అమ్మాయి పుట్టిందని.. ఏనుగు అంబారీపై ఊరేగింపుగా తీసుకొచ్చి స్వాగతం పలికి కుటుంబం

ఆడపిల్ల అంటే భారంగా భావించి..పురిటిలోనే వారిని చంపేస్తున్న నేటి రోజుల్లో ఓ కుటుంబం వేడుకలు చేసుకుని అందరికీ ఆదర్శంగా నిలిచింది. తమ వంశంలో 35 తర్వాత ఆడపిల్ల పుట్టడిందన్న ఆనందంతో ఓ కుటుంబం సంబరాలు చేసుకుంది. ఆ చిన్నారిని తమ ఇంటికి తీసుకొచ్చినప్పుడు ఘనంగా స్వాగతం పలికింది. పాపను అమ్మమ్మ ఇంటి నుంచి తీసుకొచ్చిన తండ్రి.. ఏనుగు అంబారీతో ఊరేగించాడు. ఈ అరుదైన ఈ ఘటన మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లా పచ్‌గావ్‌లో చోటుచేసుకుంది.

పచ్‌గావ్‌‌కు చెందిన గిరీశ్‌ పాటిల్‌, సుధ దంపతులకు ఐదు నెలల కిందట కూమార్తె పుట్టింది. పాపకు ముద్దుగా ‘ఐరా’ అని పేరు పెట్టుకున్నారు. ప్రసవానికి పుట్టింటికి వెళ్లిన భార్య, తన కుమార్తెను గిరీశ్ పాటిల్ తొలిసారిగా శనివారం తన ఇంటికి తీసుకొచ్చారు. గుజరాత్‌లోని హత్తివరోన్ నుంచి పచ్‌గావ్‌కు తీసుకొచ్చి.. ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఆమెకు గిరీశ్‌ ఘనస్వాగతం పలికాడు. కుమార్తెను ఊరు పొలిమేరల నుంచి ఏనుగుపై ఊరేగిస్తూ డప్పు వాయిద్యాల మధ్య ఇంటికి తీసుకువెళ్లాడు. చాలా ఏళ్ల తరవాత తమ ఇంట కూతురు పుట్టిందని పాటిల్‌ కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

గిరీశ్ పుణెలో సాఫ్ట్‌వేర్ ఇంజినీ‌ర్‌గా పనిచేస్తోన్న గిరీశ్.. బంధువులు, ఇరుగుపొరుగు వారిని ఆహ్వానించి ఘనంగా రిసెప్షన్‌ ఏర్పాటు చేశారు. ఇలా భిన్నమైన రీతిలో ఆడపిల్ల పుట్టడాన్ని స్వాగతించి సమాజానికి ఆదర్శంగా నిలిచారు. రెండేళ్ల కిందట రాజ‌స్థాన్‌కు చెందిన హ‌నుమాన్, చుకీదేవి అనే దంప‌తులు తమకు ఆడపిల్ల పుట్టిందని హెలికాప్టర్‌లో ఇంటికి తీసుకొచ్చారు. వారి వంశంలో 35 ఏళ్ల తర్వాత ఆడపిల్ల పుట్టడంతో సంతోషం వెల్లివిరిసింది. గతేడాది కూడా మహారాష్ట్రలోని పుణేకు చెందిన ఫ్యామిలీ సైతం ఏకంగా హెలికాప్టర్‌ను బుక్ చేసి ఔరా అనిపించింది. మహారాష్ట్రలోని పుణేకు చెందిన ఓ కుటుంబం ఆడపిల్లకు గ్రాండ్‌ వెల్కమ్ చెప్పింది. ఇటీవల అమృత్‌సర్‌కు చెందిన ఓ ఫ్యామిలీ సైతం తమకు ఆడపిల్ల పుట్టిందని రథంపై ఊరేగించారు.

Read More Latest National News And Telugu News

2023-05-28T02:29:25Z dg43tfdfdgfd