మొగలి రేకులు ఫేమ్ సాగర్ ని ఒక సీనియర్ నటి అందరి ముందుకు వీడికి బలుపు ఎక్కువ అందట. ఆమె ఎవరో? దానికి కారణం ఏమిటో చచూద్దాం...
చక్రవాకం, మొగలి రేకులు సీరియల్స్ తెలుగులో సూపర్ హిట్. ఈ రెండు సీరియల్స్ లో నటించిన సాగర్ బుల్లితెర ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆయనకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. ఆ సీరియల్స్ ద్వారా వచ్చిన ఫేమ్ తో సిల్వర్ స్క్రీన్ కి ఎంట్రీ ఇచ్చాడు.
ముఖ్యంగా మొగలి రేకులు సీరియల్ లో ఆర్ కే నాయుడుగా పాప్యులర్ అయ్యాడు. సాగర్ అనే ఒరిజినల్ నేమ్ కంటే కూడా ఆర్ కే నాయుడు గానే జనాలు గుర్తు పెట్టుకున్నారు. మిస్టర్ పర్ఫెక్ట్ మూవీలో ప్రభాస్ కి ఫ్రెండ్ ఆ నటించాడు.
2016లో సిద్ధార్థ టైటిల్ తో విడుదలైన చిత్రంలో సాగర్ హీరోగా నటించడం విశేషం. అలాగే మాన్ ఆఫ్ ది మ్యాచ్ టైటిల్ తో మరొక చిత్రం చేశాడు. హీరోగా సాగర్ చివరి చిత్రం షాదీ ముబారక్. ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ పర్లేదు అనిపించుకుంది. హీరోగా నిలబడాలన్న సాగర్ కోరిక నెరవేరలేదు.
చక్రవాకం సక్సెస్ తర్వాత ఎలా ముందుకు వెళ్లాలో సాగర్ కి అర్థం కాలేదట. ఆ సమయంలో సీనియర్ నటి రమాప్రభ ఒక తమిళ్ సీరియల్ కి రికమెండ్ చేసిందట. ఆ సీరియల్ లో సాగర్ హీరోగా ఎంపికయ్యాడట. చెన్నై వెళ్లి షూటింగ్ లో పాల్గొనాల్సి ఉండగా... అన్ని మాట్లాడుకున్నాక సాగర్ సీరియల్ చేయను అన్నాడట.
తాను రికమెండ్ చేస్తే మాట పోగొట్టాడని రమాప్రభ బాధపడ్డారట. అనంతరం మొగలిరేకులు సీరియల్ లో ఛాన్స్ వచ్చిందట. ఆ సీరియల్ సెట్స్ లోకి ఒకరోజు రమాప్రభ వచ్చారట. అక్కడున్న సాగర్ ని చూసి... వీడికి బలుపు ఎక్కువ. నేను ఒక మంచి తమిళ సీరియల్ ఆఫర్ ఇప్పిస్తే చేయను అన్నాడని ఆమె అన్నారట.
ఈ విషయాన్ని సాగర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. యాక్టింగ్ స్కూల్ లో సహజంగా నటించాలని శిక్షణ ఇచ్చారట. సీరియల్స్ లో మాత్రం డ్రమటిక్ గా నటించాల్సి వచ్చేదట. అప్పుడు చాలా ఇబ్బందిగా ఉండేదని సాగర్ వెల్లడించారు. ఇటీవల సాగర్ జనసేన పార్టీలో చేరిన విషయం తెలిసిందే...
2024-04-24T13:09:30Z dg43tfdfdgfd