భర్తల గెలుపు కోసం భార్యల ప్రచారం
షాద్ నగర్/పరిగి, వెలుగు: మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డికి మద్దతుగా ఆయన సతీమణి ఆశ్లేషరెడ్డి ఆదివారం కొత్తూరు, కేశంపేట, షాద్ నగర్ ప్రాంతాల్లో విస్తృత ప్రచారం చేశారు. ఆమె వెంట షాద్నగర్ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, ఆయన సతీమణి అనురాధ, ఎంపీపీ ప్రియాంక గౌడ్, జడ్పీటీసీ తాండ్ర విశాల, కౌన్సిలర్ విశాల ఉన్నారు.
అలాగే చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డికి మద్దతుగా ఆయన సతీమణి కొండా సంగీతారెడ్డి ఆదివారం పరిగి నియోజకవర్గంలోని ఇబ్రహీంపూర్, గడి సింగాపూర్, పరిగి టౌన్ లో డోర్టు డోర్ప్రచారం చేశారు. ఈ సందర్భంగా పలువురు బీఆర్ఎస్, కాంగ్రెస్కార్యకర్తలు ఆమె సమక్షంలో బీజేపీలో చేరారు.
©️ VIL Media Pvt Ltd. 2024-04-29T01:47:29Z dg43tfdfdgfd