అవునా నిజమా: మనల్ని కాదని.. కాంగ్రెస్ సర్కారు నడుస్తదా : తలసాని

అవునా నిజమా: మనల్ని కాదని.. కాంగ్రెస్ సర్కారు నడుస్తదా : తలసాని

హైదరాబాద్: ‘గవర్నమెంట్ మారిందని క్యాడర్ సైలెంట్ ఉన్నదా..? హైదరాబాద్ గవర్నమెంట్ మనది.. మనను కాదని హైదరాబాద్ లో గవర్నమెంట్ నడుస్తదా..? గవర్నమెంట్ ఉండొచ్చు.. పోవచ్చు.. సనత్ నగర్ లో శ్రీనివాస్ యాదవ్ మాత్రం శాశ్వతంగా ఉంటడు.’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఇవాళ సనత్ నగర్ లో బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్ కు మద్దతుగా ప్రచారం చేశారు.

 పార్లమెంటు ఎన్నికలు అయ్యే దాకా ఆగాలని, ఆరు నెలలు ఎన్నికల కోసం టైం ఉంటే ఫుట్ బాల్ ఆడేవారమని అన్నారు. జూటా మాటలు, అమలు కాని హామీలతో కాంగ్రెస్ డ్రామాలు చేస్తోందని అన్నారు. ఎంపీ ఎన్నికల తర్వాత పనులకోసం పరుగులు పెట్టిస్తామని చెప్పారు. ప్రశ్నించే గొంతుకగా ఉన్న పద్మారావు గౌడ్ ను గెలిపించాలని కోరారు.

©️ VIL Media Pvt Ltd.

2024-04-25T12:48:26Z dg43tfdfdgfd