రూ.10 లక్షలు కొట్టేశాడు.. రిసార్ట్‌లో ఫ్రెండ్స్‌కు గ్రాండ్ పార్టీ ఇచ్చాడు.. వీడు మామూలోడు కాదు!

Hyderabad: ఈనెల 11న హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో చోటు చేసుకున్న దోపిడీ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. సీసీటీవీ పుటేజ్‌ల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితుడు సికింద్రాబాద్‌ ప్రాంతానికి చెందిన మోతీరాం రాజేష్‌ యాదవ్‌గా గుర్తించారు. తాను దొంగిలించిన రూ. 10 లక్షలతో శామీర్‌పేట సమీపంలోని ఒక రిసార్ట్‌లో తన ఫ్రెండ్స్‌కు గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేయగా..పక్కా సమాచారం మేరకు దాడి చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు తాను దొంగిలించిన డబ్బులో రూ.2.50 లక్షలు పెట్టి రాయల్‌ ఎన్‌ఫిల్డ్‌ వాహనాన్ని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. బైక్‌తో పాటు మరి కొంత నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

గర్బిణీ మెడపై కత్తి పెట్టి..

చోరీ ఘటన వివరాల్లోకి వెళితే.. ఈనెల 11న జూబ్లీహిల్స్‌లో భారీ దొంగతనం జరిగింది. ఏపీకి చెందిన వ్యాపారి ఎన్‌ఎస్‌ఎన్‌ రాజు ఇంట్లోకి తెల్లవారుజామున 4 గంటల సమయంలో చొరబడిన అగంతకుడు గర్బిణీ అయిన ఆయన కుమార్తె మెడపై కత్తి పెట్టాడు. తనకు రూ. 25 లక్షలు కావాలని డిమాండ్ చేశారు. తన వద్ద డబ్బు లేదని బంగారు వజ్రభరణాలు ఉన్నాయని వాటిని ఇస్తానని రాజు కూతురు నవ్య చెప్పగా.. నిందితుడు ఒప్పకోలేదు. తనకు డబ్బే కావాలని ఆమెను బెదిరించాడు. దాదాపు ఆరు గంటల పాటు ఆ గదిలోనే ఉన్నాయి. అక్కడే ఉన్న మద్యం బాటిళ్లను సైతం తాగాడు.

ఉదయం 10 గంటల అయినా కుమార్తె బయటకు రాకపోవటంతో రాజు భార్య లోపలికి వెళ్లింది. ఆమెను కూడా బెదిరించిన అగంతకుడు తనకు డబ్బు కావాలని డిమాండ్ చేశాడు. అయితే తన వద్ద అంత డబ్బు లేదని రూ. 2 లక్షలు ఉన్నాయని వాటిని అతడికి ఇచ్చారు. మరో రూ.8 లక్షలు కావాలని కోరటంతో నవ్య తన భర్త మనీశ్ రెడ్డి ద్వారా రూ. 8 లక్షలను ఇంటికి తెప్పించి అతడికి ఇచ్చింది. వాటిని తీసుకున్న నిందితుడు నవ్య ఫోన్ నుంచి కారు బుక్ చేసుకొని అక్కడి నుంచి దర్జాగా పరారయ్యాడు.

99641862

అప్పులు ఎక్కువై దోపిడి..

అనంతరం బాధితులు పోలీసులను ఆశ్రయించగా.. కేసు నమోదు చేసుకొని దర్యాపు చేశారు. అక్కడున్న సీసీటీవీ పుటేజ్‌, వేలి ముద్రలను ఆధారంగా చేసుకొని విచారణ చేపట్టగా.. నిందితుడు సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన రాజేష్‌ యాదవ్‌గా గుర్తించారు. చోరీ సొత్తుతో ఫ్రెండ్స్‌కు పార్టీ ఇస్తుండగా.. అతడిని పట్టుకున్నారు. అప్పుల ఎక్కువై రాజేశ్ చోరీకి పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. అప్పులు తీర్చేందుకు దొంగతనం చేయాలని నిర్ణయం తీసుకున్నాడని.. అందుకోసమే జూబ్లీహిల్స్ ప్రాంతంలో రెక్కీ నిర్వహించినట్లు చెప్పారు. పలు ఇళ్లను పరిశీలించగా.. అన్నింటికి గోడలు ఎత్తుగా ఉండి, కాపలాదారులు సైతం ఉండటాన్ని రాజేశ్ గుర్తించాడు. అయితే ఎన్‌ఎస్‌ఎన్‌ రాజు ఇంటి గోడలు ఎత్తు తక్కువగా ఉండటంతో ఆ ఇంట్లో ఈజీగా ప్రవేశించాడని.. రాజు కుమార్తె మెడపై కత్తి పెట్టి రూ. 10 లక్షలతో ఉడాయించినట్లు పోలీసులు వెల్లడించారు.

Read More Telangana News And Telugu News

2023-05-28T07:48:04Z dg43tfdfdgfd