MINISTER ERRABELLI DAYAKAR RAO | తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టిన మహానుభావుడు: మంత్రి ఎర్రబెల్లి

హనుమకొండ: విశ్వ విఖ్యాత నటుడిగా, పరిపాలనాదక్షుడిగా ఎన్టీఆర్ (NTR) తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు (Minister Errabelli Dayakar rao) అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టిన మహానుభావుడని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శతజయంతి (Birth anniversary) సందర్భంగా హనుమకొండ (Hanamkonda) పట్టణంలోని ఆయన విగ్రహానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. పేదల పెన్నిధి ఎన్టీఆర్‌ అని, రెండు రూపాయలకే కిలో బియ్యం ఇచ్చారన్నారు. పేదలకు ఇండ్లు ఇచ్చారని, ఎందరో యువతకు ఆదర్శంగా నిలిచిన నేత అని కొనియాడారు.

ఆయన సేవలు చీర స్మరనియమని పేర్కొన్నారు. ఎన్టీఆర్‌ నిజమైన రాజకీయ, పరిపాలన వారసుడు సీఎం కేసీఆర్‌ (CM KCR) అని, ఆయన ఆశయాలను పాటిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారని వెల్లడించారు. ఎన్టీఆర్‌ ఆశయాలను కొనసాగించడమే ఆయనకు మనమిచ్చే ఘనమైన నివాళి అని చెప్పారు.

2023-05-28T05:51:33Z dg43tfdfdgfd