VAMSHI PAIDIPALLY: వంశీ పైడిపల్లి నెక్స్ట్ సినిమా బాలీవుడ్ హీరోతో - ఆ స్టార్ ఎవరంటే?

దర్శకుడు వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) తీసిన సినిమా థియేటర్లలోకి వచ్చి సంవత్సరం దాటింది. కోలీవుడ్ స్టార్, దళపతి విజయ్ హీరోగా ఆయన దర్శకత్వం వహించిన 'వారసుడు' (తమిళంలో 'వారిసు') గత ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తర్వాత మరో సినిమా స్టార్ట్ చెయ్యలేదు. లేటెస్ట్ టాక్ ఏమిటంటే... బాలీవుడ్ హీరోతో వంశీ పైడిపల్లి సినిమా చెయ్యనున్నారని!

షాహిద్ కపూర్ హీరో వంశీ పైడిపల్లి సినిమా?

బాలీవుడ్ కథానాయకుడు షాహిద్ కపూర్ (Shahid Kapoor)తో సినిమా చెయ్యడానికి వంశీ పైడిపల్లి ట్రై చేస్తున్నారని ఫిల్మ్ నగర్ టాక్. ఇటీవల హీరోని కలిసి ఓ కథ నేరేట్ చేశారని, అది ఆయనకు నచ్చడంతో సినిమా చేద్దామని చెప్పారని వినికిడి.

షాహిద్ కపూర్, వంశీ పైడిపల్లిని స్టార్ ప్రొడ్యూసర్ 'దిల్' రాజు కలిపారట. ఆయనతో దర్శకుడికి మంచి రిలేషన్షిప్ ఉంది. 'మున్నా'తో వంశీ పైడిపల్లిని దర్శకుడిగా ఇంట్రడ్యూస్ చేసింది దిల్ రాజే. ఆ తర్వాత 'బృందావనం', 'ఎవడు', 'మహర్షి', 'వారిసు' సినిమాలు వాళ్ల కలయికలో వచ్చాయి. వంశీ పైడిపల్లి తీసిన 'ఊపిరి'కి తప్ప మిగతా అన్ని సినిమాల నిర్మాణంలో దిల్ రాజు ఉన్నారు. షాహిద్ కపూర్ హీరోగా హిందీలో 'జెర్సీ'ని రీమేక్ చేశారు. ఇద్దరితో పరిచయం ఉండటంతో మీటింగ్ ఎరేంజ్ చేశారట.

షాహిద్ కపూర్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించనున్న సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై 'దిల్' రాజు, శిరీష్ ప్రొడ్యూస్ చెయ్యనున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.

Also Read: వద్దమ్మా... బ్యాక్ నుంచి ఫోటోలు, వీడియోలు వద్దమ్మా - ముంబై పాపరాజీ వర్సెస్ హీరోయిన్ల గొడవేంటి?

టాలీవుడ్ డైరెక్టర్లతో చేసిన సినిమాలతో హిందీలో షాహిద్ కపూర్ భారీ బ్లాక్ బస్టర్ అందుకోవడం లేదంటే పెర్ఫార్మన్స్ విషయంలో పేరు తెచ్చుకోవడం జరిగింది. విజయ్ దేవరకొండ 'అర్జున్ రెడ్డి'ని హిందీలో ఆయన రీమేక్ చేశారు. ఆ సినిమాకు భారీ కలెక్షన్స్ వచ్చాయి. హిందీలో 'జెర్సీ' కమర్షియల్ సక్సెస్ కాలేదు. థియేటర్స్ దగ్గర కలెక్షన్స్ రాబట్టడంలో ఫెయిల్ అయ్యింది. అయితే, షాహిద్ నటనకు పేరు వచ్చింది. ఇప్పుడు మరోసారి టాలీవుడ్ డైరెక్టర్ చెప్పిన కథకు ఆయన ఆల్మోస్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

Also Read'జాతి రత్నాలు' to 'టిల్లు స్క్వేర్'... కామెడీ కాదు, కోవిడ్ తర్వాత కోట్లు కొల్లగొట్టిన పైసా వసూల్ ఫార్ములా

టాలీవుడ్ టాప్ హీరోలు, పాన్ ఇండియా రికగ్నైజేషన్ ఉన్న ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, నాగార్జునతో వంశీ పైడిపల్లి సినిమాలు తీశారు. మహేష్ బాబుకు ఆయన క్లోజ్. ప్రజెంట్ ఆ హీరోలు అందరూ బిజీ బిజీగా వున్నారు. దాంతో హిందీ హీరోకి కథ చెప్పారు. ప్రజెంట్ షాహిద్ కపూర్ 'దేవా' సినిమా చేస్తున్నారు. అందులో బుట్టబొమ్మ పూజ హెగ్డే హీరోయిన్. రెండు మూడు వెబ్ ప్రాజెక్టులు వున్నాయి. అవి కంప్లీట్ అయ్యాక వంశీ పైడిపల్లితో మూవీ వుంటుందట. నెక్స్ట్ ఇయర్ సెట్స్ మీదకు వెళ్లే ఛాన్స్ వుంది.

Also Readఅందంతో కాదు, నటనతో... వెండితెరపై రాజకీయం రంగరించిన హీరోయిన్లు

2024-04-25T05:37:32Z dg43tfdfdgfd