‘కూలీ’పై ఇళయారాజా నోటీసులు.. రజినీకాంత్ అలా అనేశాడేంటి?

రజినీకాంత్ కూలీ సినిమా మీద ఇళయారాజా కేసు వేసిన సంగతి తెలిసిందే. కూలీ టీజర్‌లో తన పాత పాటను వాడుకున్నారని, తన అనుమతి తీసుకోలేదంటూ సన్ పిక్చర్స్‌కి ఇళయారాజా నోటీసులు అందించారు. ఇలా పాటల మీద చాలా మంది నోటీసులు అందిస్తున్నారు. గతంలో ఎస్పీబీకి ఇళయారాజా నోటీసులు ఇచ్చాడు. తనకు రాయల్టీ చెల్లించకుండా తన పాటలను స్టేజ్ మీద పాడుకుంటున్నారని, వాడుకుంటున్నారని ఇళయారాజా కేసు వేశాడు. ఈ మధ్య ఎస్పీబీ వాయిస్‌ను ఏఐ చేశారంటూ ఎస్పీ చరణ్ కూడా కేసు వేసిన సంగతి తెలిసిందే.

ఇక కూలీ సినిమాలో తన అనుమతి లేకుండా ట్యూన్‌ను, పాటను వాడుకున్నారంటూ ఇళయారాజా సన్ పిక్చర్స్‌కు నోటీసులు ఇచ్చాడు. ఈ విషయంలో తాజాాగా రజినీకాంత్ స్పందించాడు. వేట్టయాన్ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని ముంబై నుంచి చెన్నైకి వచ్చిన రజినీ.. ఎయిర్ పోర్టులో మీడియా అడిగిన వాటికి సమాధానాలు ఇచ్చాడు. కూలీ టీజర్ రెస్పాన్స్ బాగుందన్నాడు తలైవా. ఇళయారాజా ఇచ్చిన నోటీసు గురించి అడిగితే.. అది ఇళయారాజా, నిర్మాతలు చూసుకుంటారని అన్నాడు.

ఇక వేట్టయాన్ సినిమా ఎక్కడి వరకు వచ్చిందంటూ అడిగితే.. 80 శాతం పూర్తయిందని క్లారిటీ ఇచ్చాడు. రజినీకాంత్ ప్రస్తుతం ఈ కాంట్రవర్సీలో మాత్రం చేతులెత్తేసినట్టుగానే కనిపిస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్, నిర్మాతలే చూసుకుంటారని, తనకేం సంబంధం లేదన్నట్టుగా రజినీకాంత్ చెప్పేశాడు. వెంకట్ ప్రభు వేట్టయాన్, లోకేష్ కనకరాజ్ కూలీ సినిమాలతో రజినీకాంత్ ప్రస్తుతం బిజీగా ఉన్నాడు. గతేడాది జైలర్‌తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. కానీ ఇదే ఏడాది లాల్ సలామ్ అంటూ డిజాస్టర్ మూవీతో అభిమానుల్ని నిరాశ పరిచాడు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-04T12:48:51Z dg43tfdfdgfd