కొడుకుకు బాధ్యతను గుర్తు చేసిన్రు

కొడుకుకు బాధ్యతను గుర్తు చేసిన్రు

నవాబుపేట, వెలుగు: కన్నతల్లికి తిండిపెట్టకుండా, వైద్యం చేయించకుండా ఇంట్లో నుంచి వెళ్లగొట్టిన కొడుకుకు సీనియర్స్​ సిటిజన్స్​ ఫోరం సభ్యులు కౌన్సిలింగ్​ ఇచ్చారు. మండలంలోని యన్మన్​గండ్ల గ్రామానికి చెందిన కొల్లూరు మైసమ్మ (70)ని ఆమె  కొడుకు నర్సింలు, కోడలు వేధించి ఇంట్లో నుంచి వెళ్లగొట్టారు. అప్పటి నుంచి ఆమె మహబూబ్​నగర్​లో ఉంటున్న కూతురు వెంకటమ్మ ఇంట్లో ఉంటోంది.

Also Read:సాగు నీటి దినోత్సవానికి  స్పందన  కరవు..

ఇటీవల కూతురుకు భారం కావద్దని భావించి వమోవృద్ధుల సహాయ కేంద్రాన్ని సంప్రదించగా, బుధవారం నవాబుపేటలోని సీనియర్​​సిటిజన్స్​ ఫోరం ఆఫీసులో సహాయ కేంద్రం సభ్యులు, ఫోరం సభ్యులు పోలీసుల సమక్షంలో నర్సింలుకు కౌన్సిలింగ్​ ఇచ్చారు. తల్లి పోషణ కోసం ప్రతి నెలా రూ.3 వేలు చెల్లించాలని, ప్రతి వారం తల్లిని కలవాలని సూచించారు. నాగరాజు, నాగభూషణం, చిగిళ్లపల్లి నర్సింలు, వెంకటేశ్వరప్ప, చంద్రశేఖర్,​ గాండ్లశంకరయ్య, వెంకటేశ్, చిన్నయ్య, ఏఎస్ఐ ఆనంద్, పండరీనాథ్​ పాల్గొన్నారు.

©️ VIL Media Pvt Ltd.

2023-06-08T05:48:57Z dg43tfdfdgfd