బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య

బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య

నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో ఘోరం జరిగింది. ట్రిపుల్ ఐటీలో పీయూసీ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థి అరవింద్ ఆత్మహత్య చేసుకున్నాడు. హాస్టల్ గదిలో ఊరి వేసుకున్నాడు.  అరవింద్ డెడ్ బాడీని అతని స్నేహితులు షాక్ కు గురయ్యారు. డెడ్ బాడీ గురించి కాలేజీ యాజమాన్యానికి తెలిపారు. యాజమాన్యం పోలీసులను పిలిచి అరవింద్ బాడీని రికవరీ చేపించారు. పోలీసులు ఘటనా స్థలంలో విచారణ జరిపారు.

 విద్యార్థి బుచ్చ అరవింద్ సిద్దిపేట జిల్లా బండార్ పల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఘటనపై అతని కుటుంబ సభ్యులకు ఇన్ ఫాం చేశామని పోలీసులు తెలిపారు. విద్యార్థి ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు అన్నారు. ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నామని తెలపారు. 

©️ VIL Media Pvt Ltd.

2024-04-16T05:12:10Z dg43tfdfdgfd