అమ్మకి బంగారు కానుక.. బిగ్ బాస్ టీంకు పల్లవి ప్రశాంత్ థ్యాంక్స్

బిగ్ బాస్ విన్నర్‌గా వచ్చే నగదు, ఇతర స్పాన్సర్ ఇచ్చే ప్రోత్సహకాలు ఎప్పుడు చేతికి వస్తాయ్ అన్నది ఎవ్వరూ చెప్పలేరు. అసలు చెప్పిన డబ్బు చెప్పినట్టుగా చేతికి వస్తుందా? అన్నది కూడా అనుమానలే. ట్యాక్సులన్నీ కట్ అవ్వగా సగం కూడా చేతికి రాదని కంటెస్టెంట్లు చెబుతుంటారు. అయితే ఇప్పుడు పల్లవి ప్రశాంత్ మాత్రం ఫుల్ ఖుషీగా ఉన్నాడు. తాను విన్నర్ అయినప్పుడు ప్రకటించిన బంగారు నగ ఇప్పుడు చేతికి వచ్చింది. విన్నర్‌గా నిలిచిన వారికి నగదు పాటు, రూ. 15 లక్షల విలువైన బంగారం కూడా ఇస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇక ఇప్పుడు ఆ బంగారు నగ ప్రశాంత్ చేతికి వచ్చినట్టుంది. అందుకే అమ్మకి తొలి కానుక అంటూ పల్లవి ప్రశాంత్ మురిసిపోయాడు. ఇక ప్రశాంత్ ఆనందం అంతా కూడా మొహంలోనే కనిపిస్తోంది. ఇక పల్లవి ప్రశాంత్ వేసిన ఈ పోస్ట్ మీద నెటిజన్లు బాగానే స్పందిస్తున్నారు. తనకు ఈ బంగారు నగ ఇప్పించిన స్టార్ మా, బిగ్ బాస్ టీం ఇలా అందరికీ థాంక్స్ చెప్పాడు. పల్లవి ప్రశాంత్ ఇలా అమ్మకి తొలి కానుక అంటూ వేసిన పోస్ట్ అయితే తెగ వైరల్ అవుతోంది.

View this post on Instagram

A post shared by MALLA OCHINA (@pallaviprashanth_)

]]>

పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ తరువాత బుల్లితెరపై బాగానే సందడి చేస్తున్నాడు. స్టార్ మా పండుగలకు చేసే ప్రత్యేక ఈవెంట్లు, షోల్లో ప్రశాంత్ బాగానే కనిపిస్తున్నాడు. బిగ్ బాస్ ఇంట్లో వర్కౌట్ కానీ ట్రాక్‌ను ఈ పండుగ ప్రత్యేక ఈవెంట్లలో వర్కౌట్ చేద్దామని ప్రయత్నిస్తున్నట్టుగా ఉంది. తనను సీఎంని చేస్తే రైతులందరినీ ఆదుకుంటాను అని చేసిన కామెంట్లపై ట్రోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-09T15:56:03Z dg43tfdfdgfd