Tollywood: ఆ తెలుగు హీరో ఆస్తి రూ.250 కోట్లు.. కానీ ఇప్పటివరకు ఒక్క హిట్టు కూడా కొట్టలేదు!
టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ బాబు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సీనియర్ హీరోలు చిరంజీవి, బాలయ్య, వెంకటేష్ల నుంచి ఇప్పటి స్టార్లు ఎన్టీఆర్, అల్లు అర్జున్, రవితేజ ఇలా దాదాపు స్టార్ హీరోలందరితో సినిమాలు చేశాడు. ఇక ఆయన వారసులిద్దరు ఇప్పుడు టాలీవుడ్లో హీరోలుగా దూసుకుపోతున్నారు. ఇక సురేష్ బాబు వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్నాడు. సినిమాల సంగతి పక్కన పెడితే వ్యక్తిగతంగా శ్రీనివాస్కు ఇండస్ట్రీలో మంచి పేరుతో పాటు క్రేజ్ ఉంది. మరీ ముఖ్యంగా కాంట్రవర్సీలకు దూరంగా ఉంటాడు. అంతేకాదు తనపై ఎన్ని ట్రోల్స్ వచ్చినా సరే పాజిటీవ్ గానే తీసుకుంటుంటాడు. ఇక బెల్లంకొండ శ్రీనివాస్, వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన అల్లుడు శ్రీను సినిమాతో డెబ్యూ ఇచ్చాడు. సినిమాకు పాజిటీవ్ రివ్యూలు వచ్చాయి కానీ.. బిజినెస్ ఓవర్గా జరగడంతో బ్రేక్ ఈవెన్ అవలేక యావరేజ్ హిట్టుగా నిలిచింది. ఆ తర్వాత 'స్పీడున్నోడు' వంటి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాతో వచ్చి డిజాస్టర్ అందుకున్నాడు. తమిళంలో సూపర్ హిట్టయిన సుందర పాండియన్కు రీమేక్గా ఈ సినిమా తెరకెక్కింది. ఇక మూడో సినిమాకు ఏకంగా బోయపాటితో 'జయ జానకి నాయక' మూవీలో చాన్స్ పట్టేశాడు. ప్రేమించిన అమ్మాయి కోసం ఎంత దూరమైనా వెళ్లే క్యారెక్టర్ రోల్ ప్లే చేశాడు. టీజర్, ట్రైలర్లతో ఓ ఊపు ఊపేసిన ఈ సినిమా థియేటర్లలో కూడా అదే టాక్ తెచ్చుకుంది. ఇక యాక్షన్ సీన్లు అయితే నెక్స్ట్ లెవల్లో ఉంటాయి. బోయపాటి లాజిక్స్ పక్కన పెడితే మాస్ ఆడియెన్స్ మాత్రం ఫైట్ సీన్లను పిచ్చ పిచ్చగా ఎంజాయ్ చేశారు. అదిరిపోయే ఓపెనింగ్స్ వచ్చినా.. రిలీజ్ టైమ్కు మరో రెండు సినిమాలు పోటీగా ఉండటం, అందులో ఒకటి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోవడంతో ఫైనల్ రన్లో మాత్రం బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోకుండానే థియేటర్ల నుంచి వెళ్లిపోయింది. అయితే టీవీల్లో ఈ సినిమా టెలికాస్ట్ అయయిన ప్రతీ సారి మంచి టీఆర్పీ వస్తుంది. మరీ ముఖ్యంగా మాస్ ఆడియెన్స్ ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయిపోయారు. బెల్లంకొండ శ్రీనివాస్కు నార్త్లో మంచి క్రేజే ఉంది. ఆయన నటించిన సినిమాలు హిందీ డబ్బింగ్ వెర్షన్లకు మిలియన్లలో వ్యూస్ ఉన్నాయి. సీతా, కవచం, సాక్ష్యం, స్పీడున్నోడు వంటి సినిమాలకు వందల మిలియన్లలో వ్యూస్ సాధించాయి. అయితే అదే ధైర్యంతో ఛత్రపతి సినిమాను హిందీలో చేసి చేతులు కాల్చుకున్నాడు. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ 'టైసన్ నాయుడు' సినిమా చేస్తున్నాడు. 'భీమ్లా నాయక్' దర్శకుడు సాగర్ కే చంద్ర ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇక బెల్లంకొండ శ్రీనివాస్కు అక్షరాల రూ.250 కోట్ల ఆస్తి ఉందట. తన తండ్రి ఆస్తులతో పాటు తన ఆస్తుల కలిపి ఇంత పెద్ద మొత్తంలో ఉందని సమాచారం.
2024-07-27T05:42:16Z