Ponguleti Srinivas Reddy: బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన తరువాత ఖమ్మం కీలక నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) ఏ పార్టీలో చేరతారన్నది ఇంకా క్లారిటీ రాలేదు. మొదట బీజేపీ ఆ తర్వాత వైఎస్సార్ తెలంగాణ పార్టీ అలాగే కాంగ్రెస్ లో చేరతారని ప్రచారం జరిగింది. కానీ ఏ పార్టీలో చేరాలనేదానిపై పొంగులేటి ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. అయితే ఈ ఊగిసలాటలో ఉన్న పొంగులేటి (Ponguleti Srinivas Reddy)కి ఆయన అనుచరుడు ఊహించని షాకిచ్చారు.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) ముఖ్య అనుచరుడు మట్ట దయానంద్ శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు తెలుస్తుంది. గాంధీభవన్ లో రేవంత్ రెడ్డి సమక్షంలో దయానంద్ హస్తం పార్టీ కండువా కప్పుకోనున్నారు. అయితే దయానంద్ దారిలో మరికొంతమంది కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టు తెలుస్తుంది. కాగా పొంగులేటి (Ponguleti Srinivas Reddy) మట్ట దయానంద్ ను సత్తుపల్లి అభ్యర్థిగా గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. అనుచరుడి చేరికతో పొంగులేటి అలెర్ట్ అయినట్లు తెలుస్తుంది.
2023-05-26T05:12:03Z dg43tfdfdgfd