AKSHAYA TRITIYA 2024 అక్షయ తృతీయ వేళ తులసితో ఇలా పూజిస్తే.. లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక లభిస్తుందట..

Akshaya Tritiya 2024 అక్షయ తృతీయ వంటి పవిత్రమైన రోజున తులసి పూజలో కొన్ని పద్ధతులను పాటించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొందొచ్చని పండితులు చెబుతున్నారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

Akshaya Tritiya 2024 హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి ఏడాది వైశాఖ మాసం శుక్ల పక్షంలో వచ్చే తదియ తిథి నాడు అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు. ఈ పర్వదినాన శ్రీ మహా విష్ణువు, లక్ష్మీదేవి, సంపదకు అధి నాయకుడైన కుభేర స్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు. అక్షయ తృతీయ అత్యంత పవిత్రమైన రోజుగా, ఈరోజున ఏ పని చేసినా శుభప్రదంగా, విజయవంతం అవుతుందని చాలా మంది నమ్ముతారు. అంతేకాదు అక్షయ తృతీయ రోజున బంగారం, వెండితో పాటు విలువైన ఆభరణాలను కొంటూ ఉంటారు. అయితే అలా కొనడమే కాదు.. దానధర్మాలు చేయడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతారు. ఇదిలా ఉండగా అక్షయ తృతీయ రోజున తులసి పూజకు సంబంధించిన కొన్ని నియమాలను పాటించాలి.. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు లభించడమే కాకుండా, డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి.పూజా సమయం..

* ఈ ఏడాది అక్షయ తృతీయ 10 మే 2024 శుక్రవారం తెల్లవారుజామున 4:17 గంటలకు ప్రారంభమై.. మరుసటి రోజు 11 మే 2024 శనివారం తెల్లవారుజామున 2:50 గంటలకు ముగుస్తుంది. ఉదయం తిథి ప్రకారం, అక్షయ తృతీయ పండుగను శుక్రవారం నాడు జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున ఉదయం 5:33 గంటల నుంచి మధ్యాహ్నం 12:18 గంటల వరకు పూజ చేసేందుకు శుభప్రదంగా ఉంటుందని పండితులు చెబుతన్నారు.​Akshaya Tritiya 2024 అక్షయ తృతీయకు, బంగారానికి ఉన్న అవినాభవ సంబంధమేంటో తెలుసా...

తులసి పూజతో ప్రయోజనాలు..

హిందూ మత విశ్వాసాల ప్రకారం, తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతారు. అందుకే అక్షయ తృతీయ రోజున ఇంట్లో కొత్త తులసి మొక్కను నాటొచ్చు. అదే విధంగా తప్పనిసరిగా తులసి చెట్టును పూజించాలి. సాయంత్రం వేళ తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల మీకు ఆర్థిక, ఆరోగ్య పరమైన సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని. మీ కోరికలన్నీ నెరవేరే అవకాశాలు మెండుగా ఉంటాయి.

పూజలో సమర్పించాల్సిన వస్తువులు..

మరోవైపు తులసి శ్రీ మహా విష్ణువుకు ఎంతో ప్రియమైనదిగా పరిగణించబడుతుంది. తులసి దళం లేని పూజ అసంపూర్ణంగా భావిస్తారు. అందుకే అక్షయ తృతీయ రోజున కచ్చితంగా తులసి దళాలను జోడించాలి. తులసి దళంపై స్వస్తిక్ గుర్తును వేసి, పూజలో తులసి సమర్పించి, ధూపం, దీపం, సువాసన పువ్వులు తదితర వాటిని సమర్పించాలి. ఇలా చేయడం వల్ల శ్రీ మహా విష్ణువు ఆశీస్సులు కచ్చితంగా దొరుకుతాయి. అంతేకాదు విష్ణుమూర్తి, లక్ష్మీదేవి అనుగ్రహం లభించడంతో, మీకు ఆర్థిక లాభాలొస్తాయి.

గమనిక : ఇక్కడ అందించిన భక్తి సమాచారం, పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.Read Latest Religion News and Telugu News

లక్ష్మీ పూజ..

* అక్షయ తృతీయ రోజున పూజా సమయంలో తెలుపు రంగు దుస్తులను ధరించాలి. అంతేకాదు తెలుపు లేదా పసుపు రంగులో ఉండే నైవేద్యాన్ని సమర్పించాలి.* అక్షయ తృతీయ నాడు లక్ష్మీదేవికి తామర పువ్వులు సమర్పించాలి.* అక్షయ తృతీయ వేళ తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి.* లక్ష్మీదేవికి అక్షయ తృతీయ రోజున పూజ ముగిసిన తర్వాత తమలపాకులతో తాంబులం సమర్పించాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుంది. మీ ఇంట్లో సుఖ సంతోషాలను, సంపదను పెరిగేలా అనుగ్రహిస్తుంది.* అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవితో పాటు శ్రీ విష్ణువు, కుభేర స్వామిలను పూజించడం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మీ ఇంట్లో ఆనందం, శాంతి ఉంటుంది. మీ జీవితంలో ఏర్పడే ఇబ్బందులన్నీ తొలగిపోతాయి.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-08T10:23:34Z dg43tfdfdgfd