2023-05-27T22:21:05Z dg43tfdfdgfd