పూజా కార్యక్రమాలతో తిండిబోతు దెయ్యం ప్రారంభం

పూజా కార్యక్రమాలతో తిండిబోతు దెయ్యం ప్రారంభం

నరసింహ బోదాసు హీరోగా నటిస్తూ, దర్శక నిర్మాతగా రూపొందిస్తున్న చిత్రం ‘తిండిబోతు దెయ్యం’. మోనికా సమత్తార్, తన్నీరు వాసవి  హీరోయిన్లుగా నటిస్తున్నారు. మంగళవారం పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు.  దర్శకులు రేలంగి నరసింహారావు క్లాప్ కొట్టి మూవీ టీమ్‌‌‌‌‌‌‌‌కు బెస్ట్ విషెస్ చెప్పారు. ఈ సందర్భంగా నరసింహ బోదాసు మాట్లాడుతూ ‘కామెడీతో కూడిన హారర్ సినిమా ఇది. 

చాలా కొత్తగా ఉంటుంది. ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారని నమ్మకం ఉంది’ అని అన్నాడు. మంచి కాన్సెప్ట్ ఉన్న చిత్రంలో నటిస్తున్నందుకు ఆనందంగా ఉందని హీరోయిన్స్ చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో  డైలాగ్ రైటర్ శ్రీకాంత్ సాయి తదితరులు పాల్గొన్నారు.

©️ VIL Media Pvt Ltd.

2024-05-01T02:55:52Z dg43tfdfdgfd