యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న వార్ 2పై భారీ అంచనాలు ఉన్నాయి. హృతిక్ రోషన్తో కలిసి ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ముంబైలో మొదలైంది. 10 రోజుల షూటింగ్ షెడ్యూల్ కూడా ఎన్టీఆర్ ముగించారు. ఇక ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్కి ఎన్టీఆర్-హృతిక్ కలిసి స్టెప్పులేస్తారని ఇటీవల ఓ వార్త వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై ఓ క్రేజీ అప్డేట్ వచ్చింది.
రిహార్సల్స్
వైభవి మర్చంట్ ఈ పాటకి కొరియోగ్రఫీ చేయబోతున్నారని సమాచారం. అయితే ఈ పాట కోసం హృతిక్ రోషన్తో కలిసి ఎన్టీఆర్ ప్రాక్టీస్ సెషన్లో పాల్గొనబోతున్నారని టాక్. ఎందుకంటే ఈ పాటకి కొన్ని క్రేజీ స్టెప్పులను కంపోజ్ చేస్తున్నారట. అంతేకాకుండా కేవలం మూడు రోజుల్లోనే ఈ పాటని షూట్ చేస్తారట. అందుకే ఎలాంటి ఆలస్యం అవ్వకుండా, వీలైనంత త్వరగా పాటను ముగించేందుకే ఈ రిహార్సల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.
అయితే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాస్త ఫైర్ అవుతున్నారు. ఎందుకంటే ఎన్టీఆర్ ఎంత గొప్ప డ్యాన్సర్ అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎలాంటి కష్టమైన మూమెంట్స్ అయినా ఆన్ ది స్పాట్ ఒక్కసారి చూసిన వెంటనే టేక్ చేస్తారు ఎన్టీఆర్. ఈ విషయాన్ని టాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్లు శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ చాలా సందర్భాల్లో చెప్పారు. అలాంటిది ఎన్టీఆర్తో ఇప్పుడు అన్ని రోజులు రిహార్సల్స్ చేయించడం ఏంటని కామెంట్లు పెడుతున్నారు. ఇదే నిజమైతే ఎన్టీఆర్ తన కెరీర్లోనే ఫస్ట్ టైమ్ ఓ సాంగ్ కోసం ఇంతలా రిహార్సల్స్ చేయబోతున్నారన్నమాట.
60 రోజుల పాటు
ఇక వార్ 2 సినిమా కోసం ఎన్టీఆర్ మొత్తం 60 రోజుల కాల్ షీట్స్ కేటాయించినట్టు టాక్. వార్ 1ను మించిపోయేలా వార్ 2 సినిమాలో యాక్షన్ సీక్వెన్స్లు ఉంటాయట. 2025 ఆగష్టు 14న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఎన్టీఆర్కి ఇది తొలి బాలీవుడ్ ప్రాజెక్ట్ కావడం విశేషం. ఇందులో సీక్రెట్ ఏజెంట్గా ఎన్టీఆర్ నటించబోతున్నారు. ఇందుకోసమే తన లుక్ను కూడా ఛేంజ్ చేశారు. ఇటీవల షూటింగ్ ముగసిన తర్వాత హృతిక్ రోషన్, ఆలియా భట్-రణబీర్ కపూర్తో కలిసి ఎన్టీఆర్ డిన్నర్కి వెళ్లారు. తన సతీమణి లక్ష్మీ ప్రణతితో కలిసి ఈ పార్టీకి హాజరయ్యారు ఎన్టీఆర్. అక్కడి నుంచి బయటికి వచ్చినప్పుడు తీసిన ఫొటోలు, వీడియోలు కూడా తెగ వైరల్ అయ్యాయి. ఇక వార్ 2 తర్వాత ఎన్టీఆర్ బాలీవుడ్లో బిజీ అయ్యే అవకాశం ఉందంటూ అక్కడి మీడియాలో వార్తలు వస్తున్నాయి.