Telangana Tourism Hyderabad Arunachalam Tour: అరుణాచలం… ప్రతి ప్రతీ నెల పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ కోసం ఈ పుణ్యక్షేత్రానికి వెళ్తుంటారు. లక్షల సంఖ్యలో భక్తలు వస్తుంటారు. ముఖ్యంగా ఏపీ, తెలంగాణ నుంచి వెళ్లే భక్తల సంఖ్య కాస్త ఎక్కువగానే ఉంటుంది. అరుణాచలం అనేది… పంచభూతలింగ క్షేత్రాలలో ఒకటి. దక్షిణభారతంలో అత్యంత పేరు గాంచిన ప్రాంతం.
అరుణాచలం(Arunachalam) చాలా గొప్ప పుణ్యక్షేత్రం. ఈ అరుణాచలం పరమేశ్వరుడిని జ్యోతిర్లింగా స్వరూపంగా భావిస్తారు. దీని చుట్టూ ప్రదక్షిణం చేయటం సాక్ష్తాత్తు శివునికి ప్రదక్షిణం అని భక్తుల విశ్వాసం. ఇక్కడికి వచ్చే భక్తులు గిరిప్రదక్షిణ చేస్తుంటారు. ఇది మొత్తం 14 కిలోమీటర్లు ఉంటుంది. దారిలో వచ్చే మొత్తం 8 లింగాలను మనం దర్శించుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. గిరి ప్రదక్షిణ చేస్తే మంచి ఫలితాలు అందుతాయని భక్తులు నమ్ముతుంటారు.
ఇక ప్రతీ నెల పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ కోసం అరుణాచలాని(Arunachalam)కి భక్తులు ఎక్కువ సంఖ్యలో వెళ్తుంటారు. అయితే భక్తుల రాకపోకలను దృష్టిలో ఉంచుకొని… తెలంగాణ టూరిజం(Telangana Tourism) సరికొత్త ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘HYDERABAD - ARUNACHALAM - Telangana Tourism’ పేరుతో టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తుంది. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా అరుణాచలానికి తీసుకెళ్తుంది. 4 రోజుల ప్యాకేజీ ఇది. పెద్దలకు రూ. 7500గా టికెట్ ధరను నిర్ణయించారు. చిన్న పిల్లలకు రూ. 6000గా ఉంది. ప్రస్తుతం మే 20వ తేదీన ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది.
ఈ నెలకు సంబంధించిన టూర్ ప్యాకేజీ బుకింగ్ చేసుకోలేకపోతే… వచ్చే నెలలో మళ్లీ ఈ ప్యాకేజీని బుకింగ్ చేసుకోవచ్చు. జూన్ నెలలో అయితే 19వ తేదీన అందుబాటులో ఉంది. జూన్ నెల ప్యాకేజీ పూర్తి అయిన తర్వాత… మిగతా నెలల తేదీలను ప్రకటిస్తుంది తెలంగాణ టూరిజం.
2024-05-02T13:39:33Z dg43tfdfdgfd