ఫస్ట్ మూవీ బ్లాక్బస్టర్..ఆ హీరోకి తప్ప మిగతావారికి నో ఛాన్స్..ప్రభాస్ సినిమాతో కమ్ బ్యాక్
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒక టైమ్ పీరియడ్ వరకు కొందరు నటీనటుల కాలం సాగుతుంది. ఆ తర్వాత వారు అన్ని సర్దుకుని బయటికి పోవాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే కొత్తగా ఇండస్ట్రీలో అడిగి పెట్టి ఫస్ట్ సినిమాతోనే హిట్టు కొట్టేవారికి తిరుగు ఉండదు. కానీ ఒక హీరోయిన్ విషయంలో అలా జరగలేదు. 1980ల చివరిలో బాలీవుడ్లో అమితాబ్ బచ్చన్, హేమ మాలిని, రేఖ, వినోద్ ఖన్నా లాంటి దిగ్గజ నటుల కాలం ముగిసింది. వాళ్ల బాక్సాఫీస్ కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. దీంతో ఓ కొత్త తరం నటి ఇండస్ట్రీలో అడుగుపెట్టి సెన్సేషనల్ హిట్ కొట్టింది. కానీ ఆ హీరోయిన్ తక్కువ సమయంలోనే కనుమరుగైంది. ఆమె ఎవరో కాదు, ఓంకారం, రాధే శ్యామ్ వంటి సినిమాలతో తెలుగువారిని అలరించిన నటి భాగ్యశ్రీ. భాగ్యశ్రీ రాజ కుటుంబం నుంచి సినిమాల్లోకి వచ్చింది. 1989లో ఆమె నటించిన తొలి సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీలో రిలీజ్ అయి కొత్త ట్రెండ్ సృష్టించింది. ఇద్దరు కొత్త నటులను ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఆ మూవీ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. ఆ హీరో సూపర్ స్టార్ అయ్యాడు, కానీ హీరోయిన్ భాగ్యశ్రీ మాత్రం ఫేడ్ అవుట్ అయిపోయింది. ఆ సినిమా మరేదో కాదు "మైనే ప్యార్ కియా". ఈ మూవీ రిలీజ్ అయ్యే సమయానికి భాగ్యశ్రీకి 20 ఏళ్లు, అందులో హీరోగా చేసిన సల్మాన్ ఖాన్కు 24 ఏళ్లు. మైనే ప్యార్ కియా ఆ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. ఈ సినిమాతో భాగ్యశ్రీ, సల్మాన్ ఇద్దరూ ఓవర్నైట్ స్టార్లు అయ్యారు. అయితే సల్మాన్కి సినిమా ఆఫర్లు గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ వచ్చాయి. భాగ్యశ్రీ మాత్రం ఫస్ట్ హిట్ కొట్టాక సినిమాలు చేయకుండా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది 1990లో, ఆమె హిమాలయ దాసానిని పెళ్లాడగా అది ఆమె కెరీర్కు ఒక బ్రేక్ లాగా పడింది. పెళ్లి తర్వాత, ఆమె మరే హీరోతోనూ నటించకూడదని, భర్తతో మాత్రమే సినిమాల్లో నటిస్తానని స్పష్టం చేసింది. వీరిద్దరూ కలిసి "ఖైదీ మే బుల్బుల్", "త్యాగి", "పాయల్" అనే మూడు సినిమాల్లో నటించారు. కానీ ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యాయి. ఇంకేముంది, భాగ్యశ్రీ 24 ఏళ్ల వయస్సులోనే సినిమాల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. సెకండ్ ఇన్నింగ్స్1997లో భాగ్యశ్రీ కన్నడ, తెలుగు సినిమాల్లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకోవడానికి ట్రై చేసింది. అయితే, 2006 వరకు ఆమె పూర్తి స్థాయిలో సినిమాల్లో మంచి కమ్బ్యాక్ ఇవ్వలేకపోయింది. 2006 తర్వాత ఈ అందాల తార సహాయక పాత్రలతో సరిపెట్టుకుంది. సపోర్టింగ్ రోల్స్ అయినా సరే "హమ్ కో దీవానా కర్ గయే" లాంటి పెద్ద సినిమాల్లో కనిపించి కమ్బ్యాక్ ఇవ్వగలిగింది. భాగ్యశ్రీ రీసెంట్ టైమ్స్లో "తలైవి", "రాధే శ్యామ్" సినిమాల్లో కీలకమైన పాత్రలు పోషించి మంచి గుర్తింపు తెచ్చుకుంది, 2023లో "కిసీ కా భాయ్ కిసీ కి జాన్" సినిమాలో సల్మాన్ ఖాన్తో మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోగలిగింది. రాయల్ ఫ్యామిలీబాలీవుడ్లో రాయల్ ఫ్యామిలీకి చెందిన నటీమణులలో భాగ్యశ్రీ ఒకరు. ఆమె సంగ్లీ సంస్థానానికి చెందిన చివరి రాజు చింతామణరావు ధుండిరావు పట్వర్ధన్కు మనవరాలు. ఆమె తండ్రి విజయ్ సింగ్రావు మాధవరావు పట్వర్ధన్ సంగ్లీ రాజు కాగా, భాగ్యశ్రీ ఆ సంస్థానానికి యువరాణి అయ్యారు.
2024-05-14T07:54:01Z