తమిళ స్టార్ హీరోలకు షాక్ ఇచ్చాడు.. కోలీవుడ్ నేచురల్ స్టార్ శివకార్తికేయన్. చాలా ఏళ్ళుగా నిర్మాణంలో ఉన్న నడిగర్ సంఘ భవన నిర్మాణాని భారీగా విరాళం ప్రకటించాడు.
దక్షిణ భారత నటీనటుల సంఘానికి కొత్త భవనాన్ని నిర్మిస్తున్నారు. చాలా ఏళ్ల క్రితం పనులు ప్రారంభించినా నేటికీ పూర్తి కాలేదు. నిధుల కొరతే ఇందుకు కారణమని చెబుతున్నారు. విశాల్, కార్తీ, నాజర్ సహా సంఘానికి చెందిన పెద్దలు చాలా రకాలుగా నిధులు సమకూర్చే ప్రయత్నాలు చేశారు.
ఆర్ట్ షోలు, స్టార్ క్రికెట్, సినిమాల ద్వారా డబ్బు కూడపెట్టాలని ప్రయత్నించారు.. కాని వారు అనుకున్న పయత్నాలు విఫలం అయ్యాయి. అనుకున్నంత సొమ్ము చేతికి రాలేదు.
రామ్ చరణ్ కాదు, ప్రభాస్ కాదు.. 3000 కోట్ల ఆస్తికి ఆ హీరో వారసుడు.. ఎవరో తెలుసా..?
దాంతో విశాల్ ఇంకా గట్టిగా ప్రయత్నాలు చేశారు. ఈ భవనం పూర్తి అయిన తరువాతే పెళ్ళి చేసుకుంటాను అంటూ ప్రతిజ్ఞ కూడా చేశాడు.
12 మందితో డేటింగ్.. ఒకరితో పెళ్ళి.. చివరకు ఒంటరిగా మిగిలిన హీరోయిన్....
నటీనటుల సంఘం భవన నిర్మాణం పూర్తయిన తర్వాతే పెళ్లి చేసుకోవాలని విశాల్ నిశ్చయించుకున్నాడు. అయితే ఇప్పటికే 75 శాతం పనులు పూర్తి కాగా 25 శాతం పనులు పూర్తి కావాల్సి ఉంది. ఇదిలా ఉండగా, బిల్డింగ్ సూపర్ ఫాస్ట్ గా పనులు జరిపించేందుకు కమల్ హాసన్, ఉదయనిధి స్టాలిన్, సూర్య, తలపతి విజయ్ వంటి ప్రముఖ నటులు తమకు తోచినంత విరాళం ఇచ్చారు.
ఇక వారి బాటలో నడుస్తూనే తమిళ యంగ్ హీరో.. కోలీవుడ్ నేచురల్ స్టార్ శివకార్తికేయన్ తన సొంత డిపాజిట్ ఫండ్ నుండి 50 లక్షలు బిల్డింగ్ నిర్మాణానికి ఇచ్చారు. ఈ విషయాన్ని తమిళ నటీనటుల సంఘం ఒక ప్రకటనలో ధృవీకరించింది.
ఆ ప్రకటనలో దక్షిణ భారత నటీనటుల సంఘం అధ్యక్షుడు శ్రీ నాజర్ మరియు కోశాధికారి శ్రీ కార్తీక దక్షిణ భారత నటీనటుల సంఘం సభ్యుడు శ్రీ శివకార్తికేయన్ 50 లక్షల చెక్కును వారికి అందించారు. నటీనటుల సంఘం తన సొంత ఆదాయాన్ని కమ్యూనిటీ డిపాజిట్ ఫండ్గా అందించి కొత్త భవనం నిర్మాణ పనులను ప్రారంభించింది.
2024-04-24T06:23:23Z dg43tfdfdgfd