ముర్ముకు సురినామ్ పౌర పురస్కారం..140 కోట్ల మందికి గౌరవం

ముర్ముకు సురినామ్ పౌర పురస్కారం..140 కోట్ల మందికి గౌరవం

పరమారిబో: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సురినామ్  అత్యున్నత పౌర పురస్కారం లభించింది. ‘గ్రాండ్  ఆర్డర్ ఆఫ్ ద చైన్  ఆఫ్​ ది ఎల్లో స్టార్’ అవార్డును సురినామ్ ప్రెసిడెంట్ చంద్రికా పర్సాద్  సంతోఖి.. ముర్ముకు అందజేశారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను గౌరవిస్తూ ముర్ముకు ఈ అవార్డును ప్రదానం చేశారు. ఈమేరకు ఢిల్లీలోని రాష్ట్రపతి కార్యాలయం ఒక ప్రకటనను విడుదల చేసింది.

ఈ సందర్భంగా సంతోఖి, సురినామ్  ప్రభుత్వానికి ముర్ము కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవార్డుతో ఇండియాలోని 140 కోట్ల మందికీ గౌరవం లభించిందన్నారు. దేశ ప్రజలకు ఈ పురస్కారాన్ని అంకితం చేస్తున్నానని తెలిపారు. సురినామ్ అత్యున్నత పౌర పురస్కారం అందుకున్న రాష్ట్రపతికి ప్రధాని మోడీ ట్విట్టర్​లో అభినందనలు తెలిపారు. కాగా, ముర్ము ఈ నెల 4 నుంచి 6 వరకు సురినామ్​లో పర్యటించారు. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి విదేశీ పర్యటన ఇదే!

©️ VIL Media Pvt Ltd.

2023-06-07T03:33:36Z dg43tfdfdgfd