భార్యకు విడాకులిచ్చిన టాలీవుడ్ ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్.. 11ఏళ్ల బంధానికి తెగతెంపులు
ఈమధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీలో చాలా మంది సెలబ్రిటీ కపుల్స్ తమ వైవాహిక బంధాన్ని తెంచుకొని విడాకులు తీసుకుంటున్నారు. రీసెంట్గా ధనుష్,ఐశ్వర్య బంధం తెగిపోయిన కొద్దిరోజులకే మరో సెలబ్రిటీ కపుల్స్ విడిపోతున్నట్లుగా ప్రకటించారు.అయితే వీళ్లిద్దరూ సంగీత ప్రపంచంలో ఫేమస్ అయిన వాళ్లు కావడం విశేషం.(Photo:Facebook) దక్షిణాది చిత్రపరిశ్రమలో ఎన్నో హిట్ సినిమాలకు మ్యూజిక్ అందించిన సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాష్ కుమార్ సింగర్ సైంధవిని 11ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి ఓ బిడ్డ కూడా ఉంది. అయితే ఈజంట ఇన్నేళ్ల తర్వాత తమ వివాహ బంధాన్ని విడాకులతో తెంచుకున్నారు.ఈవిషయాన్ని స్వయంగా జీవీ ప్రకాష్ ప్రకటించారు.(Photo:Facebook) జీవీ ప్రకాశ్ కుమార్ తన భార్య నుంచి విడాకులు తీసుకున్నట్లుగా సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఎంతో ఆలోచించి చివరికి విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు వారు ప్రకటించారు. కాగా, ప్రకాశ్, సైంధవి 2013లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి కూతురు అన్వీ ఉంది..(Photo:Facebook) "ఎంతో ఆలోచించి సైంధవి తాను 11 ఏళ్ల వివాహ బంధానికి వీడ్కోలు చెప్పాలని నిర్ణయించుకున్నామని.. మానసిక ప్రశాంతత, ఇద్దరి జీవితాల్లో మెరుగుకోసం ఒకరికొకరం పరస్పర గౌరవంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు. ఈ నిర్ణయం ఇద్దరికీ మంచిదని నమ్ముతున్నామని తెలిపారు.(Photo:Facebook) తామిద్దరం తీసుకున్న ీ నిర్ణయాన్ని మీడియా మిత్రులు, అభిమానులు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నామంటూ పేర్కొన్నారు. మా ప్రైవసీని గౌరవిస్తారని ఆశిస్తున్నామని ప్రకటనలో విన్నవించుకున్నారు.జీవీ ప్రకాష్ మ్యూజిక్ డైరెక్టర్, నటుడు మాత్రమే కాదు..ఆస్కార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సొంత మేనల్లుడు కూడా కావడం మరో విశేషం.(Photo:Facebook) జీవీ ప్రకాశ్ కుమార్ తమిళ్తో పాటు తెలుగులో పలు హిట్ చిత్రాలకు మ్యూజిక్ అందించారు. 'అసురన్', 'సురరై పోట్రు' (ఆకాశమే నీ హద్దు), 'యుగానికి ఒక్కడు', 'రాజా రాణి' వంటి హిట్ తమిళ సినిమాలకు స్వరాలు సమకూర్చాడు.(Photo:Facebook) అలాగే తెలుగులో 'డార్లింగ్', 'ఉల్లాసంగా ఉత్సాహంగా', 'ఒంగోలు గిత్త', 'జెండాపై కపిరాజు', 'ఎందుకంటే ప్రేమంటా', 'రాజాధిరాజా' సినిమాలకు మ్యూజిక్ కంపోజ్ చేశాడు జీవీ ప్రకాష్. ఇక హీరోగా 15 మూవీలలో నటించాడు..(Photo:Facebook) చిన్న వయసులోనే వివాహాలు చేసుకోవడం వల్లే స్టార్ సెలబ్రిటీలు ఈవిధంగా నడి వయస్సు రాకుండానే విడాకులు తీసుకుంటున్నారని .. ఒంటరిగా ఎవరికి నచ్చినట్లుగా వారు జీవింతాలని నిర్ణయించుకుంటున్నారని నెటిజన్లు, అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు..(Photo:Facebook)
2024-05-15T09:42:48Z
బాలీవుడ్ క్వీన్ ఆస్తి ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.. క్రిమినల్ కేసులు కూడా బానే
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ పాలిటిక్స్ లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. 2024 లోక్ సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మండి నియోజకవర్గం నుంచి ఆమె బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మండి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మంగళవారం కంగనా రనౌత్ నామినేషన్ వేశారు. ఈ క్రమంలోనే తన ఆస్తి, వ్యక్తిగత విషయాలను ఆమె తన ఎలక్షన్ అఫిడవిట్ లో తెలిపింది. తన దగ్గర స్థిర, చరాస్థులు కలిపి మొత్తం రూ.90 కోట్ల సంపద ఉన్నట్లు ఎలక్షన్ అఫిడవిట్ లో కంగనా తెలిపింది. ప్రస్తుతం తన చేతిలో రూ.2 లక్షల క్యాష్, రూ.1.35 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నట్లు కంగనా తెలిపింది. చరాస్తులలో రూ.50 లక్షల విలువైన 60 కిలోల వెండి, రూ.5 కోట్ల విలువైన 6.7 కిలోల గోల్డ్ తోపాటు డైమెండ్స్ ఉన్నాయని అఫిడవిట్ లో తెలిపింది. తనకు రూ.17 కోట్ల అప్పు ఉందని కంగనా తెలిపింది. ఇవే కాకుండా 50 ఎల్ఐసీ పాలసీలు తీసుకుంది కంగనా. ఈ 50 ఎల్ఐసీ పాలసీల మెచ్యూరిటీ మొత్తం రూ. 5 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే సొంత నిర్మాణ సంస్థ మణికర్ణిక ఫిల్మ్ ప్రైవేట్ లిమిటెడ్లో 1.21 కోట్ల రూపాయలను పెట్టుబడి పెట్టింది. అంతేకాకుండా తన తమ్ముడు, సోదరి రంగోలి, తండ్రి తదితరులకు రూ. 9.50 కోట్ల వరకు అప్పుగా ఇచ్చినట్లు తెలిపింది. కంగనా రనౌత్ పేరు మీద నాలుగు వాహనాలు ఉన్నాయి. BMW 730, మెర్సిడెస్ బెంజ్ GLE 250, మెర్సిడెస్ మేబ్యాక్ GLS 600 మూడు కార్లు ఓ వెస్పా స్కూటర్ తన దగ్గర ఉన్నాయని కంగనా తెలిపింది. తనపై 8 క్రిమినల్ కేసులు పెండింగ్ ఉన్నాయని కంగనా తెలిపింది. కంగనాకు వ్యవసాయ భూమి లేదు. ముంబై, మనాలి, హిమాచల్ ప్రదేశ్లో రెండు భవనాలు ఉన్నాయి. . వీటి ప్రస్తుత మొత్తం విలువ రూ.31.42 కోట్లు.
2024-05-15T09:27:42Z