సత్తా ఉన్న నాయకుడు గడ్డం వంశీ : శ్రీధర్​బాబు

సత్తా ఉన్న నాయకుడు గడ్డం వంశీ : శ్రీధర్​బాబు

  • అందుకే ఆయనకు హైకమాండ్​టికెట్ ఇచ్చింది

పెద్దపల్లి, వెలుగు: గడ్డం వంశీకృష్ణ సత్తా ఉన్న నాయకుడని, ప్రజా సేవలో ఉన్నారని, అందుకే ఆయనకు కాంగ్రెస్​ హైకమాండ్​ పెద్దపల్లి ఎంపీ టికెట్​ ఇచ్చిందని మంత్రి శ్రీధర్​బాబు తెలిపారు. భారీ మెజార్టీతో వంశీని ఎంపీగా గెలిపించుకుందామని పిలుపునిచ్చారు.  పెద్దపల్లి జిల్లా మంథనిలో బుధవారం ఏర్పాటు చేసిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో శ్రీధర్​ బాబు పాల్గొని మాట్లాడారు.  

కాంగ్రెస్ ఎంపీగా వివేక్ వెంకటస్వామి ​తెలంగాణ ఉద్యమ సమయంలో పార్లమెంట్​లో ఎలా పోరాడారో ప్రజలకు తెలుసని చెప్పారు. అలాగే, కాకా ఫ్యామిలీ ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో కృషి చేసిందని, అలాంటి ఫ్యామిలీ గురించి బీజేపీ, బీఆర్ఎస్​ నాయకులు ప్రశ్నిస్తున్నారని మండిపడ్డారు.  బీజేపీ విష ప్రచారాన్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని చెప్పారు.  ఈ ప్రాంతాన్ని  అభివృద్ధి చేయాలనే ఏకైక లక్ష్యంతో వంశీ ఈ ఎన్నికల్లో పోటీచేస్తున్నట్టు  ప్రజలకు వివరించాలని సూచించారు. కాంగ్రెస్​ పార్టీ అన్నివిధాలా ఆలోచించి, వంశీని బరిలో నిలిపిందని, ఆయన గెలిస్తేఈ ప్రాంతానికి న్యాయం చేస్తాడని తాను నమ్ముతున్నట్టు చెప్పారు. 

బీజేపీ 2000 సంవత్సరంలో రాజ్యాంగాన్ని మార్చాలని ఆలోచన చేసిందని చెప్తే సీఎం రేవంత్​రెడ్డిపై కేసు పెట్టారని అన్నారు. బీఆర్ఎస్​ పార్టీ  7 లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టించి.. ఇప్పుడు ఏం చేస్తున్నారంటూ కాంగ్రెస్​  ప్రభుత్వాన్ని అడుగుతున్నదని మండిపడ్డారు. ఐదు గ్యారెంటీలు పొందుతున్నవారు కాంగ్రెస్​కు తప్పకుండా ఓటేస్తారని చెప్పారు  ఎలక్షన్​ కోడ్ ముగిశాక అర్హులకు ఇండ్లు కట్టించి, ఇస్తామన్నారు.  వంశీ గెలిచాక..నీతివంతమైన పాలన అందిస్తామని, వంశీని ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తానని చెప్పారు.  

ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పడుతా: చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామివంశీకృష్ణను ఎంపీగా గెలిపిస్తే మంత్రి శ్రీధర్​బాబు సహకారంతో ఈ ప్రాంతం అభివృద్ధికి తోడ్పడుతానని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి అన్నారు.  బీఆర్ఎస్​ పార్టీ రాష్ట్రాన్ని  కాళేశ్వరం, మిషన్​ భగీరథ పేరుతో దోచుకున్నదని మండిపడ్డారు, కాంగ్రెస్​ వచ్చిన తర్వాత ఐదు గ్యారంటీలు అమలు చేస్తున్నదని చెప్పారు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ క్లియర్​ చేస్తానని సీఎం రేవంత్​రెడ్డి చెప్పారన్నారు.  రాహుల్ గాంధీ రూపొందించిన పాంచ్​ న్యాయ్​ స్కీమ్​లను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.   

©️ VIL Media Pvt Ltd.

2024-05-02T00:44:13Z dg43tfdfdgfd