ప్రియాంక అవసరం జాతీయ స్థాయిలో ఉంది: జైరాం రమేశ్
న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ అవసరం జాతీయ స్థాయిలో ఉందని కాంగ్రెస్ నేషనల్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ పేర్కొన్నారు. ‘ప్రధాని మోదీ ప్రచారం చేస్తున్న అబద్ధాల ను తిప్పికొట్టడంలో ప్రియాంక నిమగ్నమయ్యారు.
ప్రచారంలో తీరిక లేకుండా పాల్గొంటున్నరు. అందుకే ఏదో ఒక నియోజకవర్గాని కి ఆమె పరిమితం కావద్దనే ఉద్దేశంతో ఈ ఎన్నికల్లో పోటీ చేయట్లేదు. భవిష్యత్తులో ఏదైనా ఉప ఎన్నికలో ఆమె పోటీ చేసి పార్లమెంటులో అడుగు పెడతారు’’ అని జైరాం రమేశ్ వివరించారు.
©️ VIL Media Pvt Ltd. 2024-05-04T03:37:38Z dg43tfdfdgfd