ALLU ARJUN WAX STATUE: స్ఫెషల్ డే రోజున మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మైనపు విగ్రహంగా కొలువు తీరిన అల్లు అర్జున్..

Allu Arjun Wax statue Madame tussauds: తెలుగులో అల్లు మరియు మెగా కాంపౌండ్ హీరోగా అడుగుపెట్టిన అల్లు అర్జున్.. ఆ తర్వాత తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక 2021లో 'పుష్ప' సినిమాలోని నటకు జాతీయ ఉత్తమ నటుడిగా రాష్ట్రపతి నుంచి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే కదా. తెలుగు నుంచి తొలిసారి నేషనల్ అవార్డు అందుకున్న హీరోగా రికార్డు క్రియేట్ చేసాడు బన్ని. అంతేకాదు ఇన్‌స్టాగ్రామ్‌లో దక్షిణ భారత దేశం నుంచి అత్యధిక ఫాలోవర్స్ ఉన్నకథానాయకుడిగా కూడా రికార్డు క్రియేట్ చేసాడు. అంతేకాదు ఇన్‌స్టాగ్రామ్ .. అల్లు డాక్యుమెంటరీ చేసిన సంగతి తెలిసిందే కదా. మన దేశంలో ఈ ఘనత అందుకున్న తొలి నటుడు అల్లు అర్జునే కావడం విశేషం. ఇలా తన పేర ఎన్నో రికార్డులను క్రియేట్ చేస్తోన్న అల్లు అర్జున్ ఖాతాలో మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది సెలబ్రిటీల మైనపు విగ్రహాలను పెట్టే మేడమ్ టుస్సాడ్స్ వాళ్లు అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని దుబాయ్‌లో ఉన్న మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో పెట్టారు. ఈ విగ్రహాన్ని అల్లు అర్జున్ దుబాయ్ వెళ్లి స్వయంగా తర మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించడం విశేషం. ఇక అల్లు అర్జున్.. హీరోగా పరిచయమైన గంగోత్రి సినిమా రిలీజై కరెక్ట్‌గా 21 యేళ్లు అవుతోంది. ఈ సందర్భంగా ఈ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించడం విశేషం.   

ఈ విగ్రహం కోసం గతంలో అల్లు అర్జున్‌కు సంబంధించిన కొలతలు తీసుకున్నారు మేడమ్ టుస్సాడ్స్ వాళ్లు.   పుష్ప గెటప్‌లో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇప్పటికే మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మన తెలుగు హీరోలైన ప్రభాస్, మహేష్ బాబు మైనపు విగ్రహాలున్నాయి. తాజాగా అల్లు అర్జున్ ఈ లిస్టులో చేరడం విశేషం. అంతేకాదు తన సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ ఎప్పటి కప్పుడు తెలియజేస్తున్నాడు.  

ఇక అల్లు అర్జున్ గత సినిమా పుష్ప సినిమా ప్యాన్ ఇండియా లెవల్లో రూ. 365 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించాయి. ప్రస్తుతం అల్లు అర్జున్.. సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప 2' మూవీ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ కానీకొచ్చింది. ఒకవైపు సినిమా షూటింగ్ జరుగుతుండగానే ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేస్తున్నాడు సుకుమార్ ఈ సినిమా ఆగష్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. ఆ సంగతి పక్కన పెడితే.. అల్లు అర్జున్... పుష్ప 2 మూవీ తర్వాత పలు క్రేజీ ప్రాజెక్ట్స్‌ను లైన్‌లో పెట్టాడు. త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగ, బోయపాటి శ్రీను, అట్లీ, సురేంద్ రెడ్డి వంటి దర్శకులతో ఈయన సినిమాలు చేయనున్నట్టు సమాచారం.

అయితే పుష్ప 2 మూవీ తర్వాత అల్లు అర్జున్.. అరవ డైరెక్టర్ అట్లీతో సినిమా చేయడం దాదాపు ఖరారైంది. ఇక అట్లీ గతేడాది షారుఖ్‌ ఖాన్‌తో చేసిన 'జవాన్' మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇపుడు తొలిసారి అల్లు అర్జున్‌తో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అట్లీ.  ఈ సినిమాను అల్లు అర్జున్ పుట్టినరోజైన ఏప్రిల్ 8న అఫీషియల్‌గా ఈ ప్రాజెక్ట్ డీటెల్స్ అనౌన్స్ చేసే అవకాశాలున్నాయి. ఈ సినిమా కూడా ప్యాన్ ఇండియా లెవల్లో భారీ యాక్షన్ మూవీగా  తెరకెక్కించబోతున్నారట. తెలుగు, తమిళం, హిందీ నిర్మాతలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నారట. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే పేరును పరిశీలిస్తున్నారు. తనతో చేసిన దువ్వాడ జగన్నాథం, అల వైకుంఠపురములో హిట్స్ తర్వాత మరోసారి వీళ్లిద్దరు ఈ మూవీలో జోడిగా కనిపించబోతున్నట్టు సమాచారం.

Also Read: Egg Murder: 'కోడిగుడ్డు'తో చనిపోయిన మహిళ.. ప్రేమ వ్యవహారమే కారణం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

2024-03-28T17:16:42Z dg43tfdfdgfd