Ys Avinash Reddy: కడప ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి లక్ష్మి ఆరోగ్య పరిస్తితిపై గచ్చిబౌలి AIG హాస్పిటల్ వర్గాలు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. లక్ష్మి 26వ తేదీ హైదరాబాద్లోని గచ్చిబౌలి AIG హాస్పిటల్స్లో చేరారని, యాంజియోగ్రామ్ తర్వాత కర్నూలులోని ఆసుపత్రి నుంచి గచ్చిబౌలి AIG హాస్పటల్కు రిఫర్ చేశారని బులిటెన్లో తెలిపారు.
కరోనరీ యాంజియోగ్రామ్ రెండు నాళాల వ్యాధిని ఉన్నట్లు పరీక్షల్లో నిర్ధారణ అయినట్లు వైద్యులు తెలిపారు. గచ్చిబౌలి AIG ఆసుపత్రిలో కుడి కరోనరీ ఆర్టరీకి కట్టింగ్ బెలూన్ యాంజియోప్లాస్టీ, స్టెంట్ ప్లేస్మెంట్ చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం స్థిరంగా ఉందని, ఐసీయూలో కోలుకుంటున్నట్లు బులిటెన్లో పేర్కొన్నారు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎలాంటి ఇబ్బంది లేదని ఏఐజీ డాక్టర్లు వెల్లడించారు.
2023-05-28T03:39:16Z dg43tfdfdgfd