MAHESH BABU - RAJAMOULI - SSMB 29: ఆ స్పెషల్ డే రోజున మహేష్ బాబు, రాజమౌళి సినిమాపై అఫిషియల్ ప్రకటన..

Mahesh Babu - Rajamouli -SSMB29: రాజమౌళి ఇప్పటి వరకు తన సినిమాలతో ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ వంటి హీరోలను స్టార్స్‌గా మార్చారు. కానీ తొలిసారి సూపర్ స్టార్ మహష్ బాబుతో సినిమా చేయబోతుండటంతో ఈ సినిమాపై అంచనాలు పీక్స్‌కు చేరాయి.  ఇక అభిమానుల  ఎదురు చూపులు ఫలించే రోజులు రానే వచ్చాయి.  ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన .. మే 31న సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే రోజున ప్రకటించనున్నారు. మహేష్ బాబు ప్రతి యేడాది తన తండ్రి పుట్టిన రోజు సందర్బంగా తన సినిమాలకు సంబంధించిన ప్రకటన చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సారి కూడా రాజమౌళితో చేయబోయే సినిమాను మే 31న అఫిషియల్‌గా ప్రకటించనున్నారు.

ఆర్ఆర్ఆర్ తర్వాత ఆ సినిమా రేంజ్‌కు ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమాను  రాజమౌళి తెరకెక్కించనున్నాడు.  ఇప్పటికే ఈ సినిమా కథ ఫైనలైజ్ అయిపోయింది.   అంతేకాదు  మహేష్ బాబు తప్ప మిగిలిన నటీనటులు ఎవరు ఫైనల్ కాలేదన్నారు. తాజాగా ఈ సినిమాలో ఆలియా భట్ మహేష్ బాబుకు జోడిగా నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరోవైపు జాన్వీ కపూర్ పేరును పరిశీలిస్తున్నారు.  మహేష్ బాబుతో చేయబోయే సినిమా నెవర్ బిఫోర్ అనే విధంగా ఉండనున్నట్టు సమాచారం. ఇప్పటికే విజయేంద్ర ప్రసాద్.. ఈ సినిమా కథతో పాటు స్రీన్ ప్లే, డైలాగ్స్ వెర్షన్స్, స్కెచెస్ కూడా పూర్తి అయినట్టు సమాచారం. ఆగష్టు 9న మహేష్ బాబు బర్త్ డే రోజు నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

మరోవైపు ఈ సినిమాలో మహేష్ బాబు కోసం 8 లుక్స్ ట్రై చేస్తున్నారు. ఇప్పటికే మహేష్ బాబు పై టెస్ట్ షూట్స్ చేస్తున్నట్టు సమాచారం.  ఇప్పటికే పెరిగిన జుట్టు, గడ్డంతో ఉన్న మహేష్ బాబు లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాదు ఈ సినిమాలో పూర్తి స్థాయిలో డ్యూయల్ రోల్లో చూపించబోతున్నాడట. మహేష్ బాబు ఇప్పటి వరకు హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత 'నాని' సినిమా క్లైమాక్స్‌లో మాత్రమే తండ్రీ కొడుకులుగా డ్యూయల్‌ రోల్లో కనిపించాడు. అంతకు ముందు బాల నటుడిగా తన తండ్రి దర్శకత్వంలో 'కొడుకు దిద్దిన కాపురం' సినిమాలో ద్విపాత్రాభినయం చేసాడు.

ఇపుడు రాజమౌళి విక్రమార్కుడు సినిమాలో రవితేజతో..  బాహుబలిలో ప్రభాస్‌తో డ్యూయల్ రోల్లో యాక్ట్ చేయించాడు. ఇపుడు మహేష్ బాబుతో చేయబోతున్న సినిమాలో డోపర్ గాంగల్ తరహాలో హీరో కమ్ విలన్ తరహాలో మహేష్ బాబు పాత్ర ఉండబోతుందని సమాచారం. తెలుగులో ఏ హీరో చేయనటువంటి డిఫరెంట్ రోల్ అనే టాక్ నడస్తోంది. ఈ ప్యాన్ వరల్డ్ మూవీలో  తెలుగు నటీనటులతో పాటు బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ నటీనటుల కలయికలో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారట.

మరోవైపు మహేష్ బాబు ఈ సినిమా కోసం సూపర్ స్టార్ ప్రత్యేకంగా ట్రెయిన్ అవుతున్నాడు. అందుకోసం ప్రత్యేక డైట్ తీసుకోవడం స్టార్ట్ చేసినట్టు సమాచారం. యాక్ష‌న్ అడ్వంచ‌ర‌స్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో  స్టంట్స్ యాక్షన్ సీన్స్ కు ఇంపార్టెన్స్ ఉంది.  దీని కోసం మహేష్ బాబు జర్మనీ వెళ్ళి ట్రెయిన్ అయి వచ్చాడు. అక్కడ ప్రముఖ వ్యాయామ నిపుణులు హ్యారీ కొనిగ్‌తో కలిసి ట్రెక్కింగ్‌తో పాటు ప‌లు వ్యాయామాల్లో శిక్షణ తీసుకున్నాడు.  ఇక మహేష్ బాబు కూడా రాజమౌళితో వర్క్ చేయడానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు చెప్పాడు. ఈ సినిమాను అమెజాన్ అడవుల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు.  ఇక రాజ‌మౌళి సినిమా కోసం మ‌హేష్ బాబు కొత్త లుక్‌లో మేకోవ‌ర్ కానున్నాడు. అందుకే ఈ సినిమా పూర్త‌య్యే వ‌ర‌కు మ‌హేష్ బాబు ఎక్క‌డా క‌న‌బ‌డ‌కుండా ఉండాల‌ని జ‌క్క‌న్న కండిష‌న్ పెట్టాడ‌ట‌. ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగార్జున కూడా ఓ ముఖ్య‌పాత్ర‌లో న‌టించ‌బోతున్న‌ట్టు స‌మాచారం.

మ‌హేష్ బాబు, రాజ‌మౌళి సినిమాను  డాక్టర్ కే.ఎల్. నారాయణ భారీ ఎత్తున నిర్మించనున్నాడు. విజయేంద్ర ప్రసాద్ కథను అందిస్తున్నారు. ఈ సినిమా ఇండియానా జోన్స్ ఆధారంగా యాక్షన్ అండ్ అడ్వెంచరెస్ మూవీగా తెరకెక్కించనున్నాడు. ఈ మూవీని 2025 ఎండింగ్‌లో కానీ.. 2026 సంక్రాంతి కానుక‌గా విడుద‌ల చేయాల‌నే ప్లాన్‌లో ఉన్నాడు.

Also read: Pink Mooon: ఆకాశంలో అద్భుతం, తెల్లవారుజామునే పింక్ మూన్, ఎన్ని గంటలకంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

2024-04-24T06:56:06Z dg43tfdfdgfd