రామ్ చరణ్ కొత్త బ్యానర్‌పై ఫస్ట్ మూవీ.. గ్లింప్స్ రిలీజ్ చేసి అంచనాలు పెంచేసిన మేకర్స్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ఓ వైపు హీరోగా రాణిస్తూనే మరోవైపు వ్యాపార రంగంలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే సొంతంగా కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ స్థాపించి పలు సినిమాలు నిర్మించిన ఆయన.. ఇప్పుడు ప్రొడ్యుసర్ విక్రమ్ రెడ్డి కలిసి మరో బ్యానర్ స్టార్ట్ చేశారు. వి మెగా పిక్చర్స్ (V Mega Pictures) అనే పేరుతో కొత్త నిర్మాణ సంస్థ ఓపెన్ చేసి తాజాగా ఈ బ్యానర్ నుంచి రాబోతున్న తొలి సినిమాను ప్రకటించారు. కొత్త ట్యాలెంట్‌ ఎంకరేజ్ చేయాలనే ఆలోచనతో ఈ బ్యానర్ స్టార్ట్ చేశారు రామ్ చరణ్.

ఈ నేపథ్యంలోనే యంగ్ హీరో నిఖిల్ తో ఫస్ట్ మూవీ ప్లాన్ చేశారు. ది ఇండియా హౌస్ (The India House Movie) అనే పేరుతో ఈ సినిమా రానుందని తెలుపుతూ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. వి మెగా పిక్చర్స్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు రామ్ వంశీ కృష్ణ దర్శకత్వం వహించనున్నారు. మన భారత దేశానికి స్వాతంత్య్రం రాక ముందు కాలంలో సాగే కథతో ది ఇండియా హౌస్ మూవీ తెరకెక్కనుంది. లండన్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ఎన్నో కీలక విషయాలు ప్రస్తావించనున్నారని తాజాగా వదిలిన గ్లింప్స్ వీడియో చెప్పకనే చెబుతోంది.

ఈ సినిమాలో శివగా నిఖిల్ కనిపించనుండగా.. అనుపమ్ ఖేర్ మరో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. కాగా తమ బ్యానర్ పై రాబోతున్న తొలి సినిమాపై ట్విట్టర్ లో ట్వీట్ చేశారు రామ్ చరణ్ . స్వాతంత్య్ర సమరయోధులు వీర్ సావర్కర్ 140వ జయంతి సందర్భంగా 'ది ఇండియా హౌస్' చిత్రాన్ని అనౌన్స్ చేయడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు.

మరోవైపు ప్రస్తుతం బడా దర్శకుడు శంకర్ తో కలిసి గేమ్ ఛేంజర్ మూవీ చేస్తున్నారు రామ్ చరణ్. ఈ సినిమాలో చెర్రీ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమా సెట్స్ పై బిజీగా ఉంటూనే నిఖిల్ తో తాను నిర్మించబోయే సినిమా కోసం కసరత్తులు చేస్తున్నారట రామ్ చరణ్.

2023-05-28T07:27:52Z dg43tfdfdgfd