సీఎం కేసీఆర్‌ను కలిసిన శర్వానంద్.. రిసెప్షన్‌కు ఆహ్వానం!

Sharwanand Wedding Reception: టాలీవుడ్ యంగ్ హీరో, డిఫరెంట్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న శర్వానంద్ (Sharwanand) పెళ్లి చేసుకున్నారు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ రక్షితా రెడ్డితో (Rakhita Reddy) జూన్ 3న వివాహం జరిగింది. రాజస్థాన్, జైపూర్‌లోని లీలా ప్యాలెస్‌లో సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరగ్గా.. రామ్ చరణ్ సహా పలువురు సినీ నటులు హాజరై కొత్త దంపతులను ఆశీర్వదించారు. అయితే పెళ్లికి ముందు శర్వానంద్.. ప్రగతి భవన్‌కు వెళ్లి ఎంపీ సంతోష్‌ కుమార్‌కు ఆహ్వాన పత్రిక అందజేశారు. ఇదిలా ఉంటే.. శర్వానంద్, రక్షితా రెడ్డిల వెడ్డింగ్ రిసెప్షన్ జూన్ 9న హైదరాబాద్‌లో జరగనుంది. ఈ మేరకు గురువారం తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌ను (CM KCR) కలిసిన శర్వా.. తన రిసెప్షన్‌కు రావాల్సిందిగా ఆహ్వాన పత్రిక అందజేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

ఇదిలా ఉంటే.. శర్వానంద్, రక్షితారెడ్డిల ఎంగేజ్‌మెంట్ జనవరిలోనే జరిగినా.. పెళ్లికి మాత్రం ఆర్నెళ్ల సమయం పట్టింది. ఇక మ్యారేజ్ రిసెప్షన్.. హైదరాబాద్‌లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో రాత్రి 7.30 గంటల నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. అయితే, పెళ్లికి బంధువులు, సన్నిహితులు మాత్రమే హాజరవగా.. ఈ రిసెప్షన్‌ను గ్రాండ్‌గా ప్లాన్ చేశారు. కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది. పైగా రక్షితా రెడ్డి తాత బొజ్జల గోపాల్ రెడ్డి ఏపీలో ప్రముఖ పొలిటిషియన్ అని తెలిసిందే.

100852019

ఇక శర్వానంద్ మూవీ కెరీర్ విషయానికొస్తే.. గతేడాది చివరన ‘ఒకే ఒక జీవితం’ చిత్రం ద్వారా హిట్ అందుకున్నాడు. వెన్నెల కిశోర్, ప్రియదర్శి, రీతూ వర్మ, అక్కినేని అమల ప్రధాన్ పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రానికి శ్రీ కార్తిక్ దర్శకత్వం వహించారు. కాగా.. భాను శంకర్ దర్శకత్వంలో శర్వానంద్, మోహన్ బాబు లీడ్ రోల్స్‌లో నటించిన ‘రాజు మహరాజ’ చిత్రం ఆగస్టులో విడుదల కానుంది. ఇది కాకుండా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందుతున్న శర్వా 35వ చిత్రం జులైలో రిలీజ్ కానుంది.

Read latest Tollywood updates and Telugu News

2023-06-08T14:19:27Z dg43tfdfdgfd