KIRAAK RP: భూమికి జానడు కిర్రాక్ ఆర్పీ.. నువ్వు దొరికితే పులుసే: శ్రీరెడ్డి వార్నింగ్.. పచ్చి బూతులు

నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఆర్పీకి పులుసు కారిపోయేటైం దగ్గరపడిందని వార్నింగ్ ఇచ్చింది వైఎస్ఆర్‌సీపీ విధేయురాలు, నటి శ్రీరెడ్డి. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపైన.. ఆ పార్టీ నాయకులపై నోటికొచ్చినట్టు పేలుతున్న కిర్రాక్ ఆర్పీకి మూడిందని తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చింది శ్రీరెడ్డి.

‘‘ఒరేయ్.. ఆర్పీ!! నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అని రెడ్లు పేరు పెట్టుకుని బిజినెస్ చేస్తున్నావ్. నీమీద.. నీ చేపల పులుసుపైన బోలెడు కంప్లైంట్‌లు వచ్చాయి. నీ చేపల పులుసు చెండాలంగా ఉంటుందని.. నేను మాట్లాడటం కాదు.. యూట్యూబ్ ఓపెన్ చేసి చూస్తే ఎవరైనా అదే మాట చెప్తారు.

వీడి షాప్ ముందు ఓ పది మంది నిలబడ్డారట.. దానికి వీడు ఫేమస్ అయిపోయడట. వీడో పెద్ద కమెడియన్ అట. వీడికి వీడే డబ్బాలు కొట్టుకుంటున్నాడు. వీడి **** వీడే ఎగరేసుకుంటున్నాడు. వీడు భూమికి జానడు ఉంటాడు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. నువ్వు రాజకీయంగా ఎదగాలనుకుంటే.. జగన్ గారి మీద, వైఎస్ఆర్ పార్టీపైన రాళ్లు వేయాలని అనుకుంటున్నావా?

ఈ ఆర్పీగాడి జాతి ఏంటో కులం ఏంటో నాకు తెలియదు కానీ.. వీడు మాత్రం రెడ్లు పేరు మీద బతుకుతున్నాడు. వీడు జగన్ మోహన్ రెడ్డిగారి గురించి మాట్లాడుతున్నాడు. రెడ్డి జాతినే కించపరిచి మాట్లాడుతున్నావ్. నెల్లూరు నీ యబ్బ సొత్తా? నీకు పులుసు కారే టైం వచ్చింది. నువ్వు దొరికితే మాత్రం ఉతుకుడే.

అసలు నీ బతుకు ఎంత నువ్వెంత.. ఊకలో ఈకగాడివి. జగన్ అన్న వల్ల ఈరోజు ఎంతమంది కడుపు నింపుకుంటున్నారో.. ఎంత మందికి ఉపాధి లభించిందో తెలుసా? ఈకగాడివి రెండు బ్రాంచ్‌లు పెట్టిన నీకే అంత ఉంటే.. రాష్ట్ర సీఎం ఆయనకి ఎంత ఉండాలిరా. కనీసం నువ్వు వార్డ్ మెంబర్‌గా అయినా గెలిచి ఏడ్చావా? నీకు పులుసు కారే టైం వచ్చిందిరా.. ఎక్కడెక్కడ కూర్చుని ఏం పేలుతున్నావో.. అన్నీ చూస్తున్నాం.. నీకు దగ్గరపడింది. నీ బలుపు తీర్చే రోజు తొందరలోనే ఉంది వెయిట్ చేయి’’ అంటూ కిర్రాక్ ఆర్పీపై పచ్చి బూతులతో వార్నింగ్ ఇచ్చింది శ్రీరెడ్డి.

కాగా కిర్రాక్ ఆర్పీ.. ‘నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు’ వ్యాపారానికి ఆర్ధికంగా సాయం చేస్తున్నది నెల్లూరుకి చెందిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డే. ఈయనంటే కిరాక్ ఆర్పీ ఎంతో అభిమానం. ఎంత అభిమానం అంటే.. ఆయన పేరు చేతిపై పచ్చబొట్టు పొడిపించుకునేంతగా. ప్రస్తుతం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు ఎంపీగా.. ఆయన భార్య వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కోవూరు ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ తరుపున పోటీ చేస్తున్నారు. అయితే ఈ ఇద్దరూ కూడా ఇటీవల వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలో చేరగా.. పొత్తులో ఉండి కూడా.. భార్యాభర్తలిద్దరూ ఎంపీ ఎమ్మెల్యే టికెట్లను దక్కించుకోవడం విశేషం.

అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి మద్దతు ప్రకటించిన కిరాక్ ఆర్పీ.. సీఎం జగన్ మోహన్ రెడ్డిపైన.. ఎమ్మెల్యేలు అనీల్ కుమార్, ప్రసన్నకుమార్‌లపై వ్యక్తిగత విమర్శలు చేశారు. దీంతో శ్రీరెడ్డి.. ఆర్పీకి కౌంటర్ ఇచ్చిందన్నమాట.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-03-29T12:41:22Z dg43tfdfdgfd