RS Praveen Kumar: బహుజన్ సమాజ్వాదీ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఒక ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయం బయటపెట్టారు. బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ పార్టీలో చేరాలని అనుకున్నా కానీ.. బీజేపీకి మాత్రం ఎప్పటికీ మద్దతు ఇవ్వనంటూ తేల్చిచెప్పారు.
ఒకే దేశం-ఒకే మతం అంటూ బీజేపీ దేశాన్ని నాశనం చేస్తుందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ఎన్నికలకు మరో ఐదు నెలలు మాత్రమే సమయం ఉండటంతో.. పార్టీలన్నీ స్పీడ్ పెంచాయి. గెలుపు కోసం ఇప్పటినుంచే ప్రయత్నాలు చేస్తోన్నాయి. అందులో భాగంగా ప్రజల్లోకి వెళుతూ వచ్చే ఎన్నికల్లో తమ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కోరుతున్నాయి. పలు హామీలు ప్రకటిస్తూ ప్రజలను తమవైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తోన్నాయి.
వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ టార్గెట్గా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా పావులు కదుపుతున్నారు. ఇటీవల హైదరాబాద్లో బీఎస్పీ బహిరంగసభ నిర్వహించింది. ఈ సభకు బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సభలో బీఎస్పీ తరపున తెలంగాణ సీఎం అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేరు ప్రకటించారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణలో ఆ పార్టీ పుంజుకుంటోంది. గతంలో జరిగిన మునుగోడు ఎన్నికల్లో కూడా బీఎస్పీ తరపున అభ్యర్థిరి పోటీలోకి దింపారు. బీఎస్పీ నాలుగు వేలకుపైగా ఓట్లు సాధించింది.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ అన్ని స్థానాల్లో అభ్యర్థులకు బరిలోకి దింపేందుకు కసరత్తులు చేస్తోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్లో చేరాలని అనుకున్నట్లు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు హాట్టాపిక్గా మారాయి. తాజాగా వ్యాఖ్యలతో రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో బీఎస్పీ ఎవరికి మద్దతుగా ఉంటుందనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతోంది.
85452482
Read More Telangana News And Telugu News
2023-05-28T06:03:03Z dg43tfdfdgfd