టంగుటూరు: శభాష్ డ్రైవరన్నా.. 32మంది ప్రాణాలు కాపాడిన రియల్ హీరో

ప్రకాశం జిల్లాలో తెలంగాణ ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. తిరుపతి నుంచి హైదరాబాద్‌ వెళుతున్న తెలంగాణ ఆర్టీసీ బస్సు నిమిషాల్లోని దగ్ధమెంది. టంగుటూరు మండలం సూరారెడ్డిపాలెం దగ్గర ఆదివారం రాత్రి 11 గంటలు దాటిన తర్వాత జరిగింది. బస్సు సూరారెడ్డిపాలెం వద్దకు రాగానే లోపల మంటలు రేగడంతో అప్రమత్తమైన డ్రైవర్‌ వెంటనే ప్రయాణికులను కిందకు దించడంతో పెను ప్రమాదం తప్పింది.

ఈ ఘటనలో బస్సు పూర్తిగా కాలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 32మంది ప్రయాణికులు ఉన్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఇంజన్‌లో షార్ట్‌సర్క్యూటే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు.

ఆ బస్సులో ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయం ఏర్పాటు చేశారు.. వారందరిని మరో బస్సులో గమ్య స్థానాలకు పంపారు. డ్రైవర్ అప్రమత్తం కావడంతో పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డామని ప్రయాణికులు చెబుతున్నారు. ఎండాకాలం కావడంతోనే బస్సు ఇంజన్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉంటాయని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-29T04:33:52Z dg43tfdfdgfd