శర్వానంద్ ప్రయాణిస్తున్న కారు బోల్తా.. కొద్ది రోజుల్లో పెళ్లి ఉండగా ప్రమాదం

టాలీవుడ్ క్రేజీ హీరో శర్వానంద్ ప్రమాదానికి గురయ్యారు. ఈ న్యూస్ టాలీవుడ్ ని, శర్వానంద్ అభిమానులని షాక్ కి గురిచేస్తోంది. మరికొద్ది రోజుల్లో శర్వానంద్ పెళ్లి ఉండగా ఇలా కారు ప్రమాదానికి గురయ్యారు. 

ఈ ప్రమాదంలో శర్వానంద్ కి స్వల్ప గాయాలు అయినట్లు తెలుస్తోంది. ఈ తెల్లవారుజామున ఫిలిం నగర్ జంక్షన్ వద్ద రేంజ్ రోవర్ కారులో శర్వానంద్ ప్రయ్నస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కారు బోల్తా పడడంతో అక్కడ ఉన్న వారు వెంటనే స్పదించి శర్వాని ఆసుపత్రికి తరలించారట. 

కేవలం శర్వకి స్వల్ప గాయాలు మాత్రమే కావడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటన పై శర్వా ఫ్యామిలీ ఇంకా స్పందించలేదు. శర్వానంద్ కారు ప్రమాదం వార్త విన్న కుటుంబ సభ్యులు కంగారుతో స్పాట్ కి చేరుకున్నారు. ఎదురుగా వస్తున్న టూ వీలర్ ని తప్పించే క్రమంలో శర్వానంద్ కారు డివైడర్ ని ఢీ కొట్టినట్లు తెలుస్తోంది. 

కాస్ట్లీ రేంజ్ రోవర్ కారు కావడంతో సేఫ్టీ ఫీచర్స్ అద్భుతంగా పనిచేసినట్లు తెలుస్తోంది. దీనితో శర్వాకి పెద్ద ప్రమాదమే తప్పింది అని అంటున్నారు. అయితే ఈ ప్రమాదంపై పోలీసుకు కానీ, కుటుంబ సభ్యులు కానీ అధికారికంగా ప్రకటించలేదు. ఏది ఏమైనా శర్వానంద్ చిన్నపాటి గాయాలతో తప్పించుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. 

ఇదిలా ఉండగా జూన్ 2, 3 తేదీల్లో శర్వానంద్ వివాహం రక్షిత రెడ్డితో జరగనుంది. జైపూర్ లో లీలా ప్యాలెస్ లో ఆల్రెడీ శర్వా వివాహ వేడుకకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. శర్వానంద్, రక్షిత రెడ్డికి కొన్ని నెలల క్రితం హైదరాబాద్ లో నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. రక్షితారెడ్డి హైకోర్టు అడ్వాకెట్ మధుసూదన్ రెడ్డి కుమార్తె. 

2023-05-28T05:46:24Z dg43tfdfdgfd