విశ్వంభరలో ప్రముఖ కాంగ్రెస్ నేత కీలకపాత్ర.. ఈ కాంబినేషన్‌కు విజిల్స్ వేస్తారు...

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం భోళా శంకర్ డిజాస్టర్ తర్వాత విశ్వంభర (Vishwambhara) అనే ఫ్యాంటసీ మూవీలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ను జరుపుకుంటోంది. బింబిసారతో భారీ విజయాన్నిఅందుకున్న వశిష్ట మల్లిడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా చేస్తోంది. మరో కీలకపాత్రలో అనుష్క శెట్టి కూడా నటిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ఇక లేటెస్ట్ సమాచారం మేరకు ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో సీనియర్ హీరోయిన్, నటి, రాజకీయవేత్త విజయశాంతి నటిస్తున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు ఇప్పటికే విజయశాంతిని కలిసి, తన పాత్ర గురించి చెప్పినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో త్వరలో క్లారిటీ రానుంది. గతంలో చిరంజీవి, విజయశాంతి కలయికలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే. మరి ఈ కాంబినేషన్ మళ్ళీ కుదిరితే విశ్వంభర కు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు సినీ విశ్లేషకులు.

భారీ అంచనాల నడుమ వస్తోన్న ఈ సినిమా విడుదల (Vishwambhara Release date) తేది విషయంలో తాజాగా టీమ్ ఓ ప్రకటన చేసింది. ఈసినిమా 2025 జనవరి 10న విడుదలకానుందని టీమ్ అధికారికంగా ప్రకటించింది. అదిరే గ్రాఫిక్స్‌తో వస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఇక ఈ భారీ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

ఇక మరోవైపు భారత ప్రభుత్వం చిరంజీవికి అత్యంత ప్రతిష్టాత్మక అవార్డ్ పద్మ విభూషణ్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయనకు పద్మ భూషణ్ వరించగా.. లేటెస్ట్‌గా పద్మ విభూషణ్ అవార్డ్ వరించింది. సినీరంగానికి చేసిన సేవతో పాటు ఆ మధ్య కరోనా సమయంలో.. లాక్‌డౌన్‌ రావడంతో సినీ కార్మికులను, సామాన్యులను ఆదుకునేందుకు చిరంజీవి చేసిన సేవలను గుర్తించి ప్రభుత్వం ఆయనను పద్మవిభూషణ్‌తో సత్కరించింది.

ఇక బింబిసార సినిమా తర్వాత చిరంజీవి ఈ సినిమా తర్వాత.. తన తదుపరి సినిమాను ఇప్పటి వరకు అపజయమే ఎరుగని దర్శకుడు అనిల్ రావిపూడితో ఉండనుందని తెలుస్తోంది. ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ కామెడీతో ఎంటర్టైనింగ్ ఉంటుందని తెలుస్తోంది. అంతేకాదు ఓ చిన్న మెసేజ్ కూడా ఉంటుందట. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది.

2024-04-23T11:09:54Z dg43tfdfdgfd