వెండితెరపై మరో సారి రామాయణం, సీతగా సాయి పల్లవి... మరి రాముడు ఎవరు..?

నేచురల్ బ్యూటీ సాయి పల్లవి సీత పాత్రలో కనిపించబోతుందా..? వెండితెరపై మరో రామాయణం ఆవిష్క్రుతం కాబోతోందా..? మరి రాముడి పాత్రలో ఎవరు కనిపించబోతున్నారు...? 

ఇప్పటికే ఆదిపురుష్ క్రియేట్ చేసిన బజ్ అంతా ఇంతా కాదు. ఈసినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు.. దేశవ్యాప్తంగా ఆడియన్స్ ఎంతో ఉత్కంటతో ఎదరుచూస్తున్నారు. ఈక్రమంలో ఈనెల 16న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కు రెడీ అవుతుంది ఆదిపురుష్. రాముడిగా ప్రభాస్, సీతగా కృతీసన్ సందడి చేయబోతున్నారు. ఇక ఆదిపురుష్ రిలీజ్ కంటే ముందే.. మరో రామాయణానికి సబంధించి మరో సినిమా అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈమూవీలో సీతగా సాయి పల్లవి సందడి చేయబోతున్నట్టు తెలుస్తోంది. 

చూసీగా సినిమాలు చేసుకుంటూ.. కూల్ గా వెళ్లిపోతుంది ఈ నేచ్యురల్ బ్యూటీ సాయిపల్లవి.  వచ్చాయి కదా అని పోలొమని సినిమాలు చేయకుండా హీరోయిన్ ఇంపార్టెన్స్ ఉన్న సినిమాలు మాత్రమే చేస్తూ వెళ్తోంది. ఇక ఆమధ్య ఆమె సినిమాలకు చాలా గ్యాప్ ఇచ్చింది.  విరాటపర్వం, గార్గీ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న సాయి.. తాజాగా తమిళ నేచురల్ స్టార్  శివ కార్తీకేయన్ సినిమాలో నటించబోతుంది. 

 

ఇక ప్రస్తుతం సాయి పల్లవికి సంబంధించిన ఓ న్యూస్ ఫిల్మ్ సర్కిల్ లో తెగ వైరల్ అవుతోది. ఒక రకంగా  హల్ చల్ చేస్తోంది. ఆమె బాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతున్నట్లు అది కూడా ఓ మైథలాజికల్ మూవీతో ఎంట్రీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది పురాణ ఇతిహాస గాధలకు సంబంధించిన రామాయణ  కథలో ఆమె నటించబోతుందట. 

ఈ జనరేషన్ కు తగ్గట్టు.. ఇప్పటికే ఆదిపురుష్ సినిమా  రిలీజ్ కు రెడీగా ఉండగా.. మరోసారి రామయాణాన్ని సిల్వర్ స్క్రీన్‌పై ఆవిష్కరించనున్నారట. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితీష్ తివారి దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుందని సమాచారం. అందులో సీత పాత్రలో సాయిపల్లవిని  ఊహించుకున్నాడట దర్శకుడు.ఆమె అయితేనే సరిపోతుందన్న భావనలో ఉన్నాడట డైరెక్టర్. 

అయితే  రాముడి పాత్రలో రణబీర్ కపూర్ అయితే బాగుంటుందని ఫిక్స్ అయ్యారట మేకర్స్.. ఇక  రావణుడిగా కండల వీరుడు  హృతిక్ రోషన్ ఎంపిక చేయనున్నారని సమాచారం. అయితే ఈ ప్రాజెక్టుపైఇప్పటి వరకూ అఫీషియల్ గా మాత్రం అనౌన్స్ మెంట్ రాలేదు. అలసే  సాయి పల్లవికి చాలా భక్తి ఎక్కువ. ఇప్పుడు ఈ సీత పాత్ర తన వద్దకు వస్తే ఒప్పుకుంటుందో లేదో చూడాలి. కాగా,

 ప్రస్తుతం దర్శకుడు నితీష్.. వరుణ్ ధావన్,జాన్వీ కపూర్ జంటగా బవాల్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి.. ఆ తర్వాత ఆ సినిమాపై కసరత్తులు చేయనున్నారు. అయితే బాలీవుడ్ లో ఇప్పటికే కొన్ని ఘట్టాలు తీసుకుని ఆదిపురుష్ తెరకెక్కింది. మరి ఈ సినిమాలో ఆదిపురుష్ కు టచ్ లేకుండా.. ఇతర ఘట్టాలను తీసుకుని డెవలప్ చేయబోతున్నట్టు సమాచారం. 

2023-06-08T05:36:12Z dg43tfdfdgfd