PARSHURAM JAYANTI 2024 పరశురామ జయంతి విశిష్టత, చరిత్ర గురించి తెలుసుకుందామా..

Parshuram Jayanti 2024 ఈ ఏడాది వైశాఖ మాసంలో అక్షయ తృతీయ రోజే పరశురాముని జయంతి వచ్చింది. అంటే మే 10వ తేదీన పరశురామ జయంతిని జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా పరశురామ చరిత్ర, విశిష్టత గురించి తెలుసుకుందాం...

Parshuram Jayanti 2024 హిందూ పురాణాల ప్రకారం, శ్రీ మహావిష్ణువు ఆరో అవతారమే పరశురాముడు. స్కాంద, బ్రహ్మండ పురాణాల ప్రకారం, పరశురామ అంటే పార్షుతో రాముడు. ఈయన ఆయుధం గొడ్డలి. తను శివయ్యకు గొప్ప భక్తుడు. పరశురాముడు మహిష్మాతి లాంటి పెద్ద రాజ్యాన్ని కూడా జయించిన మహావీరుడు.ప్రసేనాజిత్ కుమార్తె రేణుక, బ్రిగు వంశీయులైన జమదగ్ని దంపతులకు ఐదో కుమారుడిగా జన్మించాడు. లక్ష్మీదేవి అవతారమైన ధనవిని పెళ్లి చేసుకున్నాడు. కొన్ని గ్రంథాల ప్రకారం ఈయన ఎప్పటికీ అమరుడు. ఇప్పటికీ తాను భూమిపై ఉన్నట్లు చాలా మంది నమ్ముతారు. భీష్ముడు, ద్రోణచార్యుడు, కర్ణుల గురువు పరశురామునిగా పలు గ్రంథాల్లో ప్రస్తావించబడింది.పురాణాల ప్రకారం..

హరి వంశ పురాణం ప్రకారం, కర్తా విర్య అర్జునుడు రాజు. ఈయన మాహిష్మతి సామ్రాజ్యాన్ని పరిపాలించారు. ఈ సమయంలో ఆయన చాలా కష్టాలు పడ్డారు. ఈ కాలంలో ఎంతగానో బాధపడిన ప్రజలు తమ ధరణిని క్షత్రియుల క్రూరత్వం నుంచి భూమిని, జీవులను కాపాడటానికి శ్రీ విష్ణుమూర్తిని కోరారు. అప్పుడు ధరణికి సాయం చేసేందుకు విష్ణువు పరశురాముని పేరుతో రేణుక, జమదగ్ని దంపతులకు జన్మించారు. ఆయనే క్షత్రియులను సంహరించి ప్రజలను క్రూరత్వం నుంచి కాపాడారు.

ఇప్పటికే బతికే ఉన్నారని..

దుష్టులను శిక్షించేందుకు, ముఖ్యంగా చెడ్డవారిని హైహ్యవంశీయులను నాశనం చేసేందుకు పరశురాముడు అవతరించాడు. ఈ వివరాలన్నీ స్కంద పురాణం, విష్ణు పురాణం, హరివంశ, భశివ పురాణాల్లో వివరించబడ్డాయి. పరశురాముడు రుద్రుడు, నారాయణుడు ఇద్దరికీ అవతారంగా పరిగణిస్తారు. ఈయన తండ్రి ఆదేశం మేరకు కన్న తల్లినే చంపుతాడు. అంతేకాదు తన గొడ్డలితో క్షత్రియులను 21 సార్లు నాశనం చేశాడు. అందుకే ఆయన్ని హైహేయ వంశానికి చెందిన క్షత్రియుడు అని పిలుస్తారు. పరశురాముడు ఇప్పటికీ భూమిపైనే చిరంజీవిగా ఉన్నారని చాలా మంది విశ్వాసం. త్రేతాయుగంలో జన్మించిన హిందూ మతంలో జన్మించిన ఏడుగురు అమరవీరులలో ఈయన ఒకరు. తను పుట్టుకతో బ్రాహ్మణుడు అయినప్పటికీ, క్షత్రియుల దూకుడు, ధైర్యం ఉన్నాయి కాబట్టే తనకి ‘బ్రాహ్మ-క్షత్రియ’ అనే పేరొచ్చింది.

Akshaya Tritiya 2024 అక్షయ తృతీయ వేళ తులసితో ఇలా పూజిస్తే.. లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక లభిస్తుందట..

శివయ్యే గురువుగా..

పరశురాముడు యుద్ధ రంగంలో ఎంతో నైపుణ్యం కలవాడు. అందుకే 21 సార్లు భూమి మీద ఉన్న అవనీతి యోధులను ఒంటరిగా మట్టి కరిపించాడు. ‘పరశు’ అంటే ‘గొడ్డలి’ అని అర్థం. పరశురామునికి ఆయుధాలపై అద్భుతమైన పట్టు ఉండేది. ఈయన పరమేశ్వరుడిని మెప్పించేందుకు కఠినమైన తపస్సు చేశాడు. తన ఆధ్యాత్మిక గురువు శివయ్యగా చెప్పుకున్నాడు. తన నుంచి గొడ్డలిని వరంగా పొందాడు. ఆ తర్వాతే తనకు పరశురామునికి పేరొచ్చిందని పురాణాలలో పేర్కొనబడింది.

తల్లిని మళ్లీ బతికించుకున్నాడు..

పరశురాముడి తల్లి రేణుక ఎంతో అంకితభావం కలది. బంక మట్టితో నీటిని సేకరించడం ఆమె శక్తి, నమ్మకానికి నిదర్శనం. అయితే ఓ రోజు కుండతో నీరు నింపుతుంటే, ఆకాశంలో గాంధర్వ రథం ప్రయాణిస్తున్న సమయంలో ఒక్క క్షణం కోరికలకు లోనైంది. దాని ఫలితంగా, ఆ కుండ నీటిలో కరిగిపోయింది. తన యోగ శక్తుల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న భర్త, ఆవేశంతో తన భార్యను చంపమని కన్న కొడుకు పరశురాముడిని ఆదేశించాడు. తను తప్ప ఈ పని ఎవరూ చేయలేరు. అందుకే తన తండ్రి చెప్పినట్టు తన తల్లి, నలుగురు సోదరులను నరికేసినట్టు పురాణాల్లో ప్రస్తావించబడింది. ఆ తర్వాత ఆ తండ్రి రెండు వరాలు కోరుకోమన్నారు. ఆ వెంటనే తను తల్లిని, అన్నలను బతికించమని కోరాడు. ఆ వెంటనే తండ్రి పరశురాముని కోరిక మేరకు వారికి తిరిగి ప్రాణం పోశాడు.గమనిక : ఇక్కడ అందించిన భక్తి సమాచారం, పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.Read Latest Religion News and Telugu News

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-09T14:26:17Z dg43tfdfdgfd