వరుడి ముఖంపై యాసిడ్ పోసిన గర్ల్ ఫ్రెండ్

వరుడి ముఖంపై యాసిడ్ పోసిన గర్ల్ ఫ్రెండ్

ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది.  ఒక అమ్మాయి తన ప్రియుడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడనే కోపంతో అతని ముఖంపై యాసిడ్ పోసింది. అదృష్టవశాత్తు అతను స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.  రాకేష్‌ బింద్‌, లక్ష్మి గతకొంతకాలంగా ప్రేమలో ఉన్నారు.  కానీ ఆ అమ్మాయిని కాదని రాకేష్ తల్లిదండ్రులు అతనికి మరో అమ్మాయితో పెళ్లి ఫిక్స్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న లక్ష్మి..  ఆగ్రహంతో  పెళ్లి ఊరేగింపులో ఉన్న రాకేష్  ముఖంపై యాసిడ్ పోసింది. 

కానీ అదృష్టవశాత్తు అతనికి పెద్దగా  గాయపడలేదు.  ఘటనానంతరం రాకేష్‌ను స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. రాకేష్ తల్లి మునిదేవి ఫిర్యాదు మేరకు లక్ష్మిపై కేసు నమోదు చేసింది. పోలీసులు  లక్ష్మిని అదుపులోకి తీసుకుని విచారించగా..  రాకేష్‌కు లక్ష్మితో గతంలో ప్రేమ వ్యవహారం ఉందని, అయితే తనను  కాకుండా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని వెల్లడించింది.    వరుడి తల్లి ఫిర్యాదు చేసినట్లు పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ మున్నా లాల్ యాదవ్ తెలిపారు. సెక్షన్ 326బి కింద కేసు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకుంటున్నారు.

©️ VIL Media Pvt Ltd.

2024-04-24T10:14:13Z dg43tfdfdgfd