Rama navami 2024: రామ నవమి నాడు ఈ 5 పనులు అస్సలు చేయకండి..!
రామభక్తులకు రామ నవమి పండుగ లాంటిది. రాముడిని ప్రసన్నం చేసుకోవడానికి అనేక మంత్రాలు, శ్లోకాలు చదవాలని మత గ్రంధాలు చెబుతున్నాయి. ఈ మంత్రాలు మరియు స్తోత్రాలను చదవడం వల్ల శ్రీరాముడు సంతోషిస్తాడని నమ్ముతారు. ముఖ్యంగా శ్రీరామరక్షా స్తోత్రాన్ని పఠించడం వల్ల జీవితంలోని అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు ఉంటాయి. దానికి పరిష్కారాలు వెతకాలి. అయితే దానికి దేవుని సహాయం కూడా కావాలి. కాబట్టి ఈ రామ నవమి నాడు తప్పకుండా ఈ శ్లోకాలు పఠించండి రామ నవమి పూజ ఎలా చేయాలి: ఈసారి రామ నవమి మార్చి 30న వస్తుంది. ఈ రోజున రామ రక్షా స్తోత్రాన్ని పఠించడం వల్ల జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు పెరుగుతుంది. దీనిని పఠించే ముందు తెల్లవారుజామున లేచి తలస్నానం చేసి శ్రీరాముని అనుగ్రహం పొందాలని పూజించాలి. ఉపవాస సమయంలో పుష్కలంగా నీరు త్రాగాలి. నిమ్మరసం, మంచినీరు, మజ్జిగ , గ్రీన్ టీ తాగడం ఇతర ఎంపికలు.పూజ సమయంలో దేవునికి అర్ఘ్యం సమర్పించండి.అయోధ్యలోని సరయు నదిలో పుణ్యస్నానం చేయడం వల్ల గత మరియు ప్రస్తుత పాపాలు తొలగిపోతాయి.రామచరిత మానస, రామ చాలీసా మరియు శ్రీరామ రక్షా స్తోత్రాలను కలిసి పఠించండి.ఈ రోజు రామ కీర్తనలు, భజనలు మరియు స్తోత్రాలను నిరంతరం పఠించడం ఉత్తమం. హనుమాన్ చాలీసా పఠించండి మరియు ప్రజలకు మరియు పేదలకు మీకు వీలైనంత దానం చేయండి.శ్రీరాముడు మధ్యాహ్న సమయంలో జన్మించినందున, ఈ సమయంలో రామనవమి పూజ చేయడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ రోజున అర్చనలు, నిర్దిష్ట పూజలు కూడా చేయవచ్చు.మీరు నిజాయితీగా ఉండండి. ఈ పవిత్రమైన రోజున చేయకూడని కొన్ని పనులు ఉన్నాయి:తామసిక ఆహారాలు, మాంసం మరియు ఆల్కహాల్ తీసుకోవడం మానుకోండి. ఉల్లి, వెల్లుల్లి వేయకుండా కూరలు చేయడం గురించి ఆలోచించండి.ఈ రోజున మీ జుట్టును కత్తిరించడం లేదా షేవింగ్ చేయడం మానుకోండి.ఇతరులను విమర్శించవద్దు లేదా చెడుగా మాట్లాడవద్దు.మీ భాగస్వామిని మోసం చేయవద్దు. ఎవరికీ ద్రోహం చేయవద్దు.(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఆధారాలు లేవు.)
2024-04-17T06:12:06Z
ఓటీటీలో 6 వెబ్ సిరీస్లను చూశారా.. ఒళ్లు గగుర్లు పొడిచే సీన్స్తో..
The Railway Men : శివ్ రావైల్ దర్శకత్వం వహించిన సిరీస్లో కెకె మీనన్, ఆర్. మాధవన్, దివ్యేందు శర్మ మరియు బాబిల్ ఖాన్. ఇందులో, ది రైల్వే మెన్ భారతీయ రైల్వేలతో సంబంధం ఉన్న నలుగురు వ్యక్తుల కల్పిత కథను చెబుతుంది. భోపాల్ చరిత్రలో అత్యంత దారుణమైన రాత్రి గురించి ఈ వెబ్ సిరీస్లో చూపించారు. దీనిని YRF ఎంటర్టైన్మెంట్ (యశ్ రాజ్ ఫిల్మ్స్ స్ట్రీమింగ్ విభాగం) నిర్మించింది. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో ప్రసారం అవుతోంది. నాలుగు గంటల నిడివి గల వెబ్ సిరీస్ ఎపిసోడ్ 1984 భోపాల్ విపత్తు సంఘటనలను హైలైట్ చేస్తుంది. Scam 1992:The Harshad Mehta Story: స్టాక్ బ్రోకర్ హర్షద్ మెహతా నిజ జీవితం చుట్టూ తిరిగే థ్రిల్లింగ్ బయోలాజికల్ ఫైనాన్షియల్ సిరీస్ ఇది. జర్నలిస్టులు సుచేతా దలాల్, దేబాశిష్ బసు రచించిన 1992 పుస్తకం ది స్కామ్ : హు వోన్, హూ లాస్ట్, హూ గాట్ అవే ఆధారంగా తెరకెక్కింది. స్టాక్ బ్రోకర్లు చేసిన 1992 ఇండియన్ స్టాక్ మార్కెట్ స్కామ్ను డిస్కస్ చేస్తుంది. హన్సల్ మెహతా దర్శకత్వం వహించారు, జై మెహతా కో-డైరెక్టర్గా పనిచేశారు, ఈ వెబ్ సిరీస్లో ప్రతీక్ గాంధీ, శ్రేయ ధన్వంతి, హేమంత్ ఖేర్, సతీష్ కౌశిక్ నటించారు. స్కామ్ 1992 అక్టోబరు 9, 2020న ప్రీమియర్ అయ్యింది. SonyLIVలో ప్రసారం అవుతోంది. Dahaad: ఇది ఒక పోలీస్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్, ఇందులో సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలో నటించింది. రీమా కగ్తి, జోయా అక్తర్ రూపోందించారు. రుచికా ఒబెరాయ్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్లో గుల్షన్ దేవయ్య, విజయ్ వర్మ, సోహమ్ షా ఇతర కీలక పాత్రలో నటించారు. ఈ వెబ్ సిరీస్ సీరియల్ కిల్లర్ మోహన్ కుమార్ జీవితం ఆధారంగా తీసుకుని తీశారు. అతన్ని సైనైడ్ మోహన్ అని కూడా పిలిచేవారు. ఈవెబ్ సిరీస్ మే 12, 2023 నుంచి Amazon Prime వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. Scoop: హన్సల్ మెహతా, మృణ్మయీ లాగూ వైకులే నిర్మించి, దర్శకత్వం వహించిన స్కూప్ సిరీస్లో కరిష్మా తన్నా, మహమ్మద్ జీషన్ అయ్యూబ్,హర్మాన్ బవేజా ప్రధాన పాత్రల్లో నటించారు. ఇందులో ప్రోసెన్జిత్ ఛటర్జీ, తన్నిష్ఠ ఛటర్జీ, దేవెన్ భోజాని కూడా సహాయక పాత్రల్లో నటించారు. ఈ స్కూప్ జిగ్నా వోరా జీవితచరిత్ర స్మృతి బిహైండ్ బార్స్ ఇన్ బైకుల్లా : మై డేస్ ఇన్ ప్రిజన్ ఆధారంగా రూపొందించబడింది. ఈ సిరీస్ జూన్ 2011లో మిడ్-డే రిపోర్టర్ జ్యోతిర్మయి డే హత్యను డిస్కస్ చేస్తుంది. ఈ క్రైమ్ డ్రామా సిరీస్ జూన్ 2, 2023 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది.Delhi Crime: ఢిల్లీ క్రైమ్లో షెఫాలీ షా, రసిక దుగ్గల్, ఆదిల్ హుస్సేన్ , రాజేష్ తైలాంగ్ నటించారు. ఈ సిరీస్ మొదటి సీజన్ 2012లో దక్షిణ ఢిల్లీలో జరిగిన ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేసు ఆధారంగా వచ్చింది. గ్యాంగ్రేప్ సంఘటన తర్వాత, మహిళా బాధితురాలిని కొట్టి చంపడానికి కారణం ఏంటీ.. ఈ నిందితులను డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డిసిపి) వర్తికా చతుర్వేది ఎలా కనుగొన్నారు అనే విషయాలను డిస్కస్ చేశారు. మొదటి సీజన్ మార్చి 22, 2019 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఇక రెండవ సీజన్ ఆగస్టు 26, 2022 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. రెండో సీజన్ చడ్డీ బనియన్ గ్యాంగ్పై ఫోకస్ చేసింది. ఈ రెండు సీజన్లు నెట్ఫ్లిక్స్లో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతున్నాయి. Jamtara– Sabka Number Ayega: సౌమేంద్ర పాధి నిర్మించి, దర్శకత్వం వహించిన ఇండియన్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్ ఇది. జమ్తారా - సబ్కా నంబర్ ఆయేగాలో అమిత్ సియాల్, దిబ్యేందు భట్టాచార్య, అక్ష్ పర్దసాని, స్పర్ష్ శ్రీవాస్తవ, అన్షుమాన్ పుష్కర్ తదితరులు నటించారు. ఇండియాలో జరిగే ఫిషింగ్ రాకెట్ను నడిపే వ్యక్తుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ సిరీస్ మొదటి సీజన్ను జనవరి 10, 2020 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఇక రెండవ సీజన్ను సెప్టెంబర్ 23, 2022 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ రెండు సీజన్లు నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్కు అందుబాటులో ఉన్నాయి.
2024-04-17T12:42:09Z
తిరుమల శ్రీవారిని మొదటి గడప నుంచి దర్శించుకోవాలా? ఈ లక్కీ ఛాన్స్ మీకోసమే
తిరుమలలో శ్రీవారి దర్శనానికి వెళ్లాలనుకునే భక్తులకు గుడ్ న్యూస్. జూలై నెల కోటాను విడుదల చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన జూలై నెల కోటాను ఇవాళ ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేసింది. తిరుమల ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం భక్తులు ఏప్రిల్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. అదేరోజు మధ్యాహ్నం 12 గంటలకు లక్కీడిప్ జరుగుతుంది. లక్కీ డిప్లో టికెట్లు పొందిన వారు డబ్బులు చెల్లించి ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్ల కోటాను ఏప్రిల్ 22వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన జూలై నెల కోటాను ఏప్రిల్ 22న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. జూలై నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను ఏప్రిల్ 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన జూలై నెల ఆన్ లైన్ కోటాను ఏప్రిల్ 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా జూలై నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను ఏప్రిల్ 23న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఇక జూలై నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఏప్రిల్ 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. తిరుమల, తిరుపతిలో జూలై నెల గదుల కోటాను ఏప్రిల్ 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. ఏప్రిల్ 27న శ్రీవారి సేవ ఉదయం 11 గంటలకు, నవనీత సేవ మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవ మధ్యాహ్నం 1 గంటకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. భక్తులు ఈ విషయాలను గమనించి టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ కోరుతోంది. లక్కీ డిప్లో పాల్గొనాలనుకునే భక్తులు ముందుగా https://ttdevasthanams.ap.gov.in/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. మొబైల్ నెంబర్, ఇతర వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి. రిజిస్ట్రేషన్ పూర్తైన తర్వాత లాగిన్ చేయాలి. లాగిన్ అయ్యాక ఇతర వివరాలు నమోదు చేసి లక్కీ డిప్లో టికెట్స్ సెలెక్ట్ చేయాలి. టీటీడీ ముందుగా చెప్పిన సమయానికి లక్కీ డ్రా నిర్వహిస్తుంది లక్కీ డిప్లో టికెట్స్ వచ్చినవారు డబ్బులు చెల్లించి టికెట్స్ తీసుకోవచ్చు. ఆ తర్వాత తిరుమలలో గదుల కోసం రిజిస్ట్రేషన్ చేయొచ్చు.
2024-04-18T04:45:42Z