WARANGAL NEWS: ఒకరికి తెలియకుండా మరొకరితో యువకుడు మూడు పెళ్లిళ్లు, నాలుగో అమ్మాయితో ప్రేమాయణం!

Telangana News: వరంగల్ నగరంలోని సుందరయ్య నగర్ లో నిత్య పెళ్లి కొడుకు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఒకరికి తెలియకుండా ఒకరికి మూడు ముళ్లు వేస్తూ పోయి.. ఇలా మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. మరో యువతితో తిరగడంపై మూడో పెళ్లి కూతురు తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది.

పోలీసులు, స్థానికులు వెల్లడించిన వివరాల ప్రకారం.. వరంగల్ నగరంలోని సుందరయ్య నగర్ చెందిన రాజేష్ హైదరాబాద్ లో కార్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. రాజేష్ డ్రైవర్ గా కొనసాగుతూ అమ్మాయిలను ప్రేమ పేరుతో బుట్టలో వేసుకునే పెళ్లి చేసుకుంటున్నాడు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ముగ్గురిని పెళ్లి చేసుకున్నాడు. ఫిబ్రవరి 2022న నగరంలోని చార్ బౌలీకి చెందిన సుమన ప్రియను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తర్వాత మే 2022న ఆంధ్రాకు చెందిన శ్రావణి హైదరాబాదులో రెండో పెళ్లి చేసుకున్నాడు. మూడో అమ్మాయి సుందరయ్య నగర్ కు చెందిన సారికతో ప్రేమాయణం సాగించాడు. 2024 ఫిబ్రవరిలో తీసుకెళ్లి హైదరాబాద్ ఆర్య సమాజంలో మూడో వివాహం చేసుకున్నాడని మూడో అమ్మాయి సారిక తల్లిదండ్రులు చెప్పారు. రాజేష్ ఇప్పుడు కరుణ అనే యువతతో తిరుగుతున్నాడని సారిక తల్లిదండ్రులు ఆరోపించారు.

నిన్న సుందరయ్య నగర్ రావడంతో సారిక తల్లిదండ్రులు రాజేష్ పట్టుకొని గొడవకు దిగడంతో పరారయ్యాడని సారిక తండ్రి రమణ వివరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎవరికి విడాకులు ఇవ్వకుండా తన కూతురిని మూడో పెళ్లి చేసుకున్న రాజేష్ పై చర్యలు తీసుకొని తన కూతురు జీవితాన్ని కాపాడాలంటూ సారిక తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.

2024-04-23T14:48:00Z dg43tfdfdgfd