కడియం శ్రీహరి తన రాజకీయ జీవితాన్ని భూస్థాపితం చేసుకుండు: కేసీఆర్

కడియం శ్రీహరి తన రాజకీయ జీవితాన్ని భూస్థాపితం చేసుకుండు: కేసీఆర్

కడియం శ్రీహరి చేసిన మోసంతో ఆయన తన రాజకీయ జీవితాన్ని ఆయనే  భూస్థాపితం చేసుకున్నాడని  బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అన్నారు.  కడియం శ్రీహరి ఎందుకు పార్టీ మారారని ప్రశ్నించారు.  రాబోయే మూడు నెలల్లో స్టేషన్ ఘన్ పూర్ లో ఉపఎన్నిక వస్తుందని..  తాటికొండ రాజయ్య ఎమ్మెల్యే అవుతారని జోస్యం చెప్పారు.  హన్మకొండ చౌరస్తాలో జరిగిన రోడ్ షోలో కేసీఆర్ పాల్గొన్నారు.  ఓరుగల్లు పోరుగల్లుగా మారితేనే తెలంగాణ వచ్చిందన్నారు  కేసీఆర్. హన్మకొండ చౌరస్తాలో జరిగిన రోడ్ షోలో కేసీఆర్ పాల్గొన్నారు. తెలంగాణ వచ్చాక వరంగల్ జిల్లాకు 5 మెడికల్ కాలేజీలు వచ్చాయన్నారు. 

పదేళ్ల కిందట వంద నినాదాలు చెప్పిన మోదీ ఒక్కటైన నిజం చేశారా అని కేసీఆర్ ప్రశ్నించారు.  వరంగల్ కు రావాల్సిన కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీని గుజరాత్ కు తరలించారని మండిపడ్డారు. బీజేపీకి దేశంలో 200 సీట్లు కూడా దాటేలా లేదన్నారు. తెలంగాణ కోసం కొట్లాడే ఏకైక పార్టీ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు పార్లమెంట్ లో ఉండాలన్నారు.  యువకుడు, ఉద్యమకారుడు సుధీర్‌కుమార్‌  ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.  

©️ VIL Media Pvt Ltd.

2024-04-28T16:00:50Z dg43tfdfdgfd